తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హైదారాబాద్ తరలి వెళ్ళిన ఉద్యమకారులు

సౌకర్యాలు కల్పించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా. - ఆనందం వ్యక్తం చేసిన ఉద్యమ నేతలు

On
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హైదారాబాద్ తరలి వెళ్ళిన ఉద్యమకారులు

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

 

జగిత్యాల జిల్లా, జూన్ 02 (ప్రజా మంటలు): 

రాష్ట్ర రాజధాని హైదారాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు 

జగిత్యాల జిల్లా నుండి ఉద్యమ కారులు, అమరవీరుల కుటుంబీకులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సమయ స్ఫూర్తితో స్పందించి జిల్లాలోని ఉద్యమకారులను, అమర వీరుల కుటుంబీకులను గుర్తించి హైదారాబాద్ లో జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. వారికి తగిన ఏర్పాట్లు, వసతులు కల్పించారు.

జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల నియోజక వర్గాలకు వేర్వేరుగా బస్సులను, కార్లను, ఏర్పాటు చేసి ప్రభుత్వ ఖర్చులతోనే రవాణా సౌకర్యం కల్పించారు. అదనపు కలెక్టర్ టి.ఎస్.దివాకర, పరిపాలనాధికారి పుప్పాల హన్మంతరావు, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజు లు ఎప్పటి కప్పుడు ఏర్పాట్లను, రవాణా విషయాలను సందాన కర్తల ద్వారా తెలుసుంకుంటూ ఎలాంటి లోటు - పాట్లు జరుగకుండా తగు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

ప్రతి బస్సులో సందాన కర్తలను, సహాయకులను, ఆరోగ్య శాఖ సిబ్బందిని నియమించి సేవలు అందించారు. ఉద్యమ కారులకు, అమరవీరుల కుటుంబాలకు అల్పాహారం, భోజన సౌకర్యాలు, త్రాగు నీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 

జగిత్యాల జిల్లాలోని ప్రముఖ ఉద్యమ కారులు సి.హెచ్.వి.ప్రభాకర్ రావు, చుక్క గంగారెడ్డి, సిరిసిల్ల రాజేందర్ శర్మ, కంతి మోహన్ రెడ్డి ల ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ మండలాలతో పాటు పట్టణాల, గ్రామాల నుండి సుమారు రెండు వందల మందికి పైగా ఉద్యమకారులను, అమర వీరుల కుటుంబీకులను

రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తరలించారు.

కొందరు ఉద్యమకారులు వారంతట వారే ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకొని హైదారాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తరలి వెళ్లారు. ధర్మపురి లోని తహశీల్దార్ కార్యాలయం నుండి, జగిత్యాల లోని ఆర్డీవో కార్యాలయం నుండి, మెట్ పల్లి ఆర్డీవో కార్యాలయాల నుండి ఆదివారం ఉదయత్ పూర్వం 3-00 గంటలకు వాహనాల్లో ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబీకులు హైదారాబాద్ తరలి వెళ్లారు.

ఆనందం వ్యక్తం చేసిన ఉద్యమ నేతలు

ఆరు దశాబ్దాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనంతరం ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల పాలన తర్వాత నూతన ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం రావడం ఆనందంగా ఉందని ఉద్యమ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమ కారులను గుర్తించి వేడుకలకు ఆహ్వానం పలికిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి వర్గానికి, ఏర్పాట్లు చేసిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా కు, అదనపు కలెక్టర్ టి.ఎస్.దివాకర కు, ఇతర అధికారులకు, సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమ కారులకు ఇచ్చిన ఇదే గుర్తింపును ఎప్పటికీ కొనసాగించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఉద్యమ ఆకాంక్షలను, అమరవీరుల ఆశయాలను నెరవేర్చాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, ధర్మపురి, జగిత్యాల నియోజక వర్గాల తో పాటు వివిధ మండలాల నుండి, పట్టణాల నుండి సుమారు 200 మందికి పైగా ఉద్యమ కారులు, అమరవీరుల కుటుంబీకులు హైదారాబాద్ తరలి వెళ్లినట్లు వారు వివరించారు.

Tags
Join WhatsApp

More News...

National  Crime  State News 

ఘాజియాబాద్ బాలికల మృతి కేసు: ‘కొరియన్ సంస్కృతి’ నుంచి దూరం చేశారనే వేదనతో లేఖ

ఘాజియాబాద్ బాలికల మృతి కేసు: ‘కొరియన్ సంస్కృతి’ నుంచి దూరం చేశారనే వేదనతో లేఖ ఘాజియాబాద్ ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు): ఘాజియాబాద్‌లో ముగ్గురు అక్కాచెల్లెలు మృతి చెందిన ఘటనలో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. 'ది హిందూ' పత్రిక ప్రచురించిన సమాచారం మేరకు, వారికి లభించిన  లేఖ ప్రకారం, తమ మూడేళ్ల చిన్న అర్ధసోదరికి “తమ కొరియన్ సంస్కృతి” నేర్పించనివ్వలేదనే బాధను బాలికలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. లేఖలో,...
Read More...

మునిసిపల్ ఎన్నికల్లో  బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తాం ఎమ్మెల్సీ ఎల్. రమణ

మునిసిపల్ ఎన్నికల్లో  బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తాం  ఎమ్మెల్సీ ఎల్. రమణ జగిత్యాల ఫిబ్రవరి 5 (ప్రజా మంటలు) జగిత్యాల పట్టణంలో  పలు వార్డులో BRS పార్టీ అభ్యర్థులకు మద్దతుగా కార్నర్ మీటింగ్లో  ఎమ్మెల్సీ ఎల్ రమణ  మరియు మాజీ మంత్రి రాజేశం గౌడ్ మాజీ జడ్పీ చైర్మన్ దావ వసంత  తో కలిసి ప్రచారం లో గురువారం రాత్రి 7 గంటలకు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ...
Read More...
National  Crime  Current Affairs  

ఘాజియాబాద్‌లో ముగ్గురు బాలికల ఆత్మహత్య

ఘాజియాబాద్‌లో ముగ్గురు బాలికల ఆత్మహత్య ఘాజియాబాద్ / ఢిల్లీ, (ప్రజా మంటలు): ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు ఆత్మహత్యకు పాల్పడటం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ సంఘటన కుటుంబాలు, పాఠశాలలు, మానసిక ఆరోగ్య నిపుణులను కలవరపాటుకు గురి చేసింది. ఈ ఘటనపై స్పందించిన బాలికల తండ్రి, తమ పిల్లల మృతికి కొరియన్ కల్చర్ ప్రభావమే కారణమని...
Read More...

39వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బొలుసాని శ్రీనివాస్ జోరుగా ప్రచారం 

39వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బొలుసాని శ్రీనివాస్ జోరుగా ప్రచారం  జగిత్యాల ఫిబ్రవరి 5 (ప్రజా మంటలు) జగిత్యాల పట్టణంలోని 39 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోలు సాని శ్రీనివాస్ ఇంటింటా జోరుగా ప్రచారం నిర్వహించారు .ఈ సందర్భంగా చేతి గుర్తుపై తనకు ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలను అభ్యర్థించారు. స్థానిక సమస్యల పరిష్కారంలో తాను వార్డులోనే ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు....
Read More...
Local News  State News 

వరంగల్–కరీంనగర్ జంట నగరాల అభివృద్ధికి బృహత్ ప్రణాళిక: సీఎం రేవంత్ రెడ్డి

వరంగల్–కరీంనగర్ జంట నగరాల అభివృద్ధికి బృహత్ ప్రణాళిక: సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్, ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు): వరంగల్–కరీంనగర్ పట్టణాల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రణాళికను రూపొందించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రెండు పట్టణాలకు ఔటర్ రింగ్ రోడ్లు పూర్తి చేయడంతో పాటు, వాటిని అనుసంధానించే రహదారులను విస్తరించనున్నట్లు చెప్పారు. రెండు నగరాల మధ్య భారీ డంప్ యార్డు ఏర్పాటు చేసి, అక్కడే విద్యుత్...
Read More...

రాయికల్ పలు వార్డులలో అభ్యర్థులకు మద్దతుగా డా బోగ శ్రావణి ఇంటింట ప్రచారం

రాయికల్ పలు వార్డులలో అభ్యర్థులకు మద్దతుగా డా బోగ శ్రావణి ఇంటింట ప్రచారం రాయికల్ ఫిబ్రవరి 5 ( ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికలలో భాగంగా జగిత్యాల నియోజకవర్గం రాయికల్ మున్సిపల్ 8వ వార్డ్ అభ్యర్థి మచ్చ నారాయణ మరియు 12వ వార్డ్ అభ్యర్థి కల్లెడ చిన్న ధర్మపురి కి మద్దతుగా అదేవిధంగా రాయికల్ పదవ వార్డు అభ్యర్థి ఆడెపు ప్రశాంతి మరియు 11వ వార్డు అభ్యర్థి పుర్రె శ్రీధర్...
Read More...

ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా.

ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా.    జగిత్యాల ఫిబ్రవరి 5 ( ప్రజా మంటలు)తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్  40వ వార్డు  కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి స్థానికంగా ఉంటూ ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటా.. జగిత్యాల పట్టణ 40వ వార్డు తన కుటుంబంగా భావిస్తాను. ఎవరికి ఏ ఆపద వచ్చినా తక్షణమే స్పదింస్తా.. మరోమారు ఆశీర్వదించండి....
Read More...

జగిత్యాల పట్టణం 3వ  వార్డులో కారు అభ్యర్థికి జోరుగా ప్రచారం

జగిత్యాల పట్టణం 3వ  వార్డులో కారు అభ్యర్థికి జోరుగా ప్రచారం         జగిత్యాల ఫిబ్రవరి 5 ( ప్రజా మంటలు)పట్టణం 3వ  వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుమ్మడి సత్యం గౌడ్  కి మద్దతుగా ఇంటింటా తిరిగి ప్రచారం చేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ  వసంత సురేష్ . ఏ ఇంటి గడప తట్టిన కూడా కేసీఆర్ పై అభిమానం తగ్గలేదని పేద ప్రజల...
Read More...
National  International  

అనిల్ అంబానీ–ఇప్స్టీన్ ఫైల్ విశ్లేషణ: మోదీ, హార్దీప్ సింగ్ పూరి సంబంధాలు

అనిల్ అంబానీ–ఇప్స్టీన్ ఫైల్ విశ్లేషణ: మోదీ, హార్దీప్ సింగ్ పూరి సంబంధాలు అనిల్ అంబాని–జెఫ్రీ ఇప్స్టీన్ ఫైల్: మోదీ, హార్దీప్ సింగ్ పూరి సంబంధాలపై సంక్షిప్తంగా, సమగ్ర విశ్లేషణ  గత రెండు మూడు నెలలుగా, అమెరికాకు చెందిన నేరస్తుడు, దళారీ జాఫ్రీ ఎప్స్టీన్ మరియు అనెక మంది దేశాధినేతలతో, పారిశ్రామికవేత్తలతో, ప్రముఖులతో సంబంధాలు కలిగి ఉన్నాడని, అనేక అరాచకాలు చేశాడని నేరారోపణలు ప్రచారంలో ఉన్నాయి. .ఇతనికి శిక్ష...
Read More...

న్యాయవాది స్వప్న హత్య నిందితులకు వెంటనే శిక్ష విధించాలి: మెట్‌పల్లి బార్ అసోసియేషన్

న్యాయవాది స్వప్న హత్య నిందితులకు వెంటనే శిక్ష విధించాలి: మెట్‌పల్లి బార్ అసోసియేషన్    మెట్‌పల్లి, ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు):చేవెళ్ల బార్ అసోసియేషన్ సభ్యురాలు న్యాయవాది స్వప్న హత్యకు పాల్పడిన నిందితులకు వెంటనే కఠిన శిక్ష విధించాలని మెట్‌పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వప్న హత్యను నిరసిస్తూ గురువారం మెట్‌పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. అనంతరం...
Read More...
Local News 

ల్యాండ్‌మార్క్ తీర్పుకు కారణమైన న్యాయమూర్తికి మెట్‌పల్లి బార్ సన్మానం

ల్యాండ్‌మార్క్ తీర్పుకు కారణమైన న్యాయమూర్తికి మెట్‌పల్లి బార్ సన్మానం మెట్‌పల్లి, ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు): మంథని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్‌గా ఉన్న సమయంలో పోలీసుల ఫర్దార్ ఇన్వెస్టిగేషన్‌పై డి. నాగేశ్వరావు రచించిన ఆర్టికల్‌ను ఉదాహరణగా తీసుకుని అలహాబాద్ హైకోర్టుతో పాటు భారత సుప్రీంకోర్టు ల్యాండ్‌మార్క్ తీర్పు వెలువరించిన సందర్భంగా, ప్రస్తుతం మెట్‌పల్లి సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న డి. నాగేశ్వరావును మెట్‌పల్లి బార్ అసోసియేషన్...
Read More...

మెట్‌పల్లి వరుస దొంగతనాల కేసులు ఛేదింపు : 7 మంది నిందితుల అరెస్ట్

మెట్‌పల్లి వరుస దొంగతనాల కేసులు ఛేదింపు : 7 మంది నిందితుల అరెస్ట్ మెట్‌పల్లిలో వరుస దొంగతనాల కేసులు ఛేదింపు 7 మంది నిందితుల అరెస్ట్ – 15 తులాల బంగారం, 32 తులాల వెండి స్వాధీనం మెట్‌పల్లి, ఫిబ్రవరి 5 (ప్రజా మంటలు):మెట్‌పల్లి పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో జరిగిన వరుస దొంగతనాల కేసులను మెట్‌పల్లి పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులకు సంబంధించి ఏడుగురు నిందితులను...
Read More...