కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. -ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే.
-ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
గొల్లపల్లి మే 09 (ప్రజా మంటలు) : గత పదేళ్ల పాలన కాలంలో నరేంద్ర మోడీ కార్పొరేట్లకు తప్ప సామాన్య జనానికి చేసింది ఏం లేదని,! ఈ విషయాన్ని సామాన్య జనం గుర్తించి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయడం ద్వారా అతి త్వరలో కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
పేర్కొన్నారు. గొల్లపల్లి మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ లో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ప్రభుత్వ విప్ , విధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి కార్నర్ మీటింగ్లో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ, గడ్డం వంశీ గారిని పెద్దపెల్లి పార్లమెంటు ఎంపి గా భారీ మెజారిటీతో గెలిపించాలని,బి .ఆర్.ఎస్,బీజేపీ పార్టీ నాయకుల మోసపూరిత హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని,! ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని పేర్కొన్నారు. కళ్ళుండి చూడలేని కబోదులు టిఆర్ఎస్, బిజెపి అని! వారి మాయమాటలను ప్రజలు నమ్మి మరోసారి మోసపోవద్దని హెచ్చరించారు. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి ప్రియ శిష్యుడైన ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కు రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన పంచ న్యాయలను అమలు చేసి తీరుతామని, ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు ఓటు వేసి వంశి నీ గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ! అధ్యక్షులు నిశాంత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రశేఖర రావు, తాండ్ర సురేందర్ , భీమ సంతోష్ ,యూత్ అధ్యక్షులు ఓరగంటి తిరుపతి, ఎంపిటిసి లంబ! దనవ్వ లక్ష్మణ్, పట్టణ అధ్యక్షులు నేల మహేష్, ఓర్స్ విజయ్, గురజాల బుచ్చిరెడ్డి, కొక్కుల జలంధర్, కట్ట లక్ష్మణ్, గాజగ్గి సత్తయ్య ,నాయకులు కార్యకర్తలు యువకులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
----------------------------------------
More News...
<%- node_title %>
<%- node_title %>
భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య

సోను, సతీష్ ల పార్టీ నుండి బహిష్కరణ

ఇజ్రాయెల్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన — 47 సార్లు దాడులు, 38 మంది పాలస్తీనియన్లు మృతి

రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర - సీఎం రేవంత్ రెడ్డి

టపాకులు రాత్రి 8 నుంచి 10 మధ్యనే కాల్చాలి - తిరుమలగిరి ఇన్స్పెక్టర్. జి నాగరాజు

దీపావళి జీవితాల్లో వెలుగు నింపాలి - అజాగ్రత్తతో జీవితాన్ని ఆగం చేసుకోకండి

పేద నిందితులకు బెయిల్ మొత్తాన్ని DLSA చెల్లించచ్చు - సుప్రీంకోర్టు

అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ పెట్టుబడి భారత్లోనే — సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం రాబోతోంది - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
.jpeg)
బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నూతన ట్రస్ట్ బోర్డ్

నిజామాబాద్లో కానిస్టేబుల్ హత్య
