YLNS కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ను గాయత్రి బ్యాంక్ యందు విలీనం
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జూన్ 9 (ప్రజా మంటలు) :
తెలంగాణ లోని యాదాద్రి భువనగిరి జిల్లా యందలి యాదగిరి లక్ష్మి నరసింహ స్వామీ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ని తెలంగాణ లోని జగిత్యాల యందు గల గాయత్రి కో ఆపరేటవ్ అర్బన్ బ్యాంక్ యందు విలీనం చేయడానికి సమ్మేళన పథకాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ వారు ఆమొదించడం జరిగింది.
ఇట్టి సమ్మేళనం తేదీ 10-06-2024 నుండి అమలులోకి వస్తుంది. 6 శాఖలతో 170.74 కోట్ల వ్యాపారం కలిగిన ఇట్టి YLNS బ్యాంక్ సోమవారం నుండి గాయత్రి బ్యాంక్ యందు విలీనం చేస్తున్నాం. ఇకపై YLNS బ్యాంక్ యొక్క 6 బ్రాంచీలు గాయత్రి బ్యాంక్ యొక్క బ్రాంచీలు గా పని చేస్తాయి.
మీ అందరికీ తెలిసిన విధంగా తేది 11-09-2000 న ప్రారంభించబడిన గాయత్రి బ్యాంక్ తెలంగాణ లో మల్టి స్టేట్ బ్యాంక్ గా గత 24 సంవత్సరాలుగా తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములలో బ్యాంకింగ్ సేవలందిస్తూ ఉన్నాము.
ప్రస్తుతము 39 బ్రాంచిలతో పని చేస్తున్న గాయత్రి బ్యాంక్ ఇట్టి విలీనంతో 45 బ్రాంచిలకు చేరుకొనున్నము, మరియు ఈ సవత్సరంథానికి 60 బ్రాంచీలు చేరుకోవాలని లక్యంగా పెట్టుకున్నాము.
వ్యాపార పరంగా చూసినట్లయితే, విలీనం అనంతరం రు: 1635.86 కోట్ల డిపాజిట్స్ రు 1177.82 కోట్ల రుణాల తో రు. 2813.68 కోట్ల వ్యాపారానికి చేరుకున్నాము. అలాగే గాయత్రి బ్యాంక్ 7.49 లక్షల కస్టమర్ బేస్ తో సౌత్ ఇండియా లోనే అగ్ర స్థానంలో ఉండగా ylns బ్యాంక్ 23 వేల ఖాతాదారులను కలిగి ఉండగా విలీనం తో 7.69 లక్షలను కలిగి ఉన్నము.
మరియు రాబోవు కాలం లో ఒక మిలియన్ కస్టమర్ బేస్ కి చెరవలేనన్న లక్ష్యం తో పని చేస్తున్నాము.
2000 వ సంవత్సరములో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో చివరి బ్యాంక్ గా ప్రారంభించబడి 24 వసంతాలలో రెండవ పెద్ద బ్యాంక్ గా అవతరించింది. రాబోవు జూన్ క్వార్టర్ ముగింపు నాటికి మొదటి స్థానంలో కి చేరుకోవడానికి కృషి చేస్తున్నాము.
గాయత్రీ బ్యాంక్లో, కస్టమర్ సంతృప్తి, ఆవిష్కరణ మరియు నైతిక బ్యాంకింగ్ పద్ధతులపై బలమైన దృష్టితో, బ్యాంక్ విభిన్న శ్రేణి ఆర్థిక ఉత్పత్తులను సేవలను అందిస్తుంది అని నమ్ముతున్నాము.
డిజిటల్గా కూడా గాయత్రీ బ్యాంక్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసెస్ (AePS), యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UP) వంటి ఉత్పత్తుల పరిచయంతో డిజిటల్ కార్యకలాపాల యొక్క అన్ని రంగాలలో ఒక ఆవిష్కర్తగా ఉద్భవించింది.
భద్రతా చర్యలపై 24 x 7 నిఘాతో బ్యాంకింగ్ లావాదేవీల భద్రత ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నాము.
మేము ప్రస్తుతం 432 మంది ఉద్యోగులను కలిగి ఉన్నాము మరియు YLNS బ్యాంక్ నుండి మరో 56 మంది ఉద్యోగులు మా కుటుంబంలో చేర్చబడతారు మరియు మరో 210 మంది ఉద్యోగులను నియమించవలసిన అవసరం ఉంది కాగా మొత్తం 698 మంది ఉద్యోగులకు చేరుకోనున్నారు.
మేము సెంట్రల్ పేమెంట్ సిస్టమ్లో ప్రత్యక్ష సభ్యులుగా కూడా మారబోతున్నాము మరియు త్వరలో, షెడ్యూల్డ్ బ్యాంక్గా మారడం ద్వారా మేము మరో మైలురాయిని చేరుకుంటాము, దీని కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అనుమతులు రావలసి ఉన్నవి.
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు మరియు గాయత్రీ బ్యాంక్ బృందం మొత్తం నిబద్ధత మరియు అంకితభావంతో ప్రజలకు చేరుకోని సేవ చేయడానికి మరింత బాధ్యతను కలిగి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.
మా గాయత్రీ బ్యాంక్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు మరియు స్టాఫ్ మెంబర్ల తరపున, విలీనానికి సంబంధించిన స్వచ్ఛంద నిర్ణయం తీసుకున్న YLNS బ్యాంక్ డైరెక్టర్లందరికీ, మరియు మా వాటాదారులు, కస్టమర్లు, శ్రేయోభిలాషులు, మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.
బ్యాంక్ లక్ష్యాలు మరియు గమ్యాలను చేరుకొని ముందుకు సాగడానికి మీ నిరంతర మద్దతు మరియు ప్రోత్సాహాము ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాము అని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వనమాల శ్రీనివాస్ గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకి 9వ షెడ్యూల్ లో చేర్చాలి: జీవన్ రెడ్డి
జగిత్యాల, డిసెంబర్ 11 (ప్రజా మంటలు):బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలంటే, రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చడం తప్పనిసరి అని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల ఇందిరా భవన్లో విలేకరులతో మాట్లాడిన ఆయన, 50% రిజర్వేషన్ పరిమితిని అధిగమించడానికి ఇదే మార్గమని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ ఆలోచనలతో బలహీన... ముత్తారం సర్పంచ్ గా ఉరడి భారతి జైపాల్ రెడ్డి విజయం
అందరి సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తా - ఊరడి భారతి కొత్తగూడెం జాగృతి ఇన్చార్జీగా జగదీశ్ నియామకం
హైదరాబాద్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీగా నమ్మి జగదీశ్ను నియమిస్తూ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి అధికారిక ప్రకటనలో వెల్లడించారు.
అదే విధంగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సముద్రాల క్రాంతి కుమార్ను ... నేను ప్రస్తుతం బీఆర్ఎస్లో లేను. అయినా ప్రజల కోసం పోరాటం ఆగదు” : కవిత
మలక్పేట్–యాకుత్పురా "జనం బాట" పర్యటనలో కల్వకుంట్ల కవిత: విద్యార్థులు, వ్యాపారులు, వృత్తిదారుల సమస్యలపై ప్రభుత్వంపై మండిపాటు
హైదరాబాద్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మలక్పేట్, సైదాబాద్, యాకుత్పురా ప్రాంతాల్లో పర్యటిస్తూ విద్యార్థులు, వ్యాపారులు, కుమ్మరి వృత్తిదారులు, స్థానిక ప్రజల సమస్యలను సమీక్షించారు.
నేను ప్రస్తుతం బీఆర్ఎస్లో లేను. అయినా... జగిత్యాల జిల్లా, గ్రామపంచాయతీ ఎన్నికల మొదటిదశలో పోలింగ్ మొత్తం 73.68% ఓటింగ్
జగిత్యాల డిసెంబర్ 11 (ప్రజా మంటలు):
2025 గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల జిల్లాలో పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. అధికారిక ప్రొఫార్మా–II ప్రకారం, జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,18,194 మంది నమోదైన ఓటర్లలో 1,60,761 మంది తమ ఓటు హక్కును వినియోగించారు. దీంతో జిల్లాలో మొత్తం పోలింగ్ శాతం 73.68% వద్ద... సీఎం సహాయనిధి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్ డిసెంబర్ 11(ప్రజా మంటలు)రూరల్ మండలం అంతర్గం గ్రామానికి చెందిన ఏ.సుగుణ కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 1లక్ష 20 వేల రూపాయల విలువగల చెక్కులను జగిత్యాల క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ వెంట నాయకులు నక్కల రవీందర్ రెడ్డి రౌతు గంగాధర్ తదితరులు... జిల్లా పరిధిలో ప్రశాంతంగా జరుగుతున్నమొదటి విడత సర్పంచ్ ఎన్నికలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 11 (ప్రజా మంటలు)మొదటి విడత సర్పంచి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు.ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెట్రోలింగ్ వాహనాలు మరియు ప్రత్యేక పోలీసు... పవిత్ర హత్య కేసులో నిందితుడు ఉమాశంకర్ అరెస్ట్
సికింద్రాబాద్, డిసెంబర్ 10 (ప్రజామంటలు) :
వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూజీనగర్లో 18ఏళ్ల యువతి పవిత్రపై జరిగిన క్రూరహత్య కేసులో నిందితుడు దుక్కా ఉమాశంకర్ను వారాసిగూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి బుధవారం వారాసిగూడ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
డిసెంబర్ 8న జరిగిన... మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు భద్రత ఏర్పాట్లు పూర్తి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ఎన్నికలు నిర్వహణకు 843 మంది పోలీస్ లతో పటిష్ట బందోబస్తు.జగిత్యాల/కోరుట్ల మెట్పల్లి,డిసెంబర్ 10(ప్రజా మంటలు)
జిల్లాలో జరుగుతున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.
బుధవారం బీమారం ,కోరుట్ల,మెట్ పల్లి లో ఏర్పాటు చేసిన... శ్రీ మల్లికార్జున స్వామి దర్శించుకున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎన్. సుప్రియ
(అంకం భూమయ్య)
గొల్లపల్లి, డిసెంబర్ 10 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం మల్లన్నపేటలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం (దొంగ మల్లన్న) జాతర కార్యక్రమంలో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎన్. సుప్రియ బుధవారం ఆలయాన్ని సందర్శించారు. ఆమెతో పాటు జగిత్యాల డివిజన్ ఇన్స్పెక్టర్ రాజమొగిలి కూడా స్వామి వారిని దర్శించుకుని... మైతాపూర్ గ్రామంలో బిజెపి బలపరిచిన అభ్యర్థి కి మద్దతు గా ప్రచారము నిర్వహించిన డా భోగ శ్రావణి
రాయికల్ డిసెంబర్ 10 ( ప్రజా మంటలు)మండలములోని మహితాపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలలో భాగంగా బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థి రాజనాల సుందరి-జయానందం గారికి మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొని బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా.బోగ శ్రావణి
ఈ కార్యక్రమంలో రాయికల్... కొండగట్టులో అగ్ని ప్రమాద బాధితులకు జగిత్యాల లేడీస్ ఎంపోరియం సంఘం సభ్యుల చేయూత
కొండగట్టు డిసెంబర్ 10 –(ప్రజా మంటలు):
కొండగట్టుకు రోజు వారీ జీవనోపాధి కోసం వచ్చి చిన్న దుకాణాల ద్వారా బొమ్మలు, గాజులు, పిల్లల ఆట వస్తువులు అమ్ముకునే కుటుంబాలు కొన్ని రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యాయి. ఈ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ జగిత్యాల లేడీస్ ఎంపోరియం సంఘం సభ్యులు... 