కలెక్టర్ ల నిర్లక్ష్యం వల్లే భారీగా నిధుల దుర్వినియోగం - చట్టాల ఉల్లంఘన పన్నెండు మంది అధికారులతో సహా ఇద్దరు కార్యదర్శుల పై లోకాయుక్త కు పిర్యాదు

On
కలెక్టర్ ల నిర్లక్ష్యం వల్లే భారీగా నిధుల దుర్వినియోగం - చట్టాల ఉల్లంఘన పన్నెండు మంది అధికారులతో సహా ఇద్దరు కార్యదర్శుల పై లోకాయుక్త కు పిర్యాదు

కలెక్టర్ ల నిర్లక్ష్యం వల్లే భారీగా నిధుల దుర్వినియోగం
జిల్లా పంచాయతీలో అడ్డగోలుగా అధికార దుర్వినియోగం - చట్టాల ఉల్లంఘన
పన్నెండు మంది అధికారులతో సహా ఇద్దరు కార్యదర్శుల పై లోకాయుక్త కు పిర్యాదు

నిఘా విభాగం అధికారులతో పునర్విచారణ జరిపించాలని కోరిన చుక్క గంగారెడ్డి 

బుగ్గారం జిపి పాలక వర్గంపై చర్యలు తీసుకోవాలని విన్నపం


బుగ్గారం/ జగిత్యాల జిల్లా: 

 ప్రజా పిర్యాదులపై జిల్లా కలెక్టర్ లు సకాలంలో సరైన చర్యలు చేపట్టక, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే గ్రామ పంచాయతీలలో నిధుల దుర్వినియోగం భారీగా జరిగిపోయిందని ప్రముఖ ఉద్యమకారుడు, ఆర్టీఐ కార్యకర్త చుక్క గంగారెడ్డి ఆరోపించారు. ఆయన చేసిన పిర్యాదులపై 
 హైదారాబాద్ లోని లోకాయుక్త (కోర్టు) లో గురువారం విచారణ జరిగింది. బుగ్గారం గ్రామ పంచాయతీలో జరిగిన భారీ నిధుల దుర్వినియోగంలో బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని ఆయన లోకాయుక్త ను కోరారు.
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి, వారి బాధ్యతలను, అధికారాన్ని కూడా దుర్వినియోగం చేసి, చట్టాలను కూడా ఉల్లంఘించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని, కఠినంగా శిక్షించాలని చుక్క గంగారెడ్డి లోకాయుక్త కు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేశారు.
దుర్వినియోగం నుండి రికవరీ అయిన సొమ్మును కూడా అధికారులు లెక్కల్లో సరిగా చూపెట్టలేదన్నారు. లక్షల్లో రికవరీ సొమ్మును రికార్డులలో నమోదు చేయకుండా దాచి ఉంచారని ఆయన ఆరోపించారు.
అనేక పిర్యాదులతో పాటు 2022 సెప్టెంబర్ 21న లోకాయుక్త కు కూడా పిర్యాదులు చేయగా జిల్లా పంచాయతీ అధికారి నామ మాత్రంగా గత పంచాయతీ కార్యదర్శి మహబూబ్ పాషా ను, సర్పంచ్ మూల సుమలత ను చివరి దశలో అనగా గత 2024 జనవరి మాసంలో సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని ఆయన తెలిపారు. తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఆధారాలతో సహా మేము చేసిన పిర్యాదులపై కూడా సరైన విధంగా విచారణ చేపట్టక పోవడం చాలా బాధాకరంగా, చాలా అనుమానాస్పదంగా ఉందన్నారు. రాజకీయ ఒత్తిళ్లు, అవినీతి – అక్రమాల వల్లే ఇలా జరిగి ఉంటుందని గ్రామ ప్రజలు ముక్త కంఠంతో ఆరోపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.


1)    మేము ఎన్ని పిర్యాదులు చేసినా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు సరైన విధంగా స్పందించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా నిర్లక్యంగా వ్యవహరించారని, మా పిర్యాదులు సరిగా పట్టించుకోలేదన్నారు. అందుకే లోకాయుక్త ను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.

2)    జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారులుగా పనిచేసిన వేముల శేఖర్, ప్రభాకర్, హరి కిషన్, నరేష్ లతో పాటు ప్రస్తుత డిపిఓ దేవరాజ్ కూడా అన్నీ విషయాలు తెలిసినా, నిధులు భారీగా దుర్వినియోగం అయ్యాయని ఆధారాలు లభించినా…  కావాలనే ఉద్దేశ్య పూర్వకంగా, విధుల్లో, వారి బాధ్యతల్లో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. నిధుల దుర్వినియోగం ఋజువు అయినప్పటికీ వీరంతా వారి - వారి పాలనా సమయంలో చర్యలు తీసుకోలేదన్నారు. ఈ అధికారులంతా చట్టాలను ఉల్లంఘించారని, వారి వృత్తి ధర్మాన్ని, అత్యంత విలువైన వారి విధులను, బాధ్యతలను కూడా దుర్వినియోగం చేశారని చుక్క గంగారెడ్డి పేర్కొన్నారు.

3)    జగిత్యాల, మెట్ పల్లి - డీఎల్ పీవోలు కనక దుర్గ, శ్రీనివాస్ లు వేర్వేరు గా నిధుల దుర్వినియోగం పై ఉన్నతాధికారుల ఆదేశాలతో రెండు సార్లు తూ.. తూ… మంత్రంగా విచారణ చేపట్టారని అన్నారు. పారదర్శకంగా క్షేత్ర స్థాయిలో.. ప్రజల్లో… సరైన విచారణ జరుపలేదన్నారు. దుర్వినియోగానికి పాల్పడ్డ పాలకులతో కుమ్మక్కై వారికే కొమ్ము కాశారని,  వాస్తవాలు వెలుగులోకి వచ్చినప్పటికీనీ… నిధుల దుర్వినియోగాన్ని, వాస్తవాలను పూర్తిగా కప్పి పుచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవ విచారణకు భిన్నంగా తప్పుడు విచారణ నివేదికలు అందజేసి ఉన్నతాధికారులను నమ్మించి, తప్పు దోవ పట్టించారని పేర్కొన్నారు. వారి వృత్తి ధర్మాన్ని, అత్యంత విలువైన వారి విధులను, బాధ్యతలను కూడా దుర్వినియోగం చేశారన్నారు.

4)    మిషన్ భగీరథ లో పని చేస్తున్న ఆర్ డబ్లూ ఎస్ అసిస్టెంట్ ఇంజనీర్ వివేక్ అలియాస్ వివేకానంద కూడా బుగ్గారంలో చేయని పనులకు కూడా పనులు చేసినట్లు, బిల్లులు చెల్లించిన పురాతన పనులనే మళ్ళీ రికార్డులలో చూపెట్టి కొత్తగా పనులు చేసినట్లు తప్పుడు రికార్డులు, దొంగ రికార్డులు సృష్టించారని ఆరోపించారు. పంచాయతీ పాలక వర్గానికి అనుకూలంగా ఇష్టమొచ్చినట్లు రికార్డులను
తయారు చేసి అందజేస్తూ నిధుల దుర్వినియోగానికి, దోపిడీకి సహకరించారని వివరించారు. బుగ్గారం మండలంలోని వివిధ గ్రామాలతో పాటు ధర్మపురి నియోజక వర్గంలోని అనేక గ్రామాలలో కూడా తప్పుడు రికార్డులు, దొంగ రికార్డులు అందజేసి భారీగా నిధుల దుర్వినియోగానికి సహకరించారనే ఆరోపణలు కూడా వివేక్ అలియాస్ వివేకానంద పై కో – కొల్లలుగా ఉన్నాయన్నారు. సరైన విచారణ జరిపిస్తే కోట్లాది రూపాయల దుర్వినియోగం బయటపడే అవకాశం ఉందన్నారు.

5)    జిపిపై ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించాల్సిన బుగ్గారం మండల పంచాయతీ అధికారి అఫ్జల్ తన విధులను, అత్యంత విలువైన తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, చట్టాలను ఉల్లంఘించి, ఈ – పంచాయతీ ఆపరేటర్ జీతం పేరును సాకుగా వాడుకొని  బుగ్గారం జిపితో పాటు మండలంలోని మరో పది గ్రామ పంచాయతీల నుండి సుమారు రూ.22 లక్షలకు పైగా నిధులు తన ఖాతాల్లోకి మల్లించుకొని భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు.

6)    జిల్లా కలెక్టర్ కార్యాలయంతో సహా జిల్లా పంచాయతీ అధికారి, మండల పంచాయతీ అధికారి కార్యాలయాల్లోని ప్రజా సమాచార అధికారులు, అప్పిలేట్  అధికారులు సమాచార హక్కు చట్టం -2005 ను కూడా ఉల్లంఘించారని వివరించారు. సమాచార కమీషన్ జారీ చేసిన 18 ఫిర్యాదులపై ఆర్డర్లను, మరో 60 వరకు ఆర్టీఐ దరఖాస్తులను, అప్పీల్లను కూడా బే-ఖాతరు చేశారన్నారు. ఏండ్లు గడుస్తున్నా నేటికీ కోరిన సమాచారం ఇవ్వడం లేదన్నారు.

7)     గత పంచాయతీ కార్యదర్శి మహబూబ్ పాషా బుగ్గారం జి.పి.లో భారీగా నిధుల దుర్వినియోగం చేయడమే కాకుండా, జి.పి.లో రికార్డులు కూడా దొరుకకుండా మాయం చేసి ఏండ్లు గడుస్తున్నా అధికారులు, ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. అనేక పిర్యాదుల మేరకు కేవలం నామ మాత్రంగా సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు తప్పా…. మహబూబ్ పాషా నుండి నేటికీ రికార్డులు స్వాధీనం చేసుకోలేదన్నారు. లక్షల్లో ఉన్న దుర్వినియోగం సొమ్ము కూడా నేటికీ రికవరీ చేయలేదన్నారు.

8)    రెండో పంచాయతీ కార్యదర్శి నరేందర్ కూడా నిధుల దుర్వినియోగానికి పాల్పడి సుమారు రూ.70 వేల వరకు రికవరీ కూడా చెల్లించాడన్నారు. మరిన్ని నిధులు కూడా ఆయన నుండి రికవరీ కావలసి ఉందని తెలిసిందన్నారు. బుగ్గారం జి.పి.లో ఆయన అనేక అవినీతి -అక్రమాలకు పాల్పడ్డారని,  పాలక వర్గం చేసిన భారీ నిధుల దుర్వినియోగం లో కూడా ఆయన పాత్ర  అత్యంత కీలకంగా ఉందన్నారు. అయినా అధికారులు కార్యదర్శి నరేందర్ పై నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోషనీయం అన్నారు.

9)    బుగ్గారం గ్రామ సర్పంచ్ మూల సుమలత, ఆమె భర్త మూల శ్రీనివాస్ గౌడ్ లతో పాటు ఉప సర్పంచ్, పాలక వర్గంలోని కొందరు వార్డ్ సభ్యులు కుమ్మక్కై మూకుమ్మడిగా భారీ గా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. సుమారు కోటి రూపాయలకు పైగానే నిధులు దుర్వినియోగం జరిగి ఉంటాయని గ్రామ ప్రజలు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

10)     ఇలాంటి అనేక సందర్భాలను బట్టి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ కు మేము లిఖిత పూర్వకంగా ఆధారాలతో సహా పిర్యాదులు చేసి, పత్రికా ప్రకటనలు కూడా జారీ చేయడం జరిగిందన్నారు. అయినా అధికారులు, ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని తెలిపారు .

11)     వీటన్నిటికీ కారణం రాజకీయ ఒత్తిళ్లతో పాటు భారీ మొత్తంలో అవినీతి – అక్రమాలు కూడా జరిగి ఉండొచ్చని మాకు అనుమానంగా ఉందన్నారు.


 నేటితో నాలుగు పర్యాయాలు తమరి సన్నిధికి అందజేసిన మా పిర్యాదు లను, ఆధారాలను పరిగణనలోకి తీసుకొని వీటన్నింటిపై ప్రత్యేక నిఘా విభాగం ఉన్నతాధికారులచే తగు విచారణ జరిపించాలని చుక్క గంగారెడ్డి గురువారం లోకాయుక్త ను కోరారు. 

జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఐదుగురు జిల్లా పంచాయతీ అధికారులు, ఇద్దరు డివిజనల్ పంచాయతీ అధికారులు, జిల్లా కలెక్టరేట్, జిల్లా పంచాయతీ ఆపీస్, మండల పంచాయతీ కార్యాలయాల పౌర సమాచార అధికారులపై, అప్పిలేట్ అధికారులపై, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎ.ఇ. వివేక్, ఎంపీఓ అఫ్జల్, పంచాయతీ కార్యదర్శులు మహబూబ్ పాషా, నరేందర్ లపై, సర్పంచ్, ఉప సర్పంచ్, పాలక వర్గంలోని వార్డు సభ్యుల పై, నిధుల దుర్వినియోగానికి బాధ్యులైన ఇతర వ్యక్తు లంద రిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా శిక్షించాలని ఆయన లోకాయుక్త ను కోరారు.
 
అలాగే దుర్వినియోగం అయిన బుగ్గారం గ్రామపంచాయతీ నిధులన్నీ రికవరీ చేయించి ప్రజా సొమ్మును కాపాడాలని చుక్క గంగారెడ్డి గురువారం లోకాయుక్త కు లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేశారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా ఫజలుల్లా బేగ్

తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా ఫజలుల్లా బేగ్    జగిత్యాల, సెప్టెంబర్ 13( ప్రజా మంటలు)  తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టి యూ డబ్ల్యూ జె  ఎఫ్) జగిత్యాల జిల్లా కమిటీ ఎన్నిక ఆదివారం జగిత్యాలలోని స్పైసీ హోటల్‌లో నిర్వహించిన సమావేశంలో జరిగింది. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన పలువురు ఉర్దూ జర్నలిస్టులు హాజరయ్యారు.    ఈ సందర్భంగా మిర్జా ఫజలుల్లా బేగ్ను తెలంగాణ...
Read More...
Local News 

గౌరీ ప్రియ కాలనీలో గణేష్ మంటప నిర్మాణ సన్నాహక సమావేశం

గౌరీ ప్రియ కాలనీలో గణేష్ మంటప నిర్మాణ సన్నాహక సమావేశం   కీసర సెప్టెంబర్ 12 (ప్రజా మంటలు) కుందన్ పల్లి లోని గౌరీ ప్రియ కాలనీలో శనివారం కాలనీలో నూతనంగా గణేష నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ఆదివారం ఉత్సవ కమిటీ వారు గణేశ  ఉత్సవాలు నిర్వహించడానికి గాను సన్నాహక సమావేశం నిర్వహించి ప్రతినిత్యం నిర్వహించే కార్యక్రమాలు గూర్చి చర్చించి విధివిధానాలు ఖరారు...
Read More...
National 

జపాన్‌లో బుల్లెట్ రైలు ఢీకొని కేరళ యువతి మృతి

జపాన్‌లో బుల్లెట్ రైలు ఢీకొని కేరళ యువతి మృతి కేరళ, సెప్టెంబర్ 11: జపాన్‌లో బుల్లెట్ రైలు ఢీకొని కేరళకు చెందిన 22 ఏళ్ల యువతి మృతి చెందింది. ఆసుపత్రిలో నర్సింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వీ. దేవిక ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దేవిక మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు అవసరమైన ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆమె...
Read More...
Local News 

మాజీ సర్పంచులకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలి

మాజీ సర్పంచులకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలి జగిత్యాల, సెప్టెంబర్‌ 11 (ప్రజా మంటలు): 2023 ఎన్నికల మేనిఫెస్టోలో మాజీ సర్పంచులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మూడేళ్లుగా అమలు చేయడం లేదని తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొడ్డు దేవయ్య విమర్శించారు. శుక్రవారం జగిత్యాల ప్రెస్‌క్లబ్‌లో జిల్లా స్థాయి మాజీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో...
Read More...
State News 

సీఎం ప్రజావాణి స్ఫూర్తిదాయకం: బీహార్ గ్రూప్‌-1 అధికారులు

సీఎం ప్రజావాణి స్ఫూర్తిదాయకం: బీహార్ గ్రూప్‌-1 అధికారులు    బీహార్‌లోనూ ఇదే తరహా విధానం అమలు చేస్తాం ప్రజల వినతులు స్వీకరించిన గద్వాల్ విజయలక్ష్మి హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (ప్రజా మంటలు):తెలంగాణలో అమలవుతున్న సీఎం ప్రజావాణి కార్యక్రమం తమకు స్ఫూర్తినిచ్చిందని బీహార్‌ రాష్ట్రానికి చెందిన గ్రూప్‌-1 అధికారుల బృందం పేర్కొంది. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించడం, వాటిని సంబంధిత శాఖలకు పంపించడం, పరిష్కారాన్ని...
Read More...
Local News 

గణేష్ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలి.  టౌన్ సిఐ కరుణాకర్.

గణేష్ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలి.   టౌన్ సిఐ కరుణాకర్.    జగిత్యాల సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు) గణేష్ మండప నిర్వాహకులు రాబోయే గణేష్ ఉత్సవాలను ప్రజా జీవనానికి భంగం కలగకుండా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని టౌన్ సిఐ కరుణాకర్ తెలిపారు. విద్యుత్ తీగలకు దగ్గరగా గణేష్ మంటపాలను నిర్మించకుండా జాగ్రత్త పడాలని సూచించారు.    ట్రాఫిక్ అంతరాయం లేకుండా మంట పాలను ఏర్పాటు చేసుకోవాలని, గణేష్ మండపాల్లో భక్తి...
Read More...
National 

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్‌ను కలిసిన ఉద్యొగ సంఘ నెతలు 

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్‌ను కలిసిన ఉద్యొగ సంఘ నెతలు  హైదరాబాద్, సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు): తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (TGEJAC) చైర్మన్ వి. లచ్చి రెడ్డి, సెక్రటరీ జనరల్ ఒడ్నాల రాజశేఖర్ గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రధానంగా పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల, సీపీఎస్ రద్దు చేసి...
Read More...
Local News  Crime 

మల్యాలలో వివాహిత ఆత్మహత్య.. కుమారుడి ఆచూకీ కోసం గాలింపు

మల్యాలలో వివాహిత ఆత్మహత్య.. కుమారుడి ఆచూకీ కోసం గాలింపు మల్యాల, సెప్టెంబర్ 10 (ప్రజామంతలు): మల్యాల మండలం ముత్యంపేట శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఓ వివాహిత తన చిన్న కుమారుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. మల్యాలకు చెందిన గుండేటి కవిత (36) తన భర్త దశరథంతో కలిసి నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. గురువారం గుడిపేట శివారులోని వ్యవసాయ...
Read More...
Local News 

*కలెక్టరేట్ లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్*

*కలెక్టరేట్ లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్*    జగిత్యాల, సెప్టెంబర్ 10(ప్రజా మంటలు) తెలంగాణ రైతాంగ పోరాటంలో వీరవనితగా గుర్తింపు పొందిన ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ లో గురువారం జిల్లా బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పాల్గొని, వీరనారి చాకలి ఐలమ్మచిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్...
Read More...
Local News 

"ఫెడరల్ బ్యాంక్ "వారిచే మృత్తిక గణపతి ప్రతిమల వితరణ

  ఈస్ట్ ఆనంద్ బాగ్ సెప్టెంబర్ 10( ప్రజా మంటలు)మేడ్చల్ మల్కాజ్గిరి లోని ఈస్ట్ ఆనంద్ బాగ్ లో గల "ఫెడరల్ బ్యాంక్" శ్రీ వినాయక చవితి పండుగను పురస్కరించుకొని సమకాలీన స్థితికి అనుకూలంగా ప్రకృతి పరిరక్షణ పేరిట మృత్తిక (మట్టి  ) గణపతి ప్రతిమలను తమ బ్యాంకు ఖాతాదారులకు వితరణ చేయడానికి శ్రీకారం చుట్టారు....
Read More...
Local News 

#Draft: Add Your Titleఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో హరుష్ కు దక్కిన చోటు

#Draft: Add Your Titleఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో హరుష్ కు దక్కిన చోటు   కరీంనగర్ సెప్టెంబర్ 8 (ప్రజా మంటలు) "సాధనాత్ సాధ్యతే" సర్వం అన్నట్లు సాధన ద్వారా ఏదైనా సాధించవచ్చునని నిరూపించాడు కరీంనగర్ కు చెందిన 4వ తరగతి విద్యార్థి *టి హరుష్* *పరమ శివునికి చెందిన లింగాష్టక స్తోత్రాన్ని 53 సెకండ్లలో ఆలపించి గతంలో లింగాష్టకం పఠించిన వారి రికార్డును బద్దలు కొట్టాడు. చిన్నతనము నుండే హరుష్...
Read More...
State News 

ధర్మపురి ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం రూ.200 కోట్ల తో అభివృద్ధి - రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

ధర్మపురి ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం రూ.200 కోట్ల తో అభివృద్ధి - రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇన్గొల్లపల్లి సెప్టెంబర్ 07(ప్రజా మంటలు అంకం భూమయ్య): ధర్మపురి శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.117 కోట్లు మంజూరు చేసిందని, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి మేరకు మరో రూ.80 కోట్లు కూడా మంజూరు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు...
Read More...