కలెక్టర్ ల నిర్లక్ష్యం వల్లే భారీగా నిధుల దుర్వినియోగం - చట్టాల ఉల్లంఘన పన్నెండు మంది అధికారులతో సహా ఇద్దరు కార్యదర్శుల పై లోకాయుక్త కు పిర్యాదు

On
కలెక్టర్ ల నిర్లక్ష్యం వల్లే భారీగా నిధుల దుర్వినియోగం - చట్టాల ఉల్లంఘన పన్నెండు మంది అధికారులతో సహా ఇద్దరు కార్యదర్శుల పై లోకాయుక్త కు పిర్యాదు

కలెక్టర్ ల నిర్లక్ష్యం వల్లే భారీగా నిధుల దుర్వినియోగం
జిల్లా పంచాయతీలో అడ్డగోలుగా అధికార దుర్వినియోగం - చట్టాల ఉల్లంఘన
పన్నెండు మంది అధికారులతో సహా ఇద్దరు కార్యదర్శుల పై లోకాయుక్త కు పిర్యాదు

నిఘా విభాగం అధికారులతో పునర్విచారణ జరిపించాలని కోరిన చుక్క గంగారెడ్డి 

బుగ్గారం జిపి పాలక వర్గంపై చర్యలు తీసుకోవాలని విన్నపం


బుగ్గారం/ జగిత్యాల జిల్లా: 

 ప్రజా పిర్యాదులపై జిల్లా కలెక్టర్ లు సకాలంలో సరైన చర్యలు చేపట్టక, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే గ్రామ పంచాయతీలలో నిధుల దుర్వినియోగం భారీగా జరిగిపోయిందని ప్రముఖ ఉద్యమకారుడు, ఆర్టీఐ కార్యకర్త చుక్క గంగారెడ్డి ఆరోపించారు. ఆయన చేసిన పిర్యాదులపై 
 హైదారాబాద్ లోని లోకాయుక్త (కోర్టు) లో గురువారం విచారణ జరిగింది. బుగ్గారం గ్రామ పంచాయతీలో జరిగిన భారీ నిధుల దుర్వినియోగంలో బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని ఆయన లోకాయుక్త ను కోరారు.
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి, వారి బాధ్యతలను, అధికారాన్ని కూడా దుర్వినియోగం చేసి, చట్టాలను కూడా ఉల్లంఘించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని, కఠినంగా శిక్షించాలని చుక్క గంగారెడ్డి లోకాయుక్త కు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేశారు.
దుర్వినియోగం నుండి రికవరీ అయిన సొమ్మును కూడా అధికారులు లెక్కల్లో సరిగా చూపెట్టలేదన్నారు. లక్షల్లో రికవరీ సొమ్మును రికార్డులలో నమోదు చేయకుండా దాచి ఉంచారని ఆయన ఆరోపించారు.
అనేక పిర్యాదులతో పాటు 2022 సెప్టెంబర్ 21న లోకాయుక్త కు కూడా పిర్యాదులు చేయగా జిల్లా పంచాయతీ అధికారి నామ మాత్రంగా గత పంచాయతీ కార్యదర్శి మహబూబ్ పాషా ను, సర్పంచ్ మూల సుమలత ను చివరి దశలో అనగా గత 2024 జనవరి మాసంలో సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని ఆయన తెలిపారు. తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఆధారాలతో సహా మేము చేసిన పిర్యాదులపై కూడా సరైన విధంగా విచారణ చేపట్టక పోవడం చాలా బాధాకరంగా, చాలా అనుమానాస్పదంగా ఉందన్నారు. రాజకీయ ఒత్తిళ్లు, అవినీతి – అక్రమాల వల్లే ఇలా జరిగి ఉంటుందని గ్రామ ప్రజలు ముక్త కంఠంతో ఆరోపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.


1)    మేము ఎన్ని పిర్యాదులు చేసినా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు సరైన విధంగా స్పందించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా నిర్లక్యంగా వ్యవహరించారని, మా పిర్యాదులు సరిగా పట్టించుకోలేదన్నారు. అందుకే లోకాయుక్త ను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.

2)    జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారులుగా పనిచేసిన వేముల శేఖర్, ప్రభాకర్, హరి కిషన్, నరేష్ లతో పాటు ప్రస్తుత డిపిఓ దేవరాజ్ కూడా అన్నీ విషయాలు తెలిసినా, నిధులు భారీగా దుర్వినియోగం అయ్యాయని ఆధారాలు లభించినా…  కావాలనే ఉద్దేశ్య పూర్వకంగా, విధుల్లో, వారి బాధ్యతల్లో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. నిధుల దుర్వినియోగం ఋజువు అయినప్పటికీ వీరంతా వారి - వారి పాలనా సమయంలో చర్యలు తీసుకోలేదన్నారు. ఈ అధికారులంతా చట్టాలను ఉల్లంఘించారని, వారి వృత్తి ధర్మాన్ని, అత్యంత విలువైన వారి విధులను, బాధ్యతలను కూడా దుర్వినియోగం చేశారని చుక్క గంగారెడ్డి పేర్కొన్నారు.

3)    జగిత్యాల, మెట్ పల్లి - డీఎల్ పీవోలు కనక దుర్గ, శ్రీనివాస్ లు వేర్వేరు గా నిధుల దుర్వినియోగం పై ఉన్నతాధికారుల ఆదేశాలతో రెండు సార్లు తూ.. తూ… మంత్రంగా విచారణ చేపట్టారని అన్నారు. పారదర్శకంగా క్షేత్ర స్థాయిలో.. ప్రజల్లో… సరైన విచారణ జరుపలేదన్నారు. దుర్వినియోగానికి పాల్పడ్డ పాలకులతో కుమ్మక్కై వారికే కొమ్ము కాశారని,  వాస్తవాలు వెలుగులోకి వచ్చినప్పటికీనీ… నిధుల దుర్వినియోగాన్ని, వాస్తవాలను పూర్తిగా కప్పి పుచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవ విచారణకు భిన్నంగా తప్పుడు విచారణ నివేదికలు అందజేసి ఉన్నతాధికారులను నమ్మించి, తప్పు దోవ పట్టించారని పేర్కొన్నారు. వారి వృత్తి ధర్మాన్ని, అత్యంత విలువైన వారి విధులను, బాధ్యతలను కూడా దుర్వినియోగం చేశారన్నారు.

4)    మిషన్ భగీరథ లో పని చేస్తున్న ఆర్ డబ్లూ ఎస్ అసిస్టెంట్ ఇంజనీర్ వివేక్ అలియాస్ వివేకానంద కూడా బుగ్గారంలో చేయని పనులకు కూడా పనులు చేసినట్లు, బిల్లులు చెల్లించిన పురాతన పనులనే మళ్ళీ రికార్డులలో చూపెట్టి కొత్తగా పనులు చేసినట్లు తప్పుడు రికార్డులు, దొంగ రికార్డులు సృష్టించారని ఆరోపించారు. పంచాయతీ పాలక వర్గానికి అనుకూలంగా ఇష్టమొచ్చినట్లు రికార్డులను
తయారు చేసి అందజేస్తూ నిధుల దుర్వినియోగానికి, దోపిడీకి సహకరించారని వివరించారు. బుగ్గారం మండలంలోని వివిధ గ్రామాలతో పాటు ధర్మపురి నియోజక వర్గంలోని అనేక గ్రామాలలో కూడా తప్పుడు రికార్డులు, దొంగ రికార్డులు అందజేసి భారీగా నిధుల దుర్వినియోగానికి సహకరించారనే ఆరోపణలు కూడా వివేక్ అలియాస్ వివేకానంద పై కో – కొల్లలుగా ఉన్నాయన్నారు. సరైన విచారణ జరిపిస్తే కోట్లాది రూపాయల దుర్వినియోగం బయటపడే అవకాశం ఉందన్నారు.

5)    జిపిపై ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించాల్సిన బుగ్గారం మండల పంచాయతీ అధికారి అఫ్జల్ తన విధులను, అత్యంత విలువైన తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, చట్టాలను ఉల్లంఘించి, ఈ – పంచాయతీ ఆపరేటర్ జీతం పేరును సాకుగా వాడుకొని  బుగ్గారం జిపితో పాటు మండలంలోని మరో పది గ్రామ పంచాయతీల నుండి సుమారు రూ.22 లక్షలకు పైగా నిధులు తన ఖాతాల్లోకి మల్లించుకొని భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు.

6)    జిల్లా కలెక్టర్ కార్యాలయంతో సహా జిల్లా పంచాయతీ అధికారి, మండల పంచాయతీ అధికారి కార్యాలయాల్లోని ప్రజా సమాచార అధికారులు, అప్పిలేట్  అధికారులు సమాచార హక్కు చట్టం -2005 ను కూడా ఉల్లంఘించారని వివరించారు. సమాచార కమీషన్ జారీ చేసిన 18 ఫిర్యాదులపై ఆర్డర్లను, మరో 60 వరకు ఆర్టీఐ దరఖాస్తులను, అప్పీల్లను కూడా బే-ఖాతరు చేశారన్నారు. ఏండ్లు గడుస్తున్నా నేటికీ కోరిన సమాచారం ఇవ్వడం లేదన్నారు.

7)     గత పంచాయతీ కార్యదర్శి మహబూబ్ పాషా బుగ్గారం జి.పి.లో భారీగా నిధుల దుర్వినియోగం చేయడమే కాకుండా, జి.పి.లో రికార్డులు కూడా దొరుకకుండా మాయం చేసి ఏండ్లు గడుస్తున్నా అధికారులు, ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. అనేక పిర్యాదుల మేరకు కేవలం నామ మాత్రంగా సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు తప్పా…. మహబూబ్ పాషా నుండి నేటికీ రికార్డులు స్వాధీనం చేసుకోలేదన్నారు. లక్షల్లో ఉన్న దుర్వినియోగం సొమ్ము కూడా నేటికీ రికవరీ చేయలేదన్నారు.

8)    రెండో పంచాయతీ కార్యదర్శి నరేందర్ కూడా నిధుల దుర్వినియోగానికి పాల్పడి సుమారు రూ.70 వేల వరకు రికవరీ కూడా చెల్లించాడన్నారు. మరిన్ని నిధులు కూడా ఆయన నుండి రికవరీ కావలసి ఉందని తెలిసిందన్నారు. బుగ్గారం జి.పి.లో ఆయన అనేక అవినీతి -అక్రమాలకు పాల్పడ్డారని,  పాలక వర్గం చేసిన భారీ నిధుల దుర్వినియోగం లో కూడా ఆయన పాత్ర  అత్యంత కీలకంగా ఉందన్నారు. అయినా అధికారులు కార్యదర్శి నరేందర్ పై నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోషనీయం అన్నారు.

9)    బుగ్గారం గ్రామ సర్పంచ్ మూల సుమలత, ఆమె భర్త మూల శ్రీనివాస్ గౌడ్ లతో పాటు ఉప సర్పంచ్, పాలక వర్గంలోని కొందరు వార్డ్ సభ్యులు కుమ్మక్కై మూకుమ్మడిగా భారీ గా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. సుమారు కోటి రూపాయలకు పైగానే నిధులు దుర్వినియోగం జరిగి ఉంటాయని గ్రామ ప్రజలు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

10)     ఇలాంటి అనేక సందర్భాలను బట్టి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ కు మేము లిఖిత పూర్వకంగా ఆధారాలతో సహా పిర్యాదులు చేసి, పత్రికా ప్రకటనలు కూడా జారీ చేయడం జరిగిందన్నారు. అయినా అధికారులు, ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని తెలిపారు .

11)     వీటన్నిటికీ కారణం రాజకీయ ఒత్తిళ్లతో పాటు భారీ మొత్తంలో అవినీతి – అక్రమాలు కూడా జరిగి ఉండొచ్చని మాకు అనుమానంగా ఉందన్నారు.


 నేటితో నాలుగు పర్యాయాలు తమరి సన్నిధికి అందజేసిన మా పిర్యాదు లను, ఆధారాలను పరిగణనలోకి తీసుకొని వీటన్నింటిపై ప్రత్యేక నిఘా విభాగం ఉన్నతాధికారులచే తగు విచారణ జరిపించాలని చుక్క గంగారెడ్డి గురువారం లోకాయుక్త ను కోరారు. 

జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఐదుగురు జిల్లా పంచాయతీ అధికారులు, ఇద్దరు డివిజనల్ పంచాయతీ అధికారులు, జిల్లా కలెక్టరేట్, జిల్లా పంచాయతీ ఆపీస్, మండల పంచాయతీ కార్యాలయాల పౌర సమాచార అధికారులపై, అప్పిలేట్ అధికారులపై, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎ.ఇ. వివేక్, ఎంపీఓ అఫ్జల్, పంచాయతీ కార్యదర్శులు మహబూబ్ పాషా, నరేందర్ లపై, సర్పంచ్, ఉప సర్పంచ్, పాలక వర్గంలోని వార్డు సభ్యుల పై, నిధుల దుర్వినియోగానికి బాధ్యులైన ఇతర వ్యక్తు లంద రిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా శిక్షించాలని ఆయన లోకాయుక్త ను కోరారు.
 
అలాగే దుర్వినియోగం అయిన బుగ్గారం గ్రామపంచాయతీ నిధులన్నీ రికవరీ చేయించి ప్రజా సొమ్మును కాపాడాలని చుక్క గంగారెడ్డి గురువారం లోకాయుక్త కు లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేశారు.

Tags

More News...

Local News 

ధర్మపురి మం "నేరెళ్ల లోనే జవహర్ నవోదయ నెలకొల్పాలని కేంద్రమంత్రికి ప్రభుత్వ విప్, ఎంపి వినతి

ధర్మపురి మం ఢిల్లీ ఫిబ్రవరి 11 ( ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్రంలోని ధర్మపురి మండలం నేరెళ్లలో జవహర్ నవోదయ విద్యాలయాన్ని సకాలంలో అమలు చేయాలని కేంద్ర విద్య శాఖ మంత్రివర్యులు ధర్మేంద్ర ప్రధాన్ కలిసిన ప్రభుత్వ విప్పు లక్ష్మణ్ కుమార్  *కేంద్ర ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయన్ని ధర్మపురి మండలం నేరెళ్లలో మంజూరు చేయగా దాన్ని తరలించకుండ...
Read More...
Local News 

ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జగిత్యాల ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు)జగిత్యాల రూరల్ మం అంబర్ పేట గ్రామములో కొండపై స్వయంభుగా వెలసినశ్రీవేంకటేశ్వర స్వామి వారి 25 వ వార్షిక బ్రహ్మోత్సవాలు  లో భాగంగా  మంగళవారం రెండవ రోజులో భాగంగా ఘనంగానిర్వహించిన కార్యక్రమాలు విశ్వక్సేన విధి వాసుదేవ పుణ్యాహవాచనం, అంకురారోపణ ముత్సాంగ్గ్రహణం, ఆచార్య రిత్వికరణం, వైనతేయ ప్రతిష్టా విధి...
Read More...
Local News  State News 

రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 

రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం  రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం  రైతుల సంక్షేమం కోసం రూ. 55,256 కోట్లు వ్యయం చేసిన ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే రైతులకు మేలు పదేళ్ల కాలంలో రైతులకు బీ.ఆర్.ఎస్. చేసిందేమీ లేదు  - రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి  హైదరాబాద్ ఫిబ్రవరి 11: కాంగ్రెస్...
Read More...
Local News 

సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్​ ఫిబ్రవరి 11 (

సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి  సికింద్రాబాద్​ ఫిబ్రవరి 11 ( సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్​ ఫిబ్రవరి 11 (ప్రజామంటలు): పద్మారావునగర్​ లోని స్కందగిరి శ్రీసుబ్రహ్మాణ్యస్వామి ఆలయాన్ని మాజీ మంత్రి,రాష్ర్ట బీజేపీ నాయకులు మర్రి శశిధర్​ రెడ్డి మంగళవారం సందర్శించారు. తైపూసం పాల్గుడి కావడి పౌర్ణమి వేడుకల సందర్బంగా స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు మర్రిశశిధర్​ రెడ్డిని శాలువాతో...
Read More...
Local News 

జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం

జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం సికింద్రాబాద్​, ఫిబ్రవరి 11 ( ప్రజామంటలు): బన్సీలాల్ పేట్ లోని చాచా నెహ్రూ నగర్ కమ్యునిటీ హాలులో మంగళవారం జరిగిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.  రెయిన్ బో ఫౌండేషన్ ఇండియా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రైయిన్ బో కమ్యూనిటీ కేర్...
Read More...

#Draft: Add Your Title

#Draft: Add Your Title మహాంకాళి పీఎస్​ పరిధిలో యువతి మిస్సింగ్​సికింద్రాబాద్​ ఫిబ్రవరి 11 (ప్రజామంటలు): సికింద్రాబాద్​ మహాంకాళి పీఎస్​ పరిధిలో ఓ యువతి మిస్సింగ్​ అయింది. ఇన్​స్పెక్టర్​ పరశురామ్​ తెలిపిన వివరాల ప్రకారం..సుభాష్​ నగర్​ కు చెందిన బట్టిన్వర్​ నేహా(19) ప్యాట్నీ సెంటర్​ లోని చెన్నై షాపింగ్​ మాల్​ లో సేల్స్​ గర్ల్​ గా పనిచేస్తోంది. ఈనెల...
Read More...
Local News 

స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు

స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు సికింద్రాబాద్​ ఫిబ్రవరి 11 (ప్రజామంటలు) : పద్మారావునగర్​ లోని స్కందగిరి శ్రీసుబ్రహ్మాణ్యస్వామి ఆలయంలో మంగళవారం తైపూసం పాలకావడి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి, శ్రీసుబ్రహ్మాణ్యస్వామి వార్లను దర్శించుకున్నారు. భుజాన పాల కలశంతో కూడిన కావడిని ఎత్తుకొని ఆలయం చుట్టు ప్రదక్షిణ...
Read More...
Local News 

నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్ 

నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్  ▪️ జగిత్యాల ఫిబ్రవరి 11(ప్రజా మంటలు)  హైదరాబాదులో నిర్వహించిన నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్  తెలంగాణ మైనార్టీ జూనియర్ కాలేజ్ విద్యార్థి  ఎండీ అయా నొద్దీన్ ( ఏం పీ సి 1 సం:) గోల్డ్ మెడల్ సాధించినందుకు  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  గారు అభినందించారు ఈ కార్యక్రమంలో మైనార్టీ జూనియర్ కళాశాల...
Read More...
Local News 

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు జగిత్యాల ఫిబ్రవరి 11(ప్రజా మంటలు)300 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన జగిత్యాల రూరల్ మం  అంబారి పేట  శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే దేవాలయం వద్ద బోర్డును ఏర్పాటు చేశామని, ఏ మతాన్ని గానీ వ్యక్తులను గానీ కించపరచాలనే ఉద్దేశం తమ గ్రామస్తులకు లేదని అంబారిపేట గ్రామస్తులు స్పష్టం చేశారు....
Read More...
Local News 

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు జగిత్యాల ఫిబ్రవరి 11(ప్రజా మంటలు)300 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన జగిత్యాల రూరల్ మం  అంబారి పేట  శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే దేవాలయం వద్ద బోర్డును ఏర్పాటు చేశామని, ఏ మతాన్ని గానీ వ్యక్తులను గానీ కించపరచాలనే ఉద్దేశం తమ గ్రామస్తులకు లేదని అంబారిపేట గ్రామస్తులు స్పష్టం చేశారు....
Read More...
Local News 

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి బ్రహ్మోత్సవ  ఆహ్వాన పత్రిక అందజేత

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి బ్రహ్మోత్సవ  ఆహ్వాన పత్రిక అందజేత    జగిత్యాల ఫిబ్రవరి 11(ప్రజా మంటలు)పట్టణంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  నివాసంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి పురాని పేట , బోయవాడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో హాజరు కావాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ  కి ఆహ్వాన పత్రిక అందజేశారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి...
Read More...
National  International   State News 

మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి

మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి అమెరికా విదేశీ అవినీతి చట్టాన్ని ట్రంప్ సస్పెండ్ చేశారు; అదానీ గ్రూప్ స్టాక్స్ పెరిగాయి మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి వాషింగ్టన్, ఫిబ్రవరి 11: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ అధికారులకు లంచం ఇవ్వకుండా అమెరికా కంపెనీలు నిషేధించే చట్టం అమలును నిలిపివేయడానికి ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసిన తర్వాత,...
Read More...