పెద్దపల్లి పార్లమెంట్ ఎవరికీ దక్కనుంది ????.

On
పెద్దపల్లి పార్లమెంట్ ఎవరికీ దక్కనుంది ????.

(రాజేష్ బొంగురాల - జగిత్యాల జిల్లా ప్రతినిధి) 
 
పెద్దపల్లి పార్లమెంట్ ఎవరికీ దక్కనుంది ????.
  • కాకలు తీరిన కాకా కుటుంబ వారసుడికా ? 
  • ప్రజలను,నాయకులను నమ్ముకున్న ఈశ్వరుడికా??
  • ప్రపంచ దేశాలకు విశ్వ గురువుగా పేరొందిన కాషాయ సైనికుడు గోమాసకా???

 

జగిత్యాల జిల్లా మే 09 (ప్రజా మంటలు) :

పెద్దపెల్లి లో కమలం వికసించేనా అనే సందేహం స్పష్టంగా కనిపిస్తుండగా,గతంలో నుండి పెద్దపల్లి పార్లమెంట్ లోని మంచిర్యాల, ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం నుండి ఇప్పటి వరకు హిందుత్వం, క్రింది స్థాయి కార్యకర్తల సంకల్పం బలంగా ఉన్నప్పటికీ పోలింగ్ సమీపిస్తున్న నాయకులు పెద్దపల్లి పార్లమెంట్ లోని నియోజకవర్గాల ప్రచారంలో భాగస్వాములు కాకపోగా పక్క పార్టీల వైపు తొంగి చూస్తున్నరనే ప్రజల్లో చర్చ ఒక వైపు.

గతంలో వివేకానంద నే తమ పెద్ద దిక్కు గా ఎంపీ గా ,ఎమ్మెల్యే గా తనపై ఆశలు పెట్టుకొని వారితో మమ్మేకమై వారితో బీజేపీ పార్టీలో పని చేసిన సెంటిమెంట్ తో ప్రస్తుతం నాయకులు కాషాయ పార్టీ కోసం పోరాటం చేస్తారా లేదా అనే సందేహం మరోవైపు అన్నట్లుంది.

పెద్దపల్లి పార్లమెంట్ లో కాషాయం ఖాతా తియలేక పార్టీని వదలలేక కార్యకర్తలలో మనో వేదన మొదలైంది.

కారు పార్టీలో జోష్ నింపుతున్న మాజీ సీఎం కెసిఆర్ తరచూ రోడ్డు షో లతో ప్రజలకు దగ్గరవుతున్నరు.మాజీ మంత్రి,తెలంగాణ ఉద్యమకారుడు, సింగరేణి కార్మికులు గా అనుభవం కల్గిన కొప్పుల ఈశ్వర్ మిస్టర్ కూల్ గా రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి లో తనకున్న మంచి పేరు,వ్యక్తిత్వం, ఆదరణ అభిమానాలు తనని గట్టెకిస్తాయి అని ప్రగడమైన విశ్వసం తో తనతో కలిసి పని చేసిన నాయకులు,తాను చేసిన అభివృద్ధి పనులు తనకు కొండంత అండగా ఉంటాయని నమ్ముతున్నారు.

యువత కు స్ఫూర్తిగా గులాబీ శ్రేణులలో ఉత్సహం నింపుతూ తన కూతురు నందిని ప్రజలతో మాట్లాడుతు ఈ ఒక్కసారి ఆలోచించండి, ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈశ్వర్ అన్నగా మీముందుకు వచ్చిండు, మీరు నమ్మిన మీ స్థానిక నాయకులు మిమ్ములను మోసం చేసి ఇబ్బంది పెట్టినారు కానీ నాయకులు మిమ్ములను ఇబ్బంది పెడితే వారికీ స్థానిక ఎలక్షన్ లలో బుద్ది చెప్పండి.

న్యాయం ధర్మం కోసం పరితపించే మీ ఈశ్వరుడు అయిన మా నాన్న కి పెద్దపల్లి ఎంపీ గా అవకాశం ఇవ్వండి అని ప్రజలను వేడుకోవడం చర్చనీయ అంశం.

సీఎం రేవంత్ రెడ్డి జనజాతర సభలకు జనం నిరంజనాలు పలుకుతుండగా పెద్దపల్లి ఎంపీ కాకా కుటుంబానికే దక్కనుందా అనే చర్చ ప్రజల్లో విస్తృత కొనసాగుతుంది.

పెద్దపల్లి పార్లమెంట్ పై పట్టున్న తాత మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకట్ స్వామి కుటుంబ నేపథ్యంలో తండ్రి వివేక్ ఎంపీ చేసి ప్రజలతో, నాయకులతో కలసిపోయే బలమైన నాయకులు కాగా మంత్రి శ్రీధర్ బాబు అండదండలు,పార్టీ ఆపదలో ఉన్న సమయం లో నేనున్న అంటూ అప్పటి మాజీ మంత్రి గా, ఎమ్మెల్యే గా ప్రస్తుతం మంత్రి గా మంచిర్యాల, ధర్మపురి, రామగుండం, మంథని, బెల్లంపల్లి, చెన్నూర్, పెద్దపల్లి నియోజకవర్గం లపై పట్టు సాధించిన సౌమ్యులు గా పేరున్న మంత్రి శ్రీధర్ బాబు పార్లమెంట్ ఇంచార్జ్ గా హస్తం భారీ మెజారిటీ తో ప్రభంజనం సృష్టించం కాయంగా ప్రచార హోరు జరుగున్న పరిస్థితులు కనబడటం ఒక ఎత్తు.

పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గం లలో శాసనసభ్యులు గా ప్రతిపక్షం కి అవకాశం ఇవ్వకుండా మంచి మెజారిటీ తో గెలిచిన సీనియర్ ఎమ్మెల్యేలు ఉండడం ప్రతి నియోజకవర్గం లో తామే పార్లమెంట్ అభ్యర్థి అన్నట్లుగా ప్రచారాలు ఉదృతం చేయడం అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కి కలిసోచ్చే కాలం గా పార్లమెంట్ పరిధిలో వాతావరణం మారిపోయింది.

పది సంవత్సరాలనుండి కసి తో ఎప్పుడా అని ఎదిరి చూసిన బలమైన నాయకులు, క్రమశిక్షణ తో మేమున్నాం అంటూ పని చేసే కార్యకర్తలు మిగితా పార్టీలకు మేమేమి తీసుపోము అన్నట్లు కార్యకర్తలే ప్రచారం ముమ్మరం చేయడం కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతుంది.

ఏది ఏమైనప్పటికి గతం లో కంచుకోటగా కాంగ్రెస్ కి, పది సంవత్సరాలు బి ఆర్ యస్ కు అవకాశం ఇచ్చిన పెద్దపల్లి పార్లమెంట్ ఓటర్లు ఈసారి కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ లకు ఓటు వేస్తారా?

సాగు త్రాగు నీటి ప్రాజెక్టులు,రోడ్లు,ప్రజలకు అందించిన పథకాలు, అన్ని తామే అభివృద్ధి చేశాం అనే బి ఆర్ యస్ కు వేస్తారా?

లేదా నమో మోడి, జై శ్రీరామ్, హిందుత్వం కోసం మేమున్నాం అంటున్న,మోడీ కేంద్ర ప్రభుత్వం హయంలో చేసిన పలు జన సంక్షేమ ప్రయోజనాలు అందించిన బీజేపీ కి ఓటు వేస్తారో వేచి చూడాల్సిందే.

Tags
Join WhatsApp

More News...

Local News 

జగిత్యాలలో ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం

జగిత్యాలలో ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం జగిత్యాల (రూరల్ ) నవంబర్ 23 (ప్రజా మంటలు): జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (DRDA) మరియు సెర్ప్ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళల కోసం నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎస్సీ, ఎస్టీ,...
Read More...
Local News 

చిన్నారుల హక్కులపై అవగాహన కల్పించాలి

చిన్నారుల హక్కులపై అవగాహన కల్పించాలి రాంగోపాల్ పేట లో ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం సికింద్రాబాద్, నవంబర్ 23 (ప్రజామంటలు) : అప్స స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో, సర్వ్ నీడీ సహకారంతో రాంగోపాల్‌పేట డివిజన్‌లోని యూత్ హాస్టల్‌లో ప్రపంచ బాలల హక్కుల దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. అప్స సంస్థ పని చేస్తున్న 30 బస్తీలలోని   బాలబాలికలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూత్...
Read More...
Local News 

తెలంగాణ ప్రజల హృదయంలో సర్దార్ పటేల్ కు శాశ్వత స్థానం

తెలంగాణ ప్రజల హృదయంలో సర్దార్ పటేల్ కు శాశ్వత స్థానం సికింద్రాబాద్, నవంబర్ 23 (ప్రజామంటలు) : సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్బంగా సికింద్రాబాద్‌లో ఆదివారం సర్ధార్ 150 యూనిటీ మార్చ్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. సీతాఫల్మండి శివాజీ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ, చిలకలగూడ గాంధీ విగ్రహం వరకు సాగింది. ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు, యువత పాల్గొన్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి జి.కిషన్...
Read More...
Local News 

రాష్ట్ర స్థాయి ఖో-ఖో పోటీలకు వెల్లుల్ల విద్యార్థి ఎంపిక

రాష్ట్ర స్థాయి ఖో-ఖో పోటీలకు వెల్లుల్ల విద్యార్థి ఎంపిక మెట్టుపల్లి నవంబర్ 23(ప్రజ మంటలు దగ్గుల అశోక్)   మెట్టుపల్లి పట్టణ పరిధిలోని  వెల్లుల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  విద్యార్థి ఖో ఖో పోటీలకు *నల్ల నవీన్*అండర్-17 బాలుర విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఆదివారం నుండి మూడు రోజుల పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి ఖో ఖో పోటిల్లో ఆడనున్నట్టు
Read More...
Local News  State News 

సర్కారు పెద్దలు...! ఫుట్ పాత్ అనాధలను ఆదుకోండి

సర్కారు పెద్దలు...! ఫుట్ పాత్ అనాధలను ఆదుకోండి సికింద్రాబాద్,  నవంబర్ 23 (ప్రజా మంటలు):  సికింద్రాబాద్‌లోని  పద్మారావు నగర్ కు చెందిన స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం 289వ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వాహనంలో నగరంలోని ఫుట్‌పాత్‌లు, సంచారజాతుల ప్రాంతాలను సందర్శించి నిరాశ్రయులకు ఆహారం పంపిణీ చేశారు. ప్రభుత్వం స్పందించి ఫుట్పాత్ పై నివాసం ఉంటున్న వారికి ఉపాధి  ఇచ్చి శాశ్వత ఆవాసం కల్పించాలని...
Read More...
Local News  State News 

యశోద హైటెక్ సిటీలో AI ఆధారిత లంగ్ నోడ్యూల్ క్లినిక్

యశోద హైటెక్ సిటీలో AI ఆధారిత లంగ్ నోడ్యూల్ క్లినిక్ హైదరాబాద్, నవంబర్ 23 (ప్రజామంటలు): యశోద హాస్పిటల్స్–హైటెక్ సిటీలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించేందుకు అత్యాధునిక AI ఆధారిత లంగ్ నోడ్యూల్ క్లినిక్‌ను యశోద మేనేజింగ్ డైరెక్టర్ డా. జి.ఎస్.రావు ప్రారంభించారు. భారతదేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఆలస్యంగా గుర్తించబడటం వల్ల అధిక మరణాలు సంభవిస్తున్నాయని ఆయన తెలిపారు. సీనియర్ పల్మోనాలజిస్ట్ డా. నాగార్జున మాటూరు మాట్లాడుతూ......
Read More...
National  International   State News 

జాఫ్రీ ఎప్స్టిన్ ఫైళ్లలో మోదీ, మరో మంత్రి :: దేశాన్ని. కుదిపేస్తున్న వార్త

జాఫ్రీ ఎప్స్టిన్ ఫైళ్లలో మోదీ, మరో మంత్రి :: దేశాన్ని. కుదిపేస్తున్న వార్త "Modi on board" అనే మాట ఎం చెబుతుంది ? ఇప్పుడొచ్చిన తాజా ఎపిస్టిన్ ఫైళ్లు (“Epstein Files”)లో భారతీయ రాజకీయ, వ్యాపార వర్గాలకి చెందిన కొన్ని ప్రముఖులతో గది చోటు పొందిన ఫైళ్లు వెళ్లదీయబడ్డాయి. ఈ విషయంపై లోతైన పరిశోధన ఇది ఎవరిని దోషుల గానో, బాధ్యులుగానో చెప్పడానికి కాదు.రాజకీయ,వ్యాపార సంబంధాలు ఎలా...
Read More...
Local News 

ఏం చేశారని విజయోత్సవాలు జరుపుకుంటారు..? *కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజేశ్వరి విమర్శలు

 ఏం చేశారని విజయోత్సవాలు జరుపుకుంటారు..?  *కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజేశ్వరి విమర్శలు సికింద్రాబాద్‌, నవంబర్ 23 ( ప్రజా మంటలు):  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ముఖంతో విజయోత్సవాలు జరుపుకుంటోంది, ఎలాంటి నెరవేర్చని హామీలతో ఎన్నికలను ఎదుర్కోవాలని చూస్తోంది అని బీజేపీ రాష్ట్ర నాయకురాలు మల్లేశ్వరపు రాజేశ్వరి ప్రశ్నించారు. మహాలక్ష్మి ఫ్రీ బస్సు మినహా ఇప్పటి వరకు ఒక్క గ్యారంటీ కూడా పూర్తిగా అమలు కాలేదని ఆమె విమర్శించారు....
Read More...
National  State News 

గుజరాత్‌లో SIR పని ఒత్తిడితో నాలుగు రోజుల్లో నలుగురు BLO సిబ్బంది మృతి

గుజరాత్‌లో SIR పని ఒత్తిడితో నాలుగు రోజుల్లో నలుగురు BLO సిబ్బంది మృతి వడోదరా / గుజరాత్, నవంబర్ 22 (ప్రజా మంటలు): గుజరాత్‌లో Special Intensive Revision (SIR) కార్యక్రమం క్రమంలో Booth Level Officers (BLO) మరియు BLO అసిస్టెంట్లపై భారీ పని ఒత్తిడి నెలకొంది. ఈ ఒత్తిడిలోనే వడోదరాలో BLO అసిస్టెంట్ ఉషాబెన్ ఇంద్రసింగ్ సోలంకీ విధి నిర్వహణలో మృతి చెందారు. గత నాలుగు రోజుల్లో...
Read More...

అణు రంగంలో ప్రైవేట్ ప్రవేశానికి బిల్లు:: మరో 10 కీలక బిల్లులు సిద్ధం

అణు రంగంలో ప్రైవేట్ ప్రవేశానికి బిల్లు:: మరో 10 కీలక బిల్లులు సిద్ధం న్యూ ఢిల్లీ, నవంబర్ 22 (ప్రజా మంటలు): డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే వింటర్ సెషన్‌లో కేంద్ర ప్రభుత్వం మొత్తం 10 కీలక బిల్లులను ప్రవేశపెట్టబోతోంది. వీటిలో దేశంలోని సివిల్ న్యూక్లియర్ రంగాన్ని ప్రైవేట్ కంపెనీలకు తెరవడాన్ని ప్రతిపాదించే బిల్లు ప్రధానంగా నిలుస్తోంది. అదేవిధంగా, చండీగఢ్‌పై రాష్ట్రపతికి నేరుగా చట్టాలు, నిబంధనలు రూపొందించే అధికారం...
Read More...
National  Local News  State News 

అందెశ్రీ కీర్తి తెలంగాణ చరిత్రలో శాశ్వతం:రేవంత్ రెడ్డి 

అందెశ్రీ కీర్తి తెలంగాణ చరిత్రలో శాశ్వతం:రేవంత్ రెడ్డి  హైదరాబాద్, నవంబర్ 22 (ప్రజా మంటలు): తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన కవులు, కళాకారులలో అందెశ్రీ పేరు ఎన్నటికీ చెరిగిపోదని, రాష్ట్ర చరిత్రలో ఆయన స్థానం శాశ్వతమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రవీంద్రభారతిలో జరిగిన అందెశ్రీ స్మారక సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,వజ్రాలపై దశాబ్దాలు చర్చించినా కోహినూర్‌కు పోటీ లేకపోయినట్టే,...
Read More...
Local News 

జగిత్యాల జిల్లా నూతన డీసీసీ అధ్యక్షునికి ఆత్మీయ సన్మానం

జగిత్యాల జిల్లా నూతన డీసీసీ అధ్యక్షునికి ఆత్మీయ సన్మానం జగిత్యాల, నవంబర్ 22 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించిన జిల్లా కమిటీ అధ్యక్షుల్లో భాగంగా జగిత్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా, మాజీ మంత్రి వర్గీయుడైన, గాజంగి నందయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఇందిరా భవన్‌లో నందయ్యను ఘనంగా సన్మానించారు....
Read More...