ఘనంగా హంపి విరూపాక్ష స్వామి శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి పాదుక పూజ,మహన్యాస పూర్వక రుద్రాభిషేకం
ఘనంగా హంపి విరూపాక్ష స్వామి శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి పాదుక పూజ,మహన్యాస పూర్వక రుద్రాభిషేకం
కీసర జూలై 18 (ప్రజా మంటలు) :
మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ,శ్రీ శారద చంద్రమౌళీశ్వర రుద్ర సేవా పరిషత్ వారిచే రాంపల్లి గ్రామంలో ఘణపురం శ్రీవాణి రాంప్రసాద్ శర్మ స్వగృహంలో గురువారం శ్రీ భువనేశ్వరి విరూపాక్ష పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి వారి పాదుకాపూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు భక్తుల నుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. కలియుగంలో భగవన్నామస్మరణకు మించినది ఏదీ లేదని నిరంతరం భగవన్నామస్మరణ చేస్తూ వైదిక క్రతువులు కొనసాగించినట్లయితే ధర్మం నిలబడుతుందని ధర్మం ద్వారానే అన్ని విజయాలు సంప్రాప్తమవుతాయని అన్నారు. అనంతరం మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు విశేష సంఖ్యలో పాల్గొని స్వహస్తాలతో పరమశివుని పంచామృతాలతో అభిషేకించారు. మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ప్రధాన కార్యదర్శి ఘణపురం శ్రీవాణి రాంప్రసాద్ శర్మలు విచ్చేసిన సేవా సమితి సభ్యులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఖాతాదారుని వయసు నిర్ణయించనున్న చాట్ జీపీటీ
.jpeg)
గేమర్ aap Discord తో నేపాల్ తిరుగుబాటు, చార్లీ హత్య? నిజమా ?
.png)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు వేడుకలు

కర్ణాటకలోని విజయపురిలో SBI లూటీ
.jpeg)
ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

సికింద్రాబాద్ లో మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభం

ఉమేశ్ ఖండేల్వాల్ కు కన్నీటీ వీడ్కోలు

ఇందిరమ్మ రాజ్యంలో విద్య కోసం ఇక్కట్లా? విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ _జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

ర్యాగింగ్ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

టీ చింగ్ మెటీరియల్ ద్వారా పాఠాలు సులభతరం అవుతాయి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

ఈవీఎం గోదాము తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన : కలెక్టర్ బి. సత్యప్రసాద్

ఓజోన్ పరిరక్షణ కరపత్రం ఆవిష్కరణ
