పెద్దపల్లి పార్లమెంట్ ఎవరికీ దక్కనుంది ????.

On
పెద్దపల్లి పార్లమెంట్ ఎవరికీ దక్కనుంది ????.

(రాజేష్ బొంగురాల - జగిత్యాల జిల్లా ప్రతినిధి) 
 
పెద్దపల్లి పార్లమెంట్ ఎవరికీ దక్కనుంది ????.
  • కాకలు తీరిన కాకా కుటుంబ వారసుడికా ? 
  • ప్రజలను,నాయకులను నమ్ముకున్న ఈశ్వరుడికా??
  • ప్రపంచ దేశాలకు విశ్వ గురువుగా పేరొందిన కాషాయ సైనికుడు గోమాసకా???

 

జగిత్యాల జిల్లా మే 09 (ప్రజా మంటలు) :

పెద్దపెల్లి లో కమలం వికసించేనా అనే సందేహం స్పష్టంగా కనిపిస్తుండగా,గతంలో నుండి పెద్దపల్లి పార్లమెంట్ లోని మంచిర్యాల, ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం నుండి ఇప్పటి వరకు హిందుత్వం, క్రింది స్థాయి కార్యకర్తల సంకల్పం బలంగా ఉన్నప్పటికీ పోలింగ్ సమీపిస్తున్న నాయకులు పెద్దపల్లి పార్లమెంట్ లోని నియోజకవర్గాల ప్రచారంలో భాగస్వాములు కాకపోగా పక్క పార్టీల వైపు తొంగి చూస్తున్నరనే ప్రజల్లో చర్చ ఒక వైపు.

గతంలో వివేకానంద నే తమ పెద్ద దిక్కు గా ఎంపీ గా ,ఎమ్మెల్యే గా తనపై ఆశలు పెట్టుకొని వారితో మమ్మేకమై వారితో బీజేపీ పార్టీలో పని చేసిన సెంటిమెంట్ తో ప్రస్తుతం నాయకులు కాషాయ పార్టీ కోసం పోరాటం చేస్తారా లేదా అనే సందేహం మరోవైపు అన్నట్లుంది.

పెద్దపల్లి పార్లమెంట్ లో కాషాయం ఖాతా తియలేక పార్టీని వదలలేక కార్యకర్తలలో మనో వేదన మొదలైంది.

కారు పార్టీలో జోష్ నింపుతున్న మాజీ సీఎం కెసిఆర్ తరచూ రోడ్డు షో లతో ప్రజలకు దగ్గరవుతున్నరు.మాజీ మంత్రి,తెలంగాణ ఉద్యమకారుడు, సింగరేణి కార్మికులు గా అనుభవం కల్గిన కొప్పుల ఈశ్వర్ మిస్టర్ కూల్ గా రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి లో తనకున్న మంచి పేరు,వ్యక్తిత్వం, ఆదరణ అభిమానాలు తనని గట్టెకిస్తాయి అని ప్రగడమైన విశ్వసం తో తనతో కలిసి పని చేసిన నాయకులు,తాను చేసిన అభివృద్ధి పనులు తనకు కొండంత అండగా ఉంటాయని నమ్ముతున్నారు.

యువత కు స్ఫూర్తిగా గులాబీ శ్రేణులలో ఉత్సహం నింపుతూ తన కూతురు నందిని ప్రజలతో మాట్లాడుతు ఈ ఒక్కసారి ఆలోచించండి, ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈశ్వర్ అన్నగా మీముందుకు వచ్చిండు, మీరు నమ్మిన మీ స్థానిక నాయకులు మిమ్ములను మోసం చేసి ఇబ్బంది పెట్టినారు కానీ నాయకులు మిమ్ములను ఇబ్బంది పెడితే వారికీ స్థానిక ఎలక్షన్ లలో బుద్ది చెప్పండి.

న్యాయం ధర్మం కోసం పరితపించే మీ ఈశ్వరుడు అయిన మా నాన్న కి పెద్దపల్లి ఎంపీ గా అవకాశం ఇవ్వండి అని ప్రజలను వేడుకోవడం చర్చనీయ అంశం.

సీఎం రేవంత్ రెడ్డి జనజాతర సభలకు జనం నిరంజనాలు పలుకుతుండగా పెద్దపల్లి ఎంపీ కాకా కుటుంబానికే దక్కనుందా అనే చర్చ ప్రజల్లో విస్తృత కొనసాగుతుంది.

పెద్దపల్లి పార్లమెంట్ పై పట్టున్న తాత మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకట్ స్వామి కుటుంబ నేపథ్యంలో తండ్రి వివేక్ ఎంపీ చేసి ప్రజలతో, నాయకులతో కలసిపోయే బలమైన నాయకులు కాగా మంత్రి శ్రీధర్ బాబు అండదండలు,పార్టీ ఆపదలో ఉన్న సమయం లో నేనున్న అంటూ అప్పటి మాజీ మంత్రి గా, ఎమ్మెల్యే గా ప్రస్తుతం మంత్రి గా మంచిర్యాల, ధర్మపురి, రామగుండం, మంథని, బెల్లంపల్లి, చెన్నూర్, పెద్దపల్లి నియోజకవర్గం లపై పట్టు సాధించిన సౌమ్యులు గా పేరున్న మంత్రి శ్రీధర్ బాబు పార్లమెంట్ ఇంచార్జ్ గా హస్తం భారీ మెజారిటీ తో ప్రభంజనం సృష్టించం కాయంగా ప్రచార హోరు జరుగున్న పరిస్థితులు కనబడటం ఒక ఎత్తు.

పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గం లలో శాసనసభ్యులు గా ప్రతిపక్షం కి అవకాశం ఇవ్వకుండా మంచి మెజారిటీ తో గెలిచిన సీనియర్ ఎమ్మెల్యేలు ఉండడం ప్రతి నియోజకవర్గం లో తామే పార్లమెంట్ అభ్యర్థి అన్నట్లుగా ప్రచారాలు ఉదృతం చేయడం అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కి కలిసోచ్చే కాలం గా పార్లమెంట్ పరిధిలో వాతావరణం మారిపోయింది.

పది సంవత్సరాలనుండి కసి తో ఎప్పుడా అని ఎదిరి చూసిన బలమైన నాయకులు, క్రమశిక్షణ తో మేమున్నాం అంటూ పని చేసే కార్యకర్తలు మిగితా పార్టీలకు మేమేమి తీసుపోము అన్నట్లు కార్యకర్తలే ప్రచారం ముమ్మరం చేయడం కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతుంది.

ఏది ఏమైనప్పటికి గతం లో కంచుకోటగా కాంగ్రెస్ కి, పది సంవత్సరాలు బి ఆర్ యస్ కు అవకాశం ఇచ్చిన పెద్దపల్లి పార్లమెంట్ ఓటర్లు ఈసారి కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ లకు ఓటు వేస్తారా?

సాగు త్రాగు నీటి ప్రాజెక్టులు,రోడ్లు,ప్రజలకు అందించిన పథకాలు, అన్ని తామే అభివృద్ధి చేశాం అనే బి ఆర్ యస్ కు వేస్తారా?

లేదా నమో మోడి, జై శ్రీరామ్, హిందుత్వం కోసం మేమున్నాం అంటున్న,మోడీ కేంద్ర ప్రభుత్వం హయంలో చేసిన పలు జన సంక్షేమ ప్రయోజనాలు అందించిన బీజేపీ కి ఓటు వేస్తారో వేచి చూడాల్సిందే.

Tags
Join WhatsApp

More News...

Local News 

టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు గా రెండవ సారి ఎన్నికైన మారం జగదీశ్వర్ ను సన్మానించిన  జగిత్యాల టిఎన్జీఓ లు

టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు గా రెండవ సారి ఎన్నికైన మారం జగదీశ్వర్ ను సన్మానించిన  జగిత్యాల టిఎన్జీఓ లు కరీంనగర్ ఏప్రిల్ 1(ప్రజా మంటలు)ఇటీవల టిఎన్జీఓ కేంద్ర సంఘానికి జరిగిన ఎన్నికలలో  రెండవ సారి రాష్ట్ర అధ్యక్షులు గా ఏకగ్రీవంగా ఎన్నికైన మారం జగదీశ్వర్ ని  జగిత్యాల జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి మరియు జిల్లా కార్యదర్శి ఊకంటి అమరేందర్ రెడ్డి ల ఆధ్వర్యంలో జగిత్యాల టిఎన్జీఓ లు ఘనంగా సన్మానించారు. కరీంనగర్...
Read More...
State News 

కొండగట్టు లో పందిళ్ళు కూలిపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం - కవిత

కొండగట్టు లో పందిళ్ళు కూలిపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం - కవిత హైదరాబాద్, ఏప్రిల్ 01 (ప్రజా మంటలు): కొండగట్టు అంజన్న ఆలయంలో చలువ పందిళ్లు కూలిపోవడంతో 15 మంది భక్తులు గాయపడిన ఘటన ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు తన ట్విట్టర్ లో విమర్శించారు. . హనుమాన్ చిన్న జయంతి వేడుకల సందర్భంగా నాసిరకంగా ఏర్పాటు చేసిన పందిళ్ల వల్లే ఈ...
Read More...
Local News 

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం ప్రధాన అర్చకుని పదవి విరమణ

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం ప్రధాన అర్చకుని పదవి విరమణ జగిత్యాల మార్చి 31 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం ప్రధాన అర్చకులు మేడిపల్లి రాజన్న శాస్త్రి పదవి విరమణ మంగళవారం జరగగా ఆలయ ఆవరణలో రాజన్న శాస్త్రి పద్మ దంపతులను ఆలయ కమిటీ సభ్యులు, ఈవో సురేందర్  తదితరులు ఘనంగా సన్మానించి వీడ్కోలు తెలిపారు. ఈ...
Read More...
Local News  State News 

తెలంగాణలో ఉద్యోగ నియామకాలపై జీవోలు అడ్డంకి –కల్వకుంట్ల కవిత ఆరోపణ

తెలంగాణలో ఉద్యోగ నియామకాలపై జీవోలు అడ్డంకి –కల్వకుంట్ల కవిత ఆరోపణ హైదరాబాద్ ఏప్రిల్ 01 (ప్రజా మంటలు): రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియలో జీవోలు అడ్డంకిగా మారుతున్నాయని తెలంగాణ జాగృతి నేత కవిత విమర్శించారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వివిధ జీవోల ద్వారా అవరోధాలు సృష్టిస్తోందని ఆరోపించారు.డిగ్రీ లెక్చరర్ల నియామకాలకు సంబంధించిన జీవో నంబర్ 4 వల్ల అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందన్నారు....
Read More...
Local News 

ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి

ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి కొండగట్టు మార్చి 31 (ప్రజా మంటలు)  హనుమాన్ చిన్న జయంతికి  914  మంది సిబ్బందితో పటిష్ట భద్రత సీసీ కెమెరాలు ద్వారా నిరంతర పర్యవేక్షణ   జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  మల్యాల ఎక్స్ రోడ్ వద్దగల ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన బందోబస్తు పై పోలీసు అధికారులతో ఎస్పి సమీక్ష నిర్వహించారు. ప్రసిద్ధ...
Read More...
State News 

“రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు” : కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఆగ్రహం

 “రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు” : కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఆగ్రహం :హైదరాబాద్, మార్చ్ 31 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టేసిందని ఆమె ఆరోపించారు.కాగ్ (CAG) 2024-25 నివేదిక ఆధారంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆమె పేర్కొన్నారు. రోజువారీ ఖర్చుల నిర్వహణకే రిజర్వ్ బ్యాంక్...
Read More...
Local News 

అకాల వర్షంతో పంట దెబ్బతిన్న వరి,మామిడి తోటలు  పరిశీలించిన మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత 

అకాల వర్షంతో పంట దెబ్బతిన్న వరి,మామిడి తోటలు  పరిశీలించిన మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత       రాయికల్ మార్చి 31 (ప్రజా మంటలు)మండలం కిష్టంపేట గ్రామంలో నిన్న కురిసిన వర్షాలకు నష్టపోయిన మామిడి మరియు వరి పంట పొలాలను  బి ఆర్ ఎస్ నాయకులు మరియు రైతులతో కలిసి పరిశీలించి నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పిన జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్  ఈ సందర్భంగా వారు...
Read More...
Spiritual   State News 

కృష్ణా జిల్లా చల్లపల్లె పోలీస్ స్టేషన్‌లో పేలుడు ఘటన - నలుగురికి గాయాలు

కృష్ణా జిల్లా చల్లపల్లె పోలీస్ స్టేషన్‌లో పేలుడు ఘటన - నలుగురికి గాయాలు చల్లపల్లె, మార్చ్ 31 (ప్రజా మంటలు): ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా చల్లపల్లె పోలీస్ స్టేషన్‌లో జరిగిన పేలుడు ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకున్నట్లు సమాచారం. పోలీస్ స్టేషన్ పరిధిలో అకస్మాత్తుగా పేలుడు శబ్దం వినిపించడంతో సిబ్బంది, సమీప ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఘటన స్థలాన్ని...
Read More...

మైనర్ లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్

మైనర్ లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ జగిత్యాల మార్చి 30(ప్రజా మంటలు)పట్టణం లో ట్రాఫిక్ ఎస్ ఐ, టౌన్ ఎస్ ఐ ఆద్వర్యం లో  సోమవారం ద్విచక్ర వాహనాలు నడుపుతున్న దాదాపు 50 మంది మైనర్ లను పట్టుకున్న ట్రాఫిక్ మరియు పట్టణ పోలీసులు... ట్రాఫిక్ పోలీసుస్టేషన్కు తరలించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్  ఇక పై మైనర్...
Read More...
Local News 

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు మాజీ కౌన్సిలర్ జయ శ్రీ వినతి

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు మాజీ కౌన్సిలర్ జయ శ్రీ వినతి    జగిత్యాల మార్చి 30 ( ప్రజా మంటలు)పట్టణానికి చెందిన ఇల్లు లేని నిరుపేదల కొరకు నూకపెల్లి వద్ద డబల్ బెడ్ రూమ్ ఇండ్లు 4520 కట్టడం జరిగింది. వాటిలో 520 ఇండ్ల నిర్మాణం వద్ద డ్రైనేజీ వాటర్ కొరకు సంపు ఏర్పాటు చేసి దాని నుండి మోటార్ల ద్వారా బయటకు పంపింగ్ చేసే విధానం...
Read More...
State News 

రవీంద్రభారతిలో ప్రజాప్రతినిధుల సాంస్కృతిక వేడుకలు –

రవీంద్రభారతిలో ప్రజాప్రతినిధుల సాంస్కృతిక వేడుకలు  – హైదరాబాద్ మార్చ్ 30 (ప్రజా మంటలు); శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్వహించిన ప్రజాప్రతినిధుల సాంస్కృతిక వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి A. Revanth Reddy జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రవీంద్రభారతిలో జరిగిన ఈ వేడుకల్లో మండలి చైర్మన్ Gutta Sukender Reddy, ఉప ముఖ్యమంత్రి Mallu Bhatti Vikramarka...
Read More...
Local News 

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయా: క్షమాపణలు తెలిపిన కల్వకుంట్ల కవిత

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయా: క్షమాపణలు తెలిపిన కల్వకుంట్ల కవిత హైదరాబాద్, మార్చ్ 30 (ప్రజా మంటలు): ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నిర్వహించిన ధర్నాకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయానని అంగీకరిస్తూ క్షమాపణలు తెలిపారు.ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల...
Read More...