తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హైదారాబాద్ తరలి వెళ్ళిన ఉద్యమకారులు

సౌకర్యాలు కల్పించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా. - ఆనందం వ్యక్తం చేసిన ఉద్యమ నేతలు

On
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హైదారాబాద్ తరలి వెళ్ళిన ఉద్యమకారులు

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

 

జగిత్యాల జిల్లా, జూన్ 02 (ప్రజా మంటలు): 

రాష్ట్ర రాజధాని హైదారాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు 

జగిత్యాల జిల్లా నుండి ఉద్యమ కారులు, అమరవీరుల కుటుంబీకులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సమయ స్ఫూర్తితో స్పందించి జిల్లాలోని ఉద్యమకారులను, అమర వీరుల కుటుంబీకులను గుర్తించి హైదారాబాద్ లో జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. వారికి తగిన ఏర్పాట్లు, వసతులు కల్పించారు.

జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల నియోజక వర్గాలకు వేర్వేరుగా బస్సులను, కార్లను, ఏర్పాటు చేసి ప్రభుత్వ ఖర్చులతోనే రవాణా సౌకర్యం కల్పించారు. అదనపు కలెక్టర్ టి.ఎస్.దివాకర, పరిపాలనాధికారి పుప్పాల హన్మంతరావు, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజు లు ఎప్పటి కప్పుడు ఏర్పాట్లను, రవాణా విషయాలను సందాన కర్తల ద్వారా తెలుసుంకుంటూ ఎలాంటి లోటు - పాట్లు జరుగకుండా తగు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

ప్రతి బస్సులో సందాన కర్తలను, సహాయకులను, ఆరోగ్య శాఖ సిబ్బందిని నియమించి సేవలు అందించారు. ఉద్యమ కారులకు, అమరవీరుల కుటుంబాలకు అల్పాహారం, భోజన సౌకర్యాలు, త్రాగు నీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 

జగిత్యాల జిల్లాలోని ప్రముఖ ఉద్యమ కారులు సి.హెచ్.వి.ప్రభాకర్ రావు, చుక్క గంగారెడ్డి, సిరిసిల్ల రాజేందర్ శర్మ, కంతి మోహన్ రెడ్డి ల ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ మండలాలతో పాటు పట్టణాల, గ్రామాల నుండి సుమారు రెండు వందల మందికి పైగా ఉద్యమకారులను, అమర వీరుల కుటుంబీకులను

రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తరలించారు.

కొందరు ఉద్యమకారులు వారంతట వారే ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకొని హైదారాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తరలి వెళ్లారు. ధర్మపురి లోని తహశీల్దార్ కార్యాలయం నుండి, జగిత్యాల లోని ఆర్డీవో కార్యాలయం నుండి, మెట్ పల్లి ఆర్డీవో కార్యాలయాల నుండి ఆదివారం ఉదయత్ పూర్వం 3-00 గంటలకు వాహనాల్లో ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబీకులు హైదారాబాద్ తరలి వెళ్లారు.

ఆనందం వ్యక్తం చేసిన ఉద్యమ నేతలు

ఆరు దశాబ్దాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనంతరం ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల పాలన తర్వాత నూతన ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం రావడం ఆనందంగా ఉందని ఉద్యమ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమ కారులను గుర్తించి వేడుకలకు ఆహ్వానం పలికిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి వర్గానికి, ఏర్పాట్లు చేసిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా కు, అదనపు కలెక్టర్ టి.ఎస్.దివాకర కు, ఇతర అధికారులకు, సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమ కారులకు ఇచ్చిన ఇదే గుర్తింపును ఎప్పటికీ కొనసాగించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఉద్యమ ఆకాంక్షలను, అమరవీరుల ఆశయాలను నెరవేర్చాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, ధర్మపురి, జగిత్యాల నియోజక వర్గాల తో పాటు వివిధ మండలాల నుండి, పట్టణాల నుండి సుమారు 200 మందికి పైగా ఉద్యమ కారులు, అమరవీరుల కుటుంబీకులు హైదారాబాద్ తరలి వెళ్లినట్లు వారు వివరించారు.

Tags

More News...

Local News  State News 

ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో - బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలి

ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో  - బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలి రైల్ రోకోకు భీం ఆర్మీ మద్దతు ఎమ్మెల్సీ కవితను కలిసి సంఘీభావం ప్రకటించిన నాయకులు హైదరాబాద్ జూలై 05 : ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం చేపట్టిన ఈ ఉద్యమంలో పౌర  సమాజం కలిసి...
Read More...
Local News 

అనాధ పిల్లలకు సాయం చేయడం ఆదర్శనీయం..

అనాధ పిల్లలకు సాయం చేయడం ఆదర్శనీయం.. చిన్నారులకు బ్లాంకెట్లు, జ్యూస్ ప్యాకెట్ల పంపిణీ సికింద్రాబాద్ జూలై 05 (ప్రజామంటలు): అనాథ పిల్లలకు సహాయం చేయడంలో ప్రతి ఒక్కరూ మానవత దృక్పథంతో స్పందించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. బన్సీలాల్‌పేట కృష్ణానగర్ కాలనీలోని ఆక్సిలియం నవజీవన అనాథ బాలిక ఆశ్రమంలో శనివారం చిలకలగూడకు చెందిన రామగిరి ప్రభాకర్ చిన్నారి బాలికలకు బ్లాంకెట్లు, జ్యూస్ ప్యాకెట్లను పంపిణీ...
Read More...
Local News 

కల్వకుంట్ల కవిత తో జాగృతి వైస్ ప్రెసిడెంట్ మంచాల వరలక్ష్మీ భేటి

కల్వకుంట్ల కవిత తో జాగృతి వైస్ ప్రెసిడెంట్  మంచాల వరలక్ష్మీ భేటి సికింద్రాబాద్ జూలై 05 (ప్రజామంటలు ): తెలంగాణ జాగృతి అద్యక్షురాలు కల్వకుంట్ల కవిత ను జాగృతి ఉపాద్యక్షురాలు మంచాల వరలక్ష్మీ శనివారం ఆమె నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. గత ఆరు నెలలుగా అమెరికా పర్యటనలో ఉన్న మంచాల వరలక్ష్మీ ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చారు. తన ఆత్మీయ సోదరి కల్వకుంట్ల కవితను కలసి యోగ...
Read More...
Local News 

ధర్మపురి మండల కేంద్రంలో  పర్యటించిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్

ధర్మపురి మండల కేంద్రంలో  పర్యటించిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్    (గొల్లపల్లి ధర్మపురి ) జూలై 05 (ప్రజా మంటలు): జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ శనివారం ధర్మపురి మండల కేంద్రంలో  పర్యటించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి, ప్రమాదకర స్థితిలో ఉన్న తరగతి గదులను తక్షణమే కూల్చి వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తరువాత సానిటేషన్ అంశంపై అధికారులతో సమీక్షించారు. డ్రైనేజీ,కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచి పరిశుభ్రత...
Read More...
Local News 

చదువుతోపాటు సంస్కారం అందించాలి -గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్

చదువుతోపాటు సంస్కారం అందించాలి  -గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్    జగిత్యాల జూలై 5 : (ప్రజా మంటలు) విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారం అందిస్తేనే అది నిజమైన విద్య అని గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్ అన్నారు.  సరస్వతీ విద్యాపీఠం అనుబంధ గీత విద్యాలయం పాఠశాల 1995-96 బ్యాచ్ ఎస్ఎస్సి విద్యార్థులు పాఠశాలకు రూ. ఒక లక్ష విలువైనడెస్క్లను అందజేశారు.  ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన...
Read More...
Local News 

జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక"*

జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక *"  జగిత్యాల జులై 5( ప్రజా మంటలు)   పట్టణం లోనీ జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో  ఆషాఢ మాసం పురస్కరించుకొని  *" ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక "* పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఇది ఆషాడ మాసంలో మహిళలు జరుపుకునే ఒక సాంప్రదాయ వేడుక. ఈ వేడుకలో మహిళలు గోరింటాకును చేతులకు, కాళ్లకు...
Read More...
Local News 

జగిత్యాలలో ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ ఉచిత మెగా వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరణ

జగిత్యాలలో ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ ఉచిత మెగా వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరణ    జగిత్యాల జూలై 5(ప్రజా మంటలు)  జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎల్. రమణ గారి కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్.రమణ  సూచన మెరకు ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ, అపోలో రీచ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో తేదీ: 8.7.2025 మంగళవారం రోజున ఉదయం 9గంటల నుండి
Read More...
Local News 

ధరూర్ క్యాంప్  ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.

ధరూర్ క్యాంప్  ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్. జగిత్యాల జూలై5( ప్రజా  మంటలు    )                                                                                                                                                                                        శనివారం రోజున జగిత్యాల జిల్లా కేంద్రంలోని  ధరూర్ క్యాంప్ ఈ వీ ఎం గోడౌన్ కేంద్రంను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు  జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.  ఈ  వి ఎం భద్రతకు  సంబంధించి ప్రతి నెలలో తనిఖీ. చేయనున్నారు. ఈవీఎం గోడౌన్ కేంద్రంను కలెక్టర్...
Read More...
State News 

బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి 

బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి  హైదరాబాద్ జూలై 05: సోషల్ మీడియాలో ద్వారా బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల విషయంలో ఎలాంటి జాలి చూపకుండా దోషుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి...
Read More...
Local News  State News 

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు - ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు - ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు సిద్దిపేట జూలై 05: తాము చెప్పిందే వినాలని తమకు సంబంధించిన వారికే ఇందిరమ్మ ఇండ్లు, ఇతర పథకాలు ఇవ్వాలని హుకుం హారిచేస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరుతో సిద్దిపేట జిల్లాలో బెదిరిపోతున్న కింది ఉద్యోగులు ఒక్కొకటి వెలుగులోకి వస్తున్నాయి. తాము చెప్పింది చేయకపోతే బదిలీలు, సస్పెండ్ చేయిస్తామని బెదిరింపులు,కాంగ్రెస్ నాయకుల వేధింపులను భరించలేక ఉద్యోగులు లీవ్ పెట్టి...
Read More...
Local News  State News 

సిరిసిల్ల TV9 రిపోర్టర్‌‌ ప్రసాద్‌‌ మృతి

సిరిసిల్ల TV9 రిపోర్టర్‌‌ ప్రసాద్‌‌ మృతి కేటీఆర్, బండి సంజయ్, పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాస్‌‌ సంతాపం సిరిసిల్ల జూలై 05: సీనియర్ జర్నలిస్ట్,టీవీ9 సిరిసిల్ల  రిపోర్టర్  ప్రసాద్ ఆకస్మికంగా మృతి చెందారు. ప్రసాద్ మృతి  పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రగాఢ సానుభూతి...
Read More...
Local News  State News 

ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ - పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు

ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ - పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు   -స్థానిక సంస్థల ఎన్నికల్లో టి.జె.ఎస్. కు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి   (చుక్కా గంగా రెడ్డి - సీనియర్ జర్నలిస్ట్) హైదరాబాద్ జూలై 05: తెలంగాణ ఉద్యమాల రథ సారధి, ఎమ్మెల్సీ, తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో తెలంగాణ జనసమితి బృందం భేటీ అయ్యారు. రాబోయే...
Read More...