తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హైదారాబాద్ తరలి వెళ్ళిన ఉద్యమకారులు

సౌకర్యాలు కల్పించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా. - ఆనందం వ్యక్తం చేసిన ఉద్యమ నేతలు

On
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హైదారాబాద్ తరలి వెళ్ళిన ఉద్యమకారులు

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

 

జగిత్యాల జిల్లా, జూన్ 02 (ప్రజా మంటలు): 

రాష్ట్ర రాజధాని హైదారాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు 

జగిత్యాల జిల్లా నుండి ఉద్యమ కారులు, అమరవీరుల కుటుంబీకులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సమయ స్ఫూర్తితో స్పందించి జిల్లాలోని ఉద్యమకారులను, అమర వీరుల కుటుంబీకులను గుర్తించి హైదారాబాద్ లో జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. వారికి తగిన ఏర్పాట్లు, వసతులు కల్పించారు.

జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల నియోజక వర్గాలకు వేర్వేరుగా బస్సులను, కార్లను, ఏర్పాటు చేసి ప్రభుత్వ ఖర్చులతోనే రవాణా సౌకర్యం కల్పించారు. అదనపు కలెక్టర్ టి.ఎస్.దివాకర, పరిపాలనాధికారి పుప్పాల హన్మంతరావు, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజు లు ఎప్పటి కప్పుడు ఏర్పాట్లను, రవాణా విషయాలను సందాన కర్తల ద్వారా తెలుసుంకుంటూ ఎలాంటి లోటు - పాట్లు జరుగకుండా తగు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

ప్రతి బస్సులో సందాన కర్తలను, సహాయకులను, ఆరోగ్య శాఖ సిబ్బందిని నియమించి సేవలు అందించారు. ఉద్యమ కారులకు, అమరవీరుల కుటుంబాలకు అల్పాహారం, భోజన సౌకర్యాలు, త్రాగు నీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 

జగిత్యాల జిల్లాలోని ప్రముఖ ఉద్యమ కారులు సి.హెచ్.వి.ప్రభాకర్ రావు, చుక్క గంగారెడ్డి, సిరిసిల్ల రాజేందర్ శర్మ, కంతి మోహన్ రెడ్డి ల ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ మండలాలతో పాటు పట్టణాల, గ్రామాల నుండి సుమారు రెండు వందల మందికి పైగా ఉద్యమకారులను, అమర వీరుల కుటుంబీకులను

రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తరలించారు.

కొందరు ఉద్యమకారులు వారంతట వారే ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకొని హైదారాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తరలి వెళ్లారు. ధర్మపురి లోని తహశీల్దార్ కార్యాలయం నుండి, జగిత్యాల లోని ఆర్డీవో కార్యాలయం నుండి, మెట్ పల్లి ఆర్డీవో కార్యాలయాల నుండి ఆదివారం ఉదయత్ పూర్వం 3-00 గంటలకు వాహనాల్లో ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబీకులు హైదారాబాద్ తరలి వెళ్లారు.

ఆనందం వ్యక్తం చేసిన ఉద్యమ నేతలు

ఆరు దశాబ్దాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనంతరం ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల పాలన తర్వాత నూతన ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం రావడం ఆనందంగా ఉందని ఉద్యమ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమ కారులను గుర్తించి వేడుకలకు ఆహ్వానం పలికిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి వర్గానికి, ఏర్పాట్లు చేసిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా కు, అదనపు కలెక్టర్ టి.ఎస్.దివాకర కు, ఇతర అధికారులకు, సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమ కారులకు ఇచ్చిన ఇదే గుర్తింపును ఎప్పటికీ కొనసాగించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఉద్యమ ఆకాంక్షలను, అమరవీరుల ఆశయాలను నెరవేర్చాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, ధర్మపురి, జగిత్యాల నియోజక వర్గాల తో పాటు వివిధ మండలాల నుండి, పట్టణాల నుండి సుమారు 200 మందికి పైగా ఉద్యమ కారులు, అమరవీరుల కుటుంబీకులు హైదారాబాద్ తరలి వెళ్లినట్లు వారు వివరించారు.

Tags
Join WhatsApp

More News...

State News 

ఉప ముఖ్యమంత్రి భట్టి డిల్లీ ఇంటిపై ఐ టి దాడులు – హరీశ్‌రావు సంచలన ఆరోపణలు!

ఉప ముఖ్యమంత్రి  భట్టి  డిల్లీ ఇంటిపై ఐ టి దాడులు – హరీశ్‌రావు సంచలన ఆరోపణలు! హైదరాబాద్, నవంబర్ 8 (ప్రజా మంటలు): తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మల్లు భట్టి విక్రమార్క ఇంటిపై జరిగిన ఐటీ దాడులు బీజేపీతో ఉన్న గోప్య ఒప్పందంలో భాగమని ఆరోపించారు. హరీశ్‌రావు మాట్లాడుతూ “భట్టి ఇంట్లో ఐటీ దాడులు జరిగితే...
Read More...

iPhone 18 Air వివరాలు లీక్: మొదటిసారిగా అల్ట్రా-స్లిమ్ డిజైన్‌తో వస్తుందా?

iPhone 18 Air వివరాలు లీక్: మొదటిసారిగా అల్ట్రా-స్లిమ్ డిజైన్‌తో వస్తుందా? అల్ట్రా-స్లిమ్ డిజైన్‌లో కొత్త తరహా రూపం    హైదరాబాద్ నవంబర్ 08:    ఆపిల్ అభిమానులకు మరో ఉత్సాహకరమైన వార్త. తాజాగా లీకైన సమాచారం ప్రకారం, కంపెనీ తన కొత్త iPhone 18 Air మోడల్‌పై పనిచేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత — అల్ట్రా-స్లిమ్ డిజైన్.    మునుపటి iPhone Air మోడల్ కేవలం 5.6mm మందంతో వచ్చిన విషయం...
Read More...
Local News 

తిరుమలగిరిలో సీసీటీవీ కెమెరాలను ప్రారంభించిన ఏసిపి

తిరుమలగిరిలో సీసీటీవీ కెమెరాలను ప్రారంభించిన ఏసిపి సికింద్రాబాద్  నవంబర్ 08 (ప్రజా మంటలు):  తిరుమలగిరి చిన్నకమేల శ్రీ హనుమాన్‌ టెంపుల్‌ యూత్‌ అసోసియేషన్‌ సభ్యులు మహేష్‌, జోసెఫ్‌, శివ‌, అనిల్‌ తదితరులు ఆలయం మరియు పరిసర ప్రాంతాల్లో కొత్త సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి  తిరుమలగిరి ACP రమేష్ హాజరై కెమెరాలను ప్రారంభించారు. యువత చూపిన చొరవ ప్రశంసనీయమని అన్నారు....
Read More...
Local News 

ACN చానల్ అధినేత అన్వర్ ను పరామర్శించిన MLA సంజయ్

ACN చానల్ అధినేత అన్వర్ ను పరామర్శించిన MLA సంజయ్ జగిత్యాల నవంబర్ 08  (ప్రజా మంటలు):  జగిత్యాల ACN చానల్ అధినేత అన్వర్ భాయ్ తల్లి మరణించగా, వారి కుటుంబ సభ్యులను  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట నాయకులు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్ ఖాజిం అలీ ఫిరోజ్ సర్వర్ మున్నా భాయ్ కుతుబ్ తదితరులు ఉన్నారు....
Read More...
Local News 

ఆర్య వైశ్య సంఘం తుకారాంగేట్‌ కొత్త అధ్యక్షుడిగా మల్లవోలు శ్రీకాంత్‌

ఆర్య వైశ్య సంఘం తుకారాంగేట్‌ కొత్త అధ్యక్షుడిగా మల్లవోలు శ్రీకాంత్‌ సికింద్రాబాద్‌, నవంబర్‌ 8 (ప్రజామంటలు):  ఆర్య వైశ్య సంఘం తుకారాంగేట్‌ నూతన పదవుల నియామకాలు పూర్తయ్యాయి. అధ్యక్షుడిగా మల్లవోలు శ్రీకాంత్‌, ప్రధాన కార్యదర్శిగా నాగబండి శ్రీనివాస్‌, కోశాధికారిగా నూకల నర్సింగ్‌రావు, ఉపాధ్యక్షులుగా కర్ణకోట శ్రీనివాస్‌, కొడరపు అశోక్‌ నియమితులయ్యారు. ఈ సందర్భంగా కొత్త అధ్యక్షుడు మల్లవోలు శ్రీకాంత్‌ మాట్లాడుతూ... సంఘం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి...
Read More...
Local News 

నల్లగుట్ట నాలా  స్ట్రెచ్‌లో హైడ్రా  స్పెషల్ డ్రైవ్  :: స్టోర్మ్ వాటర్ డ్రెయిన్‌లలో సిల్ట్ తొలగింపు

నల్లగుట్ట నాలా  స్ట్రెచ్‌లో హైడ్రా  స్పెషల్ డ్రైవ్  :: స్టోర్మ్ వాటర్ డ్రెయిన్‌లలో సిల్ట్ తొలగింపు పనులు పరిశీలించిన కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ సికింద్రాబాద్, నవంబర్ 08 (ప్రజామంటలు) : గత వారం రోజులుగా నల్లగుట్ట నాలా స్ట్రెచ్‌ ప్రాంతంలో హైడ్రా ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌ కొనసాగుతోంది. ఈ సందర్భంగా స్టోర్మ్‌ వాటర్‌ డ్రెయిన్‌లలో పేరుకున్న సిల్ట్‌, చెత్తను తొలగించే పనులను సిబ్బంది చేస్తున్నారు. రామ్గోపాలపేట డివిజన్‌ కార్పొరేటర్‌ చీర...
Read More...
Local News 

తెలంగాణ పునర్నిర్మాణంలో సీఎం రేవంత్‌ కీలకపాత్ర  ::: పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ

తెలంగాణ పునర్నిర్మాణంలో సీఎం రేవంత్‌ కీలకపాత్ర  ::: పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ సికింద్రాబాద్, నవంబర్ 08 (ప్రజామంటలు) :   తెలంగాణ పునర్నిర్మాణంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారని పీసీసీ వైస్‌ ప్రెసిడెంట్‌, సనత్‌నగర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ కోట నీలిమ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా శనివారం సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్యామలకుంటలో కంజర్ల విజయలక్ష్మి యాదవ్‌ ఆధ్వర్యంలో...
Read More...
Local News 

గాంధీ మెడికల్‌కాలేజీలో ఇంటెన్సివ్‌ ఆర్థోపెడిక్స్‌ పీజీ టీచింగ్‌ ప్రోగ్రాం

గాంధీ మెడికల్‌కాలేజీలో ఇంటెన్సివ్‌ ఆర్థోపెడిక్స్‌ పీజీ టీచింగ్‌ ప్రోగ్రాం సికింద్రాబాద్, నవంబర్ 08 (ప్రజామంటలు) :    గాంధీ మెడికల్‌కాలేజీ ఆర్థోపెడిక్స్‌విభాగం ఆధ్వర్యంలో ఐఓఏ ఆర్థోపెడిక్స్‌పోస్ట్‌గ్రాడ్యుయేట్‌టీచింగ్‌ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగిన ఈ ఇంటెన్సివ్‌ అకాడెమిక్‌ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 200 మందికి పైగా పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు క్లినికల్‌నైపుణ్యాలను, డయగ్నస్టిక్‌అవగాహనను పెంపొందించేలా రూపొందించిన ఈ కార్యక్రమంలో పేషెంట్‌ఎగ్జామినేషన్‌, క్లినికల్‌చర్చలు, కేస్‌బేస్డ్‌డిస్కషన్‌లు, హ్యాండ్స్‌ఆన్‌ట్రైనింగ్‌వంటి అంశాలు...
Read More...
Local News 

బోరబండ జూ. కాలేజీ వసతుల కొరతపై ఎస్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు

బోరబండ జూ. కాలేజీ వసతుల కొరతపై ఎస్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు అడ్వకేట్ రామారావు పిటీషన్కు స్పందించిన ఎస్హెచ్ఆర్సీ సికింద్రాబాద్, నవంబర్ 08 (ప్రజామంటలు): బోరబండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రాథమిక వసతుల కొరతపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (టీఎస్హెచ్ఆర్సీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని దాఖలు చేసిన కేసు నంబర్‌ 7062/2025 ఆధారంగా కమిషన్‌ ఈ...
Read More...
Local News 

గొల్లపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  జన్మదిన వేడుక..

గొల్లపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  జన్మదిన వేడుక.. (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 08 (ప్రజా మంటలు): గొల్లపెల్లి మండల కేంద్రంలో స్థానిక ఎంపిడిఓ కార్యాలయం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  56వ జన్మదిన వేడుకలు నిర్వహించారు మండల అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ఆరోగ్యంగా, ప్రజాసేవలో...
Read More...
Local News 

100 కోట్ల భూకబ్జా వ్యవహారం లో నాపాత్ర ఏమిటి? MLA సంజయ్ కుమార్ ప్రశ్న

100 కోట్ల భూకబ్జా వ్యవహారం లో నాపాత్ర ఏమిటి? MLA సంజయ్ కుమార్ ప్రశ్న రాష్ట్రంలో అత్యధిక నిధులు నా నియోజకవర్గానికి వచ్చాయ్  ప్రజా జీవితం లో ఉన్న వారిపై బురద జల్లే ప్రయత్నం చేయడం పరిపాటిగా మారింది : సంజయ్ జగిత్యాల నవంబర్ 08 (ప్రజా మంటలు): 100 కోట్ల భూకబ్జా వ్యవహారం లో నాపాత్ర ఏమిటి? మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ బాగా శ్రావణులు...
Read More...

సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా పురాణపేట ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా పురాణపేట ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల నవంబర్ 8 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి వర్యులు  రేవంత్ రెడ్డి  జన్మదినం సందర్భంగా జగిత్యాల పురాణిపేట ఆంజనేయ స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ ఆవరణలో కేక్ కట్ చేసి శుభా కాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రంలో...
Read More...