జగిత్యాల నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఎన్ని కంపెనీలు తీసుకువచ్చారు ??
- బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి.
(సిరిసిల్ల రాజేంద్ర శర్మ - 9963339493/9348422113).
జగిత్యాల జూన్ 15 (ప్రజా మంటలు )
నియోజకవర్గంలో 4520 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు సాంక్షన్ అయ్యి నిరుపయోగం గా వుంటే వాటి గురించి పట్టించుకోకుండా కేవలం వారికి కావలసిన వర్గానికి కావాల్సిన వారి కోసమే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇద్దరూ పాకులాడుతున్నారు.
ఎమ్మెల్సీ మరియు ఎమ్మెల్యే ఇద్దరు నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్న జగిత్యాల కి మీరిద్దరూ కలిసి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు ఎంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు ఎన్ని ఇంటర్నేషనల్ కంపెనీలు జగిత్యాలకు తీసుకువచ్చారు శ్వేత పత్రం విడుదల చేయగలరా??
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ...
జీవన్ రెడ్డి 4వ వార్డ్ లో ఒక ఇంటి నిర్మాణాన్ని అక్రమ కట్టడం అని కలెక్టర్ కి కంప్లైంట్ ఇచ్చారు మరి అదే వార్డులో అదే ఇంటి ముందు ఇంకో ఇల్లు కట్టడం జరుగుతుంది. మరి దానిపై మీరు ఎందుకు స్పందించలేదు ...?
ఒక వర్గానికి చెందిన వారిపై ప్రేమ.?
అక్రమ కట్టడంపై వార్డులో ఒక వ్యక్తికి నోటీసులు వచ్చినప్పుడు అదే ఇంటి ముందు జరుగుతున్న ఇంకో అక్రమ కట్టడానికి ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదు.
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అక్రమ కట్టడాలు ఎవరు కట్టిన చర్యలు తీసుకోవాలి కేవలం మీ అనుచరుడిని వెనుక వేసుకుని వస్తే ఎలా
నచ్చితే సక్రమం నచ్చకపోతే అక్రమం అనేది ఎమ్మెల్యే మీకు వర్తిస్తుంది
ఈ మాటలు చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది
ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ హోదాలో ఉండి మీరు ఈ అక్రమ కట్టడాలను ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా...?
ఒక అక్రమ కట్టడం గురించి ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తులు ఇలా మాట్లాడడం జగిత్యాల ప్రజలు విడ్డురంగా చుస్తునారు,
జగిత్యాల్ కి ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి 4,520 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిస్థితి ఏంటి...?
వాటికి కనీస వసతులు కూడా లేవు కరెంట్, రోడ్లు,డ్రైనేజీ మరియు తాగునీటి వ్యవస్థ సరిగ్గా లేదు కరెంటు మీటర్లు రాక చెప్పులు అరిగేలా కరెంట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు కనీసం పట్టించుకునే నాయకుడు లేడు కనీసం నీటి వసతి కూడా అక్కడ సరిగ్గా లేదు కేవలం మున్సిపల్ వాటర్ ట్యాంక్ వచ్చి పోస్తే తప్ప వారికి నీళ్లు లేవు వారి గురించి మీరు ఎవరైనా మాట్లాడారా...
ఎమ్మెల్యే ఎమ్మెల్సీ దీనికి సమాధానం చెప్పండి...?
జీవన్ రెడ్డి మీ ప్రభుత్వం అధికారంలో ఉంది డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గురించి ఒక్కసారి అన్న సీఎం ని అడిగారా రిప్రజెంటేషన్ ఇచ్చారా అని ప్రశ్నించారు.
6 గ్యారంటీల అమలు ఏమైంది నియోజకవర్గ సమస్యలపై స్పందించండి అన్నారు.
1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న తెలుగు పుస్తకలలో ముందు మాట కె సి ఆర్ పేరు వుంది అని వెనక్కు తీసుకోవడం ఏంటి అన్నారు.
ఆంద్రప్రదేశ్ లో పాత సి ఎం ఫొటో వుంటే అవే పంచండి ప్రభుత్వ సొమ్ము వేస్ట్ చేయకండి అని ఎన్ డి ఏ భాగస్వామ్య సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు
700 కోట్లతో కో-కో -కోలా కంపెనీ పక్కన ఉన్న పెద్దపెల్లి జిల్లాకు అక్కడ మంత్రి తీసుకువెళ్తే మీరు ఏం చేస్తున్నారు
జగిత్యాల జిల్లా కి అన్ని హంగులు ఉండి ముఖ్యంగా ముడి సరుకు అయిన అతిపెద్ద మ్యాంగో మార్కెట్ జగిత్యాలో ఉంది అదే కంపెనీ జగిత్యాలకు వస్తే సుమారు 2000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన వారు అవుతారు రైతులకు మేలు చేసిన వారు అవుతారు
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇది మీ ఎన్నికలహామీ మీరు మర్చిపోయారా??
జీవన్ రెడ్డి మీ ప్రభుత్వంలో ఉండి మీరు జగిత్యాలకు ఏం చేస్తున్నారు ఏ కంపెనీ ఎందుకు రాలేదు జగిత్యాలకి
జగిత్యాల కు ఎమ్మెల్యే ఏంఎల్సీ ఎన్ని ఉద్యోగాలు తీస్కోచ్చారు శ్వేత పత్రం విడుదల చేస్తారా??? అని డాక్టర్ బోగ శ్రావణి ప్రశ్నించారు
ఈ కార్యక్రమంలో జగిత్యాల రూరల్ మండల అధ్యక్షుడు నలువాల తిరుపతి, జగిత్యాల పట్టణ ప్రధాన కార్యదర్శిలు ఆముదరాజు, సిరికొండ రాజన్న, మాజీ పట్టణ అధ్యక్షులు వీరభత్తిని అనిల్ కుమార్, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు కొక్కు గంగాధర్, జగిత్యాల్ పట్టణ ఇన్చార్జ్ మ్యాదరి అశోక్, పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు దురిశెట్టి మమత, పట్టణ ఉపాధ్యక్షులు గాదాసు రాజేందర్, మల్లేశ్వరి సింగం పద్మ మరియు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
చేనేత కార్మికులందరికీ ‘చేయూత’ పెన్షన్ వర్తింపజేయాలి : ఎల్ రమణ
హైదరాబాద్ సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న అర్హులైన ప్రతి కార్మికుడికి ‘చేయూత’ పెన్షన్ పథకం వర్తించేలా అర్హత ప్రమాణాలను విస్తరించాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
ప్రస్తుతం జియో ట్యాగింగ్ ద్వారా గుర్తింపు... రేవంత్రెడ్డికి సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదు: మాజీ మంత్రి జీవన్రెడ్డి
పాలన చేతగాక.. రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్
హైకోర్టు తీర్పు పార్టీ ఫిరాయింపుల విషయంలో ప్రభుత్వానికి గుణపాఠం
జగిత్యాల, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి ఆరోపించారు. రైతుల సమస్యలు, ఆరు గ్యారంటీల అమలు వంటి... కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అమన్ జిత్ సింగ్
కరీంనగర్, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
కరీంనగర్ పట్టణంలోని సిక్కు వాడకు చెందిన కాంగ్రెస్ నాయకుడు అమన్ జిత్ సింగ్ను జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. చొప్పదండి ఎమ్మెల్యే, DCC అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం రేకుర్తి క్యాంపు కార్యాలయంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్... రేపే కొడంగల్ గడ్డపై కల్వకుంట్ల కవిత పాంచజన్య శంఖారావం
కొడంగల్–కోస్గి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు)::
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కోస్గి కాలేజీ గ్రౌండ్లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నారు. సభకు పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. 120 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో సభా వేదికను ఏర్పాటు చేయగా, సుమారు... మున్సిపల్ లో గణనాథునుకి ఉత్తర పూజలు
జగిత్యాల, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
వినాయక నవరాత్రుల సందర్భంగా జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణనాథునికి మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, కమిషనర్ సత్య ప్రణవ్, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్తర పూజలు చేసి అన్నదానం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర చేపట్టారు.... సింహాచలం జగన్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు
ఎండపెల్లి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఎండపెల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన కుటుంబ సభ్యులను జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత... రాయికల్లో లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే సంజయ్
రాయికల్, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
రాయికల్ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.30 లక్షల వ్యయంతో నాలుగు డీటీఆర్లు ఏర్పాటు చేసినట్లు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. గృహజ్యోతి పథకం... రాయికల్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ
రాయికల్, సెప్టెంబర్ 18 (ప్రజా మంటలు):
రాయికల్ పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీరనాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆవిష్కరించారు.
ఈ విగ్రహాన్ని వేముల ప్రభాకర్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా... శ్రీ గౌరీ ప్రియ నగర వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ మండపం వద్ద కొనసాగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు
కీసర సెప్టెంబర్ 17 ( ప్రజా మంటలు)కుందన్ పల్లి లోని శ్రీ గౌరీ ప్రియ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ మండపం వద్ద నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతినిత్యం కొనసాగుతున్నాయి.
దీనిలో భాగంగా గణేష్ హోమము మాతలచే సామూహిక కుంకుమార్చనలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు... రెడ్ బుల్స్ వినాయక మండపం వద్ద మాజీ చైర్పర్సన్ పూజలు
జగిత్యాల సెప్టెంబర్ 17(ప్రజా మంటలు) జగిత్యాల బ్రాహ్మణ వీధిలోని రెడ్ బుల్స్ గణేశ మండపం వద్ద గురువారం సాయంత్రం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి దంపతులు సందర్శించి వినాయకునికి పూజలు చేశారు. రుద్రాంగి గోపాలకృష్ణ తీర్థప్రసాద్ అందజేసి స్వామి వారి శేష వస్తుందో సత్కరించి ఆశీర్వచనం చేశారు. జగిత్యాలలో అయోమయంలో "గణేశ నిమజ్జనోత్సవ తేదీలు
" జగిత్యాల సెప్టెంబర్ 16 (ప్రజా మంటలు) గణేష్ నవరాత్రి ఉత్సవాల నిమజ్జోత్సవ వేడుకలపై జగిత్యాల జిల్లా కేంద్రంలో అయోమయం నెలకొంది. 9 రాత్రులు ముగిసిన తర్వాత వారంతో సంబంధం లేకుండా నిమజ్జనం చేయడం ఒక ఆచారంగా వస్తుంది. అదేవిధంగా అనంత చతుర్దశి నాడు నిమజ్జనం చేయడం కూడా ఓ ఆచారం కొనసాగుతుంది.
విశ్వహిందూ పరిషత్తు... రెడ్ బుల్స్ గణేష మంటపం వద్ద లలితా సహస్రనామ పారాయణం
జగిత్యాల సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి లో గల రెడ్ బుల్స్ గణేష్ మండపం వద్ద మంగళవారం రాత్రి హనుమాన్ చాలీసా భక్తబృందం వారిచే లలితా సహస్రనామం పారాయణం హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. కార్యక్రమం అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు. 