కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. -ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే.
-ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
గొల్లపల్లి మే 09 (ప్రజా మంటలు) : గత పదేళ్ల పాలన కాలంలో నరేంద్ర మోడీ కార్పొరేట్లకు తప్ప సామాన్య జనానికి చేసింది ఏం లేదని,! ఈ విషయాన్ని సామాన్య జనం గుర్తించి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయడం ద్వారా అతి త్వరలో కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
పేర్కొన్నారు. గొల్లపల్లి మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ లో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ప్రభుత్వ విప్ , విధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి కార్నర్ మీటింగ్లో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ, గడ్డం వంశీ గారిని పెద్దపెల్లి పార్లమెంటు ఎంపి గా భారీ మెజారిటీతో గెలిపించాలని,బి .ఆర్.ఎస్,బీజేపీ పార్టీ నాయకుల మోసపూరిత హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని,! ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని పేర్కొన్నారు. కళ్ళుండి చూడలేని కబోదులు టిఆర్ఎస్, బిజెపి అని! వారి మాయమాటలను ప్రజలు నమ్మి మరోసారి మోసపోవద్దని హెచ్చరించారు. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి ప్రియ శిష్యుడైన ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కు రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన పంచ న్యాయలను అమలు చేసి తీరుతామని, ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు ఓటు వేసి వంశి నీ గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ! అధ్యక్షులు నిశాంత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రశేఖర రావు, తాండ్ర సురేందర్ , భీమ సంతోష్ ,యూత్ అధ్యక్షులు ఓరగంటి తిరుపతి, ఎంపిటిసి లంబ! దనవ్వ లక్ష్మణ్, పట్టణ అధ్యక్షులు నేల మహేష్, ఓర్స్ విజయ్, గురజాల బుచ్చిరెడ్డి, కొక్కుల జలంధర్, కట్ట లక్ష్మణ్, గాజగ్గి సత్తయ్య ,నాయకులు కార్యకర్తలు యువకులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
----------------------------------------
More News...
<%- node_title %>
<%- node_title %>
కురుమ సంఘం ఆధ్వర్యంలో వర్షాలు సమృద్ధిగా పడాలని కోరుతూ కప్పతల్లి ఆటలు, ప్రత్యేక పూజలు
జగిత్యాల జూలై 16 (ప్రజా మంటలు )
కురుమ సంఘం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం దేశంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ స్థానిక పోచమ్మ వాడ లోని పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రోకలి కి రెండు కప్పలను కట్టి ప్రత్యేక పూజలను నిర్వహించి డప్పు చప్పుల మధ్య ఇంటింటా తిరుగుతూ కప్పతల్లి... ఇంకుడు గుంతలు నిర్మిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి- మున్సిపల్ కమిషనర్ డి శ్రీనివాస్ గౌడ్
మెట్ పెల్లి జూలై 16 (ప్రజా మంటలు)జె ఎస్జెబి 3.0 ఆధ్వర్యంలోని క్యాచ్ ది రైన్ ప్రచారం జల ప్రతిజ్ఞ కార్యక్రమంలో భాగంగా సిడిఎంఏ అధికారి ఆదేశాల మేరకు జలసంచెయ్ జన భాగీ దారి (జే ఎస్జేబి )3.0 లో భాగంగా నిర్వహిస్తున్న క్యాచ్ ది రైన్ ప్రచార కార్యక్రమంలో వర్షపు నీరు సంరక్షణ... అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ల జారీకి కమిటీ ఆమోదం
జగిత్యాల జులై 15(ప్రజా మంటలు)
జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఆన్లైన్ లో సమర్పించిన 697 దరఖాస్తులను జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులు సమగ్రంగా క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన మొదటి & రొండవ విడత 506 ప్రస్తుతం మూడవ విడతలో 74 మొత్తం 580 మంది వర్కింగ్ జర్నలిస్ట్ లకు అక్రీడిటేషన్ కార్డులు జారీకి ఆమోదం... చిన్న రైస్ మిల్లర్లకు అండగా ఉంటాం: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జూలై 15 (ప్రజా మంటలు):
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితను రాష్ట్రానికి చెందిన చిన్న రైస్ మిల్లర్ల ప్రతినిధులు బుధవారం హైదరాబాద్లో కలిసి తమ సమస్యలను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద రైస్ మిల్లర్ల పట్ల ఒక విధంగా, చిన్న రైస్ మిల్లర్ల పట్ల మరో... పారిశుద్ధ్య కార్మికుడి మృతి కేసు ముగింపు: రూ.15.50 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబానికి రెండు ఉద్యోగాలు
హైదరాబాద్, జూలై 14: (ప్రజా మంటలు)
యూసుఫ్గూడ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో పారిశుద్ధ్య కార్మికుడు మీశాల సుధాకర్ మృతి చెందిన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్ఆర్సీ) స్వప్రేరణతో నమోదు చేసిన కేసును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆదేశాల అమలు నేపథ్యంలో ముగించింది.టీజీహెచ్ఆర్సీ ఛైర్పర్సన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్... రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పెద్దపల్లి మున్సిపల్ ఏఈ..
ఇంట్లో రూ.32.31 లక్షల అక్రమ నగదు స్వాధీనం
పెద్దపల్లి, జూలై 14 (ప్రజా మంటలు):
పెద్దపల్లి మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న కల్లేపల్లి సతీష్ కుమార్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్హ్యాండెడ్గా చిక్కారు.కాంట్రాక్టర్కు సంబంధించిన బిల్లును ప్రాసెస్ చేసి టీయూఎఫ్ఐడీసీ (TUFIDC)కి పంపేందుకు రూ.2 లక్షల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా... ప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువకునికి మారుతి స్నేహమండలి సత్కారం
జగిత్యాల జులై 12 (ప్రజా మంటలు) జగిత్యాల బ్రాహ్మణ వీధికి చెందిన మోతే ఆర్యన్ ఇటీవల బ్యాంకింగ్ పరీక్ష రాసి ఉద్యోగం సాధించిన నేపథ్యాన్ని పురస్కరించుకొని మారుతి స్నేహ మండలి వారిచే మోతే ఆర్యన్ కు జ్ఞాపిక అందజేసి శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆర్యన్ మాట్లాడుతూ ఉద్యోగం సాధించడానికి ప్రధానంగా ధైర్యంతో... కన్నయ్య కుమార్ మీ అర్హతను దృష్టిలో ఉంచుకొని మాట్లాడు
హైదరాబాద్ 12 జూలై (ప్రజా మంటలు) :
కాంగ్రెస్ పార్టీ నాయకుడు కన్నయ్య కుమార్ మీ అర్హతను దృష్టిలో ఉంచుకొని మాట్లాడాలని శివసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శివసేన పార్టీ అధినేత పైన చేసిన వాఖ్యల పైన శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ తీవ్రంగా స్పందించారు...... జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ
రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 ఎకరాల భూమి కేటాయింపు – త్వరలో తాత్కాలిక భవనంలో తరగతుల ప్రారంభం
జగిత్యాల, జూలై 12 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని చలగల్ వాలంతరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి ఆదివారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ... ఎస్సీ గ్రూప్ 1 లోని ఉప కులాలకు కార్పొరేషన్ ద్వారా చైర్మన్ ను నియమించాలి
జగిత్యాల జులై 12(ప్రజా మంటలు) జిల్లాలో బేడ బుడగ జంగాల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేసింది. ఎస్సీ గ్రూప్-1లోని 15 ఉపకులాల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, రాష్ట్ర సంఘ అధ్యక్షుడు సిరిపాటి వేణును ఆ కార్పొరేషన్ చైర్మన్గా నియమించాలని డిమాండ్ చేసింది.
జగిత్యాలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా... లారెన్స్ బిష్ణోయ్ను అమెరికాకు అప్పగించాలని కోరాలని యూఎస్ నిర్ణయం
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుతో పాటు అంతర్జాతీయ నేరాలపై విచారణకు రంగం సిద్ధంవాషింగ్టన్/న్యూఢిల్లీ జూలై 12: భారతీయ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ను అమెరికాకు అప్పగించాలని (ఎక్స్ట్రడిషన్) అమెరికా న్యాయశాఖ (US Department of Justice - DoJ) అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం గుజరాత్లోని జైలులో ఉన్న బిష్ణోయ్పై అమెరికా దాఖలు చేసిన అభియోగాల... తెలంగాణ మానవ హక్కుల కమిషన్ రెండు సుమోటో కేసులు నమోదు
హైదరాబాద్, జూలై 3 (ప్రజా మంటలు):
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ రెండు వేర్వేరు అంశాలపై స్వయంస్పూర్తితో (సుమోటో) కేసులు నమోదు చేసింది.మొదటి కేసులో రాజన్న సిరిసిల్ల జిల్లా బొంగులకింద గ్రామంలో నాలుగేళ్ల చిన్నారిపై వీధికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనను కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర నివేదికను ఆగస్టు... 