కలెక్టర్ ల నిర్లక్ష్యం వల్లే భారీగా నిధుల దుర్వినియోగం - చట్టాల ఉల్లంఘన పన్నెండు మంది అధికారులతో సహా ఇద్దరు కార్యదర్శుల పై లోకాయుక్త కు పిర్యాదు

On
కలెక్టర్ ల నిర్లక్ష్యం వల్లే భారీగా నిధుల దుర్వినియోగం - చట్టాల ఉల్లంఘన పన్నెండు మంది అధికారులతో సహా ఇద్దరు కార్యదర్శుల పై లోకాయుక్త కు పిర్యాదు

కలెక్టర్ ల నిర్లక్ష్యం వల్లే భారీగా నిధుల దుర్వినియోగం
జిల్లా పంచాయతీలో అడ్డగోలుగా అధికార దుర్వినియోగం - చట్టాల ఉల్లంఘన
పన్నెండు మంది అధికారులతో సహా ఇద్దరు కార్యదర్శుల పై లోకాయుక్త కు పిర్యాదు

నిఘా విభాగం అధికారులతో పునర్విచారణ జరిపించాలని కోరిన చుక్క గంగారెడ్డి 

బుగ్గారం జిపి పాలక వర్గంపై చర్యలు తీసుకోవాలని విన్నపం


బుగ్గారం/ జగిత్యాల జిల్లా: 

 ప్రజా పిర్యాదులపై జిల్లా కలెక్టర్ లు సకాలంలో సరైన చర్యలు చేపట్టక, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే గ్రామ పంచాయతీలలో నిధుల దుర్వినియోగం భారీగా జరిగిపోయిందని ప్రముఖ ఉద్యమకారుడు, ఆర్టీఐ కార్యకర్త చుక్క గంగారెడ్డి ఆరోపించారు. ఆయన చేసిన పిర్యాదులపై 
 హైదారాబాద్ లోని లోకాయుక్త (కోర్టు) లో గురువారం విచారణ జరిగింది. బుగ్గారం గ్రామ పంచాయతీలో జరిగిన భారీ నిధుల దుర్వినియోగంలో బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని ఆయన లోకాయుక్త ను కోరారు.
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి, వారి బాధ్యతలను, అధికారాన్ని కూడా దుర్వినియోగం చేసి, చట్టాలను కూడా ఉల్లంఘించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని, కఠినంగా శిక్షించాలని చుక్క గంగారెడ్డి లోకాయుక్త కు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేశారు.
దుర్వినియోగం నుండి రికవరీ అయిన సొమ్మును కూడా అధికారులు లెక్కల్లో సరిగా చూపెట్టలేదన్నారు. లక్షల్లో రికవరీ సొమ్మును రికార్డులలో నమోదు చేయకుండా దాచి ఉంచారని ఆయన ఆరోపించారు.
అనేక పిర్యాదులతో పాటు 2022 సెప్టెంబర్ 21న లోకాయుక్త కు కూడా పిర్యాదులు చేయగా జిల్లా పంచాయతీ అధికారి నామ మాత్రంగా గత పంచాయతీ కార్యదర్శి మహబూబ్ పాషా ను, సర్పంచ్ మూల సుమలత ను చివరి దశలో అనగా గత 2024 జనవరి మాసంలో సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని ఆయన తెలిపారు. తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఆధారాలతో సహా మేము చేసిన పిర్యాదులపై కూడా సరైన విధంగా విచారణ చేపట్టక పోవడం చాలా బాధాకరంగా, చాలా అనుమానాస్పదంగా ఉందన్నారు. రాజకీయ ఒత్తిళ్లు, అవినీతి – అక్రమాల వల్లే ఇలా జరిగి ఉంటుందని గ్రామ ప్రజలు ముక్త కంఠంతో ఆరోపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.


1)    మేము ఎన్ని పిర్యాదులు చేసినా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు సరైన విధంగా స్పందించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా నిర్లక్యంగా వ్యవహరించారని, మా పిర్యాదులు సరిగా పట్టించుకోలేదన్నారు. అందుకే లోకాయుక్త ను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.

2)    జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారులుగా పనిచేసిన వేముల శేఖర్, ప్రభాకర్, హరి కిషన్, నరేష్ లతో పాటు ప్రస్తుత డిపిఓ దేవరాజ్ కూడా అన్నీ విషయాలు తెలిసినా, నిధులు భారీగా దుర్వినియోగం అయ్యాయని ఆధారాలు లభించినా…  కావాలనే ఉద్దేశ్య పూర్వకంగా, విధుల్లో, వారి బాధ్యతల్లో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. నిధుల దుర్వినియోగం ఋజువు అయినప్పటికీ వీరంతా వారి - వారి పాలనా సమయంలో చర్యలు తీసుకోలేదన్నారు. ఈ అధికారులంతా చట్టాలను ఉల్లంఘించారని, వారి వృత్తి ధర్మాన్ని, అత్యంత విలువైన వారి విధులను, బాధ్యతలను కూడా దుర్వినియోగం చేశారని చుక్క గంగారెడ్డి పేర్కొన్నారు.

3)    జగిత్యాల, మెట్ పల్లి - డీఎల్ పీవోలు కనక దుర్గ, శ్రీనివాస్ లు వేర్వేరు గా నిధుల దుర్వినియోగం పై ఉన్నతాధికారుల ఆదేశాలతో రెండు సార్లు తూ.. తూ… మంత్రంగా విచారణ చేపట్టారని అన్నారు. పారదర్శకంగా క్షేత్ర స్థాయిలో.. ప్రజల్లో… సరైన విచారణ జరుపలేదన్నారు. దుర్వినియోగానికి పాల్పడ్డ పాలకులతో కుమ్మక్కై వారికే కొమ్ము కాశారని,  వాస్తవాలు వెలుగులోకి వచ్చినప్పటికీనీ… నిధుల దుర్వినియోగాన్ని, వాస్తవాలను పూర్తిగా కప్పి పుచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవ విచారణకు భిన్నంగా తప్పుడు విచారణ నివేదికలు అందజేసి ఉన్నతాధికారులను నమ్మించి, తప్పు దోవ పట్టించారని పేర్కొన్నారు. వారి వృత్తి ధర్మాన్ని, అత్యంత విలువైన వారి విధులను, బాధ్యతలను కూడా దుర్వినియోగం చేశారన్నారు.

4)    మిషన్ భగీరథ లో పని చేస్తున్న ఆర్ డబ్లూ ఎస్ అసిస్టెంట్ ఇంజనీర్ వివేక్ అలియాస్ వివేకానంద కూడా బుగ్గారంలో చేయని పనులకు కూడా పనులు చేసినట్లు, బిల్లులు చెల్లించిన పురాతన పనులనే మళ్ళీ రికార్డులలో చూపెట్టి కొత్తగా పనులు చేసినట్లు తప్పుడు రికార్డులు, దొంగ రికార్డులు సృష్టించారని ఆరోపించారు. పంచాయతీ పాలక వర్గానికి అనుకూలంగా ఇష్టమొచ్చినట్లు రికార్డులను
తయారు చేసి అందజేస్తూ నిధుల దుర్వినియోగానికి, దోపిడీకి సహకరించారని వివరించారు. బుగ్గారం మండలంలోని వివిధ గ్రామాలతో పాటు ధర్మపురి నియోజక వర్గంలోని అనేక గ్రామాలలో కూడా తప్పుడు రికార్డులు, దొంగ రికార్డులు అందజేసి భారీగా నిధుల దుర్వినియోగానికి సహకరించారనే ఆరోపణలు కూడా వివేక్ అలియాస్ వివేకానంద పై కో – కొల్లలుగా ఉన్నాయన్నారు. సరైన విచారణ జరిపిస్తే కోట్లాది రూపాయల దుర్వినియోగం బయటపడే అవకాశం ఉందన్నారు.

5)    జిపిపై ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించాల్సిన బుగ్గారం మండల పంచాయతీ అధికారి అఫ్జల్ తన విధులను, అత్యంత విలువైన తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, చట్టాలను ఉల్లంఘించి, ఈ – పంచాయతీ ఆపరేటర్ జీతం పేరును సాకుగా వాడుకొని  బుగ్గారం జిపితో పాటు మండలంలోని మరో పది గ్రామ పంచాయతీల నుండి సుమారు రూ.22 లక్షలకు పైగా నిధులు తన ఖాతాల్లోకి మల్లించుకొని భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు.

6)    జిల్లా కలెక్టర్ కార్యాలయంతో సహా జిల్లా పంచాయతీ అధికారి, మండల పంచాయతీ అధికారి కార్యాలయాల్లోని ప్రజా సమాచార అధికారులు, అప్పిలేట్  అధికారులు సమాచార హక్కు చట్టం -2005 ను కూడా ఉల్లంఘించారని వివరించారు. సమాచార కమీషన్ జారీ చేసిన 18 ఫిర్యాదులపై ఆర్డర్లను, మరో 60 వరకు ఆర్టీఐ దరఖాస్తులను, అప్పీల్లను కూడా బే-ఖాతరు చేశారన్నారు. ఏండ్లు గడుస్తున్నా నేటికీ కోరిన సమాచారం ఇవ్వడం లేదన్నారు.

7)     గత పంచాయతీ కార్యదర్శి మహబూబ్ పాషా బుగ్గారం జి.పి.లో భారీగా నిధుల దుర్వినియోగం చేయడమే కాకుండా, జి.పి.లో రికార్డులు కూడా దొరుకకుండా మాయం చేసి ఏండ్లు గడుస్తున్నా అధికారులు, ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. అనేక పిర్యాదుల మేరకు కేవలం నామ మాత్రంగా సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు తప్పా…. మహబూబ్ పాషా నుండి నేటికీ రికార్డులు స్వాధీనం చేసుకోలేదన్నారు. లక్షల్లో ఉన్న దుర్వినియోగం సొమ్ము కూడా నేటికీ రికవరీ చేయలేదన్నారు.

8)    రెండో పంచాయతీ కార్యదర్శి నరేందర్ కూడా నిధుల దుర్వినియోగానికి పాల్పడి సుమారు రూ.70 వేల వరకు రికవరీ కూడా చెల్లించాడన్నారు. మరిన్ని నిధులు కూడా ఆయన నుండి రికవరీ కావలసి ఉందని తెలిసిందన్నారు. బుగ్గారం జి.పి.లో ఆయన అనేక అవినీతి -అక్రమాలకు పాల్పడ్డారని,  పాలక వర్గం చేసిన భారీ నిధుల దుర్వినియోగం లో కూడా ఆయన పాత్ర  అత్యంత కీలకంగా ఉందన్నారు. అయినా అధికారులు కార్యదర్శి నరేందర్ పై నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోషనీయం అన్నారు.

9)    బుగ్గారం గ్రామ సర్పంచ్ మూల సుమలత, ఆమె భర్త మూల శ్రీనివాస్ గౌడ్ లతో పాటు ఉప సర్పంచ్, పాలక వర్గంలోని కొందరు వార్డ్ సభ్యులు కుమ్మక్కై మూకుమ్మడిగా భారీ గా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. సుమారు కోటి రూపాయలకు పైగానే నిధులు దుర్వినియోగం జరిగి ఉంటాయని గ్రామ ప్రజలు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

10)     ఇలాంటి అనేక సందర్భాలను బట్టి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ కు మేము లిఖిత పూర్వకంగా ఆధారాలతో సహా పిర్యాదులు చేసి, పత్రికా ప్రకటనలు కూడా జారీ చేయడం జరిగిందన్నారు. అయినా అధికారులు, ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని తెలిపారు .

11)     వీటన్నిటికీ కారణం రాజకీయ ఒత్తిళ్లతో పాటు భారీ మొత్తంలో అవినీతి – అక్రమాలు కూడా జరిగి ఉండొచ్చని మాకు అనుమానంగా ఉందన్నారు.


 నేటితో నాలుగు పర్యాయాలు తమరి సన్నిధికి అందజేసిన మా పిర్యాదు లను, ఆధారాలను పరిగణనలోకి తీసుకొని వీటన్నింటిపై ప్రత్యేక నిఘా విభాగం ఉన్నతాధికారులచే తగు విచారణ జరిపించాలని చుక్క గంగారెడ్డి గురువారం లోకాయుక్త ను కోరారు. 

జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఐదుగురు జిల్లా పంచాయతీ అధికారులు, ఇద్దరు డివిజనల్ పంచాయతీ అధికారులు, జిల్లా కలెక్టరేట్, జిల్లా పంచాయతీ ఆపీస్, మండల పంచాయతీ కార్యాలయాల పౌర సమాచార అధికారులపై, అప్పిలేట్ అధికారులపై, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎ.ఇ. వివేక్, ఎంపీఓ అఫ్జల్, పంచాయతీ కార్యదర్శులు మహబూబ్ పాషా, నరేందర్ లపై, సర్పంచ్, ఉప సర్పంచ్, పాలక వర్గంలోని వార్డు సభ్యుల పై, నిధుల దుర్వినియోగానికి బాధ్యులైన ఇతర వ్యక్తు లంద రిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా శిక్షించాలని ఆయన లోకాయుక్త ను కోరారు.
 
అలాగే దుర్వినియోగం అయిన బుగ్గారం గ్రామపంచాయతీ నిధులన్నీ రికవరీ చేయించి ప్రజా సొమ్మును కాపాడాలని చుక్క గంగారెడ్డి గురువారం లోకాయుక్త కు లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేశారు.

Tags
Join WhatsApp

More News...

Local News  Crime 

సూర్యాపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఖమ్మం వైద్యుడు సజీవ దహనం

సూర్యాపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఖమ్మం వైద్యుడు సజీవ దహనం సూర్యాపేట, సెప్టెంబర్ 20 (ప్రజా మంటలు): సూర్యాపేట–ఖమ్మం 365వ జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ను ఢీకొన్న వోల్వో కారు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకోవడంతో అందులో ఉన్న ఖమ్మంకు చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కసుకుర్తి జగదీష్ సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు ముందు...
Read More...
State News 

పిడుగుపాటుకు 15 గొర్రెలు మృతి

పిడుగుపాటుకు 15 గొర్రెలు మృతి కోరుట్ల, సెప్టెంబర్ 20 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం రామారావుపల్లి గ్రామానికి చెందిన చిలువేరి మహేష్‌ గొర్రెల మందపై పిడుగు పడటంతో సుమారు 15 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటనలో దాదాపు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు. ప్రభుత్వం స్పందించి పిడుగుపాటుతో మృతి చెందిన గొర్రెలకు...
Read More...
Local News 

చర్లపల్లిలో స్టీల్ ప్లేట్లు, జ్యూట్ బ్యాగుల పంపిణీ

చర్లపల్లిలో స్టీల్ ప్లేట్లు, జ్యూట్ బ్యాగుల పంపిణీ జగిత్యాల సెప్టెంబర్ 20 (ప్రజా మంటలు):   ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పర్యావరణ ప్రేమికుడు, ఉద్యమకారుడు నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. చర్లపల్లి గ్రామంలో ఆయన ఆధ్వర్యంలో స్టీల్ ప్లేట్లు, జ్యూట్ బ్యాగులను పంపిణీ చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పునర్వినియోగించగల వస్తువులను ఉపయోగించడం ద్వారా పర్యావరణాన్ని...
Read More...
State News 

గొల్లకోటలో సింహాచలం జగన్ కుటుంబానికి రూ.21.36 లక్షల ఆర్థిక సాయం

గొల్లకోటలో సింహాచలం జగన్ కుటుంబానికి రూ.21.36 లక్షల ఆర్థిక సాయం వెల్గటూర్/గొల్లపల్లి, సెప్టెంబర్ 21 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గొల్లకోటకు చెందిన బీఆర్‌ఎస్‌ మాజీ అధ్యక్షుడు దివంగత సింహాచలం జగన్ కుటుంబానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో రూ.21.36 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఇటీవల అకాల మరణం చెందిన జగన్ చిత్రపటానికి నివాళులర్పించిన కొప్పుల ఈశ్వర్, ఆయన కుటుంబ సభ్యులను...
Read More...
Local News 

ఘనంగా శ్రీ గౌరీ ప్రియ నగర వెల్ఫేర్ అసోసియేషన్ గణేశ  నిమజ్జన శోభాయాత్ర 

ఘనంగా శ్రీ గౌరీ ప్రియ నగర వెల్ఫేర్ అసోసియేషన్ గణేశ  నిమజ్జన శోభాయాత్ర  కీసర సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు)కుందన్ పల్లి లోని శ్రీ గౌరీ ప్రియ నగర వెల్ఫేర్ అసోసియేషన్ నిమజ్జన కార్యక్రమం శనివారం అంగరంగ వైభవంగా కొనసాగింది. బ్యాండు మేళ తాళాలతో ప్రత్యేక వాహనంపై స్వామివారిని ఉపస్థితి చేసి శోభాయాత్రగా నిమజ్జనానికి తరలించారు. కోలాటాలతో భజనలతో శోభాయాత్రగా తటకానికి తరలించి నిమజ్జనం నిర్వహించారు. ఐదు రోజులపాటు...
Read More...
Local News 

నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ 

నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి  - జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్  జగిత్యాల జిల్లా ప్రతినిధి, ( ప్రజా మంటలు) సెప్టెంబర్ 19: గణేశ్ నిమజ్జనo శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సజావుగా జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. శనివారం జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తో కలిసి గణేష్ నిమజ్జన ప్రాంతాలైన జగిత్యాలలో...
Read More...
Local News 

వర్ష కొండలో గణపతి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు,

వర్ష కొండలో గణపతి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు,   ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ )   ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామంలో పెద్ద చెరువు వద్ద గణపతి నిమజ్జన ఏర్పాట్లను తహసిల్దార్ వరప్రసాద్,ఎస్ఐ నవీన్ పరిశీలించినరు,   గంగమ్మ గుడి కట్టపైన నుండి  చిన్న గణపతులు నిమజ్జనం, గంగపుత్ర సంఘ భవనం వద్ద నుండి పెద్ద గణపతులు నిమగ్నం చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నట్లు...
Read More...
Local News 

మహాత్మ జ్యోతిరావ్ ఫూలే స్కూల్ ని ఆకష్మిక తనిఖీ చేసిన సీనియర్ సివిల్ జడ్జి.-ఆర్. అజయ్ కుమార్

మహాత్మ జ్యోతిరావ్ ఫూలే స్కూల్ ని ఆకష్మిక తనిఖీ చేసిన సీనియర్ సివిల్ జడ్జి.-ఆర్. అజయ్ కుమార్   మెట్టుపల్లి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు  దగ్గుల అశోక్ ) మెట్ పల్లి మండల లీగల్ సర్వీసెస్ ఛైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి ఆర్. అజయ్ కుమార్, శనివారం పట్టణంలోని మహాత్మ జ్యోతిరావ్ పూలే బాలుర హాస్టల్, బీర్పూర్ ఎట్ మెట్ పల్లిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో ఉన్న కిచెన్, బాత్రూం,...
Read More...
Local News 

చేనేత కార్మికులందరికీ ‘చేయూత’ పెన్షన్ వర్తింపజేయాలి : ఎల్ రమణ

చేనేత కార్మికులందరికీ ‘చేయూత’ పెన్షన్ వర్తింపజేయాలి : ఎల్ రమణ    హైదరాబాద్ సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు): చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న అర్హులైన ప్రతి కార్మికుడికి ‘చేయూత’ పెన్షన్ పథకం వర్తించేలా అర్హత ప్రమాణాలను విస్తరించాలని బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం జియో ట్యాగింగ్ ద్వారా గుర్తింపు...
Read More...
Local News  State News 

రేవంత్‌రెడ్డికి సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదు: మాజీ మంత్రి జీవన్‌రెడ్డి

రేవంత్‌రెడ్డికి సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదు: మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పాలన చేతగాక.. రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ హైకోర్టు తీర్పు పార్టీ ఫిరాయింపుల విషయంలో ప్రభుత్వానికి గుణపాఠం జగిత్యాల, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు): పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి ఆరోపించారు. రైతుల సమస్యలు, ఆరు గ్యారంటీల అమలు వంటి...
Read More...
Local News 

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అమన్ జిత్ సింగ్

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అమన్ జిత్ సింగ్ కరీంనగర్, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు): కరీంనగర్ పట్టణంలోని సిక్కు వాడకు చెందిన కాంగ్రెస్ నాయకుడు అమన్ జిత్ సింగ్ను జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. చొప్పదండి ఎమ్మెల్యే, DCC అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం రేకుర్తి క్యాంపు కార్యాలయంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్...
Read More...
State News 

రేపే కొడంగల్ గడ్డపై కల్వకుంట్ల కవిత పాంచజన్య శంఖారావం

రేపే  కొడంగల్ గడ్డపై కల్వకుంట్ల కవిత పాంచజన్య శంఖారావం కొడంగల్–కోస్గి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కోస్గి కాలేజీ గ్రౌండ్‌లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నారు. సభకు పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. 120 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో సభా వేదికను ఏర్పాటు చేయగా, సుమారు...
Read More...