కలెక్టర్ ల నిర్లక్ష్యం వల్లే భారీగా నిధుల దుర్వినియోగం - చట్టాల ఉల్లంఘన పన్నెండు మంది అధికారులతో సహా ఇద్దరు కార్యదర్శుల పై లోకాయుక్త కు పిర్యాదు

On
కలెక్టర్ ల నిర్లక్ష్యం వల్లే భారీగా నిధుల దుర్వినియోగం - చట్టాల ఉల్లంఘన పన్నెండు మంది అధికారులతో సహా ఇద్దరు కార్యదర్శుల పై లోకాయుక్త కు పిర్యాదు

కలెక్టర్ ల నిర్లక్ష్యం వల్లే భారీగా నిధుల దుర్వినియోగం
జిల్లా పంచాయతీలో అడ్డగోలుగా అధికార దుర్వినియోగం - చట్టాల ఉల్లంఘన
పన్నెండు మంది అధికారులతో సహా ఇద్దరు కార్యదర్శుల పై లోకాయుక్త కు పిర్యాదు

నిఘా విభాగం అధికారులతో పునర్విచారణ జరిపించాలని కోరిన చుక్క గంగారెడ్డి 

బుగ్గారం జిపి పాలక వర్గంపై చర్యలు తీసుకోవాలని విన్నపం


బుగ్గారం/ జగిత్యాల జిల్లా: 

 ప్రజా పిర్యాదులపై జిల్లా కలెక్టర్ లు సకాలంలో సరైన చర్యలు చేపట్టక, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే గ్రామ పంచాయతీలలో నిధుల దుర్వినియోగం భారీగా జరిగిపోయిందని ప్రముఖ ఉద్యమకారుడు, ఆర్టీఐ కార్యకర్త చుక్క గంగారెడ్డి ఆరోపించారు. ఆయన చేసిన పిర్యాదులపై 
 హైదారాబాద్ లోని లోకాయుక్త (కోర్టు) లో గురువారం విచారణ జరిగింది. బుగ్గారం గ్రామ పంచాయతీలో జరిగిన భారీ నిధుల దుర్వినియోగంలో బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని ఆయన లోకాయుక్త ను కోరారు.
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి, వారి బాధ్యతలను, అధికారాన్ని కూడా దుర్వినియోగం చేసి, చట్టాలను కూడా ఉల్లంఘించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని, కఠినంగా శిక్షించాలని చుక్క గంగారెడ్డి లోకాయుక్త కు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేశారు.
దుర్వినియోగం నుండి రికవరీ అయిన సొమ్మును కూడా అధికారులు లెక్కల్లో సరిగా చూపెట్టలేదన్నారు. లక్షల్లో రికవరీ సొమ్మును రికార్డులలో నమోదు చేయకుండా దాచి ఉంచారని ఆయన ఆరోపించారు.
అనేక పిర్యాదులతో పాటు 2022 సెప్టెంబర్ 21న లోకాయుక్త కు కూడా పిర్యాదులు చేయగా జిల్లా పంచాయతీ అధికారి నామ మాత్రంగా గత పంచాయతీ కార్యదర్శి మహబూబ్ పాషా ను, సర్పంచ్ మూల సుమలత ను చివరి దశలో అనగా గత 2024 జనవరి మాసంలో సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని ఆయన తెలిపారు. తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఆధారాలతో సహా మేము చేసిన పిర్యాదులపై కూడా సరైన విధంగా విచారణ చేపట్టక పోవడం చాలా బాధాకరంగా, చాలా అనుమానాస్పదంగా ఉందన్నారు. రాజకీయ ఒత్తిళ్లు, అవినీతి – అక్రమాల వల్లే ఇలా జరిగి ఉంటుందని గ్రామ ప్రజలు ముక్త కంఠంతో ఆరోపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.


1)    మేము ఎన్ని పిర్యాదులు చేసినా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు సరైన విధంగా స్పందించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా నిర్లక్యంగా వ్యవహరించారని, మా పిర్యాదులు సరిగా పట్టించుకోలేదన్నారు. అందుకే లోకాయుక్త ను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.

2)    జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారులుగా పనిచేసిన వేముల శేఖర్, ప్రభాకర్, హరి కిషన్, నరేష్ లతో పాటు ప్రస్తుత డిపిఓ దేవరాజ్ కూడా అన్నీ విషయాలు తెలిసినా, నిధులు భారీగా దుర్వినియోగం అయ్యాయని ఆధారాలు లభించినా…  కావాలనే ఉద్దేశ్య పూర్వకంగా, విధుల్లో, వారి బాధ్యతల్లో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. నిధుల దుర్వినియోగం ఋజువు అయినప్పటికీ వీరంతా వారి - వారి పాలనా సమయంలో చర్యలు తీసుకోలేదన్నారు. ఈ అధికారులంతా చట్టాలను ఉల్లంఘించారని, వారి వృత్తి ధర్మాన్ని, అత్యంత విలువైన వారి విధులను, బాధ్యతలను కూడా దుర్వినియోగం చేశారని చుక్క గంగారెడ్డి పేర్కొన్నారు.

3)    జగిత్యాల, మెట్ పల్లి - డీఎల్ పీవోలు కనక దుర్గ, శ్రీనివాస్ లు వేర్వేరు గా నిధుల దుర్వినియోగం పై ఉన్నతాధికారుల ఆదేశాలతో రెండు సార్లు తూ.. తూ… మంత్రంగా విచారణ చేపట్టారని అన్నారు. పారదర్శకంగా క్షేత్ర స్థాయిలో.. ప్రజల్లో… సరైన విచారణ జరుపలేదన్నారు. దుర్వినియోగానికి పాల్పడ్డ పాలకులతో కుమ్మక్కై వారికే కొమ్ము కాశారని,  వాస్తవాలు వెలుగులోకి వచ్చినప్పటికీనీ… నిధుల దుర్వినియోగాన్ని, వాస్తవాలను పూర్తిగా కప్పి పుచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవ విచారణకు భిన్నంగా తప్పుడు విచారణ నివేదికలు అందజేసి ఉన్నతాధికారులను నమ్మించి, తప్పు దోవ పట్టించారని పేర్కొన్నారు. వారి వృత్తి ధర్మాన్ని, అత్యంత విలువైన వారి విధులను, బాధ్యతలను కూడా దుర్వినియోగం చేశారన్నారు.

4)    మిషన్ భగీరథ లో పని చేస్తున్న ఆర్ డబ్లూ ఎస్ అసిస్టెంట్ ఇంజనీర్ వివేక్ అలియాస్ వివేకానంద కూడా బుగ్గారంలో చేయని పనులకు కూడా పనులు చేసినట్లు, బిల్లులు చెల్లించిన పురాతన పనులనే మళ్ళీ రికార్డులలో చూపెట్టి కొత్తగా పనులు చేసినట్లు తప్పుడు రికార్డులు, దొంగ రికార్డులు సృష్టించారని ఆరోపించారు. పంచాయతీ పాలక వర్గానికి అనుకూలంగా ఇష్టమొచ్చినట్లు రికార్డులను
తయారు చేసి అందజేస్తూ నిధుల దుర్వినియోగానికి, దోపిడీకి సహకరించారని వివరించారు. బుగ్గారం మండలంలోని వివిధ గ్రామాలతో పాటు ధర్మపురి నియోజక వర్గంలోని అనేక గ్రామాలలో కూడా తప్పుడు రికార్డులు, దొంగ రికార్డులు అందజేసి భారీగా నిధుల దుర్వినియోగానికి సహకరించారనే ఆరోపణలు కూడా వివేక్ అలియాస్ వివేకానంద పై కో – కొల్లలుగా ఉన్నాయన్నారు. సరైన విచారణ జరిపిస్తే కోట్లాది రూపాయల దుర్వినియోగం బయటపడే అవకాశం ఉందన్నారు.

5)    జిపిపై ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించాల్సిన బుగ్గారం మండల పంచాయతీ అధికారి అఫ్జల్ తన విధులను, అత్యంత విలువైన తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, చట్టాలను ఉల్లంఘించి, ఈ – పంచాయతీ ఆపరేటర్ జీతం పేరును సాకుగా వాడుకొని  బుగ్గారం జిపితో పాటు మండలంలోని మరో పది గ్రామ పంచాయతీల నుండి సుమారు రూ.22 లక్షలకు పైగా నిధులు తన ఖాతాల్లోకి మల్లించుకొని భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు.

6)    జిల్లా కలెక్టర్ కార్యాలయంతో సహా జిల్లా పంచాయతీ అధికారి, మండల పంచాయతీ అధికారి కార్యాలయాల్లోని ప్రజా సమాచార అధికారులు, అప్పిలేట్  అధికారులు సమాచార హక్కు చట్టం -2005 ను కూడా ఉల్లంఘించారని వివరించారు. సమాచార కమీషన్ జారీ చేసిన 18 ఫిర్యాదులపై ఆర్డర్లను, మరో 60 వరకు ఆర్టీఐ దరఖాస్తులను, అప్పీల్లను కూడా బే-ఖాతరు చేశారన్నారు. ఏండ్లు గడుస్తున్నా నేటికీ కోరిన సమాచారం ఇవ్వడం లేదన్నారు.

7)     గత పంచాయతీ కార్యదర్శి మహబూబ్ పాషా బుగ్గారం జి.పి.లో భారీగా నిధుల దుర్వినియోగం చేయడమే కాకుండా, జి.పి.లో రికార్డులు కూడా దొరుకకుండా మాయం చేసి ఏండ్లు గడుస్తున్నా అధికారులు, ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. అనేక పిర్యాదుల మేరకు కేవలం నామ మాత్రంగా సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు తప్పా…. మహబూబ్ పాషా నుండి నేటికీ రికార్డులు స్వాధీనం చేసుకోలేదన్నారు. లక్షల్లో ఉన్న దుర్వినియోగం సొమ్ము కూడా నేటికీ రికవరీ చేయలేదన్నారు.

8)    రెండో పంచాయతీ కార్యదర్శి నరేందర్ కూడా నిధుల దుర్వినియోగానికి పాల్పడి సుమారు రూ.70 వేల వరకు రికవరీ కూడా చెల్లించాడన్నారు. మరిన్ని నిధులు కూడా ఆయన నుండి రికవరీ కావలసి ఉందని తెలిసిందన్నారు. బుగ్గారం జి.పి.లో ఆయన అనేక అవినీతి -అక్రమాలకు పాల్పడ్డారని,  పాలక వర్గం చేసిన భారీ నిధుల దుర్వినియోగం లో కూడా ఆయన పాత్ర  అత్యంత కీలకంగా ఉందన్నారు. అయినా అధికారులు కార్యదర్శి నరేందర్ పై నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోషనీయం అన్నారు.

9)    బుగ్గారం గ్రామ సర్పంచ్ మూల సుమలత, ఆమె భర్త మూల శ్రీనివాస్ గౌడ్ లతో పాటు ఉప సర్పంచ్, పాలక వర్గంలోని కొందరు వార్డ్ సభ్యులు కుమ్మక్కై మూకుమ్మడిగా భారీ గా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. సుమారు కోటి రూపాయలకు పైగానే నిధులు దుర్వినియోగం జరిగి ఉంటాయని గ్రామ ప్రజలు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

10)     ఇలాంటి అనేక సందర్భాలను బట్టి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ కు మేము లిఖిత పూర్వకంగా ఆధారాలతో సహా పిర్యాదులు చేసి, పత్రికా ప్రకటనలు కూడా జారీ చేయడం జరిగిందన్నారు. అయినా అధికారులు, ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని తెలిపారు .

11)     వీటన్నిటికీ కారణం రాజకీయ ఒత్తిళ్లతో పాటు భారీ మొత్తంలో అవినీతి – అక్రమాలు కూడా జరిగి ఉండొచ్చని మాకు అనుమానంగా ఉందన్నారు.


 నేటితో నాలుగు పర్యాయాలు తమరి సన్నిధికి అందజేసిన మా పిర్యాదు లను, ఆధారాలను పరిగణనలోకి తీసుకొని వీటన్నింటిపై ప్రత్యేక నిఘా విభాగం ఉన్నతాధికారులచే తగు విచారణ జరిపించాలని చుక్క గంగారెడ్డి గురువారం లోకాయుక్త ను కోరారు. 

జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఐదుగురు జిల్లా పంచాయతీ అధికారులు, ఇద్దరు డివిజనల్ పంచాయతీ అధికారులు, జిల్లా కలెక్టరేట్, జిల్లా పంచాయతీ ఆపీస్, మండల పంచాయతీ కార్యాలయాల పౌర సమాచార అధికారులపై, అప్పిలేట్ అధికారులపై, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎ.ఇ. వివేక్, ఎంపీఓ అఫ్జల్, పంచాయతీ కార్యదర్శులు మహబూబ్ పాషా, నరేందర్ లపై, సర్పంచ్, ఉప సర్పంచ్, పాలక వర్గంలోని వార్డు సభ్యుల పై, నిధుల దుర్వినియోగానికి బాధ్యులైన ఇతర వ్యక్తు లంద రిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా శిక్షించాలని ఆయన లోకాయుక్త ను కోరారు.
 
అలాగే దుర్వినియోగం అయిన బుగ్గారం గ్రామపంచాయతీ నిధులన్నీ రికవరీ చేయించి ప్రజా సొమ్మును కాపాడాలని చుక్క గంగారెడ్డి గురువారం లోకాయుక్త కు లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేశారు.

Tags
Join WhatsApp

More News...

National  International   State News 

ఇండెక్స్ మార్పులతో బంగారం–వెండి మార్కెట్‌లో కలకలం

ఇండెక్స్ మార్పులతో బంగారం–వెండి మార్కెట్‌లో కలకలం లండన్ / అంతర్జాతీయ మార్కెట్లు జనవరి 10: 2026 సంవత్సరంలో అంతర్జాతీయ బులియన్ మార్కెట్ తొలి పెద్ద పరీక్షను ఎదుర్కొంటోంది. కమోడిటీ ఇండెక్స్‌లలో జరిగే వార్షిక పునఃసంఘటన (Index Rebalancing) కారణంగా బంగారం, వెండిలో $10 బిలియన్లకు పైగా విలువైన అమ్మకాలు జరగనున్నట్లు అంచనాలు వెలువడ్డాయి. 2025లో రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు...
Read More...
Crime  State News 

పిల్లల సిరప్‌పై తెలంగాణ DCA హెచ్చరిక Almont-Kid Syrup వాడకూడదని ఆదేశాలు

పిల్లల సిరప్‌పై తెలంగాణ DCA హెచ్చరిక Almont-Kid Syrup వాడకూడదని ఆదేశాలు హైదరాబాద్, జనవరి 10 (ప్రజా మంటలు): పిల్లలకు ఉపయోగించే Almont-Kid Syrup విషయంలో తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి (DCA) తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ఈ సిరప్‌లో ప్రమాదకరమైన ఇథిలీన్ గ్లైకాల్ (Ethylene Glycol) మోతాదుకు మించి ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. బిహార్‌కు చెందిన ట్రిడస్ రెమెడీస్ తయారు చేసిన ఈ...
Read More...
Local News  State News 

జగిత్యాల జిల్లాలో పొలం బాట పట్టిన ట్రైనీ ఐఏఎస్ హరిణి

జగిత్యాల జిల్లాలో పొలం బాట పట్టిన ట్రైనీ ఐఏఎస్ హరిణి జగిత్యాల, జనవరి 10 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాకు నియమితులైన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హరిణి గ్రామీణ జీవన విధానాన్ని సమీపంగా తెలుసుకునేందుకు పొలం బాట పట్టారు. ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్, బూరుగుపల్లి గ్రామాల్లో ఆమె క్షేత్ర స్థాయి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా పొలాల్లో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలతో మమేకమై, స్వయంగా వరి నాట్లు...
Read More...
State News 

సర్పంచ్‌గా గెలుపొందిన సందర్భంగా స్కూల్ పిల్లలకు విందు భోజనం

సర్పంచ్‌గా గెలుపొందిన సందర్భంగా స్కూల్ పిల్లలకు విందు భోజనం జగిత్యాల, జనవరి 09 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్ గ్రామంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్ గట్టు శారద గంగారాం స్థానిక ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గారు విద్యార్థులతో కలిసి భోజనం చేయడం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బుగ్గారం...
Read More...

నదీ జలాలపై వివాదాలు కాదు.. చర్చల ద్వారానే పరిష్కారం కావాలి: సీఎం రేవంత్ రెడ్డి

నదీ జలాలపై వివాదాలు కాదు.. చర్చల ద్వారానే పరిష్కారం కావాలి: సీఎం రేవంత్ రెడ్డి మహేశ్వరం  జనవరి 9 (ప్రజా మంటలు): నదీ జలాల విషయంలో పక్క రాష్ట్రాలతో వివాదాలు కోరుకోవడం లేదని, చర్చలు మరియు పరస్పర సహకారం ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. “పంచాయతీ కావాలా.. నీళ్లు కావాలా అని అడిగితే తెలంగాణకు నీళ్లే కావాలి” అని...
Read More...
Crime  State News 

వీడియో కాల్‌లో తుపాకులతో బెదిరింపులు… ముగ్గురు అరెస్ట్

వీడియో కాల్‌లో తుపాకులతో బెదిరింపులు… ముగ్గురు అరెస్ట్ కోరుట్ల జనవరి 09 (ప్రజా మంటలు): కోరుట్ల పట్టణంలో వీడియో కాల్ ద్వారా తుపాకులు చూపిస్తూ బెదిరింపులకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం… కోరుట్ల పట్టణంలోని “కోరుట్ల సెల్ పాయింట్ అసోసియేషన్” పేరిట మార్త శివకుమార్, భోగ శ్రీనివాస్, అడ్డగడ్ల సురేష్ అనే ముగ్గురు వ్యక్తులు ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ బిజినెస్...
Read More...
State News 

‘ప్రతిపక్షం’ దినపత్రిక సంపాదకుడు మహమ్మద్ ఫజుల్ రహమాన్ (66) కనుమూత

‘ప్రతిపక్షం’ దినపత్రిక సంపాదకుడు మహమ్మద్ ఫజుల్ రహమాన్ (66) కనుమూత హైదరాబాద్ జనవరి 09 (ప్రజా మంటలు): గత ఆరు రోజులుగా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ అపస్మారక స్థితిలో ఉన్న ‘ప్రతిపక్షం’ దినపత్రిక సంపాదకులు మహమ్మద్ ఫజుల్ రహమాన్ శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఈ విషాదకర సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నానని సామాజిక...
Read More...

ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మిక తనకీ చేసిన ఇంటర్ బోర్డ్ స్పెషల్ ఆఫీసర్

ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మిక తనకీ చేసిన ఇంటర్ బోర్డ్ స్పెషల్ ఆఫీసర్   జగిత్యాల జనవరి 9 (ప్రజా మంటలు)ఎస్ కే ఎన్ ఆర్  ప్రభుత్వ జూనియర్ కళాశాలలో  ఇంటర్మీడియట్ బోర్డు నుండి ఆకస్మిక తనిఖీ కి వచ్చిన స్పెషల్ ఆఫీసర్  రమణ రావు  జగిత్యాల జిల్లాలోనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, రాబోయే ఐ పి ఈ మార్చ్ 2026 అండ్  ప్రాక్టికల్ ఎగ్జామ్స్  కు సంబంధించిన మౌలిక...
Read More...

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని కలిసిన  టీఎన్జీవో నాయకులు

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని కలిసిన  టీఎన్జీవో నాయకులు జగిత్యాల జనవరి 9( ప్రజా మంటలు)టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి  ఆధ్వర్యంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి,  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి ఉద్యోగులకు సంబంధించిన వివిధ పెండింగ్ సమస్యల గురించి చర్చించారు.   ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  మాట్లాడుతూ టీఎన్జీవో
Read More...

ఓసిలకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలి ఓసి జేఏసీ నేతలు కిషన్ రెడ్డి, మహంకాళి రాజన్న, సిరిసిల్ల రాజేంద్ర శర్మ ఓసి ల సింహ గర్జన సభ సక్సెస్ కోసం జగిత్యాలలో బైక్ ర్యాలీ

ఓసిలకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలి  ఓసి జేఏసీ నేతలు కిషన్ రెడ్డి, మహంకాళి రాజన్న, సిరిసిల్ల రాజేంద్ర శర్మ  ఓసి ల సింహ గర్జన సభ సక్సెస్ కోసం జగిత్యాలలో బైక్ ర్యాలీ    జగిత్యాల జనవరి 9 ( ప్రజా మంటలు) ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసి ఐకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, ఓసి జేఏసీ జగిత్యాల జిల్లా కో ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ మహంకాళి రాజన్న సిరిసిల్ల రాజేంద్ర శర్మ లు  కేంద్ర రాష్ట్ర...
Read More...

కొండగట్టు అగ్ని ప్రమాద  బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ చెక్కుల కార్యక్రమంలో పాల్గొన్న సంక్షేమ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్

కొండగట్టు అగ్ని ప్రమాద  బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ     చెక్కుల కార్యక్రమంలో పాల్గొన్న సంక్షేమ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ కొండగట్టు జనవరి 9 ( ప్రజా మంటలు)మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టులో జరిగిన ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన 31 బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 83 లక్షల రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగులు, ట్రాన్స్ జెండర్ శాఖ మంత్రి అడ్లూరి...
Read More...
Local News 

అరగుండాల ప్రాజెక్టుతో రైతుల ముఖాల్లో చిరునవ్వులు – మాజీ మంత్రి జీవన్ రెడ్డి

అరగుండాల ప్రాజెక్టుతో రైతుల ముఖాల్లో చిరునవ్వులు – మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీర్పూర్, జనవరి 09 (ప్రజా మంటలు): బీర్పూర్ మండలంలోని అరగుండాల ప్రాజెక్టు ముత్తడి ప్రాంతాన్ని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పరిశీలించారు. ఇటీవల ప్రాజెక్టు స్లూయిస్ గేట్ దెబ్బతినడంతో పాటు కాలువ మరమ్మత్తుల అవసరాన్ని రైతులు తన దృష్టికి తీసుకురావడంతో, జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో చర్చించి తక్షణ చర్యలు చేపట్టించినట్లు...
Read More...