జగిత్యాల నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఎన్ని కంపెనీలు తీసుకువచ్చారు ??

- బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి.

On
జగిత్యాల నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఎన్ని కంపెనీలు తీసుకువచ్చారు ??

(సిరిసిల్ల రాజేంద్ర శర్మ - 9963339493/9348422113).

జగిత్యాల జూన్ 15 (ప్రజా మంటలు )

నియోజకవర్గంలో 4520 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు సాంక్షన్ అయ్యి నిరుపయోగం గా వుంటే వాటి గురించి పట్టించుకోకుండా కేవలం వారికి కావలసిన వర్గానికి కావాల్సిన వారి కోసమే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇద్దరూ పాకులాడుతున్నారు.

ఎమ్మెల్సీ మరియు ఎమ్మెల్యే ఇద్దరు నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్న జగిత్యాల కి మీరిద్దరూ కలిసి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు ఎంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు ఎన్ని ఇంటర్నేషనల్ కంపెనీలు జగిత్యాలకు తీసుకువచ్చారు శ్వేత పత్రం విడుదల చేయగలరా??

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ...

జీవన్ రెడ్డి 4వ వార్డ్ లో ఒక ఇంటి నిర్మాణాన్ని అక్రమ కట్టడం అని కలెక్టర్ కి కంప్లైంట్ ఇచ్చారు మరి అదే వార్డులో అదే ఇంటి ముందు ఇంకో ఇల్లు కట్టడం జరుగుతుంది. మరి దానిపై మీరు ఎందుకు స్పందించలేదు ...?

ఒక వర్గానికి చెందిన వారిపై ప్రేమ.?

అక్రమ కట్టడంపై వార్డులో ఒక వ్యక్తికి నోటీసులు వచ్చినప్పుడు అదే ఇంటి ముందు జరుగుతున్న ఇంకో అక్రమ కట్టడానికి ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదు.

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అక్రమ కట్టడాలు ఎవరు కట్టిన చర్యలు తీసుకోవాలి కేవలం మీ అనుచరుడిని వెనుక వేసుకుని వస్తే ఎలా

నచ్చితే సక్రమం నచ్చకపోతే అక్రమం అనేది ఎమ్మెల్యే మీకు వర్తిస్తుంది

ఈ మాటలు చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది

ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ హోదాలో ఉండి మీరు ఈ అక్రమ కట్టడాలను ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా...?

ఒక అక్రమ కట్టడం గురించి ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తులు ఇలా మాట్లాడడం జగిత్యాల ప్రజలు విడ్డురంగా చుస్తునారు,

 జగిత్యాల్ కి ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి 4,520 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిస్థితి ఏంటి...?

 వాటికి కనీస వసతులు కూడా లేవు కరెంట్, రోడ్లు,డ్రైనేజీ మరియు తాగునీటి వ్యవస్థ సరిగ్గా లేదు కరెంటు మీటర్లు రాక చెప్పులు అరిగేలా కరెంట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు కనీసం పట్టించుకునే నాయకుడు లేడు కనీసం నీటి వసతి కూడా అక్కడ సరిగ్గా లేదు కేవలం మున్సిపల్ వాటర్ ట్యాంక్ వచ్చి పోస్తే తప్ప వారికి నీళ్లు లేవు వారి గురించి మీరు ఎవరైనా మాట్లాడారా...

ఎమ్మెల్యే ఎమ్మెల్సీ దీనికి సమాధానం చెప్పండి...?

జీవన్ రెడ్డి మీ ప్రభుత్వం అధికారంలో ఉంది డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గురించి ఒక్కసారి అన్న సీఎం ని అడిగారా రిప్రజెంటేషన్ ఇచ్చారా అని ప్రశ్నించారు.

6 గ్యారంటీల అమలు ఏమైంది నియోజకవర్గ సమస్యలపై స్పందించండి అన్నారు.

1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న తెలుగు పుస్తకలలో ముందు మాట కె సి ఆర్ పేరు వుంది అని వెనక్కు తీసుకోవడం ఏంటి అన్నారు.

ఆంద్రప్రదేశ్ లో పాత సి ఎం ఫొటో వుంటే అవే పంచండి ప్రభుత్వ సొమ్ము వేస్ట్ చేయకండి అని ఎన్ డి ఏ భాగస్వామ్య సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు

700 కోట్లతో కో-కో -కోలా కంపెనీ పక్కన ఉన్న పెద్దపెల్లి జిల్లాకు అక్కడ మంత్రి తీసుకువెళ్తే మీరు ఏం చేస్తున్నారు

జగిత్యాల జిల్లా కి అన్ని హంగులు ఉండి ముఖ్యంగా ముడి సరుకు అయిన అతిపెద్ద మ్యాంగో మార్కెట్ జగిత్యాలో ఉంది అదే కంపెనీ జగిత్యాలకు వస్తే సుమారు 2000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన వారు అవుతారు రైతులకు మేలు చేసిన వారు అవుతారు

 ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇది మీ ఎన్నికలహామీ మీరు మర్చిపోయారా??

జీవన్ రెడ్డి మీ ప్రభుత్వంలో ఉండి మీరు జగిత్యాలకు ఏం చేస్తున్నారు ఏ కంపెనీ ఎందుకు రాలేదు జగిత్యాలకి

జగిత్యాల కు ఎమ్మెల్యే ఏంఎల్సీ ఎన్ని ఉద్యోగాలు తీస్కోచ్చారు శ్వేత పత్రం విడుదల చేస్తారా??? అని డాక్టర్ బోగ శ్రావణి ప్రశ్నించారు 

ఈ కార్యక్రమంలో జగిత్యాల రూరల్ మండల అధ్యక్షుడు నలువాల తిరుపతి, జగిత్యాల పట్టణ ప్రధాన కార్యదర్శిలు ఆముదరాజు, సిరికొండ రాజన్న, మాజీ పట్టణ అధ్యక్షులు వీరభత్తిని అనిల్ కుమార్, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు కొక్కు గంగాధర్, జగిత్యాల్ పట్టణ ఇన్చార్జ్ మ్యాదరి అశోక్, పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు దురిశెట్టి మమత, పట్టణ ఉపాధ్యక్షులు గాదాసు రాజేందర్, మల్లేశ్వరి సింగం పద్మ మరియు తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

ప్రధాని సంసద్ ఖేల్ మహోత్సవం–2026ను విజయవంతం చేయాలి :

ప్రధాని సంసద్ ఖేల్ మహోత్సవం–2026ను విజయవంతం చేయాలి : సికింద్రాబాద్, జనవరి 7 (ప్రజామంటలు): ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం–2026 ను సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో విజయవంతం చేయాలని బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ టి. రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం బోయిగూడలోని గొల్ల కొమురయ్య కాలనీలో బీజేపీ బన్సీలాల్‌పేట్ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. .నియోజకవర్గంలో జరుగుతున్న...
Read More...

డ్రగ్స్‌, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి – జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

డ్రగ్స్‌, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి – జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  రాయికల్ జనవరి 7 ( ప్రజా మంటలు)డ్రగ్స్‌, మాదకద్రవ్యాల మహమ్మారిని సమాజం నుండి పూర్తిగా నిర్మూలించి భావితరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  తెలిపారు.   రాయికల్ ఈ...
Read More...
Local News 

సైబర్ నేరాలపై అవగాహన సదస్సు 

సైబర్ నేరాలపై అవగాహన సదస్సు  ఇబ్రహీంపట్నం జనవరి 7 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   జగిత్యాల అశోక్ కుమార్ ఆదేశాల మేరకు బుధవారం రోజున ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల (కేజీబీవీ) విద్యార్థులకు సైబర్,డ్రగ్స్, ట్రాఫిక్ మరియు ఉమెన్ ట్రాఫికింగ్ లాంటి పలు అంశాల పైన అవగాహన సదస్సు ను ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు.
Read More...
Local News 

సర్పంచ్, ఉప సర్పంచ్,వార్డ్ సభ్యులకు శాలువాతో సన్మానం

సర్పంచ్, ఉప సర్పంచ్,వార్డ్ సభ్యులకు శాలువాతో సన్మానం గొల్లపల్లి జనవరి 07  (ప్రజా మంటలు):   కథలాపూర్ మండల కేంద్రంలో  పద్మశాలి కమ్యూనిటీ  భవనంలో బుధవారం జగిత్యాల్ జిల్లా పద్మశాలి కమ్యూనిటీ కార్యవర్గ సభ్యుడు పులి హరిప్రసాద్  ఆధ్వర్యంలో కథలాపూర్ మండలంలోని ఆయా గ్రామాలలోని సర్పంచ్  ఉప సర్పంచులు వార్డు సభ్యులు  పద్మశాలి కమ్యూనిటీ  సభ్యులను శాలువాతో ఘనంగా సన్మానించారు   ఈ కార్యక్రమంలో కథలాపూర్ మండల...
Read More...

జగిత్యాల మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగరవేయాలి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ 

జగిత్యాల మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగరవేయాలి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్     జగిత్యాల జనవరి 7 ( ప్రజా మంటలు)  జగిత్యాల మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగుర వేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లా బి ఆర్ యస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్, జిల్లా బి ఆర్ యస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు , జిల్లా తొలి జడ్పీ...
Read More...
State News 

నేచురల్, ఆర్గానిక్ వ్యవసాయం రైతుకు లాభదాయకం : డా. జీ. చిన్నారెడ్డి

నేచురల్, ఆర్గానిక్ వ్యవసాయం రైతుకు లాభదాయకం : డా. జీ. చిన్నారెడ్డి హైదరాబాద్, జనవరి 07 (ప్రజా మంటలు): నేచురల్, ఆర్గానిక్ వ్యవసాయం వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా భూమి సారవంతంగా మారి రైతుకు మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి తెలిపారు. లక్డికాపూల్‌లోని ఫ్యాప్సీ కాన్ఫరెన్స్ హాల్‌లో రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం డైరీలు, క్యాలెండర్లు, పాకెట్ డైరీలను...
Read More...

బి ఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్ష పదవికి గట్టు సతీష్ రాజీనామా

బి ఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్ష పదవికి గట్టు సతీష్ రాజీనామా   జగిత్యాల జనవరి 7 ( ప్రజా మంటలు) 2014 నుండి దాదాపు దశాబ్ద కాలం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ (టిఆర్ఎస్) పార్టీ కార్యకర్తగా, జగిత్యాల పట్టణ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించిన గట్టు సతీష్ వ్యక్తిగత కారణాలతో అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. బిఆర్ ఎస్ పార్టీ కుటుంబ...
Read More...

భగవద్గీతే నిజమైన విద్యకు పునాది., సిద్దార్థ విద్యా సంస్థల ఎస్ ఎస్ సి  విద్యార్థులకు దేవనాథ జీయర్ స్వామీజీ బోధ

భగవద్గీతే నిజమైన విద్యకు పునాది., సిద్దార్థ విద్యా సంస్థల ఎస్ ఎస్ సి  విద్యార్థులకు దేవనాథ జీయర్ స్వామీజీ బోధ    జగిత్యాల జనవరి 7(ప్రజా మంటలు)పట్టణం లోని సిద్ధార్థ విద్యాసంస్థ ఆధ్వర్యంలో మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో సూర్య గ్లోబల్ స్కూల్, జ్యోతి హై స్కూల్, మానస హై స్కూల్ విద్యార్థుల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే ఉద్దేశంతో 10వ తరగతి విద్యార్థులకోసం “ఎగ్జామ్ ఛాలెంజెస్– మోటివేషనల్ సెషన్ ” అనే ప్రేరణాత్మక కార్యక్రమాన్ని  నిర్వహించారు. ...
Read More...

కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఆమోదం

కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఆమోదం హైదరాబాద్ జనవరి 07 (ప్రజామంటలు):    నిజామాబాద్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన రాజీనామాను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఈ మేరకు లెజిస్లేటివ్ సెక్రటరీ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. కల్వకుంట్ల కవిత  2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచి...
Read More...

కొండగట్టు క్షేత్రానికి భారీగా తరలివచ్చిన భక్తులు

కొండగట్టు క్షేత్రానికి భారీగా తరలివచ్చిన భక్తులు    కొండగట్టు జనవరి 6 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజామున నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ముందుగా బేతాళ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకున్నారు. టెంకాయ మొక్కులు చెల్లించి తమ...
Read More...

మంగళవారం కొండగట్టులో ట్రాఫిక్ రద్దీ.. పార్కింగ్ కొరతతో భక్తుల ఇబ్బందులు

మంగళవారం కొండగట్టులో ట్రాఫిక్ రద్దీ.. పార్కింగ్ కొరతతో భక్తుల ఇబ్బందులు కొండగట్టు జనవరి 6 (ప్రజా మంటలు)   బొజ్జనపెల్లి గణేష్ కొండగట్టు కొండగట్టు ఆలయముకు మంగళవారం సందర్భంగా వాహనాల్లో వచ్చిన భక్తుల రద్దీతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. గుట్టపై సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో తరచూ ఇలాంటి పరిస్థితి నెలకొంటోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు....
Read More...

మంగళవారం కొండగట్టులో ట్రాఫిక్ రద్దీ.. పార్కింగ్ కొరతతో భక్తుల ఇబ్బందులు

మంగళవారం కొండగట్టులో ట్రాఫిక్ రద్దీ.. పార్కింగ్ కొరతతో భక్తుల ఇబ్బందులు    కొండగట్టు జనవరి 6 ( ప్రజా మంటలు)బొజ్జన పెల్లి గణేష్ (కొండగట్టు)   కొండగట్టు ఆలయముకు మంగళవారం సందర్భంగా వాహనాల్లో వచ్చిన భక్తుల రద్దీతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. గుట్టపై సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో తరచూ ఇలాంటి పరిస్థితి నెలకొంటోందని భక్తులు ఆవేదన...
Read More...