శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానము, కొండగట్టు లో ఘనంగా ప్రారంభమైన పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
మల్యాల మే 30 (ప్రజా మంటలు)
శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానము, కొండగట్టు శ్రీ స్వామి వారి పెద్ద జయంతి ఉత్సవములు తేది: 30-05-2024 నుండి 01-06-2024 వరకు అత్యంత వైభముగా నిర్వహించుట జరుగుచున్నది.
అందులో భాగంగా
- మొదటి రోజు తేది: 30 గురువారం శ్రీస్వామి వారికి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానము, భద్రాచలం నుండి ఆనవాయితీగా పట్టు వస్త్రములు కార్యనిర్వహణాధికారి మరియు అర్చక స్వాములు తీసుక వచ్చినారు.
- ఉ॥9:00 గంటలకు దేవాలయము తరుపున ప్రత్యేక అధికారులు / కార్యనిర్వహణాధికారి, అర్చక స్వాములు / సిబ్బంది వారిని సాదరముగా ఆహ్వానించి 12 రకములైన కళా బృందములతో, నాద స్వరముతో, కోలాటములు, యక్షగానము, 108 దీపాల ప్రదర్శనతో, ఒగ్గు డోలు ప్రదర్శనతో శోభాయాత్రతో శ్రీ స్వామి వారికి పట్టు వస్త్రములు సమర్పించుట జరిగినది.
- తదుపరి యాగశాల నందు ఉదయము యాగశాల శుద్ధి, పుణ్యహవచనము, అంకురార్పణ, అఖండ దీపస్థాపన, స్వస్తి వాచనము, రక్షభందనము, ఋత్విక్ వరణము, అరుణి మదనము, దేవతాహ్వనము, అగ్ని ప్రతిష్ట ,హవనము, అభిషేకములు, ద్వజారోహణము, నవగ్రహస్థాపన, పారాయణములు, నైవేధ్యము తీర్ధప్రసాదములు వినియోగము మరియు సాయంత్రము హెూమం, మహానైవేధ్యము, మంత్రపుష్పము, తీర్థ ప్రసాద వినియోగము తదుపరి సాంస్కృతిక కార్యక్రమములు నిర్వహించబడినవి.
దేవాలయ కోనేరునందు పాతనీరు తీసి క్రొత్తనీరు ఎప్పటికప్పుడు మార్చబడినది.
ఎల్లవేళల పరిశుభ్రత నిమిత్తం సానిటేషన్ సిబ్బంది సర్వీస్ (3) షిఫ్టుల ద్వారా 200 మంది చొప్పున వినియోగించి పనులు చేపట్టుట జరిగినది.
నేటి నుండి నుండి (3) రోజులు మాల విరమణ మండపము నందు భక్తులకు మాల విరమణ చేయబడుచున్నది.
భక్తుల సౌకర్యార్ధము ( 20 ) ప్రదేశములలో త్రాగు నీరు కేంద్రాలు ఏర్పాటు చేయబడినవి.
నేటి నుండి నుండి భక్తులతో పాటు వివిధ డిపార్ట్ మెంట్ ద్వారా డిప్యూట్ చేయబడిన సిబ్బందికి దేవస్థానము నుండి అన్నదానము ఏర్పాటు చేయబడినది.
జిల్లా కలెక్టర్, జగిత్యాల వారి ఉత్తర్వుల ప్రకారము వివిధ శాఖల అదికారులు వారి వారి విధుల నిర్వర్తించుచున్నారు.
ప్రత్యేకముగా దేవస్థానము నుండి ఏర్పాటు చేయబడిన పార్కింగ్ స్థలముల నుండి దేవాలయం వద్దకు 4 బస్సుల ద్వారా భక్తులకు ఉచితముగా రవాణ సౌకర్యము కల్పించబడినది.
భక్తులు ఉపయోగించుకొనుటకు కోరుచున్నాము.
హెల్త్ డిపార్ట్మెంట్ వారి నుండి దేవాలయ ప్రాంగణములలో (6) ప్రదేశములలో ఉచిత మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయబడినవన్నారు.
ప్రత్యేక కౌంటర్ల నందు మ్రొక్కుబడి టిక్కెట్లు దీక్షా / కేశ ఖండన / ప్రత్యేక దర్శనము మరియు లడ్డు, పులిహోర ప్రసాదములు విక్రయించబడుచున్నవి.
భక్తులు క్యూపద్దతి పాటించి వినియోగించుకొనుటకు కోరుచున్నామని తెలిపారు. గురువారం రోజు శోభ యాత్ర భక్తుల ద్వారా ప్రత్యేక అధికారుల సమక్షములో కళాబృందములతో, నాట్య విన్యాసముల ద్వారా దేవాలయ అర్చక మరియు పరిపాన సిబ్బంది పాల్గోని దిగ్విజయముగా నిర్వహించబడినది.
(3) రోజులుభక్తులు దీక్ష పరులు శ్రీ స్వామి వారిని దర్శించి తరించి శ్రీ స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరడమైనది.
భక్తులు దీక్షపరులు దేవాలయ కౌంటర్ల వద్ద క్యూ పద్దతి పాటించి పోలీస్ డిపార్ట్మెంట్ వారి సూచనలను పాటిస్తూ మీ యొక్క మ్రొక్కులు చెల్లించుకొని దేవాలయమునకు సహకరించగలరని కోరారు.
కమీషనర్ దేవాదాయ శాఖ, హైదరాబాద్ వారి ఉత్తర్వుల ప్రకారము ఇద్దరు ఫెస్టివల్ ఆఫీసర్స్ నిరంతరము ఏర్పాట్లను పర్యవేక్షించుచున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల నీటి పారుదల శాఖ ఉద్యోగుల నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక
జగిత్యాల డిసెంబర్ 29 (ప్రజా మంటలు)నీటి పారుదల శాఖ సమావేశం మందిరం నందు ఏర్పాటుచేసిన నీటిపారుదల శాఖ ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశానికి టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి, నీటి పారుదల శాఖ ఉద్యోగుల అడాక్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ శ్రీ సంగెo లక్ష్మణరావ, టిఎన్జీఓ జిల్లా కార్యదర్శి ఊకంటి అమరేందర్... ఓసి ల సింహగర్జన సమరభేరిని విజయవంతం చేయాలి. ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు,
జగిత్యాల డిసెంబర్ 29 (ప్రజా మంటలు)జనవరి 11న హన్మకొండ లో లక్ష మందితో ఓసి ల సింహగర్జన సభ.....హన్మకొండ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో జనవరి 11న లక్ష మందితో, రెడ్డి, వైశ్య, వెలమ బ్రాహ్మణ, కమ్మ, మార్వాడిల సంఘాల తో ఏర్పడిన రాష్ట్ర ఓసి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ... టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి శుభాకాంక్షలు
జగిత్యాల డిసెంబర్ 29 (ప్రజా మంటలు):
టీయూడబ్ల్యూజే (ఐజేయు) అనుబంధ జగిత్యాల ప్రెస్ క్లబ్కు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కార్యవర్గాన్ని అభినందిస్తూ ఆయన శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత... అసెంబ్లీలో జగిత్యాల నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
హైదరాబాద్ డిసెంబర్ 29 (ప్రజా మంటలు):
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన కీలక సమస్యలను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సభ దృష్టికి తీసుకువచ్చారు. జగిత్యాల మున్సిపాలిటీ పురాతనమైనదని, పట్టణ అభివృద్ధిలో భాగంగా యావర్ రోడ్డును 60 అడుగుల నుంచి 100 అడుగుల వరకు విస్తరించేందుకు 2021లో మాస్టర్ ప్లాన్ రూపొందించామని ఆయన... తపస్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 28 (ప్రజా మంటలు)తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా బోయినపల్లి ప్రసాద్ రావు ప్రధాన కార్యదర్శిగా కొక్కుల రాజేష్ ఎన్నికగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవగా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్... లక్ష్మీపూర్ హత్య కేసు చేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన డీఎస్పీ రఘు చందర్
జగిత్యాల డిసెంబర్ 28 (ప్రజా మంటలు)
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్ గ్రామంలో హత్యకు గురైన బుర్ర మహేందర్ అనే వ్యక్తి హత్య కేసును ఛేదించారు పోలీసులు... ప్రేమ పేరుతో మోసం చేయడంతో పాటు వీడియోలు బయట పెడతానని మహేందర్ వేధింపులకు గురి చేయడంతోనే అక్క చెల్లెలుతో పాటు కుటుంబ సభ్యులు కలిసి హత్యకు పాల్పడినట్లు... కాసుగంటి సుధాకర్ రావు పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
హైదరాబాద్ డిసెంబర్ 28 (ప్రజా మంటలు)
ప్రముఖ విద్యావేత్త , శ్రీ సరస్వతిశిశు మందిర్ ,శ్రీవాణి సహకార జూనియర్ కళాశాల,గోదావరి వ్యాలీ వ్యవస్థాపకులు కాసుగంటి సుధాకర్ రావు అనారోగ్యం తో హైదరాబాదులో మరణించగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ సుధాకర్ రావు పార్థివ దేహానికి నివాళులు అర్పించి,వారి కుమారుడు కాసుగంటి జగదీష్ చందర్ రావును,... సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి – మార్త సత్యనారాయణ
కాగజ్ నగర్, డిసెంబర్ 28 (ప్రజా మంటలు):
రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ సిటిజన్లపై జరుగుతున్న వేధింపులు, నిర్లక్ష్య ఘటనలు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో, వారి రక్షణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కార్యదర్శి మార్త సత్యనారాయణ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వృద్ధుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో... ఎస్సి రెసిడెన్షియల్ హాస్టల్ నిర్వహణపై హెచ్ఆర్సీ ఆగ్రహం
సికింద్రాబాద్, డిసెంబర్ 28 ( ప్రజామంటలు) :
రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్–నాదర్గుల్–కందుకూర్ ఎస్సి రెసిడెన్షియల్ హాస్టల్లో నెలకొన్న దారుణ పరిస్థితులపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని ఫిర్యాదుతో హెచ్ఆర్సీ కేసు నం. 8122/2025 నమోదు చేసి విచారణ చేపట్టింది.హాస్టల్లో మురుగు పొంగిపొర్లడం, తలుపులు–కిటికీలు లేని... అలరించిన ఫెమి–9 ఉమెన్స్ క్లబ్ ఫ్యాషన్ షో
సికింద్రాబాద్, డిసెంబర్ 28 (ప్రజామంటలు):
ర్యాంప్ వాక్ కేవలం ఫ్యాషన్ కోసమే కాకుండా మహిళల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆలోచనల్లో మార్పుకు నాంది పలుకుతుందని చీఫ్ గెస్ట్ మిసెస్ తెలంగాణ క్రౌన్ సుధా నాయుడు అన్నారు. బేగంపేట ఫ్యామిలీ వరల్డ్లో ఫెమి–9 ఉమెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యూటీ ఫ్యాషన్ మీట్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా... జగిత్యాల ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా రాజేందర్ రెడ్డి ఘన విజయం.
జగిత్యాల డిసెంబర్ 28 (ప్రజా మంటలు)టీయూడబ్ల్యూజే (ఐజేయు) అనుబంధ జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎల్లాల రాజేందర్ రెడ్డి ఘన విజయం సాధించినట్లు ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎన్నికల అధికారి బెజ్జంకి సంపూర్ణ చారి తెలిపారు.
ఆదివారం స్థానిక దేవిశ్రీ గార్డెన్లో నిర్వహించిన ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో రాజేందర్రెడ్డి తన సమీప ప్రత్యర్థి... ఇబ్రహీంపట్నంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 28 (ప్రజా మంటలు):
ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు గూడ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య పోరాటం నుంచి ప్రజాస్వామ్య... 