జగిత్యాల నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఎన్ని కంపెనీలు తీసుకువచ్చారు ??
- బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి.
(సిరిసిల్ల రాజేంద్ర శర్మ - 9963339493/9348422113).
జగిత్యాల జూన్ 15 (ప్రజా మంటలు )
నియోజకవర్గంలో 4520 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు సాంక్షన్ అయ్యి నిరుపయోగం గా వుంటే వాటి గురించి పట్టించుకోకుండా కేవలం వారికి కావలసిన వర్గానికి కావాల్సిన వారి కోసమే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇద్దరూ పాకులాడుతున్నారు.
ఎమ్మెల్సీ మరియు ఎమ్మెల్యే ఇద్దరు నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్న జగిత్యాల కి మీరిద్దరూ కలిసి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు ఎంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు ఎన్ని ఇంటర్నేషనల్ కంపెనీలు జగిత్యాలకు తీసుకువచ్చారు శ్వేత పత్రం విడుదల చేయగలరా??
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ...
జీవన్ రెడ్డి 4వ వార్డ్ లో ఒక ఇంటి నిర్మాణాన్ని అక్రమ కట్టడం అని కలెక్టర్ కి కంప్లైంట్ ఇచ్చారు మరి అదే వార్డులో అదే ఇంటి ముందు ఇంకో ఇల్లు కట్టడం జరుగుతుంది. మరి దానిపై మీరు ఎందుకు స్పందించలేదు ...?
ఒక వర్గానికి చెందిన వారిపై ప్రేమ.?
అక్రమ కట్టడంపై వార్డులో ఒక వ్యక్తికి నోటీసులు వచ్చినప్పుడు అదే ఇంటి ముందు జరుగుతున్న ఇంకో అక్రమ కట్టడానికి ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదు.
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అక్రమ కట్టడాలు ఎవరు కట్టిన చర్యలు తీసుకోవాలి కేవలం మీ అనుచరుడిని వెనుక వేసుకుని వస్తే ఎలా
నచ్చితే సక్రమం నచ్చకపోతే అక్రమం అనేది ఎమ్మెల్యే మీకు వర్తిస్తుంది
ఈ మాటలు చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది
ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ హోదాలో ఉండి మీరు ఈ అక్రమ కట్టడాలను ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా...?
ఒక అక్రమ కట్టడం గురించి ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తులు ఇలా మాట్లాడడం జగిత్యాల ప్రజలు విడ్డురంగా చుస్తునారు,
జగిత్యాల్ కి ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి 4,520 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిస్థితి ఏంటి...?
వాటికి కనీస వసతులు కూడా లేవు కరెంట్, రోడ్లు,డ్రైనేజీ మరియు తాగునీటి వ్యవస్థ సరిగ్గా లేదు కరెంటు మీటర్లు రాక చెప్పులు అరిగేలా కరెంట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు కనీసం పట్టించుకునే నాయకుడు లేడు కనీసం నీటి వసతి కూడా అక్కడ సరిగ్గా లేదు కేవలం మున్సిపల్ వాటర్ ట్యాంక్ వచ్చి పోస్తే తప్ప వారికి నీళ్లు లేవు వారి గురించి మీరు ఎవరైనా మాట్లాడారా...
ఎమ్మెల్యే ఎమ్మెల్సీ దీనికి సమాధానం చెప్పండి...?
జీవన్ రెడ్డి మీ ప్రభుత్వం అధికారంలో ఉంది డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గురించి ఒక్కసారి అన్న సీఎం ని అడిగారా రిప్రజెంటేషన్ ఇచ్చారా అని ప్రశ్నించారు.
6 గ్యారంటీల అమలు ఏమైంది నియోజకవర్గ సమస్యలపై స్పందించండి అన్నారు.
1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న తెలుగు పుస్తకలలో ముందు మాట కె సి ఆర్ పేరు వుంది అని వెనక్కు తీసుకోవడం ఏంటి అన్నారు.
ఆంద్రప్రదేశ్ లో పాత సి ఎం ఫొటో వుంటే అవే పంచండి ప్రభుత్వ సొమ్ము వేస్ట్ చేయకండి అని ఎన్ డి ఏ భాగస్వామ్య సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు
700 కోట్లతో కో-కో -కోలా కంపెనీ పక్కన ఉన్న పెద్దపెల్లి జిల్లాకు అక్కడ మంత్రి తీసుకువెళ్తే మీరు ఏం చేస్తున్నారు
జగిత్యాల జిల్లా కి అన్ని హంగులు ఉండి ముఖ్యంగా ముడి సరుకు అయిన అతిపెద్ద మ్యాంగో మార్కెట్ జగిత్యాలో ఉంది అదే కంపెనీ జగిత్యాలకు వస్తే సుమారు 2000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన వారు అవుతారు రైతులకు మేలు చేసిన వారు అవుతారు
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇది మీ ఎన్నికలహామీ మీరు మర్చిపోయారా??
జీవన్ రెడ్డి మీ ప్రభుత్వంలో ఉండి మీరు జగిత్యాలకు ఏం చేస్తున్నారు ఏ కంపెనీ ఎందుకు రాలేదు జగిత్యాలకి
జగిత్యాల కు ఎమ్మెల్యే ఏంఎల్సీ ఎన్ని ఉద్యోగాలు తీస్కోచ్చారు శ్వేత పత్రం విడుదల చేస్తారా??? అని డాక్టర్ బోగ శ్రావణి ప్రశ్నించారు
ఈ కార్యక్రమంలో జగిత్యాల రూరల్ మండల అధ్యక్షుడు నలువాల తిరుపతి, జగిత్యాల పట్టణ ప్రధాన కార్యదర్శిలు ఆముదరాజు, సిరికొండ రాజన్న, మాజీ పట్టణ అధ్యక్షులు వీరభత్తిని అనిల్ కుమార్, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు కొక్కు గంగాధర్, జగిత్యాల్ పట్టణ ఇన్చార్జ్ మ్యాదరి అశోక్, పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు దురిశెట్టి మమత, పట్టణ ఉపాధ్యక్షులు గాదాసు రాజేందర్, మల్లేశ్వరి సింగం పద్మ మరియు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి – 2026 తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ
మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి సంబంధించిన తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లోని ఆనంద్ బాగ్, మల్కాజిగిరి లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సమితి వ్యవస్థాపకులు నెమ్మాని విష్ణుమూర్తి శర్మ, అధ్యక్షులు మహాదేవభట్ల లక్ష్మణప్రసాద్ శర్మ, ఉపాధ్యక్షులు దామెర సత్యనారాయణ శర్మ, గణపురం రాంప్రసాద్ శర్మ, ప్రధాన కార్యదర్శి యలమంచి... ఓటరు తస్మాత్ జాగ్రత్త..! మల్లారంలో జాగృతి నాటిక
గంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన –
* ప్రశాంత ఎన్నికల పిలుపు కాంగ్రెస్ అరాచకానికి బీసీ బిడ్డ బలి: వసంత సురేష్ తీవ్ర విమర్శలు
రాయికల్, డిసెంబర్ 7 (ప్రజా మంటలు):
కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లను అమలు చేయకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లిన నిర్ణయం బీసీ వర్గాలపై తీవ్ర అన్యాయం చేసిందని, ఆ నిరాశతోనే బీసీ బిడ్డ ఈశ్వర చారి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ మండిపడ్డారు. రాయికల్... పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ సమావేశం. -టీ పి సీ ఏ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్.
జగిత్యాల డిసెంబర్ 7:పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం సోమవారం హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి సమావేశం తెలంగాణ పెన్షన ర్స్ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ తెలిపారు.ఆదివారం జిల్లా టి. పి. సీ. ఏ. కార్యాలయంలో అయన విలేకరుల తో మాట్లాడుతూ హైదరాబాద్ లోని
ఈ... అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆర్ద్ర నక్షత్రం సందర్భంగా హరిహరాలయంలో ఫల ,పంచామృత అభిషేకాలు
జగిత్యాల డిసెంబర్ 7 (ప్రజా మంటలు)అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ఆదివారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా పరమశివునికి పంచామృతాలు ,వివిధ ఫల రసాలతో సూర్యోదయానికి పూర్వమే అభిషేకాలు నిర్వహించారు.
భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు తమ స్వహస్తాలతో సాంబశివుని కి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు.... అగ్ని ప్రమాద బాధితులకు భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యుల చేయూత
మల్యాల డిసెంబరు 7 ( ప్రజా మంటలు)స్థానిక కొండగట్టు లో ఒక దారుణ అగ్నిప్రమాదంలో దాదాపు 20 చిరువ్యాపారులు చేసుకొనే షాపులు పూర్తిగా కాలిపోయి , కుటుంబాలు అన్ని రోడ్డు మీదకి వచ్చాయి.
ఇతర స్థానిక కుటుంబీకులు సామ శ్రీనాథ్ గారి కుటుంబ సభ్యులు మరియు మహేష్ గారు మన సత్యసాయి సంస్థ ని... ఓటర్లకు భరోసా కల్పిస్తూ ఇబ్రహీంపట్నం లో పోలీసుల ఫ్లాగ్మార్చ్
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 07 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్):రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భద్రతా హామీ ఇవ్వడం కోసం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మెట్టుపల్లి... మహాభారత జ్ఞాన యజ్ఞం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 7(ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్న మహాభారత జ్ఞాన యజ్ఞము రెండవ రోజు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అట్టహాసంగా శనివారం ప్రారంభమైన మహాభారత నవహాన్నిక ప్రవచన జ్ఞాన యజ్ఞం ఆదివారం రెండవ రోజుకు చేరింది.
విశ్వ కళ్యాణర్థం... సిటీలో క్రిస్మస్ ముందస్తు సెలబ్రేషన్స్. : కేక్ మిక్సింగ్..ఫన్ గేమ్స్..శాంతాక్లాజ్ సందడి
సికింద్రాబాద్, డిసెంబర్ 07 (ప్రజామంటలు):
క్రిస్మస్ ముందస్తు సెలబ్రేషన్స్ సిటీలో ఘనంగా మొదలయ్యాయి. బేగంపేట లోని మ్యారీగోల్డ్ హోటల్ లో క్రిస్మస్ ముందస్తు వేడుకలు కన్నులపండువగా జరిగాయి. ఈసందర్బంగా నీలిమా వేముల నిర్వహించిన స్పెషల్ ఈవెంట్ లో మహిళలు మెరిశారు.
ముఖ్య అతిథిగా బేబక్క, స్పీకర్ గా రజిత హాజరయ్యారు. సుధా నాయుడు, లావణ్య, ప్రణతి... మోంబాసా సాటర్ డే క్లబ్ ఫండ్ రైజింగ్లో MOMTA సభ్యుల ప్రదర్శన
సికింద్రాబాద్, డిసెంబర్ 07 ( ప్రజామంటలు) :
కెన్యా లోని మోంబాసా తెలుగు అసోసియేషన్ ( MOMTA) ఆధ్వర్యంలో ఫండ్ రైజింగ్ కొరకు "సాటర్ డే క్లబ్" నిర్వహించిన అసోసియేషన్ సభ్యుల సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది. బోర్ వెల్లుల ఏర్పాటు, విద్యార్థుల విద్యా సహాయం, భారీ నీటి నిల్వ ట్యాంకుల విరాళం, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు... కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు సత్యసాయి సేవా సమితి చేయూత
కొండగట్టు, డిసెంబర్ 06 (ప్రజా మంటలు):స్థానికంగా జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 20 మంది చిరు వ్యాపారుల షాపులు పూర్తిగా కాలిపోవడంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. పరిస్థితి తెలుసుకున్న భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల తరఫున తక్షణ సహాయం అందించారు.
సామ శ్రీనాథ్ కుటుంబ సభ్యులు, మహేష్ మొదలైన వారు... కాసేపు హాయిగా నవ్వుకోండి..చాలా సీరియస్ అంశం?
నేటి సామాజిక ఆలోచనలపై వ్యంగ్య రచన
(జర్నలిస్ట్ నాగ్ రాజ్ FB నుండి)
ఇందాక ఆకలేసి, దారిలో పంచెకట్టు దోశ సెంటర్ కనిపిస్తే వెళ్లా.
మెనూ చెక్ చేసి,"ఓ ఘీంకారం దోశ.. టోకెన్ ఇవ్వు" అనడిగా.
(అంటే ఏనుగు అరుపు కాదు) -ed
"అది ఘీంకారం కాదు, ఘీ కారం" అన్నాడాయన కోపంగా.
"ఓహ్,... 