జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మార్చడం సరైన సమయంలో సరియైన నిర్ణయమేనా?

On
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మార్చడం సరైన సమయంలో సరియైన నిర్ణయమేనా?

 
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మార్చడం సరైన సమయంలో సరియైన నిర్ణయమేనా?
కాంగ్రెస్ పార్టీలో కలవరం లేపిన సంజయ్ చేరిక  
ఇది రెడ్డి - రావుల కలయికా? కలహమా?
ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరిక బిజేపి కి లాభామా ?

(సిరిసిల్ల రాజేందర్ శర్మ 9348422113)

జగిత్యాల జూన్ 24 (ప్రజా మంటలు) : జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో అనుకోని కుదుపు. నాలబై ఏళ్లుగా ఎదురులేని జీవన రెడ్డికి పోటీగా వెలమ సామాజిక వర్గం నుండి పోటీ రావడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని అనుకొంటున్నారు. జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమర్ కాంగ్రెస్ పార్టీ హవాలో సైతం గెలవడం ఆయనకు వ్యక్తిగతంగా, వైద్యునిగా ఉన్న మంచి పేరు బహుశా సంజయ్ కి కలిసి వచ్చి రెండవసారి సైతం గెలువగలిగాడు అనే వాళ్ళు లేకపోలేదు. ఇదిలా ఉండగా డా. సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల పలువురు ఆశ్చర్యం ప్రకటిస్తున్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐదు సంవత్సరాల పాటు రాజకీయ నిరుద్యోగిగా ఉండడం ఎలాంటి నియోజకవర్గ అభివృద్ధి పనులు చేసే పరిస్థితులు కష్టమవుతుందేమోనని ఆ ఉద్దేశంతోనే సంజయ్ పార్టీ మారినట్లు పలువురు నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు.ఈ ఇద్దరు నాయకులు ఒకే పార్టీలో ఉంది తగువులాడుకోవడం వల్ల బిజేపి లాభపడవచ్చని చర్చించుకొంటున్నారు.

 

కాంగ్రెస్ పార్టీలో సంజయ్ సమన్వయంతో పనిచేయగలుగుతాడా? అని పలువురు సంజయ్ పార్టీ మార్పు పట్ల చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్లోకి వెళ్లడం వ్యక్తిగతంగా ఆయనకు ప్రయోజనం జరగవచ్చుకానీ తనను నమ్ముకున్న వారికి మోసగించి కాంగ్రెస్ పార్టీలోకి చేరినారని  బారాస నాయకులు కార్యకర్తలు బాహాటంగానే విమర్శిస్తూ సోమవారం డా. సంజయ్ దిష్టిబొమ్మను తగలబెట్టి తమ ఆవేదనను, ఆగ్రహాన్ని  వ్యక్తం చేయడమే కాకుండా పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీ లోకి   మారినందుకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు కోట్ల రూపాయలు ఆయన బ్యాంకు ఖాతాలో కాంగ్రెస్ పార్టీ జమ చేసిందని ధర్నా లో పాల్గొన్న పలువురు బారాస నాయకులు విమర్శించడం కొసమెరుపు . కాగా రాజకీయ దిగ్గజమైన ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో సమన్వయము డా.  సంజయ్ కి కుదురుతుందా? మొదటి నుండి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సంజయ్ కుమార్ కు పార్టీలపరంగా మరియు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విషయాలపై కూడా దుమ్మెత్తి పోసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జీవన్ రెడ్డితో సంజయ్ కుమార్ చివరి వరకు కొనసాగుతారా? అనే సందిగ్ధాన్ని సంజయ్ అభిమానులు చర్చించుకుంటున్నారు.

 

చివరి వరకు పార్టీ మార్చే విషయాన్ని చాలా రహస్యంగా ఉంచి పార్టీ క్యాడర్ కు ఎలాంటి సంకేతాలు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ ను కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం అటు కాంగ్రెస్ పార్టీలోని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. అదేవిధంగా జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత, బారాస నాయకులు ,కార్యకర్తలు సోమవారం జిల్లా కేంద్రములోని తాసిల్ చౌరస్తా వద్ద సంజయ్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. డా .సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగులుతుందా? ఎన్నో సంవత్సరాలుగా గెలుపు ఓటములను లెక్కచేయకుండా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న జీవన్ రెడ్డి ఎమ్మెల్యే డా సంజయ్ రాకను స్వాగతిస్తారా? లేదా తాను ఎమ్మెల్సీగా కొనసాగడమా? రాజీనామా చేయడమా? అనే ఆలోచనలో పడ్డట్టు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్నారు.

 

ఏది ఏమైనప్పటికీ జగిత్యాల నియోజకవర్గం పలుమార్లు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఒకటైతే శాసనసభ్యులు వేరే పార్టీ వారు ఉండడం అభివృద్ధి నోచుకోక పోయిందని అపవాది ఉండేది. సంజయ్ కుమార్ కాంగ్రెస్ లోకి ప్రవేశించడంతో తాను గతంలో బారాస ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయలేని పెండింగ్ పనులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత చేయడానికి, నియోజకవర్గానికి కావలసిన నిధులు తేవడానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాల్సిందేనని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. నాలుగురైదుగురు ఎమ్మెల్యేలు, మంత్రి శ్రీధర్ బాబు వచ్చి సముదాయించినా, జీవన రద్దీ తన నిర్ణయాన్ని వాయిదావేసుకొన్నారే కానీ, వారి ప్రతిపాదనలకు ఒప్పుకోలేదని తెలుస్తుంది.

ఒక వేళ ఈ ఇద్దరూకాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే ఇటు కార్యకర్తలు, అటు అధికారులు ఇబ్బందులను ఎదుర్కొనక తప్పని పరిస్థితులు ఏర్పదనున్నాయి. ఇద్దరు వెనిక్కి తగ్గే స్వభామ లేకపోవడం, రాజకీయ అనుభవంతో రాష్ట్ర స్థాయిలో నెగ్గుక రాగళననే ధీమాతో ఉన్న జీవన రెడ్డి, ఎమ్మెల్యే అనే అధికార భావనతో సంజయ్ కుమార్ లు వ్యవహరించడం వల్ల జగిత్యాల అభివృద్ధి కుంటుపడుతుందో లేక మరిన్ని ఎక్కువ నిధులతో అభివృద్ధి చెందుతుందా అనేది కాలమే చెపుతుందని ప్రజలు భావిస్తున్నారు.    

 

Tags
Join WhatsApp

More News...

National  Crime  State News 

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ బస్సు ఢీకొని 8 మంది మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ బస్సు ఢీకొని 8 మంది మృతి కడలూరు, డిసెంబర్ 24: తమిళనాడులోని కడలూరు జిల్లా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచ్చి నుంచి చెన్నైకి వెళ్తున్న ప్రభుత్వ ఎక్స్ప్రెస్ బస్సు టైరు పేలడంతో నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తిట్టకుడి ప్రాంతం సమీపంలోని తిరుచ్చి హైవేపై రాత్రి సుమారు...
Read More...
Local News 

కిసాన్ గ్రామీణ మేళలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయకు జిల్లా కురుమ సంఘం ఘన సన్మానం

కిసాన్ గ్రామీణ మేళలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయకు జిల్లా కురుమ సంఘం ఘన సన్మానం కరీంనగర్, డిసెంబర్ 24 (ప్రజా మంటలు): కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన కిసాన్ గ్రామీణ మేళ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ గవర్నర్‌, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను జిల్లా కురుమ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు కడారి ఆయిలన్న కురుమ ఆధ్వర్యంలో దత్తాత్రేయకు మెమొంటో...
Read More...

ప్రజాపాలనలో రిటైర్డ్ ఉద్యోగుల దుస్థితి దుర్భరం రిటైర్డ్ బెనిఫిట్స్ ని ఏక కాలంలో చెల్లించాలి. జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్   దావ వసంత సురేష్ 

ప్రజాపాలనలో రిటైర్డ్ ఉద్యోగుల దుస్థితి దుర్భరం   రిటైర్డ్ బెనిఫిట్స్ ని ఏక కాలంలో చెల్లించాలి.  జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్   దావ వసంత సురేష్     జగిత్యాల డిసెంబర్ 24 (ప్రజా మంటలు)ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారిందని జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్  దావ వసంత సురేష్ విమర్శించారు.   రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫెర్ అసోసియేషన్, జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో 2024 ఏప్రిల్ నుండి రిటైర్డ్ అయినా ఉద్యోగుల...
Read More...

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో  నిరసన ధర్నా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం....  

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో  నిరసన ధర్నా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం....   జగిత్యాల డిసెంబర్ 24 (ప్రజా  మంటలు) జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు చేసి మారణ హోమం సృష్టిస్తున్నారని దాని నిరసిస్తూ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు. స్థానిక తహశీల్ చౌరస్తాలోనిరసన ధర్నా చేపట్టిబంగ్లాదేశ్ ప్రధాని దిష్టిబొమ్మ దహనం చేశారు ఈసందర్భంగా విశ్వహిందూ పరిషత్  జిల్లా అధ్యక్షులు...
Read More...

నవ్య బాలికల జూనియర్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు

నవ్య బాలికల జూనియర్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు జగిత్యాల డిసెంబర్ 24 (ప్రజా మంటలు)నవ్య బాలికల జూనియర్ కళాశాల జూనియర్ విద్యార్థులు సీనియర్ విద్యార్థులకు ఏర్పాటుచేసిన వీడ్కోలు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ ఎం.సంజయ్ కుమార్  హాజరై ఎలాంటి లాభాపేక్ష లేకుండా అమ్మాయిల కోసం ప్రత్యేక కళాశాల నెలకొల్పి అతికొద్ది కాలంలోనే రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధిస్తూ,...
Read More...

అమృత్ 2.O పథకం లోని పనులను వేగవంతం చేయాలి _అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్

అమృత్ 2.O పథకం లోని పనులను వేగవంతం చేయాలి _అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్    కోరుట్ల డిసెంబర్ 24 (ప్రజా మంటలు) మున్సిపాలిటీల్లో జనాభా పెరుగుతున్న దృష్ట్యా తాగునీటికి ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమృత్ 2.0 పథకం క్రింద నిధులు మంజూరు చేయగా ఈ పథకం కింద వాటర్ ట్యాంక్లు, వాటర్ సంప్, పైప్ లైన్లు నిర్మిస్తున్నారు.  జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పనులు కొనసాగుతున్న నేపథ్యంలో బుధవారం...
Read More...

తాడిచెల్లి నూతన సర్పంచ్ రామిడి రాజిరెడ్డికి ఘన సత్కారం

తాడిచెల్లి నూతన సర్పంచ్ రామిడి రాజిరెడ్డికి ఘన సత్కారం రం కరీంనగర్, డిసెంబర్ 24 (ప్రజా మంటలు):చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం తాడిచెల్లి గ్రామానికి నూతన సర్పంచ్‌గా ఎన్నికైన సీనియర్ కాంగ్రెస్ నేత, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామిడి రాజిరెడ్డిని కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్...
Read More...

ట్రిపుల్ ఆర్‌, భూసేకరణ, రైతు–చేనేత సమస్యలపై జాగృతి పోరాటం – భువనగిరిలో కవిత సంచలన వ్యాఖ్యలు

ట్రిపుల్ ఆర్‌, భూసేకరణ, రైతు–చేనేత సమస్యలపై జాగృతి పోరాటం – భువనగిరిలో కవిత సంచలన వ్యాఖ్యలు భువనగిరి డిసెంబర్ 24 (ప్రజా మంటలు): జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా భువనగిరి జిల్లాలో పర్యటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రెస్‌మీట్‌లో విస్తృత అంశాలపై స్పందించారు. తాను తెలంగాణ ప్రజల బాణమని, ఎవరో ఆపరేట్ చేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో బరిలో ఉంటామని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు...
Read More...
Local News 

పంచాయతీలకు నెలలో నిధులు విడుదల చేయాలి – లేదంటే హైదరాబాద్‌లో సర్పంచుల పరేడ్: బండి సంజయ్

పంచాయతీలకు నెలలో నిధులు విడుదల చేయాలి – లేదంటే హైదరాబాద్‌లో సర్పంచుల పరేడ్: బండి సంజయ్ కరీంనగర్, డిసెంబర్ 24 (ప్రజా మంటలు): తెలంగాణ గ్రామ పంచాయతీలకు నిధుల విడుదల విషయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నెల రోజుల్లోగా పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని డెడ్‌లైన్ విధిస్తూ, లేకపోతే హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్రవ్యాప్త సర్పంచులు, ఉప సర్పంచులతో భారీ “పరేడ్” నిర్వహిస్తామని హెచ్చరించారు. గ్రామాలకు నిధులు...
Read More...
Local News 

పొలాస వ్యవసాయ కళాశాలలో విద్యార్థులతో  మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే డా. సంజయ్‌ ముఖాముఖి 

పొలాస వ్యవసాయ కళాశాలలో విద్యార్థులతో  మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే డా. సంజయ్‌ ముఖాముఖి  జగిత్యాల రూరల్ డిసెంబర్ 24 (ప్రజా మంటలు): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పొలాస వ్యవసాయ కళాశాలలో నిర్వహించిన విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్ ప్రొఫెసర్ జానయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజెంగి నందయ్య,...
Read More...
Local News 

ఇటిక్యాల గ్రామ అభివృద్ధికి కలిసికట్టుగా పని చేయాలి – జీవన్‌రెడ్డి

ఇటిక్యాల గ్రామ అభివృద్ధికి కలిసికట్టుగా పని చేయాలి – జీవన్‌రెడ్డి జగిత్యాల రూరల్, డిసెంబర్ 24 (ప్రజా మంటలు): ఇందిరా భవన్‌లో ఇటిక్యాల గ్రామ సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులు మాజీ మంత్రి జీవన్‌రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల అనంతరం రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయడం ఇటిక్యాల...
Read More...
Today's Cartoon 

Today's Cartoon

Today's Cartoon Today's Cartoon
Read More...