జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మార్చడం సరైన సమయంలో సరియైన నిర్ణయమేనా?
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మార్చడం సరైన సమయంలో సరియైన నిర్ణయమేనా?
కాంగ్రెస్ పార్టీలో కలవరం లేపిన సంజయ్ చేరిక
ఇది రెడ్డి - రావుల కలయికా? కలహమా?
ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరిక బిజేపి కి లాభామా ?
(సిరిసిల్ల రాజేందర్ శర్మ 9348422113)
జగిత్యాల జూన్ 24 (ప్రజా మంటలు) : జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో అనుకోని కుదుపు. నాలబై ఏళ్లుగా ఎదురులేని జీవన రెడ్డికి పోటీగా వెలమ సామాజిక వర్గం నుండి పోటీ రావడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని అనుకొంటున్నారు. జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమర్ కాంగ్రెస్ పార్టీ హవాలో సైతం గెలవడం ఆయనకు వ్యక్తిగతంగా, వైద్యునిగా ఉన్న మంచి పేరు బహుశా సంజయ్ కి కలిసి వచ్చి రెండవసారి సైతం గెలువగలిగాడు అనే వాళ్ళు లేకపోలేదు. ఇదిలా ఉండగా డా. సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల పలువురు ఆశ్చర్యం ప్రకటిస్తున్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐదు సంవత్సరాల పాటు రాజకీయ నిరుద్యోగిగా ఉండడం ఎలాంటి నియోజకవర్గ అభివృద్ధి పనులు చేసే పరిస్థితులు కష్టమవుతుందేమోనని ఆ ఉద్దేశంతోనే సంజయ్ పార్టీ మారినట్లు పలువురు నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు.ఈ ఇద్దరు నాయకులు ఒకే పార్టీలో ఉంది తగువులాడుకోవడం వల్ల బిజేపి లాభపడవచ్చని చర్చించుకొంటున్నారు.
కాంగ్రెస్ పార్టీలో సంజయ్ సమన్వయంతో పనిచేయగలుగుతాడా? అని పలువురు సంజయ్ పార్టీ మార్పు పట్ల చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్లోకి వెళ్లడం వ్యక్తిగతంగా ఆయనకు ప్రయోజనం జరగవచ్చుకానీ తనను నమ్ముకున్న వారికి మోసగించి కాంగ్రెస్ పార్టీలోకి చేరినారని బారాస నాయకులు కార్యకర్తలు బాహాటంగానే విమర్శిస్తూ సోమవారం డా. సంజయ్ దిష్టిబొమ్మను తగలబెట్టి తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేయడమే కాకుండా పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీ లోకి మారినందుకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు కోట్ల రూపాయలు ఆయన బ్యాంకు ఖాతాలో కాంగ్రెస్ పార్టీ జమ చేసిందని ధర్నా లో పాల్గొన్న పలువురు బారాస నాయకులు విమర్శించడం కొసమెరుపు . కాగా రాజకీయ దిగ్గజమైన ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో సమన్వయము డా. సంజయ్ కి కుదురుతుందా? మొదటి నుండి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సంజయ్ కుమార్ కు పార్టీలపరంగా మరియు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విషయాలపై కూడా దుమ్మెత్తి పోసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జీవన్ రెడ్డితో సంజయ్ కుమార్ చివరి వరకు కొనసాగుతారా? అనే సందిగ్ధాన్ని సంజయ్ అభిమానులు చర్చించుకుంటున్నారు.
చివరి వరకు పార్టీ మార్చే విషయాన్ని చాలా రహస్యంగా ఉంచి పార్టీ క్యాడర్ కు ఎలాంటి సంకేతాలు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ ను కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం అటు కాంగ్రెస్ పార్టీలోని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. అదేవిధంగా జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత, బారాస నాయకులు ,కార్యకర్తలు సోమవారం జిల్లా కేంద్రములోని తాసిల్ చౌరస్తా వద్ద సంజయ్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. డా .సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగులుతుందా? ఎన్నో సంవత్సరాలుగా గెలుపు ఓటములను లెక్కచేయకుండా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న జీవన్ రెడ్డి ఎమ్మెల్యే డా సంజయ్ రాకను స్వాగతిస్తారా? లేదా తాను ఎమ్మెల్సీగా కొనసాగడమా? రాజీనామా చేయడమా? అనే ఆలోచనలో పడ్డట్టు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్నారు.
ఏది ఏమైనప్పటికీ జగిత్యాల నియోజకవర్గం పలుమార్లు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఒకటైతే శాసనసభ్యులు వేరే పార్టీ వారు ఉండడం అభివృద్ధి నోచుకోక పోయిందని అపవాది ఉండేది. సంజయ్ కుమార్ కాంగ్రెస్ లోకి ప్రవేశించడంతో తాను గతంలో బారాస ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయలేని పెండింగ్ పనులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత చేయడానికి, నియోజకవర్గానికి కావలసిన నిధులు తేవడానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాల్సిందేనని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. నాలుగురైదుగురు ఎమ్మెల్యేలు, మంత్రి శ్రీధర్ బాబు వచ్చి సముదాయించినా, జీవన రద్దీ తన నిర్ణయాన్ని వాయిదావేసుకొన్నారే కానీ, వారి ప్రతిపాదనలకు ఒప్పుకోలేదని తెలుస్తుంది.
ఒక వేళ ఈ ఇద్దరూకాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే ఇటు కార్యకర్తలు, అటు అధికారులు ఇబ్బందులను ఎదుర్కొనక తప్పని పరిస్థితులు ఏర్పదనున్నాయి. ఇద్దరు వెనిక్కి తగ్గే స్వభామ లేకపోవడం, రాజకీయ అనుభవంతో రాష్ట్ర స్థాయిలో నెగ్గుక రాగళననే ధీమాతో ఉన్న జీవన రెడ్డి, ఎమ్మెల్యే అనే అధికార భావనతో సంజయ్ కుమార్ లు వ్యవహరించడం వల్ల జగిత్యాల అభివృద్ధి కుంటుపడుతుందో లేక మరిన్ని ఎక్కువ నిధులతో అభివృద్ధి చెందుతుందా అనేది కాలమే చెపుతుందని ప్రజలు భావిస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సుప్రీం కోర్టు తీర్పు: గవర్నర్–ముఖ్యమంత్రి అధికారాలపై దేశవ్యాప్త చర్చ
చెరువుల మరమ్మత్తులకు నిధులు ఇవ్వండి : MLA సంజయ్
హైదరాబాద్ నవంబర్ 21 (ప్రజా మంటలు):జగిత్యాల అభివృద్ధి పనులపై కీలక నిర్ణయాలు త్వరలో వెల్లువడనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని ఆయన కార్యాలయంలో కలిసి, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ వినతిపత్రం సమర్పించారు.
చెరువుల మరమ్మత్తులకు నిధుల అభ్యర్థన
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపిన వివరాల... చిరు ఉద్యోగుల పెద్ద మనసు....ప్రతి నెల వేతనం నుంచి కొంత భాగం సేవ పనులకు..
సికింద్రాబాద్, నవంబర్ 21 (ప్రజామంటలు) :
ఆర్ఎన్ఆర్ ఇన్ఫ్రా సంస్థ ఉద్యోగులు కృష్ణజ్యోతి, కీర్తిల ఆధ్వర్యంలో గాంధీ ఆస్పత్రి ఎంసీహెచ్ విభాగంలో చికిత్స పొందుతున్న బాలింతలు, గర్భిణీలకు శుక్రవారం పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ వాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామాజిక సేవలో భాగంగా ఉద్యోగులు తమ వేతనంలో కొంతభాగాన్ని ప్రతి... శిశు సంరక్షణపై మరింత అవగాహన పెంచుకోవాలి.. గాంధీలో న్యూ బోర్న్ బేబీ వారోత్సవాలు..
సికింద్రాబాద్, నవంబర్ 21 (ప్రజామంటలు) :
నవ జాత శిశు సంరక్షణపై తల్లులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వైద్యనిపుణులు అభిప్రాయపడ్డారు. గాంధీ మదర్ అండ్ చైల్డ్ కేర్ ఆస్పత్రి (ఎంసీహెచ్) లో గైనకాలజీ, పిడియాట్రిక్ విభాగాల సంయుక్త నేతృత్వంలో న్యూబోర్న్ బేబీ వారోత్సవాలను పురష్కరించుకుని శుక్రవారం పలు అవేర్నెస్ కార్యక్రమాలు... దేవాలయానికి ఎలక్ట్రానిక్ గుడి గంట బహుకరణ
ఇబ్రహీంపట్నం నవంబర్ 21 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వర్ష కొండ గ్రామంలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి శ్రీ పిస్క శ్రీనివాస్-లత దంపతులు ఎలక్ట్రానిక్ గుడి గంటను బహుకరించారు.
ఈ గంట ప్రతి గంట, ప్రతి గంటకు టైం చెప్పడంతో పాటు, ఒక భగవద్గీత శ్లోకం మరియు భక్తి గీతం... ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్ లత
ధర్మపురి నవంబర్ 21(ప్రజా మంటలు)
కొనుగోలు కేంద్రాలకి వచ్చిన ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్. లత అన్నారు.
శుక్రవారం ధర్మపురి మండలం రాజారాం , దమ్మన్నపేట్ మరియు దుబ్బల గూడెం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) మాట్లాడుతూ... రాష్ట్రపతికి రేవంత్ రెడ్డి స్వాగతం
హైదరాబాద్, నవంబర్ 21 (ప్రజా మంటలు):
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తో కలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్రపతి ని ఆహ్వానించారు.
రాష్ట్రపతి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న భారతీయ కళా మహోత్సవం – రెండవ... క్రీడల వల్ల నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
మెట్టుపల్లి నవంబర్ 21(ప్రజా మంటలు దగ్గుల అశోక్):
మెట్టుపల్లి పట్టణ పరిధిలోని వెల్లుల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి ఖోఖో పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జిల్లా విద్యాధికారి రాము గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... కౌన్సిలింగ్ తో వృద్ధుల కేసులు పరిష్కారం..
జగిత్యాల నవంబర్ 21 (ప్రజా మంటలు):
తల్లిదండ్రులను నిరాదరిస్తున్న కొడుకులు, కోడళ్ళకు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ కౌన్సిలింగ్ నిర్వహించారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని సీనియర్ సిటిజెన్స్ కార్యాలయం కౌన్సిలింగ్ కేంద్రానికి జిల్లా లోని జగిత్యాల పట్టణం, బీర్పూర్, మల్యాల, పెగడపల్లి, గొల్ల పల్లి... దుబాయ్ ఎయిర్ షో లో కూలిన తేజస్ ఫైటర్
దుబాయ్, నవంబర్ 21 (ప్రజా మంటలు):
దుబాయ్ ఎయిర్ షోలో భారత్కు చెందిన తేజస్ యుద్ధ విమానం కూలిపోయిన ఘటన కలకలం రేపింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, బెంగళూరు హెచ్.ఏ.ఎల్ (HAL) సంస్థలో తయారైన ఈ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో ఆకస్మికంగా కుప్పకూలింది.
విమానం కూలిన వెంటనే అక్కడ భారీగా ... కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కట్టిన ముడుపు విడిపించిన ఎంపీ వంశీ
గొల్లపల్లి, నవంబర్ 21 (ప్రజా మంటలు):
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ రాఘవపట్నంలోని హనుమాన్ దేవాలయాన్ని దర్శించి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని గతంలో కట్టుకున్న ముడుపును ఈరోజు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి పురోహితుల ఆశీర్వాదం తీసుకున్నారు.
గ్రామ ప్రజలతో మాట్లాడిన ఆయన దేవాలయ అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి సహాయం... ఈనెల 25 న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్?
హైదరాబాద్, నవంబర్ 21 (ప్రజా మంటలు):
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. బీసీ డెడికేటెడ్ కమిషన్ సమర్పించనున్న నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీరాజ్ చట్టం–2018 సవరణల ప్రకారం, గత ఎన్నికలలో... 