కోడిమ్యాల ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

On
కోడిమ్యాల ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్


కోడిమ్యాల ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

హరిత హారంలో భాగంగా నర్సరీ మొక్కల పరిశీలన

కొడిమ్యాల్ జులై 4 (ప్రజా మంటలు) :


ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రి రికార్డులను, పరిసరాలను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పరిశీలించారు. 

గురువారం రోజున కోడిమ్యాల మండలంలో ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఓ పి సేవలు, ఆన్ లైన్ రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలో ప్రసూతి సేవలను, వైద్య సేవలను మెరుగు పరచాలని, డాక్టర్లు సమయ పాలన పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. రోజుకు ఎన్ని ఓ.పి.లను చూస్తున్నారు, ఆసుపత్రిలో పేషెంట్లకు శుభ్రమైన  త్రాగునీరు అందిస్తున్నారా  అని తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధుల పట్ల అప్రమత్తమై పేషెంట్లకు ఇబ్బంది కలుగకుండా వైద్య సేవలు కల్పించాలని సూచించారు. ల్యాబ్ విభాగాన్ని తనిఖీ చేసి టి-హబ్ కి పంపే డయాగ్నోస్టిస్ పరీక్షల రికార్డును కలెక్టర్ పరిశీలించారు. ఐ.సి. యు. కి సంబంధించిన పరికరాలను కలెక్టర్ పరిశీలించారు. ఎమ్మార్వో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రికార్డుల నమోదు సరిగా ఉన్నాయా లేదా అని రికార్డులను పరిశీలించారు. అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.  గ్రామాలలో మురుగు నీరు నిల్వ ఉండకుండా శానిటేషన్ ఎప్పటికప్పుడు చేస్తున్నారా అని తెలుసుకున్నారు. హరిత హారంలో భాగంగా నర్సరీ మొక్కలను కలెక్టర్ పరిశీలించి ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఏ మొక్కలు ఎక్కువగా పంపిణీ జరుగుతుంది, ఇంట్లో పెంచుకునే మొక్కలు ఏమేమి ఉన్నాయి అని అడిగారు. మొక్కలకు నీరు పోసి సంరక్షించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అదే విధంగా డ్రైనేజి వ్యవస్థను కలెక్టర్ పరిశీలించారు. వర్షాకాలంను దృష్టిలో ఉంచుకుని నీటి నిల్వలు ఉండకుండా, ఇండ్లలోకి నీరు వెళ్ళకుండా నీటిని దారి మళ్లించి పెద్ద డ్రైనేజిని నిర్మించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.  

కలెక్టర్ వెంట జగిత్యాల ఆర్డిఓ మధుసూధన్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి సమీయుద్దీన్, సంబంధిత అధికారులు, ఎమ్మార్వో, ఎంపీడీఓ, మున్సిపాలిటీ సిబ్బంది, వివిధ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

National  State News 

Sanchar Saathi తప్పనిసరి ప్రీ-ఇన్‌స్టాలేషన్‌పై వివాదం — మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వివరణ

Sanchar Saathi తప్పనిసరి ప్రీ-ఇన్‌స్టాలేషన్‌పై వివాదం — మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వివరణ న్యూ ఢిల్లీ డిసెంబర్ 02 (ప్రజా మంటలు): భారత ప్రభుత్వం 2026 మార్చి నుంచి మార్కెట్‌లో అమ్మకానికి వచ్చే అన్ని స్మార్ట్‌ఫోన్లలో Sanchar Saathi యాప్‌ను తప్పనిసరిగా ప్రీ-ఇన్‌స్టాల్ చేయాలని టెలికం శాఖ (DoT) ఇచ్చిన తాజా ఆదేశాలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. వినియోగదారుల గోప్యత, డిజిటల్ ఫ్రీడమ్, ఫోన్ కంపెనీల విధానాలు వంటి...
Read More...
National  Opinion 

పర్యావరణ రక్షణలో అందరి భాగస్వామ్యం ఉండాలి

పర్యావరణ రక్షణలో అందరి భాగస్వామ్యం ఉండాలి నేడు జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం(డిసెంబర్ 2వ తేదీ ) --డాక్టర్. వై. సంజీవ కుమార్, ఫౌండర్ & ప్రెసిడెంట్, స్కై ఫౌండేషన్. 9393613555,9493613555. సృష్టిలో జీవం మనుగడ తీసుకునే శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. ఆ శ్వాస పర్యావరణంపైనా ఆధారపడుతుంది. ఆ పర్యావరణం కాలుష్యం అయితే జీవం మనుగడ ప్రమాదంలో...
Read More...

తెలంగాణ అమరవీరుల స్మరణలో జాగృతి మెగా రక్తదాన శిబిరం

తెలంగాణ అమరవీరుల స్మరణలో జాగృతి మెగా రక్తదాన శిబిరం హైదరాబాద్ డిసెంబర్ 02 (ప్రజా మంటలు): తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో భారీ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్వయంగా రక్తదానం చేసి, ఉద్యమ నాయకులు, కార్యకర్తలు, యువతను ఉత్సాహపరచారు. కవిత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర నిర్మాణం...
Read More...
Local News  State News 

రేపు హుస్నాబాద్‌లో భారీ కాంగ్రెస్ బహిరంగ సభ

రేపు హుస్నాబాద్‌లో భారీ కాంగ్రెస్ బహిరంగ సభ హుస్నాబాద్, డిసెంబర్ 3, 2025 (ప్రజా మంటలు): హుస్నాబాద్ పట్టణం మరో భారీ కాంగ్రెస్ శక్తి ప్రదర్శనకు సాక్ష్యమవుతోంది. బుధవారం (03-12-2025) జరుగనున్న హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. సీఎం హోదాలో మొదటిసారి హుస్నాబాద్ వస్తున్న రేవంత్ రెడ్డి, ఏమిస్టారో అని సామాన్యులే...
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రి వద్ద పేదలకు దుప్పట్లు పంపిణీ

గాంధీ ఆసుపత్రి వద్ద పేదలకు దుప్పట్లు పంపిణీ సికింద్రాబాద్,  డిసెంబర్ 02 (ప్రజా మంటలు): స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి, వివిధ రాష్ట్రాల మాజీ గవర్నర్ డా. మర్రి చెన్నారెడ్డి  29వ వర్ధంతిని మంగళవారం బన్సీలాల్ పేట డివిజన్ లో   ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.బిజెపి నాయకులు...
Read More...

సరియైన ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకెళ్తే సీజ్ చేస్తాము దొంగల మర్రి చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సరియైన ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకెళ్తే సీజ్ చేస్తాము  దొంగల మర్రి చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ,  మల్యాల డిసెంబర్ 2 ( ప్రజా మంటలు)సరియైన ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకెళ్తే సీజ్ చేస్తాము అన్నారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,  తెలిపారు. కొడిమ్యాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా...
Read More...
Local News 

గొల్లపల్లి మండలంలో 6 నామినేషన్ స్వీకరణ కేంద్రాలు

గొల్లపల్లి మండలంలో 6 నామినేషన్ స్వీకరణ కేంద్రాలు (అంకం భూమయ్య) గొల్లపల్లి డిసెంబర్ 01 (ప్రజా మంటలు):  పంచాయతి ఎన్నికలు -2025  మండలం లోని మూడవ విడతలో 6 నామినేషన్ల స్వీకరణ కేంద్రాలలో తేది 3 నుండి 5 వరకు సర్పంచి మరియు వార్డు సభ్యులకు 6 కేంద్రాలు ఏర్పాటు చేశారు. గొల్లపల్లి మండలంలోని 27 గ్రామాలను ఆరు క్లస్టర్లుగా 6 కేంద్రాలు విభజించారు....
Read More...
Local News 

బాల్య వివాహాలపై అవగాహన సదస్సు.

బాల్య వివాహాలపై అవగాహన సదస్సు. ఇబ్రహీంపట్నం డిసెంబర్ 01 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండలంలోనీ వర్షకొండ గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో బాల్య వివాహం  అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది.మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది హేమశ్రీ మాట్లాడుతూ  గ్రామ సభ్యులకు,పాఠశాల విద్యార్థులకు, మరియు  తల్లులకు,కిశోర బాలికలకు బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల గురించి...
Read More...

ఫ్రీడమ్ సన్ ఫ్లవర్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు చేయూత...

ఫ్రీడమ్ సన్ ఫ్లవర్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు చేయూత...   కొండగట్టు డిసెంబర్ 1(ప్రజా    మంటలు)ఫ్రీడమ్ సన్ ఫ్లవర్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో  కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు సోమవారం రూపాయలు 40 వేల విలువగల  దుస్తువులను  కంపెనీ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్బంగా కంపెనీ ASM రమేష్ కుమార్ , CFA ఏజెంట్ వూటూరి నవీన్ కుమార్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం కొండగట్టులోని...
Read More...
Local News  State News 

హెచ్ఐవీ బాధితులు ఆందోళన చెందొద్దు : సూపరింటెండెంట్ డాక్టర్ వాణి 

హెచ్ఐవీ బాధితులు ఆందోళన చెందొద్దు : సూపరింటెండెంట్ డాక్టర్ వాణి  గాంధీ ఏఆర్‌టీ సెంటర్ లో అందుబాటులో  చక్కటి వైద్యం సికింద్రాబాద్, డిసెంబర్ 01 (ప్రజామంటలు) :  ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గాంధీ ఆసుపత్రిలోని జనరల్ మెడిసిన్ విభాగం,ఎ.ఆర్.టి. సెంటర్ ఆధ్వర్యంలో సోమవారం వరల్డ్ ఎయిడ్స్ డే ర్యాలీ, అవేర్నెస్  నిర్వహించారు. ముఖ్య అతిథిగా సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ వాణి హాజరయ్యారు. అనంతరం ఎ ఆర్...
Read More...

మొబైల్ ఫోన్ పోతే సంబదిత పోలీస్ స్టేషన్లో  పిర్యాదు చేయండి: : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

మొబైల్ ఫోన్ పోతే సంబదిత పోలీస్ స్టేషన్లో  పిర్యాదు చేయండి: : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  జగిత్యాల డిసెంబర్ 1 (ప్రజా మంటలు)   మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in CEIR  అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి జిల్లా పరిధిలో  పోగొట్టుకున్న, చోరికి గురైన 28 లక్షల విలువగల 136  మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత. సెల్ ఫోన్  పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ...
Read More...
Local News 

ఇది ప్రభుత్వ భూమి..ఆక్రమిస్తే చర్యలు తప్పవు : ఐడీహెచ్ కాలనీలో బోర్డు పెట్టిన రెవిన్యూ సిబ్బంది

ఇది ప్రభుత్వ భూమి..ఆక్రమిస్తే చర్యలు తప్పవు : ఐడీహెచ్ కాలనీలో బోర్డు పెట్టిన రెవిన్యూ సిబ్బంది సికింద్రాబాద్, డిసెంబర్ 01 (ప్రజామంటలు):బన్సీలాల్ పేట డివిజన్ న్యూ బోయిగూడా ఐడిహెచ్ కాలనీ లోని  ఉన్న భూమి ప్రభుత్వానికి చెందినదని స్పష్టంచేస్తూ సికింద్రాబాద్ తహాసీల్దార్ కార్యాలయ సిబ్బంది సోమవారం హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఈ భూమి ప్రభుత్వానికి చెందిన భూమి...అక్రమంగా ఆక్రమించే వారికి కఠిన చర్యలు తప్పవు.. అని బోర్డుపై పేర్కొన్నారు. సదరు...
Read More...