శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానము, కొండగట్టు లో ఘనంగా ప్రారంభమైన పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
మల్యాల మే 30 (ప్రజా మంటలు)
శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానము, కొండగట్టు శ్రీ స్వామి వారి పెద్ద జయంతి ఉత్సవములు తేది: 30-05-2024 నుండి 01-06-2024 వరకు అత్యంత వైభముగా నిర్వహించుట జరుగుచున్నది.
అందులో భాగంగా
- మొదటి రోజు తేది: 30 గురువారం శ్రీస్వామి వారికి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానము, భద్రాచలం నుండి ఆనవాయితీగా పట్టు వస్త్రములు కార్యనిర్వహణాధికారి మరియు అర్చక స్వాములు తీసుక వచ్చినారు.
- ఉ॥9:00 గంటలకు దేవాలయము తరుపున ప్రత్యేక అధికారులు / కార్యనిర్వహణాధికారి, అర్చక స్వాములు / సిబ్బంది వారిని సాదరముగా ఆహ్వానించి 12 రకములైన కళా బృందములతో, నాద స్వరముతో, కోలాటములు, యక్షగానము, 108 దీపాల ప్రదర్శనతో, ఒగ్గు డోలు ప్రదర్శనతో శోభాయాత్రతో శ్రీ స్వామి వారికి పట్టు వస్త్రములు సమర్పించుట జరిగినది.
- తదుపరి యాగశాల నందు ఉదయము యాగశాల శుద్ధి, పుణ్యహవచనము, అంకురార్పణ, అఖండ దీపస్థాపన, స్వస్తి వాచనము, రక్షభందనము, ఋత్విక్ వరణము, అరుణి మదనము, దేవతాహ్వనము, అగ్ని ప్రతిష్ట ,హవనము, అభిషేకములు, ద్వజారోహణము, నవగ్రహస్థాపన, పారాయణములు, నైవేధ్యము తీర్ధప్రసాదములు వినియోగము మరియు సాయంత్రము హెూమం, మహానైవేధ్యము, మంత్రపుష్పము, తీర్థ ప్రసాద వినియోగము తదుపరి సాంస్కృతిక కార్యక్రమములు నిర్వహించబడినవి.
దేవాలయ కోనేరునందు పాతనీరు తీసి క్రొత్తనీరు ఎప్పటికప్పుడు మార్చబడినది.
ఎల్లవేళల పరిశుభ్రత నిమిత్తం సానిటేషన్ సిబ్బంది సర్వీస్ (3) షిఫ్టుల ద్వారా 200 మంది చొప్పున వినియోగించి పనులు చేపట్టుట జరిగినది.
నేటి నుండి నుండి (3) రోజులు మాల విరమణ మండపము నందు భక్తులకు మాల విరమణ చేయబడుచున్నది.
భక్తుల సౌకర్యార్ధము ( 20 ) ప్రదేశములలో త్రాగు నీరు కేంద్రాలు ఏర్పాటు చేయబడినవి.
నేటి నుండి నుండి భక్తులతో పాటు వివిధ డిపార్ట్ మెంట్ ద్వారా డిప్యూట్ చేయబడిన సిబ్బందికి దేవస్థానము నుండి అన్నదానము ఏర్పాటు చేయబడినది.
జిల్లా కలెక్టర్, జగిత్యాల వారి ఉత్తర్వుల ప్రకారము వివిధ శాఖల అదికారులు వారి వారి విధుల నిర్వర్తించుచున్నారు.
ప్రత్యేకముగా దేవస్థానము నుండి ఏర్పాటు చేయబడిన పార్కింగ్ స్థలముల నుండి దేవాలయం వద్దకు 4 బస్సుల ద్వారా భక్తులకు ఉచితముగా రవాణ సౌకర్యము కల్పించబడినది.
భక్తులు ఉపయోగించుకొనుటకు కోరుచున్నాము.
హెల్త్ డిపార్ట్మెంట్ వారి నుండి దేవాలయ ప్రాంగణములలో (6) ప్రదేశములలో ఉచిత మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయబడినవన్నారు.
ప్రత్యేక కౌంటర్ల నందు మ్రొక్కుబడి టిక్కెట్లు దీక్షా / కేశ ఖండన / ప్రత్యేక దర్శనము మరియు లడ్డు, పులిహోర ప్రసాదములు విక్రయించబడుచున్నవి.
భక్తులు క్యూపద్దతి పాటించి వినియోగించుకొనుటకు కోరుచున్నామని తెలిపారు. గురువారం రోజు శోభ యాత్ర భక్తుల ద్వారా ప్రత్యేక అధికారుల సమక్షములో కళాబృందములతో, నాట్య విన్యాసముల ద్వారా దేవాలయ అర్చక మరియు పరిపాన సిబ్బంది పాల్గోని దిగ్విజయముగా నిర్వహించబడినది.
(3) రోజులుభక్తులు దీక్ష పరులు శ్రీ స్వామి వారిని దర్శించి తరించి శ్రీ స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరడమైనది.
భక్తులు దీక్షపరులు దేవాలయ కౌంటర్ల వద్ద క్యూ పద్దతి పాటించి పోలీస్ డిపార్ట్మెంట్ వారి సూచనలను పాటిస్తూ మీ యొక్క మ్రొక్కులు చెల్లించుకొని దేవాలయమునకు సహకరించగలరని కోరారు.
కమీషనర్ దేవాదాయ శాఖ, హైదరాబాద్ వారి ఉత్తర్వుల ప్రకారము ఇద్దరు ఫెస్టివల్ ఆఫీసర్స్ నిరంతరము ఏర్పాట్లను పర్యవేక్షించుచున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కొరకే ఫ్లాగ్ మార్చ్:డిఎస్పి రఘు చందర్
జగిత్యాల ఫిబ్రవరి 9 (ప్రజా మంటలు)ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలి.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది.... అభివృద్ధే అస్త్రం… అధికార పార్టీతోనే జగిత్యాల పురోగతి: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు):
చేసిన అభివృద్ధి పనులకే ప్రజలు పట్టం కడతారని, ప్రభుత్వంతో కలిసి పనిచేసే ప్రతినిధులను గెలిపిస్తేనే జగిత్యాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
యావర్ రోడ్డు విస్తరణకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, 200 కోట్ల... మళ్ళీ సెన్సార్ కు జన నాయకన్ సినిమా: కోర్టులో కేసు ఉపసంహరణ
చెన్నై – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు):
TVK పార్టీ నాయకుడు దలపతి నటించిన ‘జననాయకన్’ చిత్రాన్ని మళ్లీ సెన్సార్ బోర్డుకు పంపాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించారు. ఈ నిర్ణయంతో సంబంధించి కోర్టులో పెండింగ్లో ఉన్న కేసును చిత్ర బృందం ఉపసంహరించుకున్నట్లు న్యాయస్థానానికి తెలియజేసింది.
ఇంతవరకు ఉన్న ఈ చిత్ర సెన్సార్ పై ఉన్న సందేహాలను... సీషెల్స్కు 175 మిలియన్ డాలర్ల అభివృద్ధి సహాయం ప్రకటించిన భారత్
న్యూఢిల్లీ – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు):
భారతదేశానికి ఆరు రోజుల అధికారిక పర్యటనకు వచ్చిన సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహుళ రంగాలపై విస్తృత చర్చలు జరిపారు. ఈ సమావేశాల్లో వాణిజ్యం, ఆర్థిక సహకారం, భద్రతా అంశాలపై పరస్పర సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని ఇరుపక్షాలు అంగీకరించాయి.
ఈ చర్చల అనంతరం,... అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ జప్తు
ఇబ్రహీంపట్నం – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు):
అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకుని, లారీ ఓనర్ మరియు డ్రైవర్పై కేసు నమోదు చేశారు.
మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన భూక్య వంశీ (24) తన యజమాని ఇస్లావత్ శంకర్ ఆదేశాల మేరకు వేంపల్లి గ్రామ శివారులోని గోదావరి నది నుంచి ఇసుకను... ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో గొల్లపల్లి బి ఆర్ ఎస్ నాయకులు
గొల్లపల్లి ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు);
ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 6,7,,8,, వార్డుల అభ్యర్థులకు,తోడుగా ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజల మధ్యలో ఓట్లు అభ్యర్థిస్తున్నా, మాజీ ఎంబిపీపి నక్క శంకయ్య గోస్కుల జలంధర్ పి ఎస్ సి ఎస్ చైర్మన్ చెందోళ గందే మాధవ రావు ఓరగంటి అశోక్ ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా, రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలి
జగిత్యాల – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు):
మున్సిపాలిటీలు ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా పనిచేయాలని, రాజ్యాంగ స్ఫూర్తితో పాలన సాగిస్తూ అవకతవకలకు తావు లేకుండా ఉండాలని ఎమ్మెల్సీ ఎల్. రమణ అన్నారు. జగిత్యాల పట్టణంలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బి.ఆర్.ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని... అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన శరద్ పవార్
ముంబై ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు)ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా గొంతు ఇన్ఫెక్షన్, శ్వాసకు సంబంధించిన ఇబ్బందులతో బాధపడుతున్న ఆయనను వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేర్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా... రాయికల్ లో బి ఆర్ ఎస్ నాయకుల ప్రచారం
రాయికల్ ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు):
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్) పార్టీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచార కార్యక్రమం నిర్వహించారు. రాయికల్ బస్టాండ్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగులు ఏర్పాటు చేసి, ప్రజలతో నేరుగా మమేకమై పార్టీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలను... సభాపతి విషు శర్మచే కొనసాగుతున్న శ్రీ గణేశ వైభవం
జగిత్యాల ఫిబ్రవరి 8 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని శ్రీ లక్ష్మీ గణపతి మందిరంలో, 25వ,రజితోత్సవ, వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు మొదటి రోజు మూలమూర్తికి ఫల, పంచామృత,అభిషేకం, దుర్వార్చన, పల్లకి సేవ, గణేష వైభవం పై ప్రముఖ పౌరాణిక పండితులు,సభాపతి, బ్రహ్మశ్రీ తిగుళ్ల విషు శర్మ , అద్భుతమైన... జగిత్యాల 4,6,12,19 వార్డుల్లో ఇంటింట ప్రచార నిర్వహించిన మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత
జగిత్యాల ఫిబ్రవరి 8 ( ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల పట్టణంలోనీ 4వ వార్డులో బత్తిని ప్రణయ్ కు 6 వ వార్డ్ లో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి నీలి ప్రతాప్ కు 12వ వార్డు పంతం అనురాధకు 19వ వార్డు భారతి సంతోష్ కు మద్దతుగా ఇంటింటా తిరిగి... 