కలెక్టర్ ల నిర్లక్ష్యం వల్లే భారీగా నిధుల దుర్వినియోగం - చట్టాల ఉల్లంఘన పన్నెండు మంది అధికారులతో సహా ఇద్దరు కార్యదర్శుల పై లోకాయుక్త కు పిర్యాదు
కలెక్టర్ ల నిర్లక్ష్యం వల్లే భారీగా నిధుల దుర్వినియోగం
జిల్లా పంచాయతీలో అడ్డగోలుగా అధికార దుర్వినియోగం - చట్టాల ఉల్లంఘన
పన్నెండు మంది అధికారులతో సహా ఇద్దరు కార్యదర్శుల పై లోకాయుక్త కు పిర్యాదు
నిఘా విభాగం అధికారులతో పునర్విచారణ జరిపించాలని కోరిన చుక్క గంగారెడ్డి
బుగ్గారం జిపి పాలక వర్గంపై చర్యలు తీసుకోవాలని విన్నపం
బుగ్గారం/ జగిత్యాల జిల్లా:
ప్రజా పిర్యాదులపై జిల్లా కలెక్టర్ లు సకాలంలో సరైన చర్యలు చేపట్టక, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే గ్రామ పంచాయతీలలో నిధుల దుర్వినియోగం భారీగా జరిగిపోయిందని ప్రముఖ ఉద్యమకారుడు, ఆర్టీఐ కార్యకర్త చుక్క గంగారెడ్డి ఆరోపించారు. ఆయన చేసిన పిర్యాదులపై
హైదారాబాద్ లోని లోకాయుక్త (కోర్టు) లో గురువారం విచారణ జరిగింది. బుగ్గారం గ్రామ పంచాయతీలో జరిగిన భారీ నిధుల దుర్వినియోగంలో బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని ఆయన లోకాయుక్త ను కోరారు.
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి, వారి బాధ్యతలను, అధికారాన్ని కూడా దుర్వినియోగం చేసి, చట్టాలను కూడా ఉల్లంఘించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని, కఠినంగా శిక్షించాలని చుక్క గంగారెడ్డి లోకాయుక్త కు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేశారు.
దుర్వినియోగం నుండి రికవరీ అయిన సొమ్మును కూడా అధికారులు లెక్కల్లో సరిగా చూపెట్టలేదన్నారు. లక్షల్లో రికవరీ సొమ్మును రికార్డులలో నమోదు చేయకుండా దాచి ఉంచారని ఆయన ఆరోపించారు.
అనేక పిర్యాదులతో పాటు 2022 సెప్టెంబర్ 21న లోకాయుక్త కు కూడా పిర్యాదులు చేయగా జిల్లా పంచాయతీ అధికారి నామ మాత్రంగా గత పంచాయతీ కార్యదర్శి మహబూబ్ పాషా ను, సర్పంచ్ మూల సుమలత ను చివరి దశలో అనగా గత 2024 జనవరి మాసంలో సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని ఆయన తెలిపారు. తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఆధారాలతో సహా మేము చేసిన పిర్యాదులపై కూడా సరైన విధంగా విచారణ చేపట్టక పోవడం చాలా బాధాకరంగా, చాలా అనుమానాస్పదంగా ఉందన్నారు. రాజకీయ ఒత్తిళ్లు, అవినీతి – అక్రమాల వల్లే ఇలా జరిగి ఉంటుందని గ్రామ ప్రజలు ముక్త కంఠంతో ఆరోపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
1) మేము ఎన్ని పిర్యాదులు చేసినా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు సరైన విధంగా స్పందించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా నిర్లక్యంగా వ్యవహరించారని, మా పిర్యాదులు సరిగా పట్టించుకోలేదన్నారు. అందుకే లోకాయుక్త ను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.
2) జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారులుగా పనిచేసిన వేముల శేఖర్, ప్రభాకర్, హరి కిషన్, నరేష్ లతో పాటు ప్రస్తుత డిపిఓ దేవరాజ్ కూడా అన్నీ విషయాలు తెలిసినా, నిధులు భారీగా దుర్వినియోగం అయ్యాయని ఆధారాలు లభించినా… కావాలనే ఉద్దేశ్య పూర్వకంగా, విధుల్లో, వారి బాధ్యతల్లో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. నిధుల దుర్వినియోగం ఋజువు అయినప్పటికీ వీరంతా వారి - వారి పాలనా సమయంలో చర్యలు తీసుకోలేదన్నారు. ఈ అధికారులంతా చట్టాలను ఉల్లంఘించారని, వారి వృత్తి ధర్మాన్ని, అత్యంత విలువైన వారి విధులను, బాధ్యతలను కూడా దుర్వినియోగం చేశారని చుక్క గంగారెడ్డి పేర్కొన్నారు.
3) జగిత్యాల, మెట్ పల్లి - డీఎల్ పీవోలు కనక దుర్గ, శ్రీనివాస్ లు వేర్వేరు గా నిధుల దుర్వినియోగం పై ఉన్నతాధికారుల ఆదేశాలతో రెండు సార్లు తూ.. తూ… మంత్రంగా విచారణ చేపట్టారని అన్నారు. పారదర్శకంగా క్షేత్ర స్థాయిలో.. ప్రజల్లో… సరైన విచారణ జరుపలేదన్నారు. దుర్వినియోగానికి పాల్పడ్డ పాలకులతో కుమ్మక్కై వారికే కొమ్ము కాశారని, వాస్తవాలు వెలుగులోకి వచ్చినప్పటికీనీ… నిధుల దుర్వినియోగాన్ని, వాస్తవాలను పూర్తిగా కప్పి పుచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవ విచారణకు భిన్నంగా తప్పుడు విచారణ నివేదికలు అందజేసి ఉన్నతాధికారులను నమ్మించి, తప్పు దోవ పట్టించారని పేర్కొన్నారు. వారి వృత్తి ధర్మాన్ని, అత్యంత విలువైన వారి విధులను, బాధ్యతలను కూడా దుర్వినియోగం చేశారన్నారు.
4) మిషన్ భగీరథ లో పని చేస్తున్న ఆర్ డబ్లూ ఎస్ అసిస్టెంట్ ఇంజనీర్ వివేక్ అలియాస్ వివేకానంద కూడా బుగ్గారంలో చేయని పనులకు కూడా పనులు చేసినట్లు, బిల్లులు చెల్లించిన పురాతన పనులనే మళ్ళీ రికార్డులలో చూపెట్టి కొత్తగా పనులు చేసినట్లు తప్పుడు రికార్డులు, దొంగ రికార్డులు సృష్టించారని ఆరోపించారు. పంచాయతీ పాలక వర్గానికి అనుకూలంగా ఇష్టమొచ్చినట్లు రికార్డులను
తయారు చేసి అందజేస్తూ నిధుల దుర్వినియోగానికి, దోపిడీకి సహకరించారని వివరించారు. బుగ్గారం మండలంలోని వివిధ గ్రామాలతో పాటు ధర్మపురి నియోజక వర్గంలోని అనేక గ్రామాలలో కూడా తప్పుడు రికార్డులు, దొంగ రికార్డులు అందజేసి భారీగా నిధుల దుర్వినియోగానికి సహకరించారనే ఆరోపణలు కూడా వివేక్ అలియాస్ వివేకానంద పై కో – కొల్లలుగా ఉన్నాయన్నారు. సరైన విచారణ జరిపిస్తే కోట్లాది రూపాయల దుర్వినియోగం బయటపడే అవకాశం ఉందన్నారు.
5) జిపిపై ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించాల్సిన బుగ్గారం మండల పంచాయతీ అధికారి అఫ్జల్ తన విధులను, అత్యంత విలువైన తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, చట్టాలను ఉల్లంఘించి, ఈ – పంచాయతీ ఆపరేటర్ జీతం పేరును సాకుగా వాడుకొని బుగ్గారం జిపితో పాటు మండలంలోని మరో పది గ్రామ పంచాయతీల నుండి సుమారు రూ.22 లక్షలకు పైగా నిధులు తన ఖాతాల్లోకి మల్లించుకొని భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు.
6) జిల్లా కలెక్టర్ కార్యాలయంతో సహా జిల్లా పంచాయతీ అధికారి, మండల పంచాయతీ అధికారి కార్యాలయాల్లోని ప్రజా సమాచార అధికారులు, అప్పిలేట్ అధికారులు సమాచార హక్కు చట్టం -2005 ను కూడా ఉల్లంఘించారని వివరించారు. సమాచార కమీషన్ జారీ చేసిన 18 ఫిర్యాదులపై ఆర్డర్లను, మరో 60 వరకు ఆర్టీఐ దరఖాస్తులను, అప్పీల్లను కూడా బే-ఖాతరు చేశారన్నారు. ఏండ్లు గడుస్తున్నా నేటికీ కోరిన సమాచారం ఇవ్వడం లేదన్నారు.
7) గత పంచాయతీ కార్యదర్శి మహబూబ్ పాషా బుగ్గారం జి.పి.లో భారీగా నిధుల దుర్వినియోగం చేయడమే కాకుండా, జి.పి.లో రికార్డులు కూడా దొరుకకుండా మాయం చేసి ఏండ్లు గడుస్తున్నా అధికారులు, ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. అనేక పిర్యాదుల మేరకు కేవలం నామ మాత్రంగా సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు తప్పా…. మహబూబ్ పాషా నుండి నేటికీ రికార్డులు స్వాధీనం చేసుకోలేదన్నారు. లక్షల్లో ఉన్న దుర్వినియోగం సొమ్ము కూడా నేటికీ రికవరీ చేయలేదన్నారు.
8) రెండో పంచాయతీ కార్యదర్శి నరేందర్ కూడా నిధుల దుర్వినియోగానికి పాల్పడి సుమారు రూ.70 వేల వరకు రికవరీ కూడా చెల్లించాడన్నారు. మరిన్ని నిధులు కూడా ఆయన నుండి రికవరీ కావలసి ఉందని తెలిసిందన్నారు. బుగ్గారం జి.పి.లో ఆయన అనేక అవినీతి -అక్రమాలకు పాల్పడ్డారని, పాలక వర్గం చేసిన భారీ నిధుల దుర్వినియోగం లో కూడా ఆయన పాత్ర అత్యంత కీలకంగా ఉందన్నారు. అయినా అధికారులు కార్యదర్శి నరేందర్ పై నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోషనీయం అన్నారు.
9) బుగ్గారం గ్రామ సర్పంచ్ మూల సుమలత, ఆమె భర్త మూల శ్రీనివాస్ గౌడ్ లతో పాటు ఉప సర్పంచ్, పాలక వర్గంలోని కొందరు వార్డ్ సభ్యులు కుమ్మక్కై మూకుమ్మడిగా భారీ గా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. సుమారు కోటి రూపాయలకు పైగానే నిధులు దుర్వినియోగం జరిగి ఉంటాయని గ్రామ ప్రజలు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
10) ఇలాంటి అనేక సందర్భాలను బట్టి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ కు మేము లిఖిత పూర్వకంగా ఆధారాలతో సహా పిర్యాదులు చేసి, పత్రికా ప్రకటనలు కూడా జారీ చేయడం జరిగిందన్నారు. అయినా అధికారులు, ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని తెలిపారు .
11) వీటన్నిటికీ కారణం రాజకీయ ఒత్తిళ్లతో పాటు భారీ మొత్తంలో అవినీతి – అక్రమాలు కూడా జరిగి ఉండొచ్చని మాకు అనుమానంగా ఉందన్నారు.
నేటితో నాలుగు పర్యాయాలు తమరి సన్నిధికి అందజేసిన మా పిర్యాదు లను, ఆధారాలను పరిగణనలోకి తీసుకొని వీటన్నింటిపై ప్రత్యేక నిఘా విభాగం ఉన్నతాధికారులచే తగు విచారణ జరిపించాలని చుక్క గంగారెడ్డి గురువారం లోకాయుక్త ను కోరారు.
జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఐదుగురు జిల్లా పంచాయతీ అధికారులు, ఇద్దరు డివిజనల్ పంచాయతీ అధికారులు, జిల్లా కలెక్టరేట్, జిల్లా పంచాయతీ ఆపీస్, మండల పంచాయతీ కార్యాలయాల పౌర సమాచార అధికారులపై, అప్పిలేట్ అధికారులపై, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎ.ఇ. వివేక్, ఎంపీఓ అఫ్జల్, పంచాయతీ కార్యదర్శులు మహబూబ్ పాషా, నరేందర్ లపై, సర్పంచ్, ఉప సర్పంచ్, పాలక వర్గంలోని వార్డు సభ్యుల పై, నిధుల దుర్వినియోగానికి బాధ్యులైన ఇతర వ్యక్తు లంద రిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా శిక్షించాలని ఆయన లోకాయుక్త ను కోరారు.
అలాగే దుర్వినియోగం అయిన బుగ్గారం గ్రామపంచాయతీ నిధులన్నీ రికవరీ చేయించి ప్రజా సొమ్మును కాపాడాలని చుక్క గంగారెడ్డి గురువారం లోకాయుక్త కు లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం_ స్థానిక సంస్థల్లో ఆధిపత్యం చెలాయించాలని చూస్తే మెడలు పట్టి గెంటేయాలి మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల జనవరి 4( ప్రజా మంటలు)
స్థానిక సంస్థల్లో ఆదిపత్యం చెలాయించాలని చూస్తే మెడలు పట్టి గెంటాయాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో జగిత్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి, డీ సీ సీ అధ్యక్షుడు గాజంగి... ఫుట్ పాత్ అనాధలకు ఔషధాలు, దుస్తుల పంపిణీ
సికింద్రాబాద్, జనవరి 04 (ప్రజా మంటలు):
హైదరాబాద్ నగరంలోని రోడ్ల పక్కన ఫుట్పాత్లపై జీవనం సాగిస్తున్న నిరాశ్రయులు, అనాథలకు స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం దుస్తులు, ఔషధాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వివిధ రుగ్మతులతో బాధపడుతున్న వారికి మందులు అందించడంతో పాటు ప్రమాదాలకు గురైన వారికి ప్రాథమిక చికిత్స చేశారు.ఈ కార్యక్రమంలో స్కై ఫౌండేషన్... బన్సీలాల్ పేటలో క్రీడోత్సవం రిజిస్ట్రేషన్లు ప్రారంభం
సికింద్రాబాద్, జనవరి 04 (ప్రజా మంటలు):
ప్రధానమంత్రి సంసద్ మహోత్సవం 2025–26లో భాగంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రేరణతో, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు సికింద్రాబాద్ పార్లమెంట్ మహా క్రీడోత్సవం కింద బన్సీలాల్పేట్ డివిజన్లో క్రీడా రిజిస్ట్రేషన్ ప్రారంభోత్సవం నిర్వహించారు.
డివిజన్ బీజేపీ అధ్యక్షులు రామంచ మహేష్ అధ్యక్షతన జరిగిన ఈ... మేడిపల్లి వద్ద ఆర్టీసీ బస్సు–తవేరా ఢీ పలువురికి గాయాలు
మెట్టుపల్లి, జనవరి 4 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిపల్లి గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు మరియు తవేరా వాహనం ఢీకొన్న ఘటనలో పలువురు గాయపడ్డారు.
మెట్టుపల్లి నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు (TS 16 UC 3599) ఆదివారం తెల్లవారుజామున సుమారు 4:45 గంటలకు మేడిపల్లి... నిరుపేద కుటుంబానికి వైద్య సాయం... 4 లక్షల ఎల్ ఓ సి అందజేత...
చిగురుమామిడి జనవరి 4 (ప్రజా మంటలు):
చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన చెరుకు వంశీ (18) అనే యువకుడు గత కొంతకాలంగా మూత్ర పిండాల వ్యాధితో బాధ పడుతున్నాడు. రెండు కిడ్నీలు పూర్తిగా పని చేయక పోవడం వల్ల కిడ్నీ మార్పిడి చేయాల్సిన అవసరం ఉంది. తన తల్లి కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న
స్థానిక... వెనిజులా పై అమెరికా దాడి: చట్టమా? లేక సామ్రాజ్యవాద దౌర్జన్యమా?
— సిహెచ్. వి. ప్రభాకర్ రావు
వెనిజులా పై అమెరికా చేసిన సైనిక–భద్రతా చర్యలు, ఆ దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యను బలవంతంగా అమెరికాకు తీసుకెళ్లి క్రిమినల్ కేసులు నమోదు చేయడం ప్రపంచ రాజకీయ చరిత్రలో అత్యంత ప్రమాదకర మలుపుగా మారింది. ఇది ఒక సాధారణ “చట్ట అమలు చర్య” కాదు; ఒక సార్వభౌమ దేశంపై... బీసీల బందు కేసీఆర్ అయితే బీసీలకు రాబందు రేవంత్ రెడ్డి- దావ వసంత సురేష్
జగిత్యాల జనవరి 3(ప్రజా మంటలు)పట్టణంలోని సావిత్రిబాయి పూలే పార్కులో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బిఆర్ఎస్ నాయకులతో కలిసి సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా తొలి జడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...* బిఆర్ఎస్ హయంలో బడుగు బలహీన వర్గాలకు... రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టీఎన్జీవో నాయకులు
జగిత్యాల జనవరి 3(ప్రజా మంటలు)టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఎస్సి ఎస్టి వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు.
మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ టీఎన్జీవో ఉద్యోగులందరికీ నూతన సంవత్సర... డాక్టర్ అరిగేలా అభినవ్ కు అత్యుత్తమ పరిశోధన పత్రం అవార్డు
జగిత్యాల జనవరి 3 ( ప్రజా మంటలు)జగిత్యాల ముద్దుబిడ్డ డాక్టర్ అరిగేలా అభినవ్ కు అత్యుత్తమ పరిశోధన పత్రం అవార్డు లభించింది.
హైదరాబాదులో నిర్వహించిన 22వ అప్రస్కాన్ 20 25 అసోసియేషన్ ఆఫ్ ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాన్ఫరెన్స్లో జగిత్యాలకు చెందిన డాక్టర్ అభినవ్... కోరుట్ల పట్టణంలో రెస్టారెంట్లు మరియు టిఫిన్ సెంటర్లు లో తనిఖీలు.. జరిమానాలు విధించిన మున్సిపల్ అధికారులు
కోరుట్ల జనవరి 3 (ప్రజా మంటలు)
పట్టణంలో రెస్టారెంట్లు మరియు టిఫిన్ సెంటర్లు లో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు పట్టణంలో తనిఖీలు చేసిన మున్సిపల్ అధికారులు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రవీందర్ ఆదేశాల మేరకు పట్టణంలో గల రెస్టారెంట్లు, హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించి పరిశుభ్రత పాటించని, మరియు సింగిల్... అభయాంజనేయ స్వామి ఆలయంలో ధార్మిక సంస్థల సమావేశం
జగిత్యాల జనవరి 3(ప్రజా మంటలు) వివిధ ధార్మిక సంస్థల సమావేశము అభయాంజనేయ స్వామి టెంపుల్ అరవింద నగర్ లో జరిగింది దీనిలో భూమి, నీరు,వాయువు అగ్ని ఆకాశము పంచభూతాలను కాపాడుతూ పర్యావరణo అసమతౌల్యం వల్ల జరిగే నష్టాలను అధిగమించుటకు పర్యావరణ సమస్యలను అధిగమించుటకు అందరూ అన్ని దేవాలయాలలో సింగల్ యూస్ ప్లాస్టిక్ వాడకూడదని నిర్ణయం ఆంజనేయుని దయతోనే నాకు పునర్జన్మ – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
కొండగట్టు, జనవరి 3 (ప్రజా మంటలు):
ఆంజనేయ స్వామి దయతోనే తనకు పునర్జన్మ లభించిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని ఆయన దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా కొండగట్టులో టిటిడి సహకారంతో నిర్మించనున్న వాయుపుత్ర సదన్ ధర్మశాల, దీక్ష విరమణ... 