తెలుగు జానపద సాహిత్య పితామహులు బిరుదు. జానపద సాహిత్యానికి బిరుదు రామరాజు ఎనలేని సేవలు ఏప్రిల్ 16... బిరుదు రామరాజు జయంతి
తెలుగు జానపద సాహిత్య పితామహులు బిరుదు. జానపద సాహిత్యానికి బిరుదు రామరాజు ఎనలేని సేవలు ఏప్రిల్ 16... బిరుదు రామరాజు జయంతి
రామ కిష్టయ్య సంగన భట్ల...
9440595494
జానపద సాహిత్య రంగంలో ఆచార్య రామరాజు పేరు తెలియని వారుండరు. తెలుగు జానపద సాహిత్యం గురించి ప్రప్రథమంగా డాక్టరేటు పట్టాకోసం పరిశోధన చేసి, దేశ విశ్వ విద్యాలయాలలో జానపద సాహిత్యం పై పరిశోధన లకు ప్రవేశం కలిపించడానికి ప్రేరణ అయినారు రామరాజు. ఆయన పరిశోధన భూమికగా ఇతర విశ్వ విద్యాలయాలలో జానపద సాహిత్యం గూర్చి పరిశోధన ప్రారంభమయింది. తెలుగునాట విశ్వ విద్యాలయాల్లో జానపద సాహిత్య శాఖలను రూపొందించి, వాటిలో తమ పరిశోధనాత్మక రచనలతో, బోధనతో, మార్గ నిర్దేశనంతో ఒకతరం జానపద సాహిత్య పరిశోధకులను, అధ్యాపకులను తయారు చేసిన మార్గదర్శకులు ఆయన. భారతీయ విశ్వ విద్యాలయాల్లోని ఆదర్శ ప్రాయమైన, అరుదైన మౌలిక పరిశోధకుల్లో ఆయన అగ్రగణ్యులు. 1955లో ప్రచురించ బడిన ఆయన పరిశోధనా గ్రంథం... 'జానపద గేయ సాహిత్యము' తెలుగు జానపద అధ్యయనాలకు విజ్ఞాన సర్వస్వంగా అందుబాటులో ఉంది.
బిరుదురాజు రామరాజు 1925 ఏప్రిల్ 16 వ తేదీ దేవనూరు గ్రామంలో లక్ష్మీదేవమ్మ, బిరుదు రాజు నారాయణరాజు దంపతు లకు జన్మించాడు. ప్రాథమిక విద్యను హన్మకొండ శివార్లలోని దేవనూరు, మడికొండలలో పూర్తి చేసి, ఉన్నత చదువుల కోసం ఎనిమిదేళ్లపాటు హన్మకొండకు 14 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వచ్చింది. 3వ తరగతి నుండి ఇంటర్మీడియెట్ వరకు ఉర్దూ మీడియంలో చదువుకున్నాడు. మెట్రిక్ చదివేటప్పుడు 11వ ఆంధ్ర మహాసభల సందర్భంగా మహాత్మా గాంధీ వరంగల్ వచ్చినప్పుడు ఆనాటి సభలలో స్వచ్ఛంద సేవలకు అందించాడు. గాంధీజీతో కలిసి పాదయాత్ర చేశాడు. 1947లో కాంగ్రెస్ సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలు పాలయ్యాడు. చదువు కునే రోజుల్లో ఆర్యసమాజం ప్రభావానికి లోనైనాడు. నిజాం వ్యతిరేక రాజకీయోద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు. నిజాం కళాశాలలో బి.ఎ. చదువుతున్న సమయంలో దాశరథి కృష్ణమా చార్యతో పరిచయం ఏర్పడింది. కాళోజీ నారాయణరావు, టి.హయగ్రీవా చారి, ముదిగొండ సిద్ద రాజలింగం, జమలాపురం కేశవరావు తదితర యువ నాయకులతో కలిసి రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, స్టేట్ కాంగ్రెస్ ఉద్యమాలలో పాల్గొని 1947లో మూడు నెలలపాటు కారాగార శిక్ష అనుభవించాడు. 1947-50ల మధ్యకాలంలో నిజాం కళాశాలలో తెలంగాణా విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా పని చేశాడు. బి.ఎ.పూర్తయ్యాక న్యాయ శాస్త్రంలో పట్టా పొందాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీలో ఎం.ఎ. చదివే రోజులలో విద్యార్థి నాయకుడిగా గుర్తింపు పొందాడు. ఆ సమయం లో సి.నారాయణ రెడ్డితో కలిసి కొంతకాలం రామనారాయణ కవులు పేరుతో జంట కవులుగా కవిత్వం చెప్పారు. మాడపాటి హనుమంతరావు ఆంధ్రసంఘం నెలకొల్పి దానికి బిరుదురాజు రామరాజును అధ్యక్షుడిగా నియమించాడు. తెలంగాణ రచయితల సంఘానికి తొలి కార్యదర్శిగా ఉన్నాడు. కాగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డాక ఆంధ్ర రచయితల సంఘంగా మారింది. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం మార్గ దర్శకత్వంలో తెలుగు జానపద గేయసాహిత్యం అనే అంశంపై పరిశోధన చేసి దక్షిణ భారత దేశంలోనే జానపద సాహిత్యంపై మొట్టమొదటి పి.హెచ్.డి ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి సంపాదిం చాడు. సంస్కృతంలో ఎం.ఎ. చేసి అందులో కూడా డాక్టరేట్ పొందా డు.
ఉస్మానియా విశ్వ విద్యాలయంలో 1951లో ఉపన్యాసకుడిగా చేరి క్రమంగా పదోన్నతుల ద్వారా తెలుగుశాఖకు డీన్గా, అధ్యక్షు డిగా విధులు నిర్వర్తించాడు. ఆయన మార్గదర్శకత్వంలో 37 మంది పిహెచ్.డి పట్టాలు పొందా రు. రామరాజు పర్యవేక్షణలో కేతవరపు రామకోటిశాస్త్రి, కోవెల సుప్రసన్నాచార్య, ముదిగొండ వీరభద్ర శాస్త్రి, అక్కిరాజు రమాపతి రావు, అనంతలక్ష్మి, కాళిదాసు పురుషోత్తం, రవ్వా శ్రీహరి వంటి వారు తమ పరిశోధనలు చేసి డాక్టరేట్ పట్టాలను పొందడం గమనార్హం. 1983లో ప్రొఫెసర్గా పదవీ విరమణ చేశాడు.
1994లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, 1995లో భారత ప్రభుత్వం నుండి నేషనల్ ప్రొఫెషనల్షిప్, 2001లో సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ వారి శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డ్, 2003లో శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం,2006/2007లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారి 'విశిష్ట పురస్కారం', 2009లో సి.పి.బ్రౌన్ అకాడెమీ వారి తెలుగు భారతి పురస్కారం అందుకున్నాడు.
ప్రాచీన సంస్కృతాంధ్ర గ్రంథాల్ని పరిశీలించి, పరిష్కరించి మొదటి సారిగా వెలుగులోకి తేవడానికి విశేష కృషి చేశాడు. సంస్కృతంలో పీహెచ్డీ చేసి 'సంస్కృత సాహిత్యానికి ఆంధ్రుల సహకారం' అనే గ్రంథంగా తన వ్యాసాన్ని ప్రచురించాడు. తాళపత్ర గ్రంథాల్ని సేకరించి పలు వ్యాసాల ద్వారా వాటిని పరిచయం చేశాడు. సంస్కృత భాషా సాహిత్యాలకు ఆంధ్రులు చేసిన సేవను గూర్చి విడిగా ఒక పెద్ద పరిశోధన గ్రంధ రచనే చేశాడు. శరత్ చంద్ర ఛటర్జీ, మున్షీ ప్రేమ్చంద్ వంటి అగ్ర రచయితల రచనలను తొలిసారిగా తెలుగులోకి అనువదించి సాహిత్యాభి మానులకు పరిచయం చేశాడు. ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాషలలో మంచి ప్రావీణ్యం ఉన్న పండితుడు రామరాజు గురు గోవింద్ సింగ్ చరిత్ర, జాతక కథలను హిందీ నుండి తెలుగులోకి అనువదించాడు. ఉర్దూ-తెలుగు నిఘంటువును కూడా రూపొందిం చాడు. ఆంగ్లంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో అనేక ఉపన్యాసాలు ఇస్తూ, అనేక పుస్తకాలు వ్రాసాడు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు యాభైకి పైగా విశ్వ విద్యాలయాలతో అనుబంధం కలిగి ఉండి, పలు యూనివర్సిటీలకు విజిటింగ్ ప్రొఫెసర్గా పని చేశాడు. తెలుగు జానపద అధ్యయనాల గాడ్ఫాదర్ గా కీర్తించబడే ఆచార్య రామరాజు, 2010, ఫిబ్రవరి 8 న హైదరాబాదులో మరణించాడు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
జగిత్యాల జిల్లా ప్రతినిధి, ( ప్రజా మంటలు) సెప్టెంబర్ 19:
గణేశ్ నిమజ్జనo శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సజావుగా జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. శనివారం జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తో కలిసి గణేష్ నిమజ్జన ప్రాంతాలైన జగిత్యాలలో... వర్ష కొండలో గణపతి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు,
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామంలో పెద్ద చెరువు వద్ద గణపతి నిమజ్జన ఏర్పాట్లను తహసిల్దార్ వరప్రసాద్,ఎస్ఐ నవీన్ పరిశీలించినరు,
గంగమ్మ గుడి కట్టపైన నుండి చిన్న గణపతులు నిమజ్జనం, గంగపుత్ర సంఘ భవనం వద్ద నుండి పెద్ద గణపతులు నిమగ్నం చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నట్లు... మహాత్మ జ్యోతిరావ్ ఫూలే స్కూల్ ని ఆకష్మిక తనిఖీ చేసిన సీనియర్ సివిల్ జడ్జి.-ఆర్. అజయ్ కుమార్
మెట్టుపల్లి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
మెట్ పల్లి మండల లీగల్ సర్వీసెస్ ఛైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి ఆర్. అజయ్ కుమార్, శనివారం పట్టణంలోని మహాత్మ జ్యోతిరావ్ పూలే బాలుర హాస్టల్, బీర్పూర్ ఎట్ మెట్ పల్లిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో ఉన్న కిచెన్, బాత్రూం,... చేనేత కార్మికులందరికీ ‘చేయూత’ పెన్షన్ వర్తింపజేయాలి : ఎల్ రమణ
హైదరాబాద్ సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న అర్హులైన ప్రతి కార్మికుడికి ‘చేయూత’ పెన్షన్ పథకం వర్తించేలా అర్హత ప్రమాణాలను విస్తరించాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
ప్రస్తుతం జియో ట్యాగింగ్ ద్వారా గుర్తింపు... రేవంత్రెడ్డికి సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదు: మాజీ మంత్రి జీవన్రెడ్డి
పాలన చేతగాక.. రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్
హైకోర్టు తీర్పు పార్టీ ఫిరాయింపుల విషయంలో ప్రభుత్వానికి గుణపాఠం
జగిత్యాల, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి ఆరోపించారు. రైతుల సమస్యలు, ఆరు గ్యారంటీల అమలు వంటి... కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అమన్ జిత్ సింగ్
కరీంనగర్, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
కరీంనగర్ పట్టణంలోని సిక్కు వాడకు చెందిన కాంగ్రెస్ నాయకుడు అమన్ జిత్ సింగ్ను జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. చొప్పదండి ఎమ్మెల్యే, DCC అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం రేకుర్తి క్యాంపు కార్యాలయంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్... రేపే కొడంగల్ గడ్డపై కల్వకుంట్ల కవిత పాంచజన్య శంఖారావం
కొడంగల్–కోస్గి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు)::
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కోస్గి కాలేజీ గ్రౌండ్లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నారు. సభకు పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. 120 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో సభా వేదికను ఏర్పాటు చేయగా, సుమారు... మున్సిపల్ లో గణనాథునుకి ఉత్తర పూజలు
జగిత్యాల, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
వినాయక నవరాత్రుల సందర్భంగా జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణనాథునికి మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, కమిషనర్ సత్య ప్రణవ్, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్తర పూజలు చేసి అన్నదానం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర చేపట్టారు.... సింహాచలం జగన్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు
ఎండపెల్లి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఎండపెల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన కుటుంబ సభ్యులను జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత... రాయికల్లో లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే సంజయ్
రాయికల్, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
రాయికల్ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.30 లక్షల వ్యయంతో నాలుగు డీటీఆర్లు ఏర్పాటు చేసినట్లు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. గృహజ్యోతి పథకం... రాయికల్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ
రాయికల్, సెప్టెంబర్ 18 (ప్రజా మంటలు):
రాయికల్ పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీరనాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆవిష్కరించారు.
ఈ విగ్రహాన్ని వేముల ప్రభాకర్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా... శ్రీ గౌరీ ప్రియ నగర వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ మండపం వద్ద కొనసాగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు
కీసర సెప్టెంబర్ 17 ( ప్రజా మంటలు)కుందన్ పల్లి లోని శ్రీ గౌరీ ప్రియ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ మండపం వద్ద నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతినిత్యం కొనసాగుతున్నాయి.
దీనిలో భాగంగా గణేష్ హోమము మాతలచే సామూహిక కుంకుమార్చనలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు... 