శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానము, కొండగట్టు లో ఘనంగా ప్రారంభమైన పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు.

On
శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానము, కొండగట్టు లో ఘనంగా ప్రారంభమైన పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

మల్యాల మే 30 (ప్రజా మంటలు)

 శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానము, కొండగట్టు శ్రీ స్వామి వారి పెద్ద జయంతి ఉత్సవములు తేది: 30-05-2024 నుండి 01-06-2024 వరకు అత్యంత వైభముగా నిర్వహించుట జరుగుచున్నది.

అందులో భాగంగా

  • మొదటి రోజు తేది: 30 గురువారం శ్రీస్వామి వారికి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానము, భద్రాచలం నుండి ఆనవాయితీగా పట్టు వస్త్రములు కార్యనిర్వహణాధికారి మరియు అర్చక స్వాములు తీసుక వచ్చినారు.
  • ఉ॥9:00 గంటలకు దేవాలయము తరుపున ప్రత్యేక అధికారులు / కార్యనిర్వహణాధికారి, అర్చక స్వాములు / సిబ్బంది వారిని సాదరముగా ఆహ్వానించి 12 రకములైన కళా బృందములతో, నాద స్వరముతో, కోలాటములు, యక్షగానము, 108 దీపాల ప్రదర్శనతో, ఒగ్గు డోలు ప్రదర్శనతో శోభాయాత్రతో శ్రీ స్వామి వారికి పట్టు వస్త్రములు సమర్పించుట జరిగినది.
  • తదుపరి యాగశాల నందు ఉదయము యాగశాల శుద్ధి, పుణ్యహవచనము, అంకురార్పణ, అఖండ దీపస్థాపన, స్వస్తి వాచనము, రక్షభందనము, ఋత్విక్ వరణము, అరుణి మదనము, దేవతాహ్వనము, అగ్ని ప్రతిష్ట ,హవనము, అభిషేకములు, ద్వజారోహణము, నవగ్రహస్థాపన, పారాయణములు, నైవేధ్యము తీర్ధప్రసాదములు వినియోగము మరియు సాయంత్రము హెూమం, మహానైవేధ్యము, మంత్రపుష్పము, తీర్థ ప్రసాద వినియోగము తదుపరి సాంస్కృతిక కార్యక్రమములు నిర్వహించబడినవి.

దేవాలయ కోనేరునందు పాతనీరు తీసి క్రొత్తనీరు ఎప్పటికప్పుడు మార్చబడినది.

ఎల్లవేళల పరిశుభ్రత నిమిత్తం సానిటేషన్ సిబ్బంది సర్వీస్ (3) షిఫ్టుల ద్వారా 200 మంది చొప్పున వినియోగించి పనులు చేపట్టుట జరిగినది.

నేటి నుండి నుండి (3) రోజులు మాల విరమణ మండపము నందు భక్తులకు మాల విరమణ చేయబడుచున్నది.

భక్తుల సౌకర్యార్ధము ( 20 ) ప్రదేశములలో త్రాగు నీరు కేంద్రాలు ఏర్పాటు చేయబడినవి.

నేటి నుండి నుండి భక్తులతో పాటు వివిధ డిపార్ట్ మెంట్ ద్వారా డిప్యూట్ చేయబడిన సిబ్బందికి దేవస్థానము నుండి అన్నదానము ఏర్పాటు చేయబడినది.

జిల్లా కలెక్టర్, జగిత్యాల వారి ఉత్తర్వుల ప్రకారము వివిధ శాఖల అదికారులు వారి వారి విధుల నిర్వర్తించుచున్నారు.

ప్రత్యేకముగా దేవస్థానము నుండి ఏర్పాటు చేయబడిన పార్కింగ్ స్థలముల నుండి దేవాలయం వద్దకు 4 బస్సుల ద్వారా భక్తులకు ఉచితముగా రవాణ సౌకర్యము కల్పించబడినది.

భక్తులు ఉపయోగించుకొనుటకు కోరుచున్నాము.

హెల్త్ డిపార్ట్మెంట్ వారి నుండి దేవాలయ ప్రాంగణములలో (6) ప్రదేశములలో ఉచిత మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయబడినవన్నారు.

ప్రత్యేక కౌంటర్ల నందు మ్రొక్కుబడి టిక్కెట్లు దీక్షా / కేశ ఖండన / ప్రత్యేక దర్శనము మరియు లడ్డు, పులిహోర ప్రసాదములు విక్రయించబడుచున్నవి.

భక్తులు క్యూపద్దతి పాటించి వినియోగించుకొనుటకు కోరుచున్నామని తెలిపారు. గురువారం రోజు శోభ యాత్ర భక్తుల ద్వారా ప్రత్యేక అధికారుల సమక్షములో కళాబృందములతో, నాట్య విన్యాసముల ద్వారా దేవాలయ అర్చక మరియు పరిపాన సిబ్బంది పాల్గోని దిగ్విజయముగా నిర్వహించబడినది.

(3) రోజులుభక్తులు దీక్ష పరులు శ్రీ స్వామి వారిని దర్శించి తరించి శ్రీ స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరడమైనది.

భక్తులు దీక్షపరులు దేవాలయ కౌంటర్ల వద్ద క్యూ పద్దతి పాటించి పోలీస్ డిపార్ట్మెంట్ వారి సూచనలను పాటిస్తూ మీ యొక్క మ్రొక్కులు చెల్లించుకొని దేవాలయమునకు సహకరించగలరని కోరారు.

కమీషనర్ దేవాదాయ శాఖ, హైదరాబాద్ వారి ఉత్తర్వుల ప్రకారము ఇద్దరు ఫెస్టివల్ ఆఫీసర్స్ నిరంతరము ఏర్పాట్లను పర్యవేక్షించుచున్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

హర్ ఘర్ తిరంగా – తిరంగా యాత్రలో భాగంగా మాజీ సైనికుడు దూరిశెట్టి కిరణ్ కుమార్‌ను సన్మానించిన  డా. బోగ శ్రావణి

హర్ ఘర్ తిరంగా – తిరంగా యాత్రలో భాగంగా మాజీ సైనికుడు దూరిశెట్టి కిరణ్ కుమార్‌ను సన్మానించిన  డా. బోగ శ్రావణి జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు)భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం పిలుపు మేరకు నిర్వహిస్తున్న "హర్ ఘర్ తిరంగా – తిరంగా యాత్ర" కార్యక్రమంలో భాగంగా, భారత త్రివిధ దళాల్లో సేవలందించి పదవీ విరమణ పొందిన మాజీ సైనికుడు దూరిశెట్టి కిరణ్ కుమార్ ని బీజేపీ జగిత్యాల నియోజకవర్గ...
Read More...
Local News 

బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ డా. బోగ శ్రావణి కి పోచమ్మ తల్లి బోనాల జాతర ఆహ్వాన పత్రిక అందజేత

బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ డా. బోగ శ్రావణి కి పోచమ్మ తల్లి బోనాల జాతర ఆహ్వాన పత్రిక అందజేత    జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా జగిత్యాల జిల్లా యూట్యూబర్స్ కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోచమ్మ తల్లి బోనాల జాతర మహోత్సవం సందర్భంగా ఆహ్వాన పత్రికను బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ డా. బోగ శ్రావణికి బోనాల జాతర వర్కింగ్ కమిటీ సభ్యులు, జగిత్యాల జిల్లా కళాకారులు మర్యాదపూర్వకంగా అందజేశారు. ఈ సందర్భంగా...
Read More...
Local News 

తల్లిపాలే శిశువుకు తొలి వరం – మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్

తల్లిపాలే శిశువుకు తొలి వరం – మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్    జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు )పట్టణంలోని స్థానిక 43వ వార్డు వాణీనగర్ అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్  సమీండ్ల వాణి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు సంప్రదాయబద్ధంగా శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాశన, అక్షరాభ్యాసం కార్యక్రమాలను నిర్వహించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ సమీండ్ల...
Read More...
Local News 

విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి – మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్

విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి – మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్    జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు)పట్టణంలోని నవ్య గర్ల్స్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన "పరిచయ్–2K26" ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్  సమిండ్ల వాణి శ్రీనివాస్ విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ విద్య జీవితానికి బలమైన పునాది అని, ఈ దశలో విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను...
Read More...
Local News 

సామాజిక న్యాయ తెలంగాణ కోసం టీఆర్ఎస్ సంకల్పం

సామాజిక న్యాయ తెలంగాణ కోసం టీఆర్ఎస్ సంకల్పం హైదరాబాద్, ఆగస్టు 06 (ప్రజా మంటలు): సామాజిక న్యాయ తెలంగాణ సాధన లక్ష్యంగా టీఆర్ఎస్ నిర్వహించిన **"సామాజిక న్యాయ సంకల్ప సభ"**లో పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత కీలక ప్రసంగం చేశారు. ఈ సభ దేశంలోని కోట్లాది మంది వెనుకబడిన వర్గాల జీవితాలను మార్చే ఉద్యమానికి నాంది అవుతుందని ఆమె పేర్కొన్నారు. తాను బీసీల కోసం...
Read More...
Local News 

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయ సాధనే ఆయనకు నిజమైన నివాళి – మున్సిపల్ చైర్ పర్సన్  సమీండ్ల వాణి శ్రీనివాస్

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయ సాధనే ఆయనకు నిజమైన నివాళి – మున్సిపల్ చైర్ పర్సన్  సమీండ్ల వాణి శ్రీనివాస్    జగిత్యాల ఆగస్ట్ 6(ప్రజా మంటలు) మున్సిపాలిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా కరీంనగర్ రోడ్‌లోని జయశంకర్ విగ్రహం వద్ద, గొల్లపల్లి రోడ్‌లోని విగ్రహం వద్ద, అలాగే మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర...
Read More...
Local News 

ధనం ఉంటే దాన స్వభావము ఉండాలి  బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేష్ శర్మ 

ధనం ఉంటే దాన స్వభావము ఉండాలి  బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేష్ శర్మ  కోరుట్ల ఆగస్టు 5 ( ప్రజా మంటలు)  సిరిసిల్ల రాజేంద్ర శర్మ 9348422113 ధనమున్న వ్యక్తికి దాన స్వభావం ఉండాలని అదేవిధంగా శక్తి ఉంటే క్షమాగుణం ఉండాలని శృంగేరి శారదా పీఠ ఆస్థాన పౌరాణికులు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి శిష్యులు గర్రెపల్లి మహేష్ శర్మ అన్నారు. కోరుట్ల పట్టణములో సనాతన ధర్మ ప్రచార సమితి కోరుట్ల...
Read More...
Local News  State News 

తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపునకు మహారాష్ట్ర అనుమతులు ఇప్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి

తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపునకు మహారాష్ట్ర అనుమతులు ఇప్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ, ఆగస్టు 5 (ప్రజా మంటలు):ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు 150–152 మీటర్లకు పెంచేందుకు మహారాష్ట్ర అనుమతులు ఇప్పించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరారు. ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన కేంద్ర మంత్రిని కలిశారు.148 మీటర్లతో పోలిస్తే 152...
Read More...
Local News 

నల్లమల్లలో చెంచు గిరిజనుల జీవన పరిస్థితులపై మానవ హక్కుల కమిషన్ చైర్మన్ క్షేత్రస్థాయి పరిశీలన

నల్లమల్లలో చెంచు గిరిజనుల జీవన పరిస్థితులపై మానవ హక్కుల కమిషన్ చైర్మన్ క్షేత్రస్థాయి పరిశీలన విద్య, వైద్యం, సంక్షేమం, మౌలిక వసతులపై అధికారులతో సమగ్ర సమీక్ష – చెంచు కుటుంబాలతో ముఖాముఖిహైదరాబాద్, ఆగస్టు 5 (ప్రజా మంటలు): నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న చెంచు గిరిజనుల జీవన పరిస్థితులను తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్...
Read More...
Local News  State News 

పూర్తిస్థాయి పంచాయతీ కార్యదర్శి లేక గొల్లపల్లి అభివృద్ధి కుంటుపాటు

పూర్తిస్థాయి పంచాయతీ కార్యదర్శి లేక గొల్లపల్లి అభివృద్ధి కుంటుపాటు గొల్లపల్లికి రావాలంటేనే జంకుతున్న కార్యదర్శులు!రాజకీయ ఒత్తిళ్లే కారణమా..? గ్రామంలో గుసగుసలు? గొల్లపల్లి, ఆగస్టు 5 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పూర్తిస్థాయి కార్యదర్శి లేక తీవ్ర పరిపాలనా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నెలకోసారి ఇన్‌చార్జి కార్యదర్శిని నియమిస్తూ కాలం గడుపుతుండటంతో గ్రామ అభివృద్ధి పనులు పూర్తిగా స్తంభించిపోయే పరిస్థితి...
Read More...
Local News 

ఐక్య ఉద్యమాలతోనే పీఆర్సీ సాధ్యం, అశాస్త్రీయమైన టెట్ పరీక్షను రద్దు చేయాలి : జిల్లా అధ్యక్షులు బైరం హరికిరణ్

ఐక్య ఉద్యమాలతోనే పీఆర్సీ సాధ్యం, అశాస్త్రీయమైన టెట్ పరీక్షను రద్దు చేయాలి : జిల్లా అధ్యక్షులు బైరం హరికిరణ్    జగిత్యాల ఆగస్టు 2 (ప్రజా మంటలు)రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్ లకు  రావాల్సిన పి.ఆర్సి , డి.ఏ లు, పెండింగ్ బకాయిల సమస్యలు   ఐక్య ఉద్యమాలతోనే పరిష్కారమవుతాయని స్టేట్ టీచర్స్ యూనియన్ జగిత్యాల జిల్లా శాఖ సమావేశం తీర్మానించింది.  ఆదివారం జగిత్యాల పట్టణంలో   రామకృష్ణ డిగ్రీ కళాశాల సమావేశమందిరంలో  ఎస్టీయు తృతీయ కార్యవర్గ...
Read More...
Local News 

సహస్ర లింగాల దేవాలయంలో ఘనంగా సంకష్టహర చతుర్థి వేడుకలు మహాగణపతికి ప్రత్యేక అభిషేకాలు 

సహస్ర లింగాల దేవాలయంలో ఘనంగా సంకష్టహర చతుర్థి వేడుకలు మహాగణపతికి ప్రత్యేక అభిషేకాలు     జగిత్యాల ఆగస్టు 2 (ప్రజా మంటలు) రూరల్ పొలాస గ్రామం శివారులోని సహస్ర లింగాల దేవాలయంలో ఉదయం   సంకటహర చతుర్థి వేడుకలు మహాగణపతికి ప్రత్యేక అభిషేకాలు. ఈ సందర్భంగా సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం ఆలయంలోని సహస్ర లింగాలకు ప్రత్యేక పూజలను నిర్వహించి అనంతరం ఆలయంలోని సంకటహర చతుర్థి సందర్భంగా మహాగణపతికి పలు పంచామృతాభిషేకాలను...
Read More...