తెలుగు జానపద సాహిత్య పితామహులు బిరుదు. జానపద సాహిత్యానికి బిరుదు రామరాజు ఎనలేని సేవలు ఏప్రిల్ 16... బిరుదు రామరాజు జయంతి
తెలుగు జానపద సాహిత్య పితామహులు బిరుదు. జానపద సాహిత్యానికి బిరుదు రామరాజు ఎనలేని సేవలు ఏప్రిల్ 16... బిరుదు రామరాజు జయంతి
రామ కిష్టయ్య సంగన భట్ల...
9440595494
జానపద సాహిత్య రంగంలో ఆచార్య రామరాజు పేరు తెలియని వారుండరు. తెలుగు జానపద సాహిత్యం గురించి ప్రప్రథమంగా డాక్టరేటు పట్టాకోసం పరిశోధన చేసి, దేశ విశ్వ విద్యాలయాలలో జానపద సాహిత్యం పై పరిశోధన లకు ప్రవేశం కలిపించడానికి ప్రేరణ అయినారు రామరాజు. ఆయన పరిశోధన భూమికగా ఇతర విశ్వ విద్యాలయాలలో జానపద సాహిత్యం గూర్చి పరిశోధన ప్రారంభమయింది. తెలుగునాట విశ్వ విద్యాలయాల్లో జానపద సాహిత్య శాఖలను రూపొందించి, వాటిలో తమ పరిశోధనాత్మక రచనలతో, బోధనతో, మార్గ నిర్దేశనంతో ఒకతరం జానపద సాహిత్య పరిశోధకులను, అధ్యాపకులను తయారు చేసిన మార్గదర్శకులు ఆయన. భారతీయ విశ్వ విద్యాలయాల్లోని ఆదర్శ ప్రాయమైన, అరుదైన మౌలిక పరిశోధకుల్లో ఆయన అగ్రగణ్యులు. 1955లో ప్రచురించ బడిన ఆయన పరిశోధనా గ్రంథం... 'జానపద గేయ సాహిత్యము' తెలుగు జానపద అధ్యయనాలకు విజ్ఞాన సర్వస్వంగా అందుబాటులో ఉంది.
బిరుదురాజు రామరాజు 1925 ఏప్రిల్ 16 వ తేదీ దేవనూరు గ్రామంలో లక్ష్మీదేవమ్మ, బిరుదు రాజు నారాయణరాజు దంపతు లకు జన్మించాడు. ప్రాథమిక విద్యను హన్మకొండ శివార్లలోని దేవనూరు, మడికొండలలో పూర్తి చేసి, ఉన్నత చదువుల కోసం ఎనిమిదేళ్లపాటు హన్మకొండకు 14 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వచ్చింది. 3వ తరగతి నుండి ఇంటర్మీడియెట్ వరకు ఉర్దూ మీడియంలో చదువుకున్నాడు. మెట్రిక్ చదివేటప్పుడు 11వ ఆంధ్ర మహాసభల సందర్భంగా మహాత్మా గాంధీ వరంగల్ వచ్చినప్పుడు ఆనాటి సభలలో స్వచ్ఛంద సేవలకు అందించాడు. గాంధీజీతో కలిసి పాదయాత్ర చేశాడు. 1947లో కాంగ్రెస్ సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలు పాలయ్యాడు. చదువు కునే రోజుల్లో ఆర్యసమాజం ప్రభావానికి లోనైనాడు. నిజాం వ్యతిరేక రాజకీయోద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు. నిజాం కళాశాలలో బి.ఎ. చదువుతున్న సమయంలో దాశరథి కృష్ణమా చార్యతో పరిచయం ఏర్పడింది. కాళోజీ నారాయణరావు, టి.హయగ్రీవా చారి, ముదిగొండ సిద్ద రాజలింగం, జమలాపురం కేశవరావు తదితర యువ నాయకులతో కలిసి రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, స్టేట్ కాంగ్రెస్ ఉద్యమాలలో పాల్గొని 1947లో మూడు నెలలపాటు కారాగార శిక్ష అనుభవించాడు. 1947-50ల మధ్యకాలంలో నిజాం కళాశాలలో తెలంగాణా విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా పని చేశాడు. బి.ఎ.పూర్తయ్యాక న్యాయ శాస్త్రంలో పట్టా పొందాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీలో ఎం.ఎ. చదివే రోజులలో విద్యార్థి నాయకుడిగా గుర్తింపు పొందాడు. ఆ సమయం లో సి.నారాయణ రెడ్డితో కలిసి కొంతకాలం రామనారాయణ కవులు పేరుతో జంట కవులుగా కవిత్వం చెప్పారు. మాడపాటి హనుమంతరావు ఆంధ్రసంఘం నెలకొల్పి దానికి బిరుదురాజు రామరాజును అధ్యక్షుడిగా నియమించాడు. తెలంగాణ రచయితల సంఘానికి తొలి కార్యదర్శిగా ఉన్నాడు. కాగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డాక ఆంధ్ర రచయితల సంఘంగా మారింది. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం మార్గ దర్శకత్వంలో తెలుగు జానపద గేయసాహిత్యం అనే అంశంపై పరిశోధన చేసి దక్షిణ భారత దేశంలోనే జానపద సాహిత్యంపై మొట్టమొదటి పి.హెచ్.డి ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి సంపాదిం చాడు. సంస్కృతంలో ఎం.ఎ. చేసి అందులో కూడా డాక్టరేట్ పొందా డు.
ఉస్మానియా విశ్వ విద్యాలయంలో 1951లో ఉపన్యాసకుడిగా చేరి క్రమంగా పదోన్నతుల ద్వారా తెలుగుశాఖకు డీన్గా, అధ్యక్షు డిగా విధులు నిర్వర్తించాడు. ఆయన మార్గదర్శకత్వంలో 37 మంది పిహెచ్.డి పట్టాలు పొందా రు. రామరాజు పర్యవేక్షణలో కేతవరపు రామకోటిశాస్త్రి, కోవెల సుప్రసన్నాచార్య, ముదిగొండ వీరభద్ర శాస్త్రి, అక్కిరాజు రమాపతి రావు, అనంతలక్ష్మి, కాళిదాసు పురుషోత్తం, రవ్వా శ్రీహరి వంటి వారు తమ పరిశోధనలు చేసి డాక్టరేట్ పట్టాలను పొందడం గమనార్హం. 1983లో ప్రొఫెసర్గా పదవీ విరమణ చేశాడు.
1994లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, 1995లో భారత ప్రభుత్వం నుండి నేషనల్ ప్రొఫెషనల్షిప్, 2001లో సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ వారి శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డ్, 2003లో శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం,2006/2007లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారి 'విశిష్ట పురస్కారం', 2009లో సి.పి.బ్రౌన్ అకాడెమీ వారి తెలుగు భారతి పురస్కారం అందుకున్నాడు.
ప్రాచీన సంస్కృతాంధ్ర గ్రంథాల్ని పరిశీలించి, పరిష్కరించి మొదటి సారిగా వెలుగులోకి తేవడానికి విశేష కృషి చేశాడు. సంస్కృతంలో పీహెచ్డీ చేసి 'సంస్కృత సాహిత్యానికి ఆంధ్రుల సహకారం' అనే గ్రంథంగా తన వ్యాసాన్ని ప్రచురించాడు. తాళపత్ర గ్రంథాల్ని సేకరించి పలు వ్యాసాల ద్వారా వాటిని పరిచయం చేశాడు. సంస్కృత భాషా సాహిత్యాలకు ఆంధ్రులు చేసిన సేవను గూర్చి విడిగా ఒక పెద్ద పరిశోధన గ్రంధ రచనే చేశాడు. శరత్ చంద్ర ఛటర్జీ, మున్షీ ప్రేమ్చంద్ వంటి అగ్ర రచయితల రచనలను తొలిసారిగా తెలుగులోకి అనువదించి సాహిత్యాభి మానులకు పరిచయం చేశాడు. ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాషలలో మంచి ప్రావీణ్యం ఉన్న పండితుడు రామరాజు గురు గోవింద్ సింగ్ చరిత్ర, జాతక కథలను హిందీ నుండి తెలుగులోకి అనువదించాడు. ఉర్దూ-తెలుగు నిఘంటువును కూడా రూపొందిం చాడు. ఆంగ్లంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో అనేక ఉపన్యాసాలు ఇస్తూ, అనేక పుస్తకాలు వ్రాసాడు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు యాభైకి పైగా విశ్వ విద్యాలయాలతో అనుబంధం కలిగి ఉండి, పలు యూనివర్సిటీలకు విజిటింగ్ ప్రొఫెసర్గా పని చేశాడు. తెలుగు జానపద అధ్యయనాల గాడ్ఫాదర్ గా కీర్తించబడే ఆచార్య రామరాజు, 2010, ఫిబ్రవరి 8 న హైదరాబాదులో మరణించాడు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని మహాశివునికి జల అభిషేకం
జగిత్యాల జులై 20 (ప్రజా మంటలు) పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి మహా శివునికి భక్తుల స్వహస్తాలతో రుద్ర నమక చమకాలతో అభిషేకాలు నిర్వహించారు
ఈ సందర్భంగా ఆలయంలోని మహాశివునికి ఉదయం ప్రత్యేక పూజలను నిర్వహించి మహా శివునికి సమృద్ధిగా వర్షాలు... సంసార సముద్రం నుండి రక్షించడానికి పరమాత్మ అవతరించాడు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి
జగిత్యాల జూలై 19(ప్రజా మంటలు) సంసారం అనే సముద్రము నుండి మనను రక్షించడానికి పరమాత్మ అవతరించాడని ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు పరమహంస పరివ్రా జకాచార్యులు శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠాధిపతులు అనంత శ్రీ విభూషిత శ్రీ శ్రీ శ్రీ త్రీదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు.
జిల్లా కేంద్రంలోని... ఆవాస విద్యార్థులకు స్కూల్ యూనిఫాం పంపిణీ
జగిత్యాల జులై 19 ( ప్రజా మంటలు) సేవా భారతి ఆధ్వర్యంలో గ్రామీణ నిరుపేద, దళిత విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన వాల్మీకి ఆవాస విద్యార్థులకు యశస్వి ఎలక్ట్రానిక్స్ అధినేత కోటగిరి శ్రీనివాస్-మంగ దంపతులు పాఠశాల యూనిఫామ్స్ అందజేశారు. శ్రీనివాస్ తల్లి వరలక్ష్మి జ్ఞాపకార్థం ఆవాసంలోని 65 మంది విద్యార్థులకు రూ.50,000 విలువచేసే దుస్తులను కోటగిరి
ఈ... సూపర్ ఎల్నినో హెచ్చరికలపై ప్రభుత్వం నిర్లక్ష్యం: కల్వకుంట్ల కవిత
గోదావరిలో 418 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి కేవలం 93 టీఎంసీలే ఉన్నాయని వెల్లడి
కోరుట్ల, జూలై 19 (ప్రజా మంటలు):
సూపర్ ఎల్నినో ప్రభావంపై వాతావరణ నిపుణులు ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కోరుట్లలో నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప... దక్షిణ భారతదేశంలో రెండో స్థానంలో గాయత్రి బ్యాంక్
ఖాతాదారులకు రూ.2 లక్షల ప్రమాద బీమా: సీఈఓ వనమాల శ్రీనివాస్జగిత్యాల, జూలై 19 (ప్రజా మంటలు):
రూ.4,558.89 కోట్ల వ్యాపారంతో, 86 శాఖల నెట్వర్క్తో గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ దక్షిణ భారతదేశంలో రెండో స్థానానికి చేరుకుందని బ్యాంకు అధ్యక్షుడు గుండేటి గంగాధర్ తెలిపారు. ఆదివారం జగిత్యాలలో నిర్వహించిన బ్యాంకు వార్షిక సర్వసభ్య సమావేశంలో... మానసిక దివ్యాంగుల పట్ల మానవత్వం చూపిన పోలీసులు
జగిత్యాల జులై 17(ప్రజా మంటలు)మానసిక దివ్యాంగుల పట్ల స్థానిక పోలీసులు మానవత్వం చాటుకున్నారు. మతిభ్రమించి ఇంటి వారికి దూరమైపట్టణంలో వివిధ ప్రాంతాలలో తిరుగుతున్న మానసిక వికలాంగులను దాదాపు పది నుండి 15 మంది మానసిక వికలాంగులకు జగిత్యాల పట్టణ పోలీసులు చేయూతనిచ్చారు...
పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ... కురుమ సంఘం ఆధ్వర్యంలో వర్షాలు సమృద్ధిగా పడాలని కోరుతూ కప్పతల్లి ఆటలు, ప్రత్యేక పూజలు
జగిత్యాల జూలై 16 (ప్రజా మంటలు )
కురుమ సంఘం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం దేశంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ స్థానిక పోచమ్మ వాడ లోని పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రోకలి కి రెండు కప్పలను కట్టి ప్రత్యేక పూజలను నిర్వహించి డప్పు చప్పుల మధ్య ఇంటింటా తిరుగుతూ కప్పతల్లి... ఇంకుడు గుంతలు నిర్మిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి- మున్సిపల్ కమిషనర్ డి శ్రీనివాస్ గౌడ్
మెట్ పెల్లి జూలై 16 (ప్రజా మంటలు)జె ఎస్జెబి 3.0 ఆధ్వర్యంలోని క్యాచ్ ది రైన్ ప్రచారం జల ప్రతిజ్ఞ కార్యక్రమంలో భాగంగా సిడిఎంఏ అధికారి ఆదేశాల మేరకు జలసంచెయ్ జన భాగీ దారి (జే ఎస్జేబి )3.0 లో భాగంగా నిర్వహిస్తున్న క్యాచ్ ది రైన్ ప్రచార కార్యక్రమంలో వర్షపు నీరు సంరక్షణ... అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ల జారీకి కమిటీ ఆమోదం
జగిత్యాల జులై 15(ప్రజా మంటలు)
జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఆన్లైన్ లో సమర్పించిన 697 దరఖాస్తులను జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులు సమగ్రంగా క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన మొదటి & రొండవ విడత 506 ప్రస్తుతం మూడవ విడతలో 74 మొత్తం 580 మంది వర్కింగ్ జర్నలిస్ట్ లకు అక్రీడిటేషన్ కార్డులు జారీకి ఆమోదం... చిన్న రైస్ మిల్లర్లకు అండగా ఉంటాం: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జూలై 15 (ప్రజా మంటలు):
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితను రాష్ట్రానికి చెందిన చిన్న రైస్ మిల్లర్ల ప్రతినిధులు బుధవారం హైదరాబాద్లో కలిసి తమ సమస్యలను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద రైస్ మిల్లర్ల పట్ల ఒక విధంగా, చిన్న రైస్ మిల్లర్ల పట్ల మరో... పారిశుద్ధ్య కార్మికుడి మృతి కేసు ముగింపు: రూ.15.50 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబానికి రెండు ఉద్యోగాలు
హైదరాబాద్, జూలై 14: (ప్రజా మంటలు)
యూసుఫ్గూడ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో పారిశుద్ధ్య కార్మికుడు మీశాల సుధాకర్ మృతి చెందిన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్ఆర్సీ) స్వప్రేరణతో నమోదు చేసిన కేసును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆదేశాల అమలు నేపథ్యంలో ముగించింది.టీజీహెచ్ఆర్సీ ఛైర్పర్సన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్... రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పెద్దపల్లి మున్సిపల్ ఏఈ..
ఇంట్లో రూ.32.31 లక్షల అక్రమ నగదు స్వాధీనం
పెద్దపల్లి, జూలై 14 (ప్రజా మంటలు):
పెద్దపల్లి మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న కల్లేపల్లి సతీష్ కుమార్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్హ్యాండెడ్గా చిక్కారు.కాంట్రాక్టర్కు సంబంధించిన బిల్లును ప్రాసెస్ చేసి టీయూఎఫ్ఐడీసీ (TUFIDC)కి పంపేందుకు రూ.2 లక్షల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా... 