తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హైదారాబాద్ తరలి వెళ్ళిన ఉద్యమకారులు
సౌకర్యాలు కల్పించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా. - ఆనందం వ్యక్తం చేసిన ఉద్యమ నేతలు
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జిల్లా, జూన్ 02 (ప్రజా మంటలు):
రాష్ట్ర రాజధాని హైదారాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు
జగిత్యాల జిల్లా నుండి ఉద్యమ కారులు, అమరవీరుల కుటుంబీకులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సమయ స్ఫూర్తితో స్పందించి జిల్లాలోని ఉద్యమకారులను, అమర వీరుల కుటుంబీకులను గుర్తించి హైదారాబాద్ లో జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. వారికి తగిన ఏర్పాట్లు, వసతులు కల్పించారు.
జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల నియోజక వర్గాలకు వేర్వేరుగా బస్సులను, కార్లను, ఏర్పాటు చేసి ప్రభుత్వ ఖర్చులతోనే రవాణా సౌకర్యం కల్పించారు. అదనపు కలెక్టర్ టి.ఎస్.దివాకర, పరిపాలనాధికారి పుప్పాల హన్మంతరావు, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజు లు ఎప్పటి కప్పుడు ఏర్పాట్లను, రవాణా విషయాలను సందాన కర్తల ద్వారా తెలుసుంకుంటూ ఎలాంటి లోటు - పాట్లు జరుగకుండా తగు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
ప్రతి బస్సులో సందాన కర్తలను, సహాయకులను, ఆరోగ్య శాఖ సిబ్బందిని నియమించి సేవలు అందించారు. ఉద్యమ కారులకు, అమరవీరుల కుటుంబాలకు అల్పాహారం, భోజన సౌకర్యాలు, త్రాగు నీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ ఉద్యమ కారులు సి.హెచ్.వి.ప్రభాకర్ రావు, చుక్క గంగారెడ్డి, సిరిసిల్ల రాజేందర్ శర్మ, కంతి మోహన్ రెడ్డి ల ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ మండలాలతో పాటు పట్టణాల, గ్రామాల నుండి సుమారు రెండు వందల మందికి పైగా ఉద్యమకారులను, అమర వీరుల కుటుంబీకులను
రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తరలించారు.
కొందరు ఉద్యమకారులు వారంతట వారే ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకొని హైదారాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తరలి వెళ్లారు. ధర్మపురి లోని తహశీల్దార్ కార్యాలయం నుండి, జగిత్యాల లోని ఆర్డీవో కార్యాలయం నుండి, మెట్ పల్లి ఆర్డీవో కార్యాలయాల నుండి ఆదివారం ఉదయత్ పూర్వం 3-00 గంటలకు వాహనాల్లో ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబీకులు హైదారాబాద్ తరలి వెళ్లారు.
ఆనందం వ్యక్తం చేసిన ఉద్యమ నేతలు
ఆరు దశాబ్దాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనంతరం ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల పాలన తర్వాత నూతన ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం రావడం ఆనందంగా ఉందని ఉద్యమ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమ కారులను గుర్తించి వేడుకలకు ఆహ్వానం పలికిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి వర్గానికి, ఏర్పాట్లు చేసిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా కు, అదనపు కలెక్టర్ టి.ఎస్.దివాకర కు, ఇతర అధికారులకు, సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమ కారులకు ఇచ్చిన ఇదే గుర్తింపును ఎప్పటికీ కొనసాగించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఉద్యమ ఆకాంక్షలను, అమరవీరుల ఆశయాలను నెరవేర్చాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, ధర్మపురి, జగిత్యాల నియోజక వర్గాల తో పాటు వివిధ మండలాల నుండి, పట్టణాల నుండి సుమారు 200 మందికి పైగా ఉద్యమ కారులు, అమరవీరుల కుటుంబీకులు హైదారాబాద్ తరలి వెళ్లినట్లు వారు వివరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు
జగిత్యాల జనవరి 07 (ప్రజా మంటలు):
తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ని శ్రీ గాయత్రీ అనాధ వృద్దాశ్రమంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా హరి అశోక్ కుమార్ సంక్రాంతి పర్వదినం విశిష్టతను తెలిపి,,వయో వృద్ధుల చట్టం పై... తెలంగాణ సమగ్రాభివృద్ధికి జాగృతి బ్లూప్రింట్ సిద్ధం: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ జనవరి 07 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ జాగృతి బ్లూప్రింట్ రూపొందిస్తోంది. ఈ దిశగా “పుష్కరకాల తెలంగాణ రాష్ట్రం – సంపూర్ణ అధ్యయనం” సహా 30కి పైగా అంశాలపై ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయిమెంట్, రైతులు, ఎస్సీ–ఎస్టీ–బీసీ–ఎంబీసీ సాధికారత, మహిళలు, యువత, మైనార్టీలు, గల్ఫ్ కార్మికులు,... ఎంఐఎం బలోపేతానికి సమన్వయంతో పని చేయాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్.
జగిత్యాల జనవరి 7 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా, టౌన్ కార్యవర్గాల ఏకగ్రీవ ఎన్నిక.
ఎంఐఎం బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ అన్నారు. బుధవారం పట్టణంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన జగిత్యాల జిల్లా,
ఈ... చీఫ్ మినిస్టర్స్ కప్–2వ ఎడిషన్ 2025 పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్ జనవరి 07 (ప్రజా మంటలు):
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ నెలలో నిర్వహించనున్న చీఫ్ మినిస్టర్స్ కప్ – 2వ ఎడిషన్ 2025 క్రీడా పోటీల పోస్టర్ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు.
ఈ క్రీడా పోటీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 8... 69వ SGF రాష్ట్ర స్థాయి అండర్–17 హాకీ పోటీలకు జ్యోతి విద్యార్థులు ఎంపిక
జగిత్యాల, జనవరి 07 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీకి చెందిన విద్యార్థులు 69వ SGF రాష్ట్ర స్థాయి అండర్–17 హాకీ పోటీలకు ఎంపికై పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు.
పాఠశాలకి చెందిన మేన్నేని సహస్ర (9వ తరగతి), కర్నె శ్రీనిధి (10వ తరగతి) విద్యార్థులు నవంబర్ 3న హుజురాబాద్లోని ప్రభుత్వ ఉన్నత... మహిళా సంఘం సభ్యులు చదవడం రాయడం నేర్చుకుని అందరికీ ఆదర్శంగా నిలవాలి_మెప్మా ఏవో బి.శ్రీనివాస్
కోరుట్ల జనవరి 07 (ప్రజా మంటలు):
*'అమ్మకు అక్షర మాల' కార్యక్రమం నిర్వహణ*మహిళా సంఘం సభ్యులు రాయడం చదవడం నేర్చుకుని ఆదర్శంగా నిలవాలని మెప్మా ఏవో శ్రీనివాస్ అన్నారు.స్వయం సహాయక మహిళా సంఘం సభ్యులకు చదవడం, వ్రాయడం నేర్చుకొనుటకు రూపొందించిన "అమ్మకు అక్షర మాల" కార్యక్రమం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా... మహిళా సంఘం సభ్యులు చదవడం రాయడం నేర్చుకుని అందరికీ ఆదర్శంగా నిలవాలి_మెప్మా ఏవో బి.శ్రీనివాస్
కోరుట్ల జనవరి 7 ( ప్రజా మంటలు) *అమ్మకు అక్షర మాల' కార్యక్రమం నిర్వహణమహిళా సంఘం సభ్యులు రాయడం చదవడం నేర్చుకుని ఆదర్శంగా నిలవాలని మెప్మా ఏవో శ్రీనివాస్ అన్నారు.స్వయం సహాయక మహిళా సంఘం సభ్యులకు చదవడం, వ్రాయడం నేర్చుకొనుటకు రూపొందించిన "అమ్మకు అక్షర మాల" కార్యక్రమం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా... ప్రధాని సంసద్ ఖేల్ మహోత్సవం–2026ను విజయవంతం చేయాలి :
సికింద్రాబాద్, జనవరి 7 (ప్రజామంటలు):
ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం–2026 ను సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో విజయవంతం చేయాలని బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ టి. రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం బోయిగూడలోని గొల్ల కొమురయ్య కాలనీలో బీజేపీ బన్సీలాల్పేట్ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. .నియోజకవర్గంలో జరుగుతున్న... డ్రగ్స్, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి – జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
రాయికల్ జనవరి 7 ( ప్రజా మంటలు)డ్రగ్స్, మాదకద్రవ్యాల మహమ్మారిని సమాజం నుండి పూర్తిగా నిర్మూలించి భావితరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
రాయికల్
ఈ... సైబర్ నేరాలపై అవగాహన సదస్సు
ఇబ్రహీంపట్నం జనవరి 7 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
జగిత్యాల అశోక్ కుమార్ ఆదేశాల మేరకు బుధవారం రోజున ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల (కేజీబీవీ) విద్యార్థులకు సైబర్,డ్రగ్స్, ట్రాఫిక్ మరియు ఉమెన్ ట్రాఫికింగ్ లాంటి పలు అంశాల పైన అవగాహన సదస్సు ను ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. సర్పంచ్, ఉప సర్పంచ్,వార్డ్ సభ్యులకు శాలువాతో సన్మానం
గొల్లపల్లి జనవరి 07 (ప్రజా మంటలు):
కథలాపూర్ మండల కేంద్రంలో పద్మశాలి కమ్యూనిటీ భవనంలో బుధవారం జగిత్యాల్ జిల్లా పద్మశాలి కమ్యూనిటీ కార్యవర్గ సభ్యుడు పులి హరిప్రసాద్ ఆధ్వర్యంలో కథలాపూర్ మండలంలోని ఆయా గ్రామాలలోని సర్పంచ్ ఉప సర్పంచులు వార్డు సభ్యులు పద్మశాలి కమ్యూనిటీ సభ్యులను శాలువాతో ఘనంగా సన్మానించారు
ఈ కార్యక్రమంలో కథలాపూర్ మండల... జగిత్యాల మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగరవేయాలి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాల జనవరి 7 ( ప్రజా మంటలు) జగిత్యాల మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగుర వేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
జిల్లా బి ఆర్ యస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్, జిల్లా బి ఆర్ యస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు , జిల్లా తొలి జడ్పీ... 