తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హైదారాబాద్ తరలి వెళ్ళిన ఉద్యమకారులు

సౌకర్యాలు కల్పించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా. - ఆనందం వ్యక్తం చేసిన ఉద్యమ నేతలు

On
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హైదారాబాద్ తరలి వెళ్ళిన ఉద్యమకారులు

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

 

జగిత్యాల జిల్లా, జూన్ 02 (ప్రజా మంటలు): 

రాష్ట్ర రాజధాని హైదారాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు 

జగిత్యాల జిల్లా నుండి ఉద్యమ కారులు, అమరవీరుల కుటుంబీకులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సమయ స్ఫూర్తితో స్పందించి జిల్లాలోని ఉద్యమకారులను, అమర వీరుల కుటుంబీకులను గుర్తించి హైదారాబాద్ లో జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. వారికి తగిన ఏర్పాట్లు, వసతులు కల్పించారు.

జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల నియోజక వర్గాలకు వేర్వేరుగా బస్సులను, కార్లను, ఏర్పాటు చేసి ప్రభుత్వ ఖర్చులతోనే రవాణా సౌకర్యం కల్పించారు. అదనపు కలెక్టర్ టి.ఎస్.దివాకర, పరిపాలనాధికారి పుప్పాల హన్మంతరావు, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజు లు ఎప్పటి కప్పుడు ఏర్పాట్లను, రవాణా విషయాలను సందాన కర్తల ద్వారా తెలుసుంకుంటూ ఎలాంటి లోటు - పాట్లు జరుగకుండా తగు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

ప్రతి బస్సులో సందాన కర్తలను, సహాయకులను, ఆరోగ్య శాఖ సిబ్బందిని నియమించి సేవలు అందించారు. ఉద్యమ కారులకు, అమరవీరుల కుటుంబాలకు అల్పాహారం, భోజన సౌకర్యాలు, త్రాగు నీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 

జగిత్యాల జిల్లాలోని ప్రముఖ ఉద్యమ కారులు సి.హెచ్.వి.ప్రభాకర్ రావు, చుక్క గంగారెడ్డి, సిరిసిల్ల రాజేందర్ శర్మ, కంతి మోహన్ రెడ్డి ల ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ మండలాలతో పాటు పట్టణాల, గ్రామాల నుండి సుమారు రెండు వందల మందికి పైగా ఉద్యమకారులను, అమర వీరుల కుటుంబీకులను

రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తరలించారు.

కొందరు ఉద్యమకారులు వారంతట వారే ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకొని హైదారాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తరలి వెళ్లారు. ధర్మపురి లోని తహశీల్దార్ కార్యాలయం నుండి, జగిత్యాల లోని ఆర్డీవో కార్యాలయం నుండి, మెట్ పల్లి ఆర్డీవో కార్యాలయాల నుండి ఆదివారం ఉదయత్ పూర్వం 3-00 గంటలకు వాహనాల్లో ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబీకులు హైదారాబాద్ తరలి వెళ్లారు.

ఆనందం వ్యక్తం చేసిన ఉద్యమ నేతలు

ఆరు దశాబ్దాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనంతరం ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల పాలన తర్వాత నూతన ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం రావడం ఆనందంగా ఉందని ఉద్యమ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమ కారులను గుర్తించి వేడుకలకు ఆహ్వానం పలికిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి వర్గానికి, ఏర్పాట్లు చేసిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా కు, అదనపు కలెక్టర్ టి.ఎస్.దివాకర కు, ఇతర అధికారులకు, సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమ కారులకు ఇచ్చిన ఇదే గుర్తింపును ఎప్పటికీ కొనసాగించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఉద్యమ ఆకాంక్షలను, అమరవీరుల ఆశయాలను నెరవేర్చాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, ధర్మపురి, జగిత్యాల నియోజక వర్గాల తో పాటు వివిధ మండలాల నుండి, పట్టణాల నుండి సుమారు 200 మందికి పైగా ఉద్యమ కారులు, అమరవీరుల కుటుంబీకులు హైదారాబాద్ తరలి వెళ్లినట్లు వారు వివరించారు.

Tags
Join WhatsApp

More News...

జిల్లా కేంద్రంలో బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రిచే మహాభారత ప్రవచనం ప్రారంభం

జిల్లా కేంద్రంలో బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రిచే మహాభారత ప్రవచనం ప్రారంభం జగిత్యాల డిసెంబర్ 6 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో శృంగేరి శారదా పీఠం ఆస్థాన పండితులు ప్రవచన నిధి, సనాతన ధర్మ సవ్యసాచి,డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి చే మహాభారత నవహాన్నిక ప్రవచన మహా యజ్ఞం శనివారం ప్రారంభమైంది.       ఉదయం వాసవి మాత ఆలయం...
Read More...
Local News  Sports 

అండర్-17 బాడ్మింటన్ రాష్ట్ర స్థాయి కి ఎంపికయిన  వెల్లుల్ల విద్యార్థులు,

అండర్-17 బాడ్మింటన్ రాష్ట్ర స్థాయి కి ఎంపికయిన  వెల్లుల్ల విద్యార్థులు, మెట్టుపల్లి డిసెంబర్ 06 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన  ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్-17 బాడ్మింటన్ సెలెక్షన్స్ నిన్న మంథని JNTU కాలేజ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండల పరిధిలోని వెల్లుల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నుండి పాల్గొన్న  విద్యార్థులు...
Read More...

ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ ను అభినందించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ 

ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ ను అభినందించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్     జగిత్యాల డిసెంబర్ 6(ప్రజా మంటలు)అర్బన్ మండలం అంబారిపేట గ్రామ సర్పంచ్ గా గోడిసెల గంగాధర్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే  క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవగా గంగాధర్ ను శాలువాతో సత్కరించి అభినందించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర ఆలయ...
Read More...

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా  వాహన తనిఖీలు - ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ అశోక్ కుమార్ 

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా  వాహన తనిఖీలు - ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ అశోక్ కుమార్      ధర్మపురి డిసెంబర్ 6 ( ప్రజా మంటలు)సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో పోలీస్ శాఖ తనిఖీలు, భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయడం జరిగిందనీ  జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  తెలిపారు.  ఈ క్రమంలో ఎస్పీ   ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లా బార్డర్ వద్ద ఏర్పాటు చేసిన రాయపట్నం చెక్‌పోస్ట్‌ను, వెల్గటూర్ పోలీస్...
Read More...

శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డ్ సేవలు వెలకట్టలేనివి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డ్ సేవలు వెలకట్టలేనివి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల డిసెంబర్ 6 (ప్రజా మంటలు) శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డ్ సేవలు వెలకట్టలేనివి అని జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ అన్నారు.  జిల్లాలో ఘనంగా హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవం పరేడ్ 63వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయం నందు హోంగార్డ్ ఆఫీసర్స్ పరేడ్ ను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ...
Read More...
National 

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా ఫ్లైట్ డ్రామా

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా ఫ్లైట్ డ్రామా ప్రయాణికులకు అర గంట వేచి ఉండమన్న ఎయిర్‌లైన్ – భద్రతా లోపాలపై ప్రశ్నలు హైదరాబాద్  డిసెంబర్ 06 (ప్రజా మంటలు): శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఢిల్లీ–హైదరాబాద్ మధ్య నడిచే ఎయిర్ ఇండియా AI–2879 ఫ్లైట్ శుక్రవారం రాత్రి అనూహ్య పరిస్థితులను ఎదుర్కొంది. ల్యాండింగ్ పూర్తైన వెంటనే, విమానం చుట్టూ ఫైరింజన్లు, భద్రతా సిబ్బంది...
Read More...
National  Filmi News  State News 

‘అఖండ 2’ రిలీజ్‌పై నిర్మాణ సంస్థ కొత్త ప్రకటన

‘అఖండ 2’ రిలీజ్‌పై నిర్మాణ సంస్థ కొత్త ప్రకటన కొత్త విడుదల తేదీ త్వరలో!ప్రకటిస్తారు? హైదరాబాద్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):  బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘అఖండ 2’ రిలీజ్‌పై నిర్మాణ సంస్థ కీలక అప్‌డేట్ ఇచ్చింది. చిత్ర విడుదల కోసం చివరి దశ పనులు పూర్తిచేస్తున్నామని, కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించబోతున్నట్టు తెలిపింది. నిర్మాణ సంస్థ...
Read More...
State News 

పంచాయతీ బరిలో చంద్రబాబు – జగన్!

పంచాయతీ బరిలో చంద్రబాబు – జగన్! కొత్తగూడెం డిసెంబర్ 06 (ప్రజా మంటలు): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామంలోని పంచాయతీ ఎన్నికల్లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. సాధారణంగా రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ప్రత్యర్థులుగా నిలిచే చంద్రబాబు – జగన్ పేర్లు ఈసారి గ్రామ సర్పంచి బరిలో కనిపించడంతో గ్రామంలో చర్చనీయాంశమైంది. అయితే వారు మీరు అనుకునే రాజకీయ...
Read More...
State News 

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ — డిసెంబర్ 8 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ — డిసెంబర్ 8 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో హైదరాబాద్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు): డిసెంబర్ 8 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పూర్తిగా ఆర్థిక సదస్సు అని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి దిశను తెలిపే ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్ ఈ సదస్సులో ఆవిష్కరించడం ప్రధాన లక్ష్యమని...
Read More...
Local News 

రాష్ర్టంలో పెరిగిన వీధి కుక్కల బెడద  : జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

రాష్ర్టంలో పెరిగిన వీధి కుక్కల బెడద  : జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు సికింద్రాబాద్, డిసెంబర్ 05 (ప్రజామంటలు) : తెలంగాణలో వీధికుక్కల బెడద మితిమీరిందని, రాష్ట్రవ్యాప్తంగా కుక్కలు మనుషులపై దాడులు, కరవడం, ప్రాణాలు తీసే ఘటనలు పెరుగుతున్నా, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కొనసాగుతుంద‌ని ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామా రావు ఇమ్మానేని ఆరోపించారు. సుప్రీం కోర్టు ఈ విషయమై ఎన్ని సార్లు మొట్టికాయలు వేసిన అధికారులు తమ...
Read More...

గాంధీలో చికిత్స పొందుతూ సాయి ఈశ్వర్ చారి మృతి

గాంధీలో చికిత్స పొందుతూ సాయి ఈశ్వర్ చారి మృతి బీసీ సంఘాల ఆందోళనతో గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత *ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు – పలు పోలీస్ స్టేషన్లకు తరలించిన నిరసనకారులు
Read More...

పిఎంఓ లో రాజకీయ అలజడి సృష్టించిన హిరెన్ జోషి

పిఎంఓ లో రాజకీయ అలజడి సృష్టించిన హిరెన్ జోషి హిరేన్ జోషి, ప్రో హిమానీ దూద్, నవనీత్ సెహగల్ లు ఎందుకు ఈరోజు ఢిల్లీ వర్గాల్లో చర్చనీయంగా మారారు? హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పదకోశం జరుగుతున్న పోటీయే దీనికి ప్రధాన కారణమా? బెట్టింగ్ అప్ కంపెనీని నిర్వహిస్తున్న సెహగల్ కొడుకు వల్లన పీఎంఓ కు వీటి సంబంధాలు బయటకు రావడం కారణమా? పూర్తిగా చదవండి.
Read More...