తెలుగు జానపద సాహిత్య పితామహులు బిరుదు. జానపద సాహిత్యానికి బిరుదు రామరాజు ఎనలేని సేవలు ఏప్రిల్ 16... బిరుదు రామరాజు జయంతి
తెలుగు జానపద సాహిత్య పితామహులు బిరుదు. జానపద సాహిత్యానికి బిరుదు రామరాజు ఎనలేని సేవలు ఏప్రిల్ 16... బిరుదు రామరాజు జయంతి
రామ కిష్టయ్య సంగన భట్ల...
9440595494
జానపద సాహిత్య రంగంలో ఆచార్య రామరాజు పేరు తెలియని వారుండరు. తెలుగు జానపద సాహిత్యం గురించి ప్రప్రథమంగా డాక్టరేటు పట్టాకోసం పరిశోధన చేసి, దేశ విశ్వ విద్యాలయాలలో జానపద సాహిత్యం పై పరిశోధన లకు ప్రవేశం కలిపించడానికి ప్రేరణ అయినారు రామరాజు. ఆయన పరిశోధన భూమికగా ఇతర విశ్వ విద్యాలయాలలో జానపద సాహిత్యం గూర్చి పరిశోధన ప్రారంభమయింది. తెలుగునాట విశ్వ విద్యాలయాల్లో జానపద సాహిత్య శాఖలను రూపొందించి, వాటిలో తమ పరిశోధనాత్మక రచనలతో, బోధనతో, మార్గ నిర్దేశనంతో ఒకతరం జానపద సాహిత్య పరిశోధకులను, అధ్యాపకులను తయారు చేసిన మార్గదర్శకులు ఆయన. భారతీయ విశ్వ విద్యాలయాల్లోని ఆదర్శ ప్రాయమైన, అరుదైన మౌలిక పరిశోధకుల్లో ఆయన అగ్రగణ్యులు. 1955లో ప్రచురించ బడిన ఆయన పరిశోధనా గ్రంథం... 'జానపద గేయ సాహిత్యము' తెలుగు జానపద అధ్యయనాలకు విజ్ఞాన సర్వస్వంగా అందుబాటులో ఉంది.
బిరుదురాజు రామరాజు 1925 ఏప్రిల్ 16 వ తేదీ దేవనూరు గ్రామంలో లక్ష్మీదేవమ్మ, బిరుదు రాజు నారాయణరాజు దంపతు లకు జన్మించాడు. ప్రాథమిక విద్యను హన్మకొండ శివార్లలోని దేవనూరు, మడికొండలలో పూర్తి చేసి, ఉన్నత చదువుల కోసం ఎనిమిదేళ్లపాటు హన్మకొండకు 14 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వచ్చింది. 3వ తరగతి నుండి ఇంటర్మీడియెట్ వరకు ఉర్దూ మీడియంలో చదువుకున్నాడు. మెట్రిక్ చదివేటప్పుడు 11వ ఆంధ్ర మహాసభల సందర్భంగా మహాత్మా గాంధీ వరంగల్ వచ్చినప్పుడు ఆనాటి సభలలో స్వచ్ఛంద సేవలకు అందించాడు. గాంధీజీతో కలిసి పాదయాత్ర చేశాడు. 1947లో కాంగ్రెస్ సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలు పాలయ్యాడు. చదువు కునే రోజుల్లో ఆర్యసమాజం ప్రభావానికి లోనైనాడు. నిజాం వ్యతిరేక రాజకీయోద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు. నిజాం కళాశాలలో బి.ఎ. చదువుతున్న సమయంలో దాశరథి కృష్ణమా చార్యతో పరిచయం ఏర్పడింది. కాళోజీ నారాయణరావు, టి.హయగ్రీవా చారి, ముదిగొండ సిద్ద రాజలింగం, జమలాపురం కేశవరావు తదితర యువ నాయకులతో కలిసి రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, స్టేట్ కాంగ్రెస్ ఉద్యమాలలో పాల్గొని 1947లో మూడు నెలలపాటు కారాగార శిక్ష అనుభవించాడు. 1947-50ల మధ్యకాలంలో నిజాం కళాశాలలో తెలంగాణా విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా పని చేశాడు. బి.ఎ.పూర్తయ్యాక న్యాయ శాస్త్రంలో పట్టా పొందాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీలో ఎం.ఎ. చదివే రోజులలో విద్యార్థి నాయకుడిగా గుర్తింపు పొందాడు. ఆ సమయం లో సి.నారాయణ రెడ్డితో కలిసి కొంతకాలం రామనారాయణ కవులు పేరుతో జంట కవులుగా కవిత్వం చెప్పారు. మాడపాటి హనుమంతరావు ఆంధ్రసంఘం నెలకొల్పి దానికి బిరుదురాజు రామరాజును అధ్యక్షుడిగా నియమించాడు. తెలంగాణ రచయితల సంఘానికి తొలి కార్యదర్శిగా ఉన్నాడు. కాగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డాక ఆంధ్ర రచయితల సంఘంగా మారింది. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం మార్గ దర్శకత్వంలో తెలుగు జానపద గేయసాహిత్యం అనే అంశంపై పరిశోధన చేసి దక్షిణ భారత దేశంలోనే జానపద సాహిత్యంపై మొట్టమొదటి పి.హెచ్.డి ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి సంపాదిం చాడు. సంస్కృతంలో ఎం.ఎ. చేసి అందులో కూడా డాక్టరేట్ పొందా డు.
ఉస్మానియా విశ్వ విద్యాలయంలో 1951లో ఉపన్యాసకుడిగా చేరి క్రమంగా పదోన్నతుల ద్వారా తెలుగుశాఖకు డీన్గా, అధ్యక్షు డిగా విధులు నిర్వర్తించాడు. ఆయన మార్గదర్శకత్వంలో 37 మంది పిహెచ్.డి పట్టాలు పొందా రు. రామరాజు పర్యవేక్షణలో కేతవరపు రామకోటిశాస్త్రి, కోవెల సుప్రసన్నాచార్య, ముదిగొండ వీరభద్ర శాస్త్రి, అక్కిరాజు రమాపతి రావు, అనంతలక్ష్మి, కాళిదాసు పురుషోత్తం, రవ్వా శ్రీహరి వంటి వారు తమ పరిశోధనలు చేసి డాక్టరేట్ పట్టాలను పొందడం గమనార్హం. 1983లో ప్రొఫెసర్గా పదవీ విరమణ చేశాడు.
1994లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, 1995లో భారత ప్రభుత్వం నుండి నేషనల్ ప్రొఫెషనల్షిప్, 2001లో సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ వారి శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డ్, 2003లో శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం,2006/2007లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారి 'విశిష్ట పురస్కారం', 2009లో సి.పి.బ్రౌన్ అకాడెమీ వారి తెలుగు భారతి పురస్కారం అందుకున్నాడు.
ప్రాచీన సంస్కృతాంధ్ర గ్రంథాల్ని పరిశీలించి, పరిష్కరించి మొదటి సారిగా వెలుగులోకి తేవడానికి విశేష కృషి చేశాడు. సంస్కృతంలో పీహెచ్డీ చేసి 'సంస్కృత సాహిత్యానికి ఆంధ్రుల సహకారం' అనే గ్రంథంగా తన వ్యాసాన్ని ప్రచురించాడు. తాళపత్ర గ్రంథాల్ని సేకరించి పలు వ్యాసాల ద్వారా వాటిని పరిచయం చేశాడు. సంస్కృత భాషా సాహిత్యాలకు ఆంధ్రులు చేసిన సేవను గూర్చి విడిగా ఒక పెద్ద పరిశోధన గ్రంధ రచనే చేశాడు. శరత్ చంద్ర ఛటర్జీ, మున్షీ ప్రేమ్చంద్ వంటి అగ్ర రచయితల రచనలను తొలిసారిగా తెలుగులోకి అనువదించి సాహిత్యాభి మానులకు పరిచయం చేశాడు. ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాషలలో మంచి ప్రావీణ్యం ఉన్న పండితుడు రామరాజు గురు గోవింద్ సింగ్ చరిత్ర, జాతక కథలను హిందీ నుండి తెలుగులోకి అనువదించాడు. ఉర్దూ-తెలుగు నిఘంటువును కూడా రూపొందిం చాడు. ఆంగ్లంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో అనేక ఉపన్యాసాలు ఇస్తూ, అనేక పుస్తకాలు వ్రాసాడు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు యాభైకి పైగా విశ్వ విద్యాలయాలతో అనుబంధం కలిగి ఉండి, పలు యూనివర్సిటీలకు విజిటింగ్ ప్రొఫెసర్గా పని చేశాడు. తెలుగు జానపద అధ్యయనాల గాడ్ఫాదర్ గా కీర్తించబడే ఆచార్య రామరాజు, 2010, ఫిబ్రవరి 8 న హైదరాబాదులో మరణించాడు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నచ్చిన వారికే అవుట్సోర్సింగ్ ఉద్యోగం
– ఏడాది పాటు న్యాయం కోసం సీనియర్ ఉద్యోగి పోరాటం– మంత్రి ఆదేశించినా ఉద్యోగం ఇవ్వకుండా అధికారులు కాలయాపన
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 15 (ప్రజా మంటలు)
జిల్లాలోని జగిత్యాల జిల్లా కేంద్రం లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో సీనియర్ను పక్కన పెట్టి జూనియర్కు ఉద్యోగం ఇవ్వడం పట్ల సీనియర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగికి... కాంగ్రెస్ సీనియర్ నేత గుజ్జర్ కిరణ్ హఠాన్మరణం
వరంగల్,నవంబర్ 15 (ప్రజా మంటలు):
వరంగల్ సిటీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కరీమాబాద్ కు చెందిన గుజ్జర్ కిరణ్ (49) శుక్రవారం రాత్రి హఠాన్మరణం చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్ ఇటీవల ఆసుపత్రిలో కాలుకి సర్జరీ చేయించుకుని ఇంటికి చేరుకున్నాక అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
40... ఈషా స్కూల్ ఆఫ్ నాలెడ్జిలో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు
జగిత్యాల నవంబర్ 14 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని ఈశా స్కూల్ ఆఫ్ నాలెడ్జ్ లో చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
విద్యార్థుల కల్చరల్ కార్యక్రమాలతో స్కూల్ సందడిగా మారింది. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలలోనే విజేతలకు బహుమతులు... చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించిన విక్రమ్ మెరిట్ ట్యుటోరియల్స్
సికింద్రాబాద్, నవంబర్ 15 (ప్రజామంటలు):చాచా నెహ్రూ జయంతి సందర్భంగా విక్రమ్ మెరిట్ ట్యుటోరియల్స్లో చిల్డ్రన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు కేవలం చదువుతో పాటు మానసిక ఉల్లాసం కోసం వివిధ రకాల గేమ్స్ను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు కూడా హాజరై తమ... ఐబొమ్మ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్
హైదరాబాద్ నవంబర్ 15 (ప్రజా మంటలు):
ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ (iBomma) నిర్వాహకుడు ఇమ్మడి రవిని శనివారం ఉదయం కూకట్పల్లిలో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ చేరుకున్న వెంటనే, పక్కా సమాచారంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
గత కొన్నేళ్లుగా ఇమ్మడి రవి కరేబియన్ దీవుల్లో తలదాచుకుని... నాగార్జునసాగర్ ప్రభుత్వాస్పత్రిలో చిన్నారులకు ఇంజక్షన్ వికటింపు… 17 మందికి అస్వస్థత
నాగార్జునసాగర్ నవంబర్ 15 (ప్రజా మంటలు):
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం సంచలన ఘటన చోటుచేసుకుంది. చిన్నపిల్లల వార్డులో చికిత్స పొందుతున్న 17 మంది శిశువులకు ఇచ్చిన ఇంజక్షన్ వికటించడంతో వారు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనతో ఆస్పత్రి వాతావరణం ఒకింత గందరగోళంగా మారింది.
ఇంజక్షన్ ఇచ్చిన అరగంటలోనే లక్షణాలు
వైద్యులు... శ్రీనగర్ లోని నౌగామ్ పోలీస్ స్టేషన్ వద్ద పేలుడు : నిర్వహణ లోపమే?
శ్రీనగర్ (కాశ్మీర్) నవంబర్ 15:
శుక్రవారం రాత్రి (నవంబర్ 14, 2025), శ్రీనగర్ నగరంలోని నౌగామ్ పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. వెతుకుతున్న సమాచార ప్రకారం, ఈ పేలుడు “ఉగ్రమైన అనుకోకుండా ప్రమాదం” గా ఉంది, అధికారులు ప్రమాదానంతర పదార్థాలను తనిఖీ చేస్తున్న సమయంలో అది స్ఫోటించింది.
అత్యల్పంగా 7 మంది చనిపోయినట్టు అధికారులు... కృష్ణానగర్ కాలనీలో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య
సికింద్రాబాద్,నవంబర్ 14 (ప్రజా మంటలు):
గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్ కాలనీలో చోటుచేసుకున్న విషాద ఘటనలో యువ ఐటీ ఉద్యోగి విశాల్ గౌడ్ (28) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై తండ్రి సుర్వి శ్రీనివాస్ గౌడ్ గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ బోస్ కిరన్ తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణానగర్ కాలనీలో నివసించే... సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ కోలుకుంటున్నారు
తాడోంగ్ (సిక్కిం) నవంబర్ 14:
సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్ (గోలే), తేలికపాటి ముక్కు రక్తస్రావం మరియు రక్తపోటు పెరగడం కారణంగా శుక్రవారం సెంట్రల్ రిఫరల్ హాస్పిటల్కు తరలించారు. ఆసుపత్రి వైద్య బృందం వెంటనే చికిత్స ప్రారంభించడంతో ఆయన పరిస్థితి తక్షణమే స్థిరపడింది.
డాక్టర్లు వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం సీఎం... రైతుల,విద్యార్థుల, సామాన్యులతో కవిత మమేకం
మెదక్ నవంబర్ 14 (ప్రజా మంటలు):
మెదక్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాగృతి జనంబాట తొలి రోజు పర్యటన నిర్వహించారు. నర్సాపూర్, కౌడిపల్లి, కొల్చారం, ఘనపూర్, వనదుర్గ, మెదక్ వంటి ప్రాంతాల్లో ప్రజలను కలుసుకుని సమస్యలను తెలుసుకున్నారు. ప్రాజెక్టులు, విద్యాసంస్థలు, ఆలయాలు, కాలనీలు—అన్ని రంగాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా... జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు
జగిత్యాల (రూరల్) నవంబర్ 14 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించిన సందర్భంగా స్థానికంగా కాంగ్రెస్ శ్రేణుల్లో భారీ సంబరాలు కొనసాగాయి. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సవాల్లో భాగమయ్యారు.
జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్... గంజాయి పెంపకం – సరఫరా – అమ్మకానికి పాల్పడిన ముగ్గురికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష
జగిత్యాల (రూరల్) నవంబర్ 14 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ వ్యాపారంలో పాల్గొన్న ముగ్గురు నిందితులకు జగిత్యాల జిల్లా గౌరవ మొదటి అదనపు సెషన్స్ జడ్జి శ్రీ నారాయణ గారు కఠినమైన తీర్పును ప్రకటించారు. గంజాయి పెంపకం, సరఫరా మరియు అమ్మకానికి పాల్పడినందుకు ఏడు సంవత్సరాల జైలు శిక్షతో... 