పెద్దపల్లి పార్లమెంట్ ఎవరికీ దక్కనుంది ????.
(రాజేష్ బొంగురాల - జగిత్యాల జిల్లా ప్రతినిధి) పెద్దపల్లి పార్లమెంట్ ఎవరికీ దక్కనుంది ????.
-
కాకలు తీరిన కాకా కుటుంబ వారసుడికా ?
- ప్రజలను,నాయకులను నమ్ముకున్న ఈశ్వరుడికా??
- ప్రపంచ దేశాలకు విశ్వ గురువుగా పేరొందిన కాషాయ సైనికుడు గోమాసకా???
జగిత్యాల జిల్లా మే 09 (ప్రజా మంటలు) :
పెద్దపెల్లి లో కమలం వికసించేనా అనే సందేహం స్పష్టంగా కనిపిస్తుండగా,గతంలో నుండి పెద్దపల్లి పార్లమెంట్ లోని మంచిర్యాల, ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం నుండి ఇప్పటి వరకు హిందుత్వం, క్రింది స్థాయి కార్యకర్తల సంకల్పం బలంగా ఉన్నప్పటికీ పోలింగ్ సమీపిస్తున్న నాయకులు పెద్దపల్లి పార్లమెంట్ లోని నియోజకవర్గాల ప్రచారంలో భాగస్వాములు కాకపోగా పక్క పార్టీల వైపు తొంగి చూస్తున్నరనే ప్రజల్లో చర్చ ఒక వైపు.
గతంలో వివేకానంద నే తమ పెద్ద దిక్కు గా ఎంపీ గా ,ఎమ్మెల్యే గా తనపై ఆశలు పెట్టుకొని వారితో మమ్మేకమై వారితో బీజేపీ పార్టీలో పని చేసిన సెంటిమెంట్ తో ప్రస్తుతం నాయకులు కాషాయ పార్టీ కోసం పోరాటం చేస్తారా లేదా అనే సందేహం మరోవైపు అన్నట్లుంది.
పెద్దపల్లి పార్లమెంట్ లో కాషాయం ఖాతా తియలేక పార్టీని వదలలేక కార్యకర్తలలో మనో వేదన మొదలైంది.
కారు పార్టీలో జోష్ నింపుతున్న మాజీ సీఎం కెసిఆర్ తరచూ రోడ్డు షో లతో ప్రజలకు దగ్గరవుతున్నరు.మాజీ మంత్రి,తెలంగాణ ఉద్యమకారుడు, సింగరేణి కార్మికులు గా అనుభవం కల్గిన కొప్పుల ఈశ్వర్ మిస్టర్ కూల్ గా రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి లో తనకున్న మంచి పేరు,వ్యక్తిత్వం, ఆదరణ అభిమానాలు తనని గట్టెకిస్తాయి అని ప్రగడమైన విశ్వసం తో తనతో కలిసి పని చేసిన నాయకులు,తాను చేసిన అభివృద్ధి పనులు తనకు కొండంత అండగా ఉంటాయని నమ్ముతున్నారు.
యువత కు స్ఫూర్తిగా గులాబీ శ్రేణులలో ఉత్సహం నింపుతూ తన కూతురు నందిని ప్రజలతో మాట్లాడుతు ఈ ఒక్కసారి ఆలోచించండి, ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈశ్వర్ అన్నగా మీముందుకు వచ్చిండు, మీరు నమ్మిన మీ స్థానిక నాయకులు మిమ్ములను మోసం చేసి ఇబ్బంది పెట్టినారు కానీ నాయకులు మిమ్ములను ఇబ్బంది పెడితే వారికీ స్థానిక ఎలక్షన్ లలో బుద్ది చెప్పండి.
న్యాయం ధర్మం కోసం పరితపించే మీ ఈశ్వరుడు అయిన మా నాన్న కి పెద్దపల్లి ఎంపీ గా అవకాశం ఇవ్వండి అని ప్రజలను వేడుకోవడం చర్చనీయ అంశం.
సీఎం రేవంత్ రెడ్డి జనజాతర సభలకు జనం నిరంజనాలు పలుకుతుండగా పెద్దపల్లి ఎంపీ కాకా కుటుంబానికే దక్కనుందా అనే చర్చ ప్రజల్లో విస్తృత కొనసాగుతుంది.
పెద్దపల్లి పార్లమెంట్ పై పట్టున్న తాత మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకట్ స్వామి కుటుంబ నేపథ్యంలో తండ్రి వివేక్ ఎంపీ చేసి ప్రజలతో, నాయకులతో కలసిపోయే బలమైన నాయకులు కాగా మంత్రి శ్రీధర్ బాబు అండదండలు,పార్టీ ఆపదలో ఉన్న సమయం లో నేనున్న అంటూ అప్పటి మాజీ మంత్రి గా, ఎమ్మెల్యే గా ప్రస్తుతం మంత్రి గా మంచిర్యాల, ధర్మపురి, రామగుండం, మంథని, బెల్లంపల్లి, చెన్నూర్, పెద్దపల్లి నియోజకవర్గం లపై పట్టు సాధించిన సౌమ్యులు గా పేరున్న మంత్రి శ్రీధర్ బాబు పార్లమెంట్ ఇంచార్జ్ గా హస్తం భారీ మెజారిటీ తో ప్రభంజనం సృష్టించం కాయంగా ప్రచార హోరు జరుగున్న పరిస్థితులు కనబడటం ఒక ఎత్తు.
పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గం లలో శాసనసభ్యులు గా ప్రతిపక్షం కి అవకాశం ఇవ్వకుండా మంచి మెజారిటీ తో గెలిచిన సీనియర్ ఎమ్మెల్యేలు ఉండడం ప్రతి నియోజకవర్గం లో తామే పార్లమెంట్ అభ్యర్థి అన్నట్లుగా ప్రచారాలు ఉదృతం చేయడం అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కి కలిసోచ్చే కాలం గా పార్లమెంట్ పరిధిలో వాతావరణం మారిపోయింది.
పది సంవత్సరాలనుండి కసి తో ఎప్పుడా అని ఎదిరి చూసిన బలమైన నాయకులు, క్రమశిక్షణ తో మేమున్నాం అంటూ పని చేసే కార్యకర్తలు మిగితా పార్టీలకు మేమేమి తీసుపోము అన్నట్లు కార్యకర్తలే ప్రచారం ముమ్మరం చేయడం కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతుంది.
ఏది ఏమైనప్పటికి గతం లో కంచుకోటగా కాంగ్రెస్ కి, పది సంవత్సరాలు బి ఆర్ యస్ కు అవకాశం ఇచ్చిన పెద్దపల్లి పార్లమెంట్ ఓటర్లు ఈసారి కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ లకు ఓటు వేస్తారా?
సాగు త్రాగు నీటి ప్రాజెక్టులు,రోడ్లు,ప్రజలకు అందించిన పథకాలు, అన్ని తామే అభివృద్ధి చేశాం అనే బి ఆర్ యస్ కు వేస్తారా?
లేదా నమో మోడి, జై శ్రీరామ్, హిందుత్వం కోసం మేమున్నాం అంటున్న,మోడీ కేంద్ర ప్రభుత్వం హయంలో చేసిన పలు జన సంక్షేమ ప్రయోజనాలు అందించిన బీజేపీ కి ఓటు వేస్తారో వేచి చూడాల్సిందే.
More News...
<%- node_title %>
<%- node_title %>
బిసి రిజర్వేషన్ల ఖరారు తర్వాతనే జెడ్పిటిసి ,ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలి జిల్లా అదనపు కలెక్టర్కు బీసీ నాయకులు వినతి
జగిత్యాల ఫిబ్రవరి 20 (ప్రజా మంటలు) స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల తర్వాతనే జడ్.పి.టి.సి., ఎం.పి.టి.సి. ఎన్నికలకు వెళ్ళాలి. లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని బీసీ నాయకులు అన్నారు .
రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల కంటే ముందు కామారెడ్డి డిక్లరేషన్లో బిసిలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పిస్తామని చెప్పి, 42% రిజర్వేషన్లను కల్పించకుండానే సర్పంచ్... పలు ఆలయాలు సందర్శించిన మున్సిపల్ నూతన చైర్పర్సన్ దంపతులు
జగిత్యాల సెప్టెంబర్ 20 (ప్రజా మంటలు) ఇటీవల జగిత్యాల మున్సిపల్ ఎన్నికలు జరగగా చైర్పర్సన్ గా ఎన్నికైన సమిండ్ల వాణి శ్రీనివాస్ దంపతులు జిల్లా కేంద్రంలోని ఎడ్లంగడి శ్రీ రామాలయం కూరగాయల మార్కెట్లో గల శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయాన్ని శుక్రవారం సందర్శించారు.
ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం... ఘనంగా శివాజీ జయంతి శోభాయాత్ర.
జగిత్యాల ఫిబ్రవరి 20 (ప్రజా మంటలు)చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. శివాజీ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం లో భాగంగా మడేలేశ్వర స్వామి దేవాలయం వద్ద హిందూ ధర్మ ధ్వజాన్ని ఆర్ఎస్ఎస్ విభాగ సంఘచాలక్ డాక్టర్ భీమనాతిని శంకర్ ఆవిష్కరించి శోభాయాత్ర... జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అవినీతీశాఖ వలలో నలుగురు ఉద్యోగులు
భూపాలపల్లి/మంథని ఫిబ్రవరి 20 (ప్రజా మంటలు):
: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించి పలువురు ప్రభుత్వ ఉద్యోగులను లంచం కేసుల్లో పట్టుకున్నారు.
భూపాలపల్లి జిల్లా కోర్టులో సర్టిఫైడ్ కాపీ ఇవ్వడానికి రూ.5 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా స్టెనోగ్రాఫర్ పాలకుర్తి సాయి చరణ్తో పాటు కోర్టు... కందేనకుంట కుల బహిష్కరణ ప్రచారం అవాస్తవం – సామాజిక సమరసత వేదిక నివేదిక
జగిత్యాల, ఫిబ్రవరి 20 (ప్రజా మంటలు):బీరుపూర్ మండలం కందేనకుంట గ్రామంలో కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రచారం పూర్తిగా అవాస్తవమని సామాజిక సమరసత వేదిక (ఆర్ ఎస్ ఎస్ అనుబంధ సంస్థ) నిజ నిర్ధారణ కమిటీ స్పష్టం చేసింది. సంఘటనపై వాస్తవాలు తెలుసుకునేందుకు వేదిక సభ్యులు గ్రామాన్ని సందర్శించి... ఆర్డీవో కార్యాలయం ఆకస్మిక తనిఖీ
జగిత్యాల ఫిబ్రవరి 20(ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలో జగిత్యాల ఆర్డీవో కార్యాలయంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్. జాతీయ రహదారి పనులకు సంబంధించిన అవార్డు కాపీలను రైతులకు త్వరగా ఇవ్వాలని, పెండింగ్ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ... అమీర్ పేట మైత్రీవనం చౌరస్తాలో అగ్ని ప్రమాదం – 60 మంది విద్యార్థులు సురక్షితం
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ప్రజా మంటలు):
నగరంలోని హైదరాబాద్ అమీర్పేట మైత్రీవనం చౌరస్తాలో ఉన్న ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కాంప్లెక్స్లోని ఓ కోచింగ్ సెంటర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
కోచింగ్ సెంటర్లో మంటలు
ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు... ట్యాంక్ బండ్ పై ఫూలే విగ్రహ పనుల పరిశీలించిన కవిత–
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ప్రజా మంటలు):
ట్యాంక్ బండ్పై ఐమాక్స్ ఎదురుగా ఉన్న లేక్ వ్యూ పార్క్లో మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి విగ్రహ ఏర్పాటు పనులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరిశీలించారు.
అసెంబ్లీలోనూ ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలి
రెండున్నరేళ్లుగా ఫూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి... డీఎండీకే – డీఎంకే కూటమి: రాజకీయ లెక్కలు ఏమిటి?
చెన్నై ఫిబ్రవరి 20:
తమిళనాడు రాజకీయాల్లో కీలకమైన మార్పు చోటుచేసుకుంది.డీఎండీకే అధికార పార్టీ అయిన డీఎంకే కూటమిలో చేరింది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల వరకు డీఎండీకే ఏ కూటమిలో చేరుతుందో స్పష్టత లేకుండా ఉంది. అధికార పార్టీ వైపు వెళ్తుందా? లేక ప్రతిపక్ష కూటమిలో చేరుతుందా? అనే సందేహాలు... నీట్–ఎస్ఎస్ ప్రవేశాలపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు
చెన్నై, ఫిబ్రవరి 19:
నీట్–ఎస్ఎస్ 2024–25 ప్రవేశాల విషయంలో కీలక తీర్పు వెలువడింది. కౌన్సెలింగ్కు నిర్ణయించిన గడువు ముగిసిన తర్వాత ఖాళీ సీట్లు ఉన్నాయనే కారణంతో అదనపు మాప్-అప్ కౌన్సెలింగ్కు అనుమతి ఇవ్వడం సరికాదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది.
చీఫ్ జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ జి. అరుల్ మురుగన్లతో కూడిన ధర్మాసనం... రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన: తెలంగాణ అభివృద్ధి రోడ్మ్యాప్పై జాతీయ నేతలతో చర్చ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు):
తెలంగాణ అభివృద్ధి దిశను మరింత వేగవంతం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వంతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేబినెట్ సహచరులు, రాష్ట్ర సీనియర్ నాయకులు హాజరయ్యారు.
ప్రతినిధి బృందం మల్లికార్జున ఖర్గే మరియు రాహుల్ గాంధీలను కలిసి తెలంగాణ... బీజేపీ కోవర్టులపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
నిజామాబాద్ ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు)::
బీజేపీ కోవర్టులపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా పార్టీని లోపల నుంచే పీడిస్తున్న వారు ఇకనైనా పార్టీని విడిచిపెట్టాలని అన్నారు.
ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఎదిగిందని పేర్కొన్న అర్వింద్, దక్షిణ తెలంగాణలో పార్టీని మరింత... 