YLNS కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ను గాయత్రి బ్యాంక్ యందు విలీనం

On
YLNS కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ను గాయత్రి బ్యాంక్ యందు విలీనం

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల జూన్ 9 (ప్రజా మంటలు) : 

తెలంగాణ లోని యాదాద్రి భువనగిరి జిల్లా యందలి యాదగిరి లక్ష్మి నరసింహ స్వామీ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ని తెలంగాణ లోని జగిత్యాల యందు గల గాయత్రి కో ఆపరేటవ్ అర్బన్ బ్యాంక్ యందు విలీనం చేయడానికి సమ్మేళన పథకాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ వారు ఆమొదించడం జరిగింది.

ఇట్టి సమ్మేళనం తేదీ 10-06-2024 నుండి అమలులోకి వస్తుంది. 6 శాఖలతో 170.74 కోట్ల వ్యాపారం కలిగిన ఇట్టి YLNS బ్యాంక్ సోమవారం నుండి గాయత్రి బ్యాంక్ యందు విలీనం చేస్తున్నాం. ఇకపై YLNS బ్యాంక్ యొక్క 6 బ్రాంచీలు గాయత్రి బ్యాంక్ యొక్క బ్రాంచీలు గా పని చేస్తాయి. 

మీ అందరికీ తెలిసిన విధంగా తేది 11-09-2000 న ప్రారంభించబడిన గాయత్రి బ్యాంక్ తెలంగాణ లో మల్టి స్టేట్ బ్యాంక్ గా గత 24 సంవత్సరాలుగా తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములలో బ్యాంకింగ్ సేవలందిస్తూ ఉన్నాము.

ప్రస్తుతము 39 బ్రాంచిలతో పని చేస్తున్న గాయత్రి బ్యాంక్ ఇట్టి విలీనంతో 45 బ్రాంచిలకు చేరుకొనున్నము, మరియు ఈ సవత్సరంథానికి 60 బ్రాంచీలు చేరుకోవాలని లక్యంగా పెట్టుకున్నాము.

వ్యాపార పరంగా చూసినట్లయితే, విలీనం అనంతరం రు: 1635.86 కోట్ల డిపాజిట్స్ రు 1177.82 కోట్ల రుణాల తో రు. 2813.68 కోట్ల వ్యాపారానికి చేరుకున్నాము. అలాగే గాయత్రి బ్యాంక్ 7.49 లక్షల కస్టమర్ బేస్ తో సౌత్ ఇండియా లోనే అగ్ర స్థానంలో ఉండగా ylns బ్యాంక్ 23 వేల ఖాతాదారులను కలిగి ఉండగా విలీనం తో 7.69 లక్షలను కలిగి ఉన్నము.

మరియు రాబోవు కాలం లో ఒక మిలియన్ కస్టమర్ బేస్ కి చెరవలేనన్న లక్ష్యం తో పని చేస్తున్నాము.

2000 వ సంవత్సరములో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో చివరి బ్యాంక్ గా ప్రారంభించబడి 24 వసంతాలలో రెండవ పెద్ద బ్యాంక్ గా అవతరించింది. రాబోవు జూన్ క్వార్టర్ ముగింపు నాటికి మొదటి స్థానంలో కి చేరుకోవడానికి కృషి చేస్తున్నాము.

గాయత్రీ బ్యాంక్‌లో, కస్టమర్ సంతృప్తి, ఆవిష్కరణ మరియు నైతిక బ్యాంకింగ్ పద్ధతులపై బలమైన దృష్టితో, బ్యాంక్ విభిన్న శ్రేణి ఆర్థిక ఉత్పత్తులను సేవలను అందిస్తుంది అని నమ్ముతున్నాము.

డిజిటల్‌గా కూడా గాయత్రీ బ్యాంక్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసెస్ (AePS), యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UP) వంటి ఉత్పత్తుల పరిచయంతో డిజిటల్ కార్యకలాపాల యొక్క అన్ని రంగాలలో ఒక ఆవిష్కర్తగా ఉద్భవించింది.

భద్రతా చర్యలపై 24 x 7 నిఘాతో బ్యాంకింగ్ లావాదేవీల భద్రత ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నాము.

మేము ప్రస్తుతం 432 మంది ఉద్యోగులను కలిగి ఉన్నాము మరియు YLNS బ్యాంక్ నుండి మరో 56 మంది ఉద్యోగులు మా కుటుంబంలో చేర్చబడతారు మరియు మరో 210 మంది ఉద్యోగులను నియమించవలసిన అవసరం ఉంది కాగా మొత్తం 698 మంది ఉద్యోగులకు చేరుకోనున్నారు.

మేము సెంట్రల్ పేమెంట్ సిస్టమ్‌లో ప్రత్యక్ష సభ్యులుగా కూడా మారబోతున్నాము మరియు త్వరలో, షెడ్యూల్డ్ బ్యాంక్‌గా మారడం ద్వారా మేము మరో మైలురాయిని చేరుకుంటాము, దీని కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అనుమతులు రావలసి ఉన్నవి.

బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు మరియు గాయత్రీ బ్యాంక్ బృందం మొత్తం నిబద్ధత మరియు అంకితభావంతో ప్రజలకు చేరుకోని సేవ చేయడానికి మరింత బాధ్యతను కలిగి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.

మా గాయత్రీ బ్యాంక్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు మరియు స్టాఫ్ మెంబర్‌ల తరపున, విలీనానికి సంబంధించిన స్వచ్ఛంద నిర్ణయం తీసుకున్న YLNS బ్యాంక్ డైరెక్టర్లందరికీ, మరియు మా వాటాదారులు, కస్టమర్లు, శ్రేయోభిలాషులు, మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.

బ్యాంక్ లక్ష్యాలు మరియు గమ్యాలను చేరుకొని ముందుకు సాగడానికి మీ నిరంతర మద్దతు మరియు ప్రోత్సాహాము ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాము అని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వనమాల శ్రీనివాస్ గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ కోరారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

వందేమాతరం 150 ఏళ్ల జాతీయ ఉత్సవాల్లో పీఐబీ 

వందేమాతరం 150 ఏళ్ల జాతీయ ఉత్సవాల్లో పీఐబీ  సికింద్రాబాద్, నవంబర్ 07 (ప్రజా మంటలు):  దేశభక్తి, ఐక్యత ప్రతీకగా నిలిచిన జాతీయ గేయం ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాన్ని పీఐబీ హైదరాబాద్‌ ఘనంగా నిర్వహించింది. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ (సీబీసీ), డీపీడీ యూనిట్లతో కలిసి పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) ఆధ్వర్యంలో ఈ వేడుకలు శుక్రవారం ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది...
Read More...
Local News 

ప్రభుత్వ ఉద్యోగులకు 44% ఫిట్‌మెంట్ అమలు చేయాలి - ఎఐటియుసి నేతల డిమాండ్ 

ప్రభుత్వ ఉద్యోగులకు 44% ఫిట్‌మెంట్ అమలు చేయాలి - ఎఐటియుసి నేతల డిమాండ్  సికింద్రాబాద్, నవంబర్07 (ప్రజామంటలు)::రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 44 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణలు తక్షణం అమలు చేయాలని ఎఐటియుసి అనుబంధ తెలంగాణ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్‌.మూర్తి డిమాండ్‌ చేశారు.శుక్రవారం ముషీరాబాద్‌లోని గాంధీ వైద్య కళాశాలలో హేమలత అధ్యక్షతన జరిగిన యూనియన్‌ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడుతూ— ప్రభుత్వ...
Read More...
Local News 

సెయింట్ ప్రాన్సిస్  గర్ల్స్ హైస్కూల్ లో వందేమాతరం ఉత్సవాలు

సెయింట్ ప్రాన్సిస్  గర్ల్స్ హైస్కూల్ లో వందేమాతరం ఉత్సవాలు సికింద్రాబాద్, నవంబర్ 07 (ప్రజామంటలు): సికింద్రాబాద్ సెయింట్ ప్రాన్సిస్ గర్ల్స్ హైస్కూల్ లో శుక్రవారం 150 వసంతాల వందేమాతరం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్బాన్ని పురస్కరించుకొని స్కూల్ కు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్సీసీ కమాండ్ ఆఫీసర్ కల్నల్ ఎంఎస్.కుమార్ ను స్కూల్ హెడ్మాస్టర్ సిస్టర్ గ్రేసీ, ఎన్సీసీ కోఆర్డినేటర్ ఏ.క్రిస్టినా నిర్మల, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు...
Read More...
Local News  Crime  State News 

TV5 CEO మూర్తికి హైకోర్టులో ఎదురుదెబ్బ

TV5 CEO మూర్తికి హైకోర్టులో ఎదురుదెబ్బ TV5 CEO D.H.V.S.S.N. Murthy పై సినీనటుడు ధర్మ మహేష్ ఫిర్యాదుతో కూకట్‌పల్లి పోలీసులు ఎక్స్టోర్షన్, బ్లాక్‌మెయిల్, ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేశారు. హైకోర్టు మూర్తి క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసి విచారణ కొనసాగించమని ఆదేశించింది.
Read More...
State News 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ శక్తి ప్రదర్శన – మాగంటి సునీత గెలుపుకోసం ముమ్మర ప్రచారం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ శక్తి ప్రదర్శన – మాగంటి సునీత గెలుపుకోసం ముమ్మర ప్రచారం షేక్‌పేట్ డివిజన్‌లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్,మాజీ మంత్రి రాజేశం గౌడ్,వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మసియుల్లా ఖాన్, దావ వసంత సురేష్, లోక బాపు రెడ్డి పాల్గొన్న ప్రచారం హైదరాబాద్‌, నవంబర్ 7 (ప్రజా మంటలు): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ పార్టీ తమ బలాన్ని మరోసారి ప్రదర్శించింది. షేక్‌పేట్ డివిజన్‌లోని ...
Read More...
Local News 

సీనియర్ సిటిజెన్స్ జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా  హరి అశోక్ కుమార్  

సీనియర్ సిటిజెన్స్ జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా  హరి అశోక్ కుమార్   జగిత్యాల (రూరల్) నవంబర్ 7 (ప్రజా మంటలు): రాష్ట్రములో  సీనియర్ సిటిజెన్స్ హక్కుల పరిరక్షణకు, సమస్యల పరిష్కారానికి సీనియర్ సిటిజెన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని  టాస్కా రాష్ట్ర అధ్యక్షులు పి. నర్సింహా రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం  జిల్లా కేంద్రం లోని సీనియర్ సిటిజెన్స్ కార్యాలయంలో  10వ జిల్లా సర్వ సభ్యుల ప్రతినిధి  మండలి...
Read More...
National  State News 

ప్రైవేట్ కాలేజీలకు సీఎం రేవంత్ హెచ్చరిక – “తమాషాలు చేస్తే తాటతీస్తా” అని స్పష్టం

ప్రైవేట్ కాలేజీలకు సీఎం రేవంత్ హెచ్చరిక – “తమాషాలు చేస్తే తాటతీస్తా” అని స్పష్టం ప్రైవేట్ విద్యాసంస్థల ఆడంబరాలకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర హెచ్చరిక – విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడితే చర్యలు తప్పవని స్పష్టం హైదరాబాద్‌, నవంబర్ 7 (ప్రజా మంటలు): ప్రైవేట్ కాలేజీల నిర్వాహకుల ప్రవర్తనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.“తమాషాలు చేస్తే తాటతీస్తా” అంటూ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. కాలేజీలు...
Read More...

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆందోళన

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆందోళన   – రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ ప్రారంభం కూటమి ప్రభుత్వ నిర్ణయంపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం – నవంబర్ 12న 175 నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు తాడేపల్లి, నవంబర్ 7 (ప్రజా మంటలు): ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకించింది.ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ...
Read More...

సామూహిక వందేమాతరం  గీతాలాపన లో పాల్గొన్న..... జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత

సామూహిక వందేమాతరం  గీతాలాపన లో పాల్గొన్న..... జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత జగిత్యాల నవంబర్ 7 ( ప్రజా మంటలు)సామూహిక వందేమాతర గీతాలపన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత  తెలిపారు. శుక్రవారం వందేమాతరం గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్  బిఎస్...
Read More...
Local News  Crime 

మూలరాంపూర్ సదర్ మట్ ప్రాజెక్టులో విషాదం – చేపలు పడుతూ యువకుడు మృతి

మూలరాంపూర్ సదర్ మట్ ప్రాజెక్టులో విషాదం – చేపలు పడుతూ యువకుడు మృతి నిర్మల్ జిల్లా పోన్కల్ గ్రామానికి చెందిన 18 ఏళ్ల సిద్ధార్థ దుర్మరణం – ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు ప్రారంభం ఇబ్రహీంపట్నం, నవంబర్ 7 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మూలరాంపూర్ గ్రామ శివారులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది.సదర్ మట్ ప్రాజెక్టు వద్ద చేపలు పడుతూ ఒక యువకుడు ప్రమాదవశాత్తు...
Read More...
Local News 

తాసిల్దార్ కార్యాలయంలో జాతీయ గీతం  వందేమాతరం 150 వ వార్షికోత్సవం.

తాసిల్దార్ కార్యాలయంలో జాతీయ గీతం  వందేమాతరం 150 వ వార్షికోత్సవం. ఇబ్రహీంపట్నం నవంబర్ 7( ప్రజా మంటలు దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయంలో జాతీయ గీతం వందేమాతరం 150 వ వార్షికోత్సవం సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించారు, ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వరప్రసాద్, డిప్యూటీ తాసిల్దార్ ప్రసాద్, ఆర్. ఐ. లు రేవంత్ రెడ్డి, రమేష్, జి పి ఓ లు,
Read More...

పెట్రోల్ పంపు భూ కబ్జా విషయం మాట్లాడడమే నేరమా? నా రాజీనామాకు అసలు కారణం ఇదే బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి 

పెట్రోల్ పంపు భూ కబ్జా విషయం మాట్లాడడమే నేరమా? నా రాజీనామాకు అసలు కారణం ఇదే బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి  జగిత్యాల నవంబర్ 7 (ప్రజా మంటలు)ఎమ్మెల్యే తెర వెనుక రాజకీయం చేస్తున్నాడు కిబాల అందరి సమక్షంలో ట్రాన్స్లేట్ చేయించాలి  మున్సిపల్ భూమి రక్షణకై జేఏసీ ఏర్పాటు చేయాలి. - బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి  జగిత్యాల జిల్లా కేంద్రంలోని బిజెపి పార్టీ ఆఫీసులో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి ప్రెస్...
Read More...