మంథని నియోజకవర్గంలో ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సుడిగాలి పర్యటన
మంథని నియోజకవర్గంలో ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సుడిగాలి పర్యటన
మంథని జూలై 03:
ఈరోజు మంత్రి శ్రీధర్ బాబు మల్హర్, కాటారం, మహాదేవపూర్ మండలాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.
👉జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మొక్కలు నాటి వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
👉మహదేవ్పూర్ మండలంలో 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులకు,
👉 జాతీయ రహదారి నుండి కుదురుపల్లి వరకు 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్ల నిర్మాణానికి
👉 40 లక్షల రూపాయలతో శివాజీ చౌక్ నుండి హనుమాన్ గుడి వరకు నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
3.50 లక్షలతో నిర్మించిన శ్రీ దుద్దిళ్ళ శ్రీపాదరావు సమీకృత మండల కార్యాలయ సముదాయ భవనాన్ని ప్రారంభించారు
👉 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పార్క్ 8.50 లక్షలు తో ప్రారంభించడం జరిగింది
👉ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు స్మారక విగ్రహం ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు
అనంతరం రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి పరిరక్షించాలని సూచించారు.
జిల్లాలో ఈ సంవత్సరం 26.129 లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు, మొక్కలు పెంపకంతో పచ్చదనం ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని కాలుష్యం నుండి ప్రజలకు రక్షణ కలుగుతుందని అన్నారు.
👉మానవాళి మనుగడకు మొక్కలు ఎంతో అవసరమని వాటి ప్రాధాన్యతను గుర్తించి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని పేర్కొన్నారు.
చెట్లను పెంచడం ద్వారా పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడుతుందని మనిషి ఆరోగ్యానికి ఆహ్లాదకరమైన జీవనయానం సమకూర్తుందని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో డిఆర్డిఓ నరేష్, జడ్పి సీఈవో విజయలక్ష్మి, అదనపు డిఆర్డీవో పసుమతి అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..
More News...
<%- node_title %>
<%- node_title %>
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
.jpeg)
సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు
