కలెక్టర్ ల నిర్లక్ష్యం వల్లే భారీగా నిధుల దుర్వినియోగం - చట్టాల ఉల్లంఘన పన్నెండు మంది అధికారులతో సహా ఇద్దరు కార్యదర్శుల పై లోకాయుక్త కు పిర్యాదు
కలెక్టర్ ల నిర్లక్ష్యం వల్లే భారీగా నిధుల దుర్వినియోగం
జిల్లా పంచాయతీలో అడ్డగోలుగా అధికార దుర్వినియోగం - చట్టాల ఉల్లంఘన
పన్నెండు మంది అధికారులతో సహా ఇద్దరు కార్యదర్శుల పై లోకాయుక్త కు పిర్యాదు
నిఘా విభాగం అధికారులతో పునర్విచారణ జరిపించాలని కోరిన చుక్క గంగారెడ్డి
బుగ్గారం జిపి పాలక వర్గంపై చర్యలు తీసుకోవాలని విన్నపం
బుగ్గారం/ జగిత్యాల జిల్లా:
ప్రజా పిర్యాదులపై జిల్లా కలెక్టర్ లు సకాలంలో సరైన చర్యలు చేపట్టక, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే గ్రామ పంచాయతీలలో నిధుల దుర్వినియోగం భారీగా జరిగిపోయిందని ప్రముఖ ఉద్యమకారుడు, ఆర్టీఐ కార్యకర్త చుక్క గంగారెడ్డి ఆరోపించారు. ఆయన చేసిన పిర్యాదులపై
హైదారాబాద్ లోని లోకాయుక్త (కోర్టు) లో గురువారం విచారణ జరిగింది. బుగ్గారం గ్రామ పంచాయతీలో జరిగిన భారీ నిధుల దుర్వినియోగంలో బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని ఆయన లోకాయుక్త ను కోరారు.
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి, వారి బాధ్యతలను, అధికారాన్ని కూడా దుర్వినియోగం చేసి, చట్టాలను కూడా ఉల్లంఘించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని, కఠినంగా శిక్షించాలని చుక్క గంగారెడ్డి లోకాయుక్త కు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేశారు.
దుర్వినియోగం నుండి రికవరీ అయిన సొమ్మును కూడా అధికారులు లెక్కల్లో సరిగా చూపెట్టలేదన్నారు. లక్షల్లో రికవరీ సొమ్మును రికార్డులలో నమోదు చేయకుండా దాచి ఉంచారని ఆయన ఆరోపించారు.
అనేక పిర్యాదులతో పాటు 2022 సెప్టెంబర్ 21న లోకాయుక్త కు కూడా పిర్యాదులు చేయగా జిల్లా పంచాయతీ అధికారి నామ మాత్రంగా గత పంచాయతీ కార్యదర్శి మహబూబ్ పాషా ను, సర్పంచ్ మూల సుమలత ను చివరి దశలో అనగా గత 2024 జనవరి మాసంలో సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని ఆయన తెలిపారు. తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఆధారాలతో సహా మేము చేసిన పిర్యాదులపై కూడా సరైన విధంగా విచారణ చేపట్టక పోవడం చాలా బాధాకరంగా, చాలా అనుమానాస్పదంగా ఉందన్నారు. రాజకీయ ఒత్తిళ్లు, అవినీతి – అక్రమాల వల్లే ఇలా జరిగి ఉంటుందని గ్రామ ప్రజలు ముక్త కంఠంతో ఆరోపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
1) మేము ఎన్ని పిర్యాదులు చేసినా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు సరైన విధంగా స్పందించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా నిర్లక్యంగా వ్యవహరించారని, మా పిర్యాదులు సరిగా పట్టించుకోలేదన్నారు. అందుకే లోకాయుక్త ను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.
2) జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారులుగా పనిచేసిన వేముల శేఖర్, ప్రభాకర్, హరి కిషన్, నరేష్ లతో పాటు ప్రస్తుత డిపిఓ దేవరాజ్ కూడా అన్నీ విషయాలు తెలిసినా, నిధులు భారీగా దుర్వినియోగం అయ్యాయని ఆధారాలు లభించినా… కావాలనే ఉద్దేశ్య పూర్వకంగా, విధుల్లో, వారి బాధ్యతల్లో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. నిధుల దుర్వినియోగం ఋజువు అయినప్పటికీ వీరంతా వారి - వారి పాలనా సమయంలో చర్యలు తీసుకోలేదన్నారు. ఈ అధికారులంతా చట్టాలను ఉల్లంఘించారని, వారి వృత్తి ధర్మాన్ని, అత్యంత విలువైన వారి విధులను, బాధ్యతలను కూడా దుర్వినియోగం చేశారని చుక్క గంగారెడ్డి పేర్కొన్నారు.
3) జగిత్యాల, మెట్ పల్లి - డీఎల్ పీవోలు కనక దుర్గ, శ్రీనివాస్ లు వేర్వేరు గా నిధుల దుర్వినియోగం పై ఉన్నతాధికారుల ఆదేశాలతో రెండు సార్లు తూ.. తూ… మంత్రంగా విచారణ చేపట్టారని అన్నారు. పారదర్శకంగా క్షేత్ర స్థాయిలో.. ప్రజల్లో… సరైన విచారణ జరుపలేదన్నారు. దుర్వినియోగానికి పాల్పడ్డ పాలకులతో కుమ్మక్కై వారికే కొమ్ము కాశారని, వాస్తవాలు వెలుగులోకి వచ్చినప్పటికీనీ… నిధుల దుర్వినియోగాన్ని, వాస్తవాలను పూర్తిగా కప్పి పుచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవ విచారణకు భిన్నంగా తప్పుడు విచారణ నివేదికలు అందజేసి ఉన్నతాధికారులను నమ్మించి, తప్పు దోవ పట్టించారని పేర్కొన్నారు. వారి వృత్తి ధర్మాన్ని, అత్యంత విలువైన వారి విధులను, బాధ్యతలను కూడా దుర్వినియోగం చేశారన్నారు.
4) మిషన్ భగీరథ లో పని చేస్తున్న ఆర్ డబ్లూ ఎస్ అసిస్టెంట్ ఇంజనీర్ వివేక్ అలియాస్ వివేకానంద కూడా బుగ్గారంలో చేయని పనులకు కూడా పనులు చేసినట్లు, బిల్లులు చెల్లించిన పురాతన పనులనే మళ్ళీ రికార్డులలో చూపెట్టి కొత్తగా పనులు చేసినట్లు తప్పుడు రికార్డులు, దొంగ రికార్డులు సృష్టించారని ఆరోపించారు. పంచాయతీ పాలక వర్గానికి అనుకూలంగా ఇష్టమొచ్చినట్లు రికార్డులను
తయారు చేసి అందజేస్తూ నిధుల దుర్వినియోగానికి, దోపిడీకి సహకరించారని వివరించారు. బుగ్గారం మండలంలోని వివిధ గ్రామాలతో పాటు ధర్మపురి నియోజక వర్గంలోని అనేక గ్రామాలలో కూడా తప్పుడు రికార్డులు, దొంగ రికార్డులు అందజేసి భారీగా నిధుల దుర్వినియోగానికి సహకరించారనే ఆరోపణలు కూడా వివేక్ అలియాస్ వివేకానంద పై కో – కొల్లలుగా ఉన్నాయన్నారు. సరైన విచారణ జరిపిస్తే కోట్లాది రూపాయల దుర్వినియోగం బయటపడే అవకాశం ఉందన్నారు.
5) జిపిపై ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించాల్సిన బుగ్గారం మండల పంచాయతీ అధికారి అఫ్జల్ తన విధులను, అత్యంత విలువైన తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, చట్టాలను ఉల్లంఘించి, ఈ – పంచాయతీ ఆపరేటర్ జీతం పేరును సాకుగా వాడుకొని బుగ్గారం జిపితో పాటు మండలంలోని మరో పది గ్రామ పంచాయతీల నుండి సుమారు రూ.22 లక్షలకు పైగా నిధులు తన ఖాతాల్లోకి మల్లించుకొని భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు.
6) జిల్లా కలెక్టర్ కార్యాలయంతో సహా జిల్లా పంచాయతీ అధికారి, మండల పంచాయతీ అధికారి కార్యాలయాల్లోని ప్రజా సమాచార అధికారులు, అప్పిలేట్ అధికారులు సమాచార హక్కు చట్టం -2005 ను కూడా ఉల్లంఘించారని వివరించారు. సమాచార కమీషన్ జారీ చేసిన 18 ఫిర్యాదులపై ఆర్డర్లను, మరో 60 వరకు ఆర్టీఐ దరఖాస్తులను, అప్పీల్లను కూడా బే-ఖాతరు చేశారన్నారు. ఏండ్లు గడుస్తున్నా నేటికీ కోరిన సమాచారం ఇవ్వడం లేదన్నారు.
7) గత పంచాయతీ కార్యదర్శి మహబూబ్ పాషా బుగ్గారం జి.పి.లో భారీగా నిధుల దుర్వినియోగం చేయడమే కాకుండా, జి.పి.లో రికార్డులు కూడా దొరుకకుండా మాయం చేసి ఏండ్లు గడుస్తున్నా అధికారులు, ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. అనేక పిర్యాదుల మేరకు కేవలం నామ మాత్రంగా సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు తప్పా…. మహబూబ్ పాషా నుండి నేటికీ రికార్డులు స్వాధీనం చేసుకోలేదన్నారు. లక్షల్లో ఉన్న దుర్వినియోగం సొమ్ము కూడా నేటికీ రికవరీ చేయలేదన్నారు.
8) రెండో పంచాయతీ కార్యదర్శి నరేందర్ కూడా నిధుల దుర్వినియోగానికి పాల్పడి సుమారు రూ.70 వేల వరకు రికవరీ కూడా చెల్లించాడన్నారు. మరిన్ని నిధులు కూడా ఆయన నుండి రికవరీ కావలసి ఉందని తెలిసిందన్నారు. బుగ్గారం జి.పి.లో ఆయన అనేక అవినీతి -అక్రమాలకు పాల్పడ్డారని, పాలక వర్గం చేసిన భారీ నిధుల దుర్వినియోగం లో కూడా ఆయన పాత్ర అత్యంత కీలకంగా ఉందన్నారు. అయినా అధికారులు కార్యదర్శి నరేందర్ పై నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోషనీయం అన్నారు.
9) బుగ్గారం గ్రామ సర్పంచ్ మూల సుమలత, ఆమె భర్త మూల శ్రీనివాస్ గౌడ్ లతో పాటు ఉప సర్పంచ్, పాలక వర్గంలోని కొందరు వార్డ్ సభ్యులు కుమ్మక్కై మూకుమ్మడిగా భారీ గా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. సుమారు కోటి రూపాయలకు పైగానే నిధులు దుర్వినియోగం జరిగి ఉంటాయని గ్రామ ప్రజలు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
10) ఇలాంటి అనేక సందర్భాలను బట్టి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ కు మేము లిఖిత పూర్వకంగా ఆధారాలతో సహా పిర్యాదులు చేసి, పత్రికా ప్రకటనలు కూడా జారీ చేయడం జరిగిందన్నారు. అయినా అధికారులు, ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని తెలిపారు .
11) వీటన్నిటికీ కారణం రాజకీయ ఒత్తిళ్లతో పాటు భారీ మొత్తంలో అవినీతి – అక్రమాలు కూడా జరిగి ఉండొచ్చని మాకు అనుమానంగా ఉందన్నారు.
నేటితో నాలుగు పర్యాయాలు తమరి సన్నిధికి అందజేసిన మా పిర్యాదు లను, ఆధారాలను పరిగణనలోకి తీసుకొని వీటన్నింటిపై ప్రత్యేక నిఘా విభాగం ఉన్నతాధికారులచే తగు విచారణ జరిపించాలని చుక్క గంగారెడ్డి గురువారం లోకాయుక్త ను కోరారు.
జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఐదుగురు జిల్లా పంచాయతీ అధికారులు, ఇద్దరు డివిజనల్ పంచాయతీ అధికారులు, జిల్లా కలెక్టరేట్, జిల్లా పంచాయతీ ఆపీస్, మండల పంచాయతీ కార్యాలయాల పౌర సమాచార అధికారులపై, అప్పిలేట్ అధికారులపై, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎ.ఇ. వివేక్, ఎంపీఓ అఫ్జల్, పంచాయతీ కార్యదర్శులు మహబూబ్ పాషా, నరేందర్ లపై, సర్పంచ్, ఉప సర్పంచ్, పాలక వర్గంలోని వార్డు సభ్యుల పై, నిధుల దుర్వినియోగానికి బాధ్యులైన ఇతర వ్యక్తు లంద రిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా శిక్షించాలని ఆయన లోకాయుక్త ను కోరారు.
అలాగే దుర్వినియోగం అయిన బుగ్గారం గ్రామపంచాయతీ నిధులన్నీ రికవరీ చేయించి ప్రజా సొమ్మును కాపాడాలని చుక్క గంగారెడ్డి గురువారం లోకాయుక్త కు లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆరుసార్లు గెలిచి! మళ్ళీ రాజీనామా చేసి, గెలుస్తా దానం ప్రకటన
హైదరాబాద్, డిసెంబర్ 27 (ప్రజా మంటలు):
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపు కేసులు, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో తాను పూర్తిగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేస్తూ, అవసరమైతే రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు.
శుక్రవారం... జగిత్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఆకుల శ్రీనివాస్ ఆకస్మిక మృతి
జగిత్యాల, డిసెంబర్ 27 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా వైద్యాధికారి (DMHO) డాక్టర్ ఆకుల శ్రీనివాస్ శనివారం ఉదయం అకస్మాత్తుగా మృతి చెందారు. ఆయన అకాల మరణం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, వైద్య వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.ప్రజారోగ్య సేవల్లో అంకితభావంతో పనిచేసిన డాక్టర్ ఆకుల శ్రీనివాస్, విధి నిర్వహణలో నిబద్ధత, మానవీయత... ఎన్.సి.సి. (NCC) ఆర్.డి (Republic Day) పరేడ్ కు ANO గా మన జగిత్యాల వాసి చేని.మంగ
సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113.
జగిత్యాల/ హైదరాబాద్ డిసెంబర్ 27 (ప్రజా మంటలు) :
జనవరి 26న ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్లో లో తెలంగాణ నుండి NCC క్యాడేట్స్ తో పాటు జగిత్యాలకు మౌంట్ కార్మెల్ స్కూల్ కు చెందిన అసోసియేట్ NCC ఆఫీసర్ పాఠశాల పి.ఈ.టి (వ్యాయామ ఉపాధ్యాయురాలు)... అధికారిక–వృత్తి సంఘం (GOPA) స్వర్ణోత్సవ వేడుకలు
హైదరాబాద్, డిసెంబర్ 26 (ప్రజా మంటలు):
గౌడ్ అధికారిక మరియు వృత్తి సంఘం (GOPA) 50వ వార్షికోత్సవ వేడుకలు కాచిగూడ, హైదరాబాద్లో అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ స్వర్ణోత్సవ కార్యక్రమానికి ప్రముఖులు హాజరై సంఘానికి అభినందనలు తెలిపారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి జి. రాజేశం గౌడ్, మహిళా కమిషన్ చైర్పర్సన్ నెర్రెల్ల... జగిత్యాల జిల్లా: కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఆటో బోల్తా – నలుగురికి గాయాలు
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 26 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డుపై శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. గోదావరిఖని నుంచి అంజన్న స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న భక్తుల ఆటో అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న సైడ్వాల్ను ఢీకొని బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు భక్తులు గాయపడ్డారు. ప్రమాద... ధర్మపురి అభివృద్ధే లక్ష్యం, మూడుేళ్లలో హామీలు నెరవేర్చకపోతే రాజీనామా చేస్తా - కరీంనగర్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కరీంనగర్ డిసెంబర్ 26, (ప్రజా మంటలు):
కరీంనగర్ ఆర్ అండ్ బి అతిథిగృహంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన నియోజకవర్గం పూర్తిగా రైతులపై ఆధారపడిన... తక్కలపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులను సత్కరించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి
జగిత్యాల డిసెంబర్ 26(ప్రజా మంటలు)రూరల్ మండల్ తక్కళ్లపెళ్లి గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ కచ్చు ముని రాజు , వార్డ్ సభ్యులు నరపాక రాజేష్ ,నాయకులు వడ్లూరి హరీష్, విజయం సాధించిన సందర్భంగా శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణిప్రవీణ్ ని స్వగృహంలో మర్యాదపూర్వక కలువగా వారిని శాలువతో... విద్యావేత్త, పారిశ్రామికవేత్త,సామాజికవేత్త కాసుగంటి సుధాకర్ రావు(80) మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 26 (ప్రజా మంటలు)
భారతీయ నాగరిక విద్యా సమితి అధ్యక్షులు కాసుగంటి సుధాకర్ రావు(80) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ, గురువారం రాత్రి హైదరాబాదులోని ఆయన మృతి చెందారు.
విద్యావేత్తగా, సామాజిక వేత్తగానే కాకుండా, పారిశ్రామికవేత్తగా జగిత్యాల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పేరొందారు.
జిల్లా కేంద్రంలో శ్రీ సరస్వతి శిశు... విద్యా–సామాజిక రంగానికి తీరని లోటు: కాసుగంటి సుధాకర్ రావు మృతిపై పలువురి సంతాపం
జగిత్యాల డిసెంబర్ 26 (ప్రజా మంటలు):
విద్యా, పారిశ్రామిక, సామాజిక రంగాలకు విశేష సేవలందించిన ప్రముఖ విద్యావేత్త కాసుగంటి సుధాకర్ రావు మృతి జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన అకాల మరణం పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
విద్యావేత్తగా, సామాజిక సేవకుడిగా, పారిశ్రామికవేత్తగా విశేష... ఈరోజు ఉదయం గుజరాత్లో భూకంపం
అహ్మదాబాద్ డిసెంబర్ 26:
గుజరాత్ రాష్ట్రంలో శుక్రవారం ఉదయం సుమారు 6:10 గంటల సమయంలో భూకంపం సంభవించింది. కచ్ జిల్లాకు సమీప ప్రాంతమే భూకంప కేంద్రంగా గుర్తించారు. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత సుమారు 3.8 నుంచి 4.2గా నమోదైంది.
కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ భూకంపం... 