YLNS కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ను గాయత్రి బ్యాంక్ యందు విలీనం
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జూన్ 9 (ప్రజా మంటలు) :
తెలంగాణ లోని యాదాద్రి భువనగిరి జిల్లా యందలి యాదగిరి లక్ష్మి నరసింహ స్వామీ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ని తెలంగాణ లోని జగిత్యాల యందు గల గాయత్రి కో ఆపరేటవ్ అర్బన్ బ్యాంక్ యందు విలీనం చేయడానికి సమ్మేళన పథకాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ వారు ఆమొదించడం జరిగింది.
ఇట్టి సమ్మేళనం తేదీ 10-06-2024 నుండి అమలులోకి వస్తుంది. 6 శాఖలతో 170.74 కోట్ల వ్యాపారం కలిగిన ఇట్టి YLNS బ్యాంక్ సోమవారం నుండి గాయత్రి బ్యాంక్ యందు విలీనం చేస్తున్నాం. ఇకపై YLNS బ్యాంక్ యొక్క 6 బ్రాంచీలు గాయత్రి బ్యాంక్ యొక్క బ్రాంచీలు గా పని చేస్తాయి.
మీ అందరికీ తెలిసిన విధంగా తేది 11-09-2000 న ప్రారంభించబడిన గాయత్రి బ్యాంక్ తెలంగాణ లో మల్టి స్టేట్ బ్యాంక్ గా గత 24 సంవత్సరాలుగా తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములలో బ్యాంకింగ్ సేవలందిస్తూ ఉన్నాము.
ప్రస్తుతము 39 బ్రాంచిలతో పని చేస్తున్న గాయత్రి బ్యాంక్ ఇట్టి విలీనంతో 45 బ్రాంచిలకు చేరుకొనున్నము, మరియు ఈ సవత్సరంథానికి 60 బ్రాంచీలు చేరుకోవాలని లక్యంగా పెట్టుకున్నాము.
వ్యాపార పరంగా చూసినట్లయితే, విలీనం అనంతరం రు: 1635.86 కోట్ల డిపాజిట్స్ రు 1177.82 కోట్ల రుణాల తో రు. 2813.68 కోట్ల వ్యాపారానికి చేరుకున్నాము. అలాగే గాయత్రి బ్యాంక్ 7.49 లక్షల కస్టమర్ బేస్ తో సౌత్ ఇండియా లోనే అగ్ర స్థానంలో ఉండగా ylns బ్యాంక్ 23 వేల ఖాతాదారులను కలిగి ఉండగా విలీనం తో 7.69 లక్షలను కలిగి ఉన్నము.
మరియు రాబోవు కాలం లో ఒక మిలియన్ కస్టమర్ బేస్ కి చెరవలేనన్న లక్ష్యం తో పని చేస్తున్నాము.
2000 వ సంవత్సరములో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో చివరి బ్యాంక్ గా ప్రారంభించబడి 24 వసంతాలలో రెండవ పెద్ద బ్యాంక్ గా అవతరించింది. రాబోవు జూన్ క్వార్టర్ ముగింపు నాటికి మొదటి స్థానంలో కి చేరుకోవడానికి కృషి చేస్తున్నాము.
గాయత్రీ బ్యాంక్లో, కస్టమర్ సంతృప్తి, ఆవిష్కరణ మరియు నైతిక బ్యాంకింగ్ పద్ధతులపై బలమైన దృష్టితో, బ్యాంక్ విభిన్న శ్రేణి ఆర్థిక ఉత్పత్తులను సేవలను అందిస్తుంది అని నమ్ముతున్నాము.
డిజిటల్గా కూడా గాయత్రీ బ్యాంక్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసెస్ (AePS), యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UP) వంటి ఉత్పత్తుల పరిచయంతో డిజిటల్ కార్యకలాపాల యొక్క అన్ని రంగాలలో ఒక ఆవిష్కర్తగా ఉద్భవించింది.
భద్రతా చర్యలపై 24 x 7 నిఘాతో బ్యాంకింగ్ లావాదేవీల భద్రత ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నాము.
మేము ప్రస్తుతం 432 మంది ఉద్యోగులను కలిగి ఉన్నాము మరియు YLNS బ్యాంక్ నుండి మరో 56 మంది ఉద్యోగులు మా కుటుంబంలో చేర్చబడతారు మరియు మరో 210 మంది ఉద్యోగులను నియమించవలసిన అవసరం ఉంది కాగా మొత్తం 698 మంది ఉద్యోగులకు చేరుకోనున్నారు.
మేము సెంట్రల్ పేమెంట్ సిస్టమ్లో ప్రత్యక్ష సభ్యులుగా కూడా మారబోతున్నాము మరియు త్వరలో, షెడ్యూల్డ్ బ్యాంక్గా మారడం ద్వారా మేము మరో మైలురాయిని చేరుకుంటాము, దీని కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అనుమతులు రావలసి ఉన్నవి.
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు మరియు గాయత్రీ బ్యాంక్ బృందం మొత్తం నిబద్ధత మరియు అంకితభావంతో ప్రజలకు చేరుకోని సేవ చేయడానికి మరింత బాధ్యతను కలిగి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.
మా గాయత్రీ బ్యాంక్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు మరియు స్టాఫ్ మెంబర్ల తరపున, విలీనానికి సంబంధించిన స్వచ్ఛంద నిర్ణయం తీసుకున్న YLNS బ్యాంక్ డైరెక్టర్లందరికీ, మరియు మా వాటాదారులు, కస్టమర్లు, శ్రేయోభిలాషులు, మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.
బ్యాంక్ లక్ష్యాలు మరియు గమ్యాలను చేరుకొని ముందుకు సాగడానికి మీ నిరంతర మద్దతు మరియు ప్రోత్సాహాము ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాము అని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వనమాల శ్రీనివాస్ గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
SIR పేరుతో మహిళల హక్కుల హరణం.. బీజేపీపై మమతా బెనర్జీ ఘాటు విమర్శలు
కృష్ణ నగర్ (పశ్చిమ బెంగాల్) డిసెంబర్ 14:
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమూల సవరణ (SIR) పేరుతో మహిళల హక్కులను హరించే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్లోని కృష్ణ నగర్లో SIRకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీకి మమతా... ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్… కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ
హైదరాబాద్ డిసెంబర్ 15
నిన్న ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన మెస్సీ – రేవంత్ టీమ్ల ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్కు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు.
ఈ ప్రయాణ సమయంలో రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయ పరిణామాలపై... దొంగ మల్లన్న స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
(అంకం భూమయ్య)
గొల్లపల్లి డిసెంబర్ 14 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేటలో ఉన్న దొంగ మల్లన్న స్వామిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కొప్పుల ఈశ్వర్ ఆదివారం దర్శించుకున్నారు. దండి ఆదివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన స్వామివారి ఆశీస్సులు తీసుకొని ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి,... స్వగ్రామం అంతర్గామలో తమ ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్ దంపతులు
జగిత్యాల డిసెంబర్ 14 (ప్రజా మంటలు)
రెండవ విడత ఆదివారం గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా తన స్వంత గ్రామం అంతర్గం లో జగిత్యాల ఎమ్మెల్యే దంపతులు డా. సంజయ్ కుమార్ రాధిక లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గోపాల్ రావు పేట గ్రామంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్న తొలి జడ్పీ చైర్పర్సన్ వసంత దంపతులు
జగిత్యాల డిసెంబర్ 14 (ప్రజా మంటలు)రెండవ విడత ఆదివారం గ్రామపంచాయతీ ఎన్నికలలో జగిత్యాల అర్బన్ మండలం గోపాల్ రావు పేట్ స్వగ్రామంలో జగిత్యాల తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ దంపతులు గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. జగిత్యాల "చిరక్కల్ మహదేవన్" భోగోజి ముఖేష్ ఖన్నా స్వామి.
జగిత్యాల డిసెంబర్ 14 (ప్రజా మంటలు) :
అయ్యప్ప స్వాములకు పరిచయం అక్కరలేని పేరు "చిరక్కల్ మహదేవన్".
"చిరక్కల్ మహదేవన్" అనేది కేరళకు చెందిన ఒక ప్రసిద్ధ ఏనుగు పేరు.
మహాదేవన్ అయ్యప్ప భక్తుడు ఒక శక్తివంతమైన ఏనుగు, ఇది సంప్రదాయ పూజలు చేసి, శబరిమల యాత్రలు చేసేది.
అలాంటి... ఉప్పల్ స్టేడియంలో మెస్సీ–రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్.. అభిమానుల్లో ఉత్సాహం
హైదరాబాద్ డిసెంబర్ 13 (ప్రజా మంటలు):
ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ప్రత్యేక ఫుట్బాల్ మ్యాచ్లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్రెడ్డి, ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మైదానంలోకి దిగారు. ఈ మ్యాచ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
మ్యాచ్లో సీఎం రేవంత్రెడ్డి ఒక గోల్ సాధించగా, మెస్సీ రెండు గోల్స్తో తన ప్రతిభను చాటుకున్నారు. గోల్స్తో పాటు... నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే జగిత్యాలకు మెడికల్ కాలేజీ: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 13 (ప్రజా మంటలు):
రాజకీయాల్లోకి తాను వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రిని కోరడంతోనే జగిత్యాలకు మెడికల్ కాలేజీ మంజూరైందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఆరు మెడికల్ కాలేజీలు మంజూరైన సమయంలో జగిత్యాల పేరు జాబితాలో ఉండేలా కృషి చేశానని చెప్పారు. రాష్ట్రంలో మొదట అనుమతి పొందిన మెడికల్... వయోవృద్ధులకు టాస్కా ఆసరా. -అల్ సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో 9వ టాస్క ఆవిర్భావ దినోత్సవం వేడుకలు.
జగిత్యాల డిసెంబర్ 13 (ప్రజా మంటలు):
వయో వృద్ధులకు తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ ఆసరాగా ఉందని,వయోవృద్ధుల సంరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం పట్ల సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
శనివారం ఆల్ సీనియర్ సిటీజేన్స్... సర్పంచ్ ఎన్నికల్లో తమ్ముడు ఓటమి: గుండెపోటుతో అక్క మృతి
కోరుట్ల డిసెంబర్ 13 (ప్రజా మంటలు) :
సర్పంచ్ ఎన్నికల్లో తమ్ముడు ఓడిపోవడాన్ని తట్టుకోలేక అక్క గుండెపోటుతో మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామస్తుల వివరాల ప్రకారం, పోతు రాజశేఖర్ సర్పంచ్ పదవికి పోటీ చేయగా గురువారం ఎన్నికలు జరిగాయి. ఫలితాల సమయంలో రాజశేఖర్ అక్క కొక్కుల... రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం
హైదరాబాద్ డిసెంబర్ 13:
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఎల్కతుర్తి గ్రామ సర్పంచిగా మునిగడప లావణ్య శేషగిరి ఘన విజయం
ఎల్కతుర్తి డిసెంబర్ 13 (ప్రజా మంటలు)
ఎల్కతుర్తి మండలం గ్రామంలో బి. ఆర్.ఎస్. పార్టీ బలపరిచిన అభ్యర్థి మునిగడప లావణ్య శేషగిరి ఘన విజయం సాధించిన సందర్భంగా ఎల్కాతుర్తి మండలానికి చెందిన తెలంగాణ రైతు రక్షణ సమితి హన్మకొండ ఉమ్మడి కరీంనగర్ జిల్లాల అధ్యక్షుడు హింగే భాస్కర్ ఆధ్వర్యంలో గ్రామంలో ప్రజలతో మమేకమై పండుగ వాతావరణముగా... 