జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మార్చడం సరైన సమయంలో సరియైన నిర్ణయమేనా?

On
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మార్చడం సరైన సమయంలో సరియైన నిర్ణయమేనా?

 
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మార్చడం సరైన సమయంలో సరియైన నిర్ణయమేనా?
కాంగ్రెస్ పార్టీలో కలవరం లేపిన సంజయ్ చేరిక  
ఇది రెడ్డి - రావుల కలయికా? కలహమా?
ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరిక బిజేపి కి లాభామా ?

(సిరిసిల్ల రాజేందర్ శర్మ 9348422113)

జగిత్యాల జూన్ 24 (ప్రజా మంటలు) : జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో అనుకోని కుదుపు. నాలబై ఏళ్లుగా ఎదురులేని జీవన రెడ్డికి పోటీగా వెలమ సామాజిక వర్గం నుండి పోటీ రావడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని అనుకొంటున్నారు. జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమర్ కాంగ్రెస్ పార్టీ హవాలో సైతం గెలవడం ఆయనకు వ్యక్తిగతంగా, వైద్యునిగా ఉన్న మంచి పేరు బహుశా సంజయ్ కి కలిసి వచ్చి రెండవసారి సైతం గెలువగలిగాడు అనే వాళ్ళు లేకపోలేదు. ఇదిలా ఉండగా డా. సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల పలువురు ఆశ్చర్యం ప్రకటిస్తున్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐదు సంవత్సరాల పాటు రాజకీయ నిరుద్యోగిగా ఉండడం ఎలాంటి నియోజకవర్గ అభివృద్ధి పనులు చేసే పరిస్థితులు కష్టమవుతుందేమోనని ఆ ఉద్దేశంతోనే సంజయ్ పార్టీ మారినట్లు పలువురు నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు.ఈ ఇద్దరు నాయకులు ఒకే పార్టీలో ఉంది తగువులాడుకోవడం వల్ల బిజేపి లాభపడవచ్చని చర్చించుకొంటున్నారు.

 

కాంగ్రెస్ పార్టీలో సంజయ్ సమన్వయంతో పనిచేయగలుగుతాడా? అని పలువురు సంజయ్ పార్టీ మార్పు పట్ల చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్లోకి వెళ్లడం వ్యక్తిగతంగా ఆయనకు ప్రయోజనం జరగవచ్చుకానీ తనను నమ్ముకున్న వారికి మోసగించి కాంగ్రెస్ పార్టీలోకి చేరినారని  బారాస నాయకులు కార్యకర్తలు బాహాటంగానే విమర్శిస్తూ సోమవారం డా. సంజయ్ దిష్టిబొమ్మను తగలబెట్టి తమ ఆవేదనను, ఆగ్రహాన్ని  వ్యక్తం చేయడమే కాకుండా పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీ లోకి   మారినందుకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు కోట్ల రూపాయలు ఆయన బ్యాంకు ఖాతాలో కాంగ్రెస్ పార్టీ జమ చేసిందని ధర్నా లో పాల్గొన్న పలువురు బారాస నాయకులు విమర్శించడం కొసమెరుపు . కాగా రాజకీయ దిగ్గజమైన ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో సమన్వయము డా.  సంజయ్ కి కుదురుతుందా? మొదటి నుండి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సంజయ్ కుమార్ కు పార్టీలపరంగా మరియు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విషయాలపై కూడా దుమ్మెత్తి పోసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జీవన్ రెడ్డితో సంజయ్ కుమార్ చివరి వరకు కొనసాగుతారా? అనే సందిగ్ధాన్ని సంజయ్ అభిమానులు చర్చించుకుంటున్నారు.

 

చివరి వరకు పార్టీ మార్చే విషయాన్ని చాలా రహస్యంగా ఉంచి పార్టీ క్యాడర్ కు ఎలాంటి సంకేతాలు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ ను కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం అటు కాంగ్రెస్ పార్టీలోని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. అదేవిధంగా జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత, బారాస నాయకులు ,కార్యకర్తలు సోమవారం జిల్లా కేంద్రములోని తాసిల్ చౌరస్తా వద్ద సంజయ్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. డా .సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగులుతుందా? ఎన్నో సంవత్సరాలుగా గెలుపు ఓటములను లెక్కచేయకుండా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న జీవన్ రెడ్డి ఎమ్మెల్యే డా సంజయ్ రాకను స్వాగతిస్తారా? లేదా తాను ఎమ్మెల్సీగా కొనసాగడమా? రాజీనామా చేయడమా? అనే ఆలోచనలో పడ్డట్టు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్నారు.

 

ఏది ఏమైనప్పటికీ జగిత్యాల నియోజకవర్గం పలుమార్లు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఒకటైతే శాసనసభ్యులు వేరే పార్టీ వారు ఉండడం అభివృద్ధి నోచుకోక పోయిందని అపవాది ఉండేది. సంజయ్ కుమార్ కాంగ్రెస్ లోకి ప్రవేశించడంతో తాను గతంలో బారాస ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయలేని పెండింగ్ పనులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత చేయడానికి, నియోజకవర్గానికి కావలసిన నిధులు తేవడానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాల్సిందేనని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. నాలుగురైదుగురు ఎమ్మెల్యేలు, మంత్రి శ్రీధర్ బాబు వచ్చి సముదాయించినా, జీవన రద్దీ తన నిర్ణయాన్ని వాయిదావేసుకొన్నారే కానీ, వారి ప్రతిపాదనలకు ఒప్పుకోలేదని తెలుస్తుంది.

ఒక వేళ ఈ ఇద్దరూకాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే ఇటు కార్యకర్తలు, అటు అధికారులు ఇబ్బందులను ఎదుర్కొనక తప్పని పరిస్థితులు ఏర్పదనున్నాయి. ఇద్దరు వెనిక్కి తగ్గే స్వభామ లేకపోవడం, రాజకీయ అనుభవంతో రాష్ట్ర స్థాయిలో నెగ్గుక రాగళననే ధీమాతో ఉన్న జీవన రెడ్డి, ఎమ్మెల్యే అనే అధికార భావనతో సంజయ్ కుమార్ లు వ్యవహరించడం వల్ల జగిత్యాల అభివృద్ధి కుంటుపడుతుందో లేక మరిన్ని ఎక్కువ నిధులతో అభివృద్ధి చెందుతుందా అనేది కాలమే చెపుతుందని ప్రజలు భావిస్తున్నారు.    

 

Tags
Join WhatsApp

More News...

State News 

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ — డిసెంబర్ 8 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ — డిసెంబర్ 8 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో హైదరాబాద్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు): డిసెంబర్ 8 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పూర్తిగా ఆర్థిక సదస్సు అని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి దిశను తెలిపే ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్ ఈ సదస్సులో ఆవిష్కరించడం ప్రధాన లక్ష్యమని...
Read More...
Local News 

రాష్ర్టంలో పెరిగిన వీధి కుక్కల బెడద  : జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

రాష్ర్టంలో పెరిగిన వీధి కుక్కల బెడద  : జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు సికింద్రాబాద్, డిసెంబర్ 05 (ప్రజామంటలు) : తెలంగాణలో వీధికుక్కల బెడద మితిమీరిందని, రాష్ట్రవ్యాప్తంగా కుక్కలు మనుషులపై దాడులు, కరవడం, ప్రాణాలు తీసే ఘటనలు పెరుగుతున్నా, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కొనసాగుతుంద‌ని ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామా రావు ఇమ్మానేని ఆరోపించారు. సుప్రీం కోర్టు ఈ విషయమై ఎన్ని సార్లు మొట్టికాయలు వేసిన అధికారులు తమ...
Read More...

గాంధీలో చికిత్స పొందుతూ సాయి ఈశ్వర్ చారి మృతి

గాంధీలో చికిత్స పొందుతూ సాయి ఈశ్వర్ చారి మృతి బీసీ సంఘాల ఆందోళనతో గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత *ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు – పలు పోలీస్ స్టేషన్లకు తరలించిన నిరసనకారులు
Read More...

పిఎంఓ లో రాజకీయ అలజడి సృష్టించిన హిరెన్ జోషి

పిఎంఓ లో రాజకీయ అలజడి సృష్టించిన హిరెన్ జోషి హిరేన్ జోషి, ప్రో హిమానీ దూద్, నవనీత్ సెహగల్ లు ఎందుకు ఈరోజు ఢిల్లీ వర్గాల్లో చర్చనీయంగా మారారు? హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పదకోశం జరుగుతున్న పోటీయే దీనికి ప్రధాన కారణమా? బెట్టింగ్ అప్ కంపెనీని నిర్వహిస్తున్న సెహగల్ కొడుకు వల్లన పీఎంఓ కు వీటి సంబంధాలు బయటకు రావడం కారణమా? పూర్తిగా చదవండి.
Read More...
State News 

జోగులాంబ అమ్మవారి ఆలయ అభివృద్ధికి ₹347 కోట్ల ప్రణాళిక - చిన్నారెడ్డి

జోగులాంబ అమ్మవారి ఆలయ అభివృద్ధికి ₹347 కోట్ల ప్రణాళిక - చిన్నారెడ్డి హైదరాబాద్ డిసెంబర్ 05 (ప్రజా మంటలు): తుంగభద్ర నది ఒడ్డున ఆలంపూర్‌లో కొలువైన పవిత్ర శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి ఆలయం అభివృద్ధికి ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. మొత్తం ₹347 కోట్లతో ఆలయాన్ని ఆధునికంగా, భక్తులకు అనుకూలంగా తీర్చిదిద్దే కార్యక్రమం రూపొందించారు. తక్షణ పనులకు ₹35 కోట్లు అవసరం బాలాలయం నిర్మాణం, వజ్రలేపనం, కుంభాభిషేకం...
Read More...
National  Comment 

ఇండిగో విమాన రద్దుల వెనుక అసలు కథ ఏమిటి?

ఇండిగో విమాన రద్దుల వెనుక అసలు కథ ఏమిటి? గత నాలుగు రోజులుుగా జరుగుతున్న ఇండిగో విమాన రద్దులపై, ప్రచారంలో ఉన్న సమాచారాన్ని ఆధారంగా తీసుకుని, కార్పొరేట్ పోరాటం కోణంలో ఒక సమగ్ర విశ్లేషణాత్మక కథనం. దేశవ్యాప్తంగా నాలుగు రోజులుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండిగో సంస్థకు చెందిన అనేక విమానాలు అకస్మాత్తుగా రద్దు కావడం, కొన్ని గంటల తరబడి ఆలస్యంగా నడవడం, ప్రయాణికులు...
Read More...
National  International   State News 

అమెరికా బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్నిప్రమాదం – ఇద్దరు తెలుగు విద్యార్థుల విషాద మరణం

అమెరికా బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్నిప్రమాదం – ఇద్దరు తెలుగు విద్యార్థుల విషాద మరణం బర్మింగ్‌హామ్ (అలబామా) డిసెంబర్ 05 (ప్రజా మంటలు): అమెరికా అలబామా రాష్ట్రంలోని బర్మింగ్‌హామ్ నగరంలో గురువారం ఉదయం జరిగిన భారీ అగ్నిప్రమాదం ఇద్దరు తెలుగు విద్యార్థుల ప్రాణాలు తీసింది. స్థానిక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు కాసేపటికే భవనం మొత్తం వ్యాపించడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అక్కడ నివాసముంటున్న మొత్తం 13 మంది...
Read More...

సోమాజిగూడలో అగ్నిప్రమాదం – శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్‌లో మంటలు

సోమాజిగూడలో అగ్నిప్రమాదం – శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్‌లో మంటలు హైదరాబాద్‌, డిసెంబర్ 05 (ప్రజా మంటలు): నగరంలోని సోమాజిగూడలో మంగళవారం సాయంత్రం పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది. భవనం ఐదో అంతస్తులో ఉన్న శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కిచెన్‌ ప్రాంతం నుంచి భారీగా పొగలు ఎగసిపడటంతో అక్కడి సిబ్బంది, భవనం నివాసితులు ఆందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న వెంటనే ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌కు...
Read More...
State News 

హన్మకొండ అడిషనల్ కలెక్టర్ ఏసీబీ వలలో

హన్మకొండ అడిషనల్ కలెక్టర్ ఏసీబీ వలలో హనుమకొండ, డిసెంబర్ 05 (ప్రజా మంటలు): హనుమకొండ అడిషనల్ కలెక్టర్‌గా, అలాగే ఇన్‌చార్జ్ డీఈవోగా పనిచేస్తున్న వెంకట్ రెడ్డి ఎసీబీ వలలో చిక్కారు. పుత్తూరు హైస్కూల్ అనుమతి పునరుద్ధరణ కోసం రూ.60,000 లంచం స్వీకరిస్తుండగా అతడిని అవినీతి నిరోధక శాఖ అధికారులు ట్రాప్ చేసినట్లు సమాచారం. వెంకట్ రెడ్డితో పాటు జూనియర్ అసిస్టెంట్ మనోజ్‌ను కూడా...
Read More...

జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబరచి జిల్లా పేరును నిలబెట్టాలి-జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్  బి.ఎస్. లత

జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబరచి జిల్లా పేరును నిలబెట్టాలి-జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్  బి.ఎస్. లత    జగిత్యాల డిసెంబర్  5 (ప్రజా మంటలు) పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియం లో జిల్లా స్థాయి పీఎం శ్రీ స్కూల్స్ ఆటల పోటీలను జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్  బి. ఎస్ లత ప్రారంభించారు. జగిత్యాల జిల్లా లోని 16 పీఎం శ్రీ స్కూల్స్ నుండి సుమారు 900 మంది విద్యార్థులు కబడ్డీ, కోకో, వాలి...
Read More...

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి : జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ 

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి : జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్      మెట్పల్లి  / ఇబ్రహీంపట్నం/ మేడిపల్లి డిసెంబర్ 5 (ప్రజా మంటలు)  శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా అన్ని వర్గాల ప్రజలు సహకరించాలి  ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరిచే ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో సాగేందుకు పోలీస్ శాఖ పరంగా కావలసిన భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పి...
Read More...
Local News 

బలిదానాలు వద్దు  బరి గీసి పోరాడుదాం–బీసీఐఎఫ్ చైర్మన్, మాజీ ఐఏఎస్ చిరంజీవిలు 

బలిదానాలు వద్దు  బరి గీసి పోరాడుదాం–బీసీఐఎఫ్ చైర్మన్, మాజీ ఐఏఎస్ చిరంజీవిలు  సికింద్రాబాద్, డిసెంబర్ 05 (విప్రజామంటలు): బీసీలకు 42శాతం  రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుని ఆత్మహుతికి ప్రయత్నించి, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందిన సాయి ఈశ్వర్ చారి మృతదేహాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులను మాజీ ఐఏఎస్ చిరంజీవులు పరామర్శించారు. అనంతరం ఆయన...
Read More...