కలెక్టర్ ల నిర్లక్ష్యం వల్లే భారీగా నిధుల దుర్వినియోగం - చట్టాల ఉల్లంఘన పన్నెండు మంది అధికారులతో సహా ఇద్దరు కార్యదర్శుల పై లోకాయుక్త కు పిర్యాదు
కలెక్టర్ ల నిర్లక్ష్యం వల్లే భారీగా నిధుల దుర్వినియోగం
జిల్లా పంచాయతీలో అడ్డగోలుగా అధికార దుర్వినియోగం - చట్టాల ఉల్లంఘన
పన్నెండు మంది అధికారులతో సహా ఇద్దరు కార్యదర్శుల పై లోకాయుక్త కు పిర్యాదు
నిఘా విభాగం అధికారులతో పునర్విచారణ జరిపించాలని కోరిన చుక్క గంగారెడ్డి
బుగ్గారం జిపి పాలక వర్గంపై చర్యలు తీసుకోవాలని విన్నపం
బుగ్గారం/ జగిత్యాల జిల్లా:
ప్రజా పిర్యాదులపై జిల్లా కలెక్టర్ లు సకాలంలో సరైన చర్యలు చేపట్టక, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే గ్రామ పంచాయతీలలో నిధుల దుర్వినియోగం భారీగా జరిగిపోయిందని ప్రముఖ ఉద్యమకారుడు, ఆర్టీఐ కార్యకర్త చుక్క గంగారెడ్డి ఆరోపించారు. ఆయన చేసిన పిర్యాదులపై
హైదారాబాద్ లోని లోకాయుక్త (కోర్టు) లో గురువారం విచారణ జరిగింది. బుగ్గారం గ్రామ పంచాయతీలో జరిగిన భారీ నిధుల దుర్వినియోగంలో బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని ఆయన లోకాయుక్త ను కోరారు.
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి, వారి బాధ్యతలను, అధికారాన్ని కూడా దుర్వినియోగం చేసి, చట్టాలను కూడా ఉల్లంఘించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని, కఠినంగా శిక్షించాలని చుక్క గంగారెడ్డి లోకాయుక్త కు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేశారు.
దుర్వినియోగం నుండి రికవరీ అయిన సొమ్మును కూడా అధికారులు లెక్కల్లో సరిగా చూపెట్టలేదన్నారు. లక్షల్లో రికవరీ సొమ్మును రికార్డులలో నమోదు చేయకుండా దాచి ఉంచారని ఆయన ఆరోపించారు.
అనేక పిర్యాదులతో పాటు 2022 సెప్టెంబర్ 21న లోకాయుక్త కు కూడా పిర్యాదులు చేయగా జిల్లా పంచాయతీ అధికారి నామ మాత్రంగా గత పంచాయతీ కార్యదర్శి మహబూబ్ పాషా ను, సర్పంచ్ మూల సుమలత ను చివరి దశలో అనగా గత 2024 జనవరి మాసంలో సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని ఆయన తెలిపారు. తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఆధారాలతో సహా మేము చేసిన పిర్యాదులపై కూడా సరైన విధంగా విచారణ చేపట్టక పోవడం చాలా బాధాకరంగా, చాలా అనుమానాస్పదంగా ఉందన్నారు. రాజకీయ ఒత్తిళ్లు, అవినీతి – అక్రమాల వల్లే ఇలా జరిగి ఉంటుందని గ్రామ ప్రజలు ముక్త కంఠంతో ఆరోపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
1) మేము ఎన్ని పిర్యాదులు చేసినా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు సరైన విధంగా స్పందించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా నిర్లక్యంగా వ్యవహరించారని, మా పిర్యాదులు సరిగా పట్టించుకోలేదన్నారు. అందుకే లోకాయుక్త ను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.
2) జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారులుగా పనిచేసిన వేముల శేఖర్, ప్రభాకర్, హరి కిషన్, నరేష్ లతో పాటు ప్రస్తుత డిపిఓ దేవరాజ్ కూడా అన్నీ విషయాలు తెలిసినా, నిధులు భారీగా దుర్వినియోగం అయ్యాయని ఆధారాలు లభించినా… కావాలనే ఉద్దేశ్య పూర్వకంగా, విధుల్లో, వారి బాధ్యతల్లో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. నిధుల దుర్వినియోగం ఋజువు అయినప్పటికీ వీరంతా వారి - వారి పాలనా సమయంలో చర్యలు తీసుకోలేదన్నారు. ఈ అధికారులంతా చట్టాలను ఉల్లంఘించారని, వారి వృత్తి ధర్మాన్ని, అత్యంత విలువైన వారి విధులను, బాధ్యతలను కూడా దుర్వినియోగం చేశారని చుక్క గంగారెడ్డి పేర్కొన్నారు.
3) జగిత్యాల, మెట్ పల్లి - డీఎల్ పీవోలు కనక దుర్గ, శ్రీనివాస్ లు వేర్వేరు గా నిధుల దుర్వినియోగం పై ఉన్నతాధికారుల ఆదేశాలతో రెండు సార్లు తూ.. తూ… మంత్రంగా విచారణ చేపట్టారని అన్నారు. పారదర్శకంగా క్షేత్ర స్థాయిలో.. ప్రజల్లో… సరైన విచారణ జరుపలేదన్నారు. దుర్వినియోగానికి పాల్పడ్డ పాలకులతో కుమ్మక్కై వారికే కొమ్ము కాశారని, వాస్తవాలు వెలుగులోకి వచ్చినప్పటికీనీ… నిధుల దుర్వినియోగాన్ని, వాస్తవాలను పూర్తిగా కప్పి పుచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవ విచారణకు భిన్నంగా తప్పుడు విచారణ నివేదికలు అందజేసి ఉన్నతాధికారులను నమ్మించి, తప్పు దోవ పట్టించారని పేర్కొన్నారు. వారి వృత్తి ధర్మాన్ని, అత్యంత విలువైన వారి విధులను, బాధ్యతలను కూడా దుర్వినియోగం చేశారన్నారు.
4) మిషన్ భగీరథ లో పని చేస్తున్న ఆర్ డబ్లూ ఎస్ అసిస్టెంట్ ఇంజనీర్ వివేక్ అలియాస్ వివేకానంద కూడా బుగ్గారంలో చేయని పనులకు కూడా పనులు చేసినట్లు, బిల్లులు చెల్లించిన పురాతన పనులనే మళ్ళీ రికార్డులలో చూపెట్టి కొత్తగా పనులు చేసినట్లు తప్పుడు రికార్డులు, దొంగ రికార్డులు సృష్టించారని ఆరోపించారు. పంచాయతీ పాలక వర్గానికి అనుకూలంగా ఇష్టమొచ్చినట్లు రికార్డులను
తయారు చేసి అందజేస్తూ నిధుల దుర్వినియోగానికి, దోపిడీకి సహకరించారని వివరించారు. బుగ్గారం మండలంలోని వివిధ గ్రామాలతో పాటు ధర్మపురి నియోజక వర్గంలోని అనేక గ్రామాలలో కూడా తప్పుడు రికార్డులు, దొంగ రికార్డులు అందజేసి భారీగా నిధుల దుర్వినియోగానికి సహకరించారనే ఆరోపణలు కూడా వివేక్ అలియాస్ వివేకానంద పై కో – కొల్లలుగా ఉన్నాయన్నారు. సరైన విచారణ జరిపిస్తే కోట్లాది రూపాయల దుర్వినియోగం బయటపడే అవకాశం ఉందన్నారు.
5) జిపిపై ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించాల్సిన బుగ్గారం మండల పంచాయతీ అధికారి అఫ్జల్ తన విధులను, అత్యంత విలువైన తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, చట్టాలను ఉల్లంఘించి, ఈ – పంచాయతీ ఆపరేటర్ జీతం పేరును సాకుగా వాడుకొని బుగ్గారం జిపితో పాటు మండలంలోని మరో పది గ్రామ పంచాయతీల నుండి సుమారు రూ.22 లక్షలకు పైగా నిధులు తన ఖాతాల్లోకి మల్లించుకొని భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు.
6) జిల్లా కలెక్టర్ కార్యాలయంతో సహా జిల్లా పంచాయతీ అధికారి, మండల పంచాయతీ అధికారి కార్యాలయాల్లోని ప్రజా సమాచార అధికారులు, అప్పిలేట్ అధికారులు సమాచార హక్కు చట్టం -2005 ను కూడా ఉల్లంఘించారని వివరించారు. సమాచార కమీషన్ జారీ చేసిన 18 ఫిర్యాదులపై ఆర్డర్లను, మరో 60 వరకు ఆర్టీఐ దరఖాస్తులను, అప్పీల్లను కూడా బే-ఖాతరు చేశారన్నారు. ఏండ్లు గడుస్తున్నా నేటికీ కోరిన సమాచారం ఇవ్వడం లేదన్నారు.
7) గత పంచాయతీ కార్యదర్శి మహబూబ్ పాషా బుగ్గారం జి.పి.లో భారీగా నిధుల దుర్వినియోగం చేయడమే కాకుండా, జి.పి.లో రికార్డులు కూడా దొరుకకుండా మాయం చేసి ఏండ్లు గడుస్తున్నా అధికారులు, ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. అనేక పిర్యాదుల మేరకు కేవలం నామ మాత్రంగా సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు తప్పా…. మహబూబ్ పాషా నుండి నేటికీ రికార్డులు స్వాధీనం చేసుకోలేదన్నారు. లక్షల్లో ఉన్న దుర్వినియోగం సొమ్ము కూడా నేటికీ రికవరీ చేయలేదన్నారు.
8) రెండో పంచాయతీ కార్యదర్శి నరేందర్ కూడా నిధుల దుర్వినియోగానికి పాల్పడి సుమారు రూ.70 వేల వరకు రికవరీ కూడా చెల్లించాడన్నారు. మరిన్ని నిధులు కూడా ఆయన నుండి రికవరీ కావలసి ఉందని తెలిసిందన్నారు. బుగ్గారం జి.పి.లో ఆయన అనేక అవినీతి -అక్రమాలకు పాల్పడ్డారని, పాలక వర్గం చేసిన భారీ నిధుల దుర్వినియోగం లో కూడా ఆయన పాత్ర అత్యంత కీలకంగా ఉందన్నారు. అయినా అధికారులు కార్యదర్శి నరేందర్ పై నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోషనీయం అన్నారు.
9) బుగ్గారం గ్రామ సర్పంచ్ మూల సుమలత, ఆమె భర్త మూల శ్రీనివాస్ గౌడ్ లతో పాటు ఉప సర్పంచ్, పాలక వర్గంలోని కొందరు వార్డ్ సభ్యులు కుమ్మక్కై మూకుమ్మడిగా భారీ గా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. సుమారు కోటి రూపాయలకు పైగానే నిధులు దుర్వినియోగం జరిగి ఉంటాయని గ్రామ ప్రజలు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
10) ఇలాంటి అనేక సందర్భాలను బట్టి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ కు మేము లిఖిత పూర్వకంగా ఆధారాలతో సహా పిర్యాదులు చేసి, పత్రికా ప్రకటనలు కూడా జారీ చేయడం జరిగిందన్నారు. అయినా అధికారులు, ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని తెలిపారు .
11) వీటన్నిటికీ కారణం రాజకీయ ఒత్తిళ్లతో పాటు భారీ మొత్తంలో అవినీతి – అక్రమాలు కూడా జరిగి ఉండొచ్చని మాకు అనుమానంగా ఉందన్నారు.
నేటితో నాలుగు పర్యాయాలు తమరి సన్నిధికి అందజేసిన మా పిర్యాదు లను, ఆధారాలను పరిగణనలోకి తీసుకొని వీటన్నింటిపై ప్రత్యేక నిఘా విభాగం ఉన్నతాధికారులచే తగు విచారణ జరిపించాలని చుక్క గంగారెడ్డి గురువారం లోకాయుక్త ను కోరారు.
జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఐదుగురు జిల్లా పంచాయతీ అధికారులు, ఇద్దరు డివిజనల్ పంచాయతీ అధికారులు, జిల్లా కలెక్టరేట్, జిల్లా పంచాయతీ ఆపీస్, మండల పంచాయతీ కార్యాలయాల పౌర సమాచార అధికారులపై, అప్పిలేట్ అధికారులపై, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎ.ఇ. వివేక్, ఎంపీఓ అఫ్జల్, పంచాయతీ కార్యదర్శులు మహబూబ్ పాషా, నరేందర్ లపై, సర్పంచ్, ఉప సర్పంచ్, పాలక వర్గంలోని వార్డు సభ్యుల పై, నిధుల దుర్వినియోగానికి బాధ్యులైన ఇతర వ్యక్తు లంద రిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా శిక్షించాలని ఆయన లోకాయుక్త ను కోరారు.
అలాగే దుర్వినియోగం అయిన బుగ్గారం గ్రామపంచాయతీ నిధులన్నీ రికవరీ చేయించి ప్రజా సొమ్మును కాపాడాలని చుక్క గంగారెడ్డి గురువారం లోకాయుక్త కు లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పోలియో చుక్కలను వేసి చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపాలి - పి.సి.సి సేవాదళ్ సెక్రటరీ బోగోజి ముఖేష్ ఖన్నా
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)
జగిత్యాల 28 జూన్ ( ప్రజా మంటలు) :
జాతీయ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా 0-5 ఏండ్ల వయస్సు ఉన్న పిల్లలకు తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలను వేసి చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపాలని పి.సి.సి సేవాదళ్ సెక్రటరీ బోగోజి ముఖేష్ ఖన్నా వెల్లడించారు.
పోలియో... యూపీఏ, ఎన్డీఏ పాలనల్లో ధరల పెరుగుదలపై సోషల్ మీడియాలో వైరల్ పోస్టు
న్యూఢిల్లీ, జూన్ 28 (ప్రజా మంటలు):మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం (2004–2014), ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం (2014–2026) హయాంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను పోలుస్తూ ఒక గ్రాఫిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (2004–2014) పాలనలోని ధరలు, ఆ... తమిళనాడు ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షుడు పి.డి. అరసకుమార్ అరెస్ట్
రూ.100 కోట్ల ప్రైవేట్ పాఠశాలల అనుమతుల మోసం కేసు
చెన్నై, జూన్ 28 (ప్రజా మంటలు):
తమిళనాడులో ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వ అనుమతులు, శాశ్వత గుర్తింపు (Recognition), గ్రేడ్ అప్గ్రేడేషన్, డీటీసీపీ (DTCP), సీఎండీఏ (CMDA) అనుమతులు ఇప్పిస్తానని నమ్మబలికి రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు ప్రైవేట్... మంచాల రామేశం స్మారకార్థం ఆర్వో వాటర్ ప్లాంటేషన్ వితరణ
జగిత్యాల జూన్ 22(ప్రజా మంటలు)జగిత్యాల పట్టణంలోని క్రిటికల్ కేర్ హాస్పిటల్ యందు మంచాల రామేశం స్మారకార్థం మంచాల కృష్ణ ఏర్పాటు చేసిన ఆర్వో (ఆర్ ఓ) వాటర్ ప్లాంట్ను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మరియు జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంచాల కృష్ణ... జగిత్యాలలో 120 గ్రాముల గంజాయి స్వాధీనం.. నిందితుడు అరెస్ట్
జగిత్యాల, జూన్ 20 (ప్రజా మంటలు):జగిత్యాల రూరల్ మండలం చల్గల్ శివార్లలో గంజాయి తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో రూరల్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాయికల్ మండలం ఉప్పుమడుగు గ్రామానికి చెందిన దగ్గు రాజేష్ వద్ద నుంచి 120 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి, అనంతరం... నకిలీ ట్రక్ చిట్టీలతో రూ.91 లక్షల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం :
ఆరుగురు నిందితుల అరెస్ట్.. రూ.14.16 లక్షల నగదు స్వాధీనం, రూ.46.21 లక్షల ఖాతాలు ఫ్రీజ్
సిరిసిల్ల, జూన్ 20 (ప్రజా మంటలు):
ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి సుమారు రూ.91 లక్షల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన కేసులో ఆరుగురు నిందితులను సిరిసిల్ల టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా... వీధికుక్కల దాడి, నిరాశ్రయ వృద్ధురాలి దుస్థితిపై మానవ హక్కుల కమిషన్ సుమోటో విచారణ
హైదరాబాద్, జూన్ 20 (ప్రజా మంటలు):
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్ఆర్సీ) న్యాయ సభ్యురాలు శ్రీమతి శివడి ప్రవీణ రెండు వార్తా కథనాలను స్వప్రేరితంగా (సుమోటో) విచారణకు స్వీకరించారు. సాక్షి దినపత్రికలో జూన్ 20న ప్రచురితమైన వార్తల ఆధారంగా ఈ చర్యలు చేపట్టారు.హెచ్ఆర్సీ నెం.2468/2026 కింద, వరంగల్ నగరంలోని శాలినీనగర్లో వీధికుక్క దాడిలో... సాహితీవేత్త ఎంవీ నరసింహారెడ్డికి ఘనంగా నివాళులు
జగిత్యాల జూన్ 19 ( ప్రజా మంటలు) సాహితీవేత్త, విద్యావేత్త రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షులు ఎంవి నరసింహారెడ్డి సంస్కరణ కార్యక్రమం జిల్లా కేంద్రంలోని పద్మ నాయక మండపంలో శుక్రవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి శిష్య బృందం, విద్యాసంస్థల ఉపాధ్యాయ బృందం, అధ్యాపకులు బంధువులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొని ఆయన చిత్రపటానికి ఘనంగా... సింగరేణి ప్రాంత వనరులు, ప్రజలను దోచుకుంటున్న కాంగ్రెస్ నేతలు: కవిత
ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తెలంగాణ రక్షణ సేన ఎదుగుతుంది - కల్వకుంట్ల కవిత
పెద్దపల్లి, జూన్ 19 (ప్రజా మంటలు):
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణి ప్రాంత ప్రజలు,... మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ఎదగాలి :చిన్నారెడ్డి
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డిహైదరాబాద్, జూన్ 17 (ప్రజా మంటలు):
పురుషులతో సమానంగా మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి అన్నారు. బుధవారం మార్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD)లో నిర్వహించిన ‘ఉమెన్ ఎంపవర్మెంట్... రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ ప్రారంభం నేడు
హైదరాబాద్, జూన్ 17 (ప్రజా మంటలు):
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి A. Revanth Reddy ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS)ను నేడు ప్రారంభించనున్నారు. విద్యా రంగంలో సంస్కరణలకు నాంది పలుకుతున్న ఈ పాఠశాల సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్గా రూపుదిద్దుకుంది.
నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ... జగిత్యాల ఎమ్మెల్యే వైఖరి విడ్డూరంగా ఉంది - మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి
జగిత్యాల జూన్ 15(ప్రజా మంటలు)యావర్ రోడ్డు పై అక్రమ నిర్మాణాలు తొలగించండి
జిల్లా కలెక్టర్ ప్రజా వాణిలో జీవన్ రెడ్డి పిర్యాదు
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అవలంబిస్తున్న వైఖరి చాలా విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో... 