కోడిమ్యాల ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
కోడిమ్యాల ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
హరిత హారంలో భాగంగా నర్సరీ మొక్కల పరిశీలన
కొడిమ్యాల్ జులై 4 (ప్రజా మంటలు) :
ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రి రికార్డులను, పరిసరాలను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పరిశీలించారు.
గురువారం రోజున కోడిమ్యాల మండలంలో ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఓ పి సేవలు, ఆన్ లైన్ రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలో ప్రసూతి సేవలను, వైద్య సేవలను మెరుగు పరచాలని, డాక్టర్లు సమయ పాలన పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. రోజుకు ఎన్ని ఓ.పి.లను చూస్తున్నారు, ఆసుపత్రిలో పేషెంట్లకు శుభ్రమైన త్రాగునీరు అందిస్తున్నారా అని తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధుల పట్ల అప్రమత్తమై పేషెంట్లకు ఇబ్బంది కలుగకుండా వైద్య సేవలు కల్పించాలని సూచించారు. ల్యాబ్ విభాగాన్ని తనిఖీ చేసి టి-హబ్ కి పంపే డయాగ్నోస్టిస్ పరీక్షల రికార్డును కలెక్టర్ పరిశీలించారు. ఐ.సి. యు. కి సంబంధించిన పరికరాలను కలెక్టర్ పరిశీలించారు. ఎమ్మార్వో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రికార్డుల నమోదు సరిగా ఉన్నాయా లేదా అని రికార్డులను పరిశీలించారు. అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. గ్రామాలలో మురుగు నీరు నిల్వ ఉండకుండా శానిటేషన్ ఎప్పటికప్పుడు చేస్తున్నారా అని తెలుసుకున్నారు. హరిత హారంలో భాగంగా నర్సరీ మొక్కలను కలెక్టర్ పరిశీలించి ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఏ మొక్కలు ఎక్కువగా పంపిణీ జరుగుతుంది, ఇంట్లో పెంచుకునే మొక్కలు ఏమేమి ఉన్నాయి అని అడిగారు. మొక్కలకు నీరు పోసి సంరక్షించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అదే విధంగా డ్రైనేజి వ్యవస్థను కలెక్టర్ పరిశీలించారు. వర్షాకాలంను దృష్టిలో ఉంచుకుని నీటి నిల్వలు ఉండకుండా, ఇండ్లలోకి నీరు వెళ్ళకుండా నీటిని దారి మళ్లించి పెద్ద డ్రైనేజిని నిర్మించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
కలెక్టర్ వెంట జగిత్యాల ఆర్డిఓ మధుసూధన్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి సమీయుద్దీన్, సంబంధిత అధికారులు, ఎమ్మార్వో, ఎంపీడీఓ, మున్సిపాలిటీ సిబ్బంది, వివిధ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పవిత్ర హత్య కేసులో నిందితుడు ఉమాశంకర్ అరెస్ట్
సికింద్రాబాద్, డిసెంబర్ 10 (ప్రజామంటలు) :
వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూజీనగర్లో 18ఏళ్ల యువతి పవిత్రపై జరిగిన క్రూరహత్య కేసులో నిందితుడు దుక్కా ఉమాశంకర్ను వారాసిగూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి బుధవారం వారాసిగూడ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
డిసెంబర్ 8న జరిగిన... మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు భద్రత ఏర్పాట్లు పూర్తి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ఎన్నికలు నిర్వహణకు 843 మంది పోలీస్ లతో పటిష్ట బందోబస్తు.జగిత్యాల/కోరుట్ల మెట్పల్లి,డిసెంబర్ 10(ప్రజా మంటలు)
జిల్లాలో జరుగుతున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.
బుధవారం బీమారం ,కోరుట్ల,మెట్ పల్లి లో ఏర్పాటు చేసిన... శ్రీ మల్లికార్జున స్వామి దర్శించుకున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎన్. సుప్రియ
(అంకం భూమయ్య)
గొల్లపల్లి, డిసెంబర్ 10 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం మల్లన్నపేటలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం (దొంగ మల్లన్న) జాతర కార్యక్రమంలో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎన్. సుప్రియ బుధవారం ఆలయాన్ని సందర్శించారు. ఆమెతో పాటు జగిత్యాల డివిజన్ ఇన్స్పెక్టర్ రాజమొగిలి కూడా స్వామి వారిని దర్శించుకుని... మైతాపూర్ గ్రామంలో బిజెపి బలపరిచిన అభ్యర్థి కి మద్దతు గా ప్రచారము నిర్వహించిన డా భోగ శ్రావణి
రాయికల్ డిసెంబర్ 10 ( ప్రజా మంటలు)మండలములోని మహితాపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలలో భాగంగా బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థి రాజనాల సుందరి-జయానందం గారికి మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొని బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా.బోగ శ్రావణి
ఈ కార్యక్రమంలో రాయికల్... కొండగట్టులో అగ్ని ప్రమాద బాధితులకు జగిత్యాల లేడీస్ ఎంపోరియం సంఘం సభ్యుల చేయూత
కొండగట్టు డిసెంబర్ 10 –(ప్రజా మంటలు):
కొండగట్టుకు రోజు వారీ జీవనోపాధి కోసం వచ్చి చిన్న దుకాణాల ద్వారా బొమ్మలు, గాజులు, పిల్లల ఆట వస్తువులు అమ్ముకునే కుటుంబాలు కొన్ని రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యాయి. ఈ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ జగిత్యాల లేడీస్ ఎంపోరియం సంఘం సభ్యులు... రోడ్డు విస్తరణ గూర్చి తమ వినతిని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసిన ఎంపీ అరవింద్ కు కృతజ్ఞతలు తెలియజేసిన డా బోగ శ్రావణి
జగిత్యాల డిసెంబర్ 10 (ప్రజా మంటలు)నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి కి గతంలో జగిత్యాల నియోజకవర్గం లోని జగిత్యాల రురల్ మండల్ అనంతరం గ్రామంలోని లో లెవెల్ బ్రిడ్జ్ వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడడం, నిత్యం ప్రమాదాలు జరగడం మరియు జగిత్యాల్ అర్బన్ మండల్ అంబారిపేట్ రోడ్డు విస్తరణ మరియు రైల్వే... బాల్యం నుంచే పిల్లలకు ఆధ్యాత్మిక చింతన అలవర్చాలి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్ర్తీ తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల డిసెంబర్ 10 (ప్రజా మంటలు,)
బాల్యం నుంచే పిల్లలకు ఆధ్యాత్మిక చింతన అలవర్చాలని శృంగేరీ శారద పీఠం ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్ర్తీ తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్లో మహాభారత ప్రవచన మహాయజ్ఞం 5... మొదటి విడత 11వ తేదీన జరిగే 7 మండలాల్లోని గ్రామ పంచాయతీ ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు జిల్లా కలెక్టర్
మేడిపల్లి/ కథలాపూర్/ మల్లాపూర్ /ఇబ్రహీంపట్నం డిసెంబర్ 10(ప్రజా మంటలు ) మేడిపల్లి, కథలాపూర్, మల్లాపూర్ మరియు ఇబ్రహీంపట్నం మండలాల్లో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, సిబ్బంది బాధ్యతల పంపిణీ, లాజిస్టిక్స్ ఎన్నికల మెటీరియల్ను జిల్లా కలెక్టర్... కేంద్ర మంత్రులు గడ్కరీ, అశ్విని వైష్ణవ్ లను కలిసిన ఎంపీ అర్వింద్ పలు సమస్యలపై విన్నపాలు సానుకూలంగా స్పందించిన మంత్రులు
ఢిల్లీ డిసెంబర్ 10 (ప్రజా మంటలు)
(S. వేణు గోపాల్)
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలోని పార్లమెంట్ కార్యాలయంలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అశ్విని వైష్ణవ్ లను వేర్వేరుగా కలిశారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ మరియు జగిత్యాల జిల్లాలకు సంబంధించి పలు విజ్ఞప్తులను అందజేశారు.
కేంద్ర రైల్వే శాఖ... స్కూల్ బస్సు ప్రమాదంలో విద్యార్థి మృతి
కామారెడ్డి డిసెంబర్ 10 (ప్రజా మంటలు):
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్కు విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటో బోల్తా పడడంతో 10వ తరగతి విద్యార్థి ప్రణవ్ (15) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 14 మంది విద్యార్థులు గాయపడ్డారు.
జుక్కల్ మండలం సావర్గావ్ గ్రామం నుండి ఖండే ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను... నాలుగవ రోజుకు చేరుకున్న మహాభారతం ప్రవచనం
జగిత్యాల డిసెంబర్ 9 ( ప్రజా మంటలు)స్థానిక ధరూర్ శివారు కరీం నగర్ రోడ్డు లోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో గత 4 రోజులుగా అత్యంత వైభవవో పేతంగా సాగిపోతున్న మహాభారత నవాహ్నిక ప్రవచన జ్ఞాన యజ్ఞం, ఉర్రూతలూగిస్తూ సాగిపోతుంది.
కళ్యాణమండపం భక్తులతో కిక్కిరిసిపోయి జనసంద్రం లాగ కనిపిస్తుందని సామాజిక కార్యకర్త తవుటు... గ్రామ రాజకీయాల్లోకి ఏఐ ఎంట్రీ
గ్రామాల్లో మర్ఫింగ్ వీడియోల కలకలం
* ఏఐ మార్ఫింగ్తో ప్రత్యర్థులపై దుష్ప్రచారం
* గ్రామ రాజకీయాల్లోకి ఏఐ ఎంట్రీ
* ఏఐ మార్ఫింగ్తో ఓటర్లలో అయోమయం
భీమదేవరపల్లి డిసెంబర్ 10 (ప్రజామంటలు) :
మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల వేళ రాజకీయ వేడి పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా ఏఐ సిత్రాలు, మర్ఫింగ్ వీడియోలు కలకలం రేపుతున్నాయి.... 