బోగోజీ.ముకేశ్ ఖన్నా ఆధ్వర్యంలో కేరళ వాయనాడ్ వరద భాధితుల "సహాయ నిధి"కార్యక్రమం
సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల 07 జులై (ప్రజా మంటలు) :
జగిత్యాల కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు బోగోజీ. ముకేశ్ ఖన్నా ఆధ్వర్యంలో కేరళ వాయనాడ్ వరద భాధితుల "సహాయ నిధి"కార్యక్రమం స్థానిక ఇందిరా భవన్ లో సేవాదళ్ ఉత్తర తెలంగాణ జిల్లాల ఇంచార్జి నీల కoటేశ్వర్ రావ్ చేతుల మీదుగా ప్రారంభించిడం జరిగింది.
ఈ సందర్బంగా నీల కoటేశ్వర్ రావ్ మాట్లాడుతూ.... కేరళ వాయనాడ్ లో వరదల వల్ల చాలా మంది ఇండ్లు కోల్పోయి నిర్వసితులుగా మారారని, చాలా మంది మరణించారాని, వారందరికీ అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, సేవాదళ్ కాంగ్రెస్ ద్వారా సహాయ నిధి ఏర్పాటు చేసి, అందరికి అండగా ఉంటామని ఇట్టి కార్యక్రమం లో అందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు మారుతీ బాపూజీ, ధర్మ పురి సేవాదళ్ అధ్యక్షులు చెంద్రయ్య,పీసీసీ సభ్యులు గిరి. నాగ బూషణం, పీసీసీ కార్యదర్శి బండ. శెంకర్, రాజేందర్, రాజు ప్రకాష్ కుమార్, అజయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాలలో C.C రోడ్ పనుల పరిశీలన: అక్రమ కట్టడాలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆగ్రహం
జగిత్యాల జనవరి 12 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎల్ ఎల్ గార్డెన్ సమీపంలో నిధులు మంజూరైన సి.సి రోడ్ నిర్మాణ పనులను మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి గారు పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు పనుల నాణ్యత, వెడల్పు అంశాలపై ఆయన ఆరా తీశారు.
మున్సిపల్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడిన... జగిత్యాలలో వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ప్రారంభం
జగిత్యాల జనవరి 12 (ప్రజా మంటలు):
జిల్లాలో ఒంటరిగా ఉన్న సీనియర్ సిటీజేన్స్(వృద్ధుల)కోసం బైపాస్ రోడ్డులో వయో వృద్ధుల సంక్షేమ శాఖ తరపున డే కేర్ సెంటర్ ను సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్చువల్ గా ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా సంక్షేమాధికారి బి.నరేశ్ మాట్లాడుతూ వృద్దులు సామాజికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఈ డే కేర్... అలిశెట్టి అక్షరాలు… సమాజ హితాన్ని కోరాయి
జగిత్యాల, జనవరి 12 (ప్రజా మంటలు):
అలిశెట్టి ప్రభాకర్ రచనలు కణికల వంటివని, ఆయన సాహిత్యం సమాజ హితాన్ని కోరుతూ ప్రజలను చైతన్యవంతులను చేసిందని సినీ కథా రచయిత, అలిశెట్టి జీవిత సాఫల్య పురస్కార గ్రహీత పెద్దింటి అశోక్ కుమార్ అన్నారు. యువతరానికి అలిశెట్టి సాహిత్యం నేటికీ ఆదర్శంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఆదివారం కళాశ్రీ... అలిశెట్టి ప్రభాకర్కు జగిత్యాలలో ఘన నివాళులు
జగిత్యాల జనవరి 12 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని అంగడి బజార్లో ప్రజాకవి, చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్, ఉద్యమకారుడు అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి మరియు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ప్రజల పక్షాన నిలబడి అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని సమాజ మార్పు కోసం జీవితాంతం పోరాడిన అక్షరయోధుడిగా అలిశెట్టి ప్రభాకర్... మెట్టుగూడలో కాంగ్రెస్ మహా పాదయాత్ర ; GHMC ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
సికింద్రాబాద్, జనవరి 11 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మెట్టుగూడ డివిజన్లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర నిర్వహించారు. నియోజకవర్గ ఇంచార్జ్, కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అదం సంతోష్ కుమార్ నాయకత్వంలో జరిగిన ఈ పాదయాత్ర GHMC ఎన్నికల్లో విజయం లక్ష్యంగా సాగింది.
పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం, ప్రభుత్వ పథకాలను... సూరారం ఆటో యూనియన్ నూతన కమిటీ ఎన్నిక
ఎల్కతుర్తి డిసెంబర్ 11 ప్రజా మంటలు
ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామంలో ఆటో యూనియన్ నూతన కమిటీని కమిటీని ఆదివారం అధికారికంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ పులి రమేష్ ఎల్కతుర్తి స్టేషన్ ఎస్ ఐ అక్కినేపల్లి ప్రవీణ్ కుమార్లను మర్యాదపూర్వకంగా కలిసి అభివాదం చేశారు.ఈ సమావేశంలో... నేరెళ్ల గ్రామంలో యువకుని ఆదృశ్యం
గొల్లపల్లి జనవరి 11 (ప్రజా మంటలు ):
ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన మంద నరేష్ (35) నేరెళ్లలో కుటుంబంతో సోమవారం మధ్యాహ్నం భార్యతో కిరాణా షాపుకు వెళ్తున్నాను అని చెప్పి ఇంటి నుండి వెళ్ళి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లి మంద శంకరమ్మ నిజాంపేట్ ఫేజ్–3లో సంక్రాంతి కానుకల పంపిణీ
సికింద్రాబాద్, జనవరి 11 (ప్రజా మంటలు):
మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు నిజాంపేట్ ఫేజ్–3లో నిర్వహించిన సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని పద్మ ప్రసాద్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు సమన్వయంతో నిర్వహించారు.ఈ సందర్భంగా నిజాంపేట్ బీజేపీ అధ్యక్షులు ఎం. బిక్షపతి యాదవ్, ఓబీసీ నిజాంపేట్... హైదరాబాద్లో స్కై ఫౌండేషన్ 292వ అన్నదాన కార్యక్రమం
సికింద్రాబాద్, జనవరి 11 (ప్రజా మంటలు):
స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలో రోడ్ల పక్కన జీవనం సాగిస్తున్న అనాథలు, నిరాశ్రయులు, నిరుపేదలకు 292వ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వాహనంలో నగరమంతా సంచరిస్తూ ఆకలితో ఉన్నవారిని గుర్తించి ఒక్కపూట భోజనం అందించారు.ఈ కార్యక్రమంలో ఫౌండర్ & ప్రెసిడెంట్ డా. వై. సంజీవ కుమార్, వైస్ ప్రెసిడెంట్... మేడిబావిలో ఆర్యసమాజ్ రంగవల్లిక పోటీలు
సికింద్రాబాద్, జనవరి 11 (ప్రజా మంటలు):
మేడిబావి ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన రంగవల్లిక పోటీలకు 50కిపైగా మంది పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్యసమాజ్ ప్రెసిడెంట్ ఎం.ఆర్. రవీందర్ మాట్లాడుతూ పండుగలు మన సంస్కృతికి ప్రతీకలని, ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్యసమాజ్ సభ్యులు... బతికుండగానే సమాధి నిర్మించుకున్న నక్క ఇంద్రయ్య మృతి – సంతాపం
జగిత్యాల, జనవరి 11 (ప్రజా మంటలు):
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సీనియర్ సిటిజన్, జగిత్యాల రూరల్ మండల సీనియర్ సిటిజెన్స్ అధ్యక్షుడు నక్క ఇంద్రయ్య శనివారం రాత్రి మృతి చెందారు. ఆయన బతికుండగానే స్వయంగా నిర్మించుకున్న సమాధిలోనే ఆదివారం ఆయన భౌతిక కాయాన్ని భూస్థాపితం చేశారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని... తొలగించిన IAS పూజా ఖేడ్కర్ తల్లిదండ్రులు సహా ఐదుగురు అచేతనం
పుణే, జనవరి 11:పదవి నుంచి తొలగించబడిన IAS ట్రైనీ అధికారి పూజా ఖేడ్కర్ తల్లిదండ్రులు సహా మరో ముగ్గురు పుణేలోని వారి బంగ్లాలో అచేతన స్థితిలో కనిపించడం కలకలం రేపింది. బానెర్–ఆంధ్ ప్రాంతంలోని నివాసంలో జరిగిన ఈ ఘటనలో నిద్ర మందులు కలిపి వారిని అచేతనం చేసి దొంగతనం చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది.
సమాచారం... 