YLNS కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ను గాయత్రి బ్యాంక్ యందు విలీనం

On
YLNS కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ను గాయత్రి బ్యాంక్ యందు విలీనం

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల జూన్ 9 (ప్రజా మంటలు) : 

తెలంగాణ లోని యాదాద్రి భువనగిరి జిల్లా యందలి యాదగిరి లక్ష్మి నరసింహ స్వామీ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ని తెలంగాణ లోని జగిత్యాల యందు గల గాయత్రి కో ఆపరేటవ్ అర్బన్ బ్యాంక్ యందు విలీనం చేయడానికి సమ్మేళన పథకాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ వారు ఆమొదించడం జరిగింది.

ఇట్టి సమ్మేళనం తేదీ 10-06-2024 నుండి అమలులోకి వస్తుంది. 6 శాఖలతో 170.74 కోట్ల వ్యాపారం కలిగిన ఇట్టి YLNS బ్యాంక్ సోమవారం నుండి గాయత్రి బ్యాంక్ యందు విలీనం చేస్తున్నాం. ఇకపై YLNS బ్యాంక్ యొక్క 6 బ్రాంచీలు గాయత్రి బ్యాంక్ యొక్క బ్రాంచీలు గా పని చేస్తాయి. 

మీ అందరికీ తెలిసిన విధంగా తేది 11-09-2000 న ప్రారంభించబడిన గాయత్రి బ్యాంక్ తెలంగాణ లో మల్టి స్టేట్ బ్యాంక్ గా గత 24 సంవత్సరాలుగా తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములలో బ్యాంకింగ్ సేవలందిస్తూ ఉన్నాము.

ప్రస్తుతము 39 బ్రాంచిలతో పని చేస్తున్న గాయత్రి బ్యాంక్ ఇట్టి విలీనంతో 45 బ్రాంచిలకు చేరుకొనున్నము, మరియు ఈ సవత్సరంథానికి 60 బ్రాంచీలు చేరుకోవాలని లక్యంగా పెట్టుకున్నాము.

వ్యాపార పరంగా చూసినట్లయితే, విలీనం అనంతరం రు: 1635.86 కోట్ల డిపాజిట్స్ రు 1177.82 కోట్ల రుణాల తో రు. 2813.68 కోట్ల వ్యాపారానికి చేరుకున్నాము. అలాగే గాయత్రి బ్యాంక్ 7.49 లక్షల కస్టమర్ బేస్ తో సౌత్ ఇండియా లోనే అగ్ర స్థానంలో ఉండగా ylns బ్యాంక్ 23 వేల ఖాతాదారులను కలిగి ఉండగా విలీనం తో 7.69 లక్షలను కలిగి ఉన్నము.

మరియు రాబోవు కాలం లో ఒక మిలియన్ కస్టమర్ బేస్ కి చెరవలేనన్న లక్ష్యం తో పని చేస్తున్నాము.

2000 వ సంవత్సరములో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో చివరి బ్యాంక్ గా ప్రారంభించబడి 24 వసంతాలలో రెండవ పెద్ద బ్యాంక్ గా అవతరించింది. రాబోవు జూన్ క్వార్టర్ ముగింపు నాటికి మొదటి స్థానంలో కి చేరుకోవడానికి కృషి చేస్తున్నాము.

గాయత్రీ బ్యాంక్‌లో, కస్టమర్ సంతృప్తి, ఆవిష్కరణ మరియు నైతిక బ్యాంకింగ్ పద్ధతులపై బలమైన దృష్టితో, బ్యాంక్ విభిన్న శ్రేణి ఆర్థిక ఉత్పత్తులను సేవలను అందిస్తుంది అని నమ్ముతున్నాము.

డిజిటల్‌గా కూడా గాయత్రీ బ్యాంక్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసెస్ (AePS), యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UP) వంటి ఉత్పత్తుల పరిచయంతో డిజిటల్ కార్యకలాపాల యొక్క అన్ని రంగాలలో ఒక ఆవిష్కర్తగా ఉద్భవించింది.

భద్రతా చర్యలపై 24 x 7 నిఘాతో బ్యాంకింగ్ లావాదేవీల భద్రత ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నాము.

మేము ప్రస్తుతం 432 మంది ఉద్యోగులను కలిగి ఉన్నాము మరియు YLNS బ్యాంక్ నుండి మరో 56 మంది ఉద్యోగులు మా కుటుంబంలో చేర్చబడతారు మరియు మరో 210 మంది ఉద్యోగులను నియమించవలసిన అవసరం ఉంది కాగా మొత్తం 698 మంది ఉద్యోగులకు చేరుకోనున్నారు.

మేము సెంట్రల్ పేమెంట్ సిస్టమ్‌లో ప్రత్యక్ష సభ్యులుగా కూడా మారబోతున్నాము మరియు త్వరలో, షెడ్యూల్డ్ బ్యాంక్‌గా మారడం ద్వారా మేము మరో మైలురాయిని చేరుకుంటాము, దీని కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అనుమతులు రావలసి ఉన్నవి.

బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు మరియు గాయత్రీ బ్యాంక్ బృందం మొత్తం నిబద్ధత మరియు అంకితభావంతో ప్రజలకు చేరుకోని సేవ చేయడానికి మరింత బాధ్యతను కలిగి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.

మా గాయత్రీ బ్యాంక్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు మరియు స్టాఫ్ మెంబర్‌ల తరపున, విలీనానికి సంబంధించిన స్వచ్ఛంద నిర్ణయం తీసుకున్న YLNS బ్యాంక్ డైరెక్టర్లందరికీ, మరియు మా వాటాదారులు, కస్టమర్లు, శ్రేయోభిలాషులు, మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.

బ్యాంక్ లక్ష్యాలు మరియు గమ్యాలను చేరుకొని ముందుకు సాగడానికి మీ నిరంతర మద్దతు మరియు ప్రోత్సాహాము ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాము అని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వనమాల శ్రీనివాస్ గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ కోరారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

చేనేత కార్మికులందరికీ ‘చేయూత’ పెన్షన్ వర్తింపజేయాలి : ఎల్ రమణ

చేనేత కార్మికులందరికీ ‘చేయూత’ పెన్షన్ వర్తింపజేయాలి : ఎల్ రమణ    హైదరాబాద్ సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు): చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న అర్హులైన ప్రతి కార్మికుడికి ‘చేయూత’ పెన్షన్ పథకం వర్తించేలా అర్హత ప్రమాణాలను విస్తరించాలని బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం జియో ట్యాగింగ్ ద్వారా గుర్తింపు...
Read More...
Local News  State News 

రేవంత్‌రెడ్డికి సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదు: మాజీ మంత్రి జీవన్‌రెడ్డి

రేవంత్‌రెడ్డికి సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదు: మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పాలన చేతగాక.. రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ హైకోర్టు తీర్పు పార్టీ ఫిరాయింపుల విషయంలో ప్రభుత్వానికి గుణపాఠం జగిత్యాల, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు): పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి ఆరోపించారు. రైతుల సమస్యలు, ఆరు గ్యారంటీల అమలు వంటి...
Read More...
Local News 

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అమన్ జిత్ సింగ్

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అమన్ జిత్ సింగ్ కరీంనగర్, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు): కరీంనగర్ పట్టణంలోని సిక్కు వాడకు చెందిన కాంగ్రెస్ నాయకుడు అమన్ జిత్ సింగ్ను జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. చొప్పదండి ఎమ్మెల్యే, DCC అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం రేకుర్తి క్యాంపు కార్యాలయంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్...
Read More...
State News 

రేపే కొడంగల్ గడ్డపై కల్వకుంట్ల కవిత పాంచజన్య శంఖారావం

రేపే  కొడంగల్ గడ్డపై కల్వకుంట్ల కవిత పాంచజన్య శంఖారావం కొడంగల్–కోస్గి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కోస్గి కాలేజీ గ్రౌండ్‌లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నారు. సభకు పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. 120 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో సభా వేదికను ఏర్పాటు చేయగా, సుమారు...
Read More...
Local News 

మున్సిపల్ లో గణనాథునుకి ఉత్తర పూజలు 

మున్సిపల్ లో గణనాథునుకి ఉత్తర పూజలు  జగిత్యాల, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు): వినాయక నవరాత్రుల సందర్భంగా జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణనాథునికి మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, కమిషనర్ సత్య ప్రణవ్, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్తర పూజలు చేసి అన్నదానం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర చేపట్టారు....
Read More...
Local News 

సింహాచలం జగన్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు

సింహాచలం జగన్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు ఎండపెల్లి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఎండపెల్లి మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన కుటుంబ సభ్యులను జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత...
Read More...
Local News 

రాయికల్‌లో లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే సంజయ్

రాయికల్‌లో లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే సంజయ్ రాయికల్, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు): రాయికల్ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.30 లక్షల వ్యయంతో నాలుగు డీటీఆర్‌లు ఏర్పాటు చేసినట్లు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. గృహజ్యోతి పథకం...
Read More...
State News 

రాయికల్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ

రాయికల్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ రాయికల్, సెప్టెంబర్ 18 (ప్రజా మంటలు): రాయికల్ పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీరనాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని వేముల ప్రభాకర్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా...
Read More...
Local News 

శ్రీ గౌరీ ప్రియ నగర వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ మండపం వద్ద కొనసాగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు

శ్రీ గౌరీ ప్రియ నగర వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ మండపం వద్ద కొనసాగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు    కీసర సెప్టెంబర్ 17 ( ప్రజా మంటలు)కుందన్ పల్లి లోని శ్రీ గౌరీ ప్రియ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ మండపం వద్ద నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతినిత్యం కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా గణేష్ హోమము మాతలచే సామూహిక కుంకుమార్చనలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు...
Read More...
Local News 

రెడ్ బుల్స్ వినాయక మండపం వద్ద మాజీ చైర్పర్సన్  పూజలు

రెడ్ బుల్స్ వినాయక మండపం వద్ద మాజీ చైర్పర్సన్  పూజలు   జగిత్యాల సెప్టెంబర్ 17(ప్రజా మంటలు) జగిత్యాల బ్రాహ్మణ వీధిలోని రెడ్ బుల్స్ గణేశ మండపం వద్ద గురువారం సాయంత్రం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి దంపతులు సందర్శించి వినాయకునికి పూజలు చేశారు. రుద్రాంగి గోపాలకృష్ణ తీర్థప్రసాద్ అందజేసి స్వామి వారి శేష వస్తుందో సత్కరించి ఆశీర్వచనం చేశారు.
Read More...
Local News 

జగిత్యాలలో  అయోమయంలో "గణేశ నిమజ్జనోత్సవ తేదీలు

జగిత్యాలలో  అయోమయంలో     " జగిత్యాల సెప్టెంబర్ 16 (ప్రజా మంటలు) గణేష్ నవరాత్రి ఉత్సవాల నిమజ్జోత్సవ వేడుకలపై జగిత్యాల జిల్లా కేంద్రంలో అయోమయం నెలకొంది. 9 రాత్రులు ముగిసిన తర్వాత వారంతో సంబంధం లేకుండా నిమజ్జనం చేయడం ఒక ఆచారంగా వస్తుంది. అదేవిధంగా అనంత చతుర్దశి నాడు నిమజ్జనం చేయడం కూడా ఓ ఆచారం కొనసాగుతుంది. విశ్వహిందూ పరిషత్తు...
Read More...
Local News 

రెడ్ బుల్స్ గణేష మంటపం వద్ద  లలితా సహస్రనామ పారాయణం

రెడ్ బుల్స్ గణేష మంటపం వద్ద  లలితా సహస్రనామ పారాయణం జగిత్యాల సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి లో గల రెడ్ బుల్స్ గణేష్ మండపం వద్ద మంగళవారం రాత్రి హనుమాన్ చాలీసా భక్తబృందం వారిచే లలితా సహస్రనామం పారాయణం హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. కార్యక్రమం అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు.
Read More...