తెలుగు జానపద సాహిత్య పితామహులు బిరుదు.      జానపద సాహిత్యానికి బిరుదు రామరాజు ఎనలేని సేవలు ఏప్రిల్ 16... బిరుదు రామరాజు జయంతి

On
తెలుగు జానపద సాహిత్య పితామహులు బిరుదు.      జానపద సాహిత్యానికి బిరుదు రామరాజు ఎనలేని సేవలు ఏప్రిల్ 16... బిరుదు రామరాజు జయంతి

తెలుగు జానపద సాహిత్య పితామహులు బిరుదు.      జానపద సాహిత్యానికి బిరుదు రామరాజు ఎనలేని సేవలు ఏప్రిల్ 16... బిరుదు రామరాజు జయంతి

 రామ కిష్టయ్య సంగన భట్ల...
      9440595494

 జానపద సాహిత్య రంగంలో ఆచార్య రామరాజు పేరు తెలియని వారుండరు. తెలుగు జానపద సాహిత్యం గురించి ప్రప్రథమంగా డాక్టరేటు పట్టాకోసం పరిశోధన చేసి, దేశ విశ్వ విద్యాలయాలలో జానపద సాహిత్యం పై పరిశోధన లకు ప్రవేశం కలిపించడానికి ప్రేరణ అయినారు రామరాజు. ఆయన పరిశోధన భూమికగా ఇతర విశ్వ విద్యాలయాలలో జానపద సాహిత్యం గూర్చి పరిశోధన ప్రారంభమయింది. తెలుగునాట విశ్వ విద్యాలయాల్లో జానపద సాహిత్య శాఖలను రూపొందించి, వాటిలో తమ పరిశోధనాత్మక రచనలతో, బోధనతో, మార్గ నిర్దేశనంతో ఒకతరం జానపద సాహిత్య పరిశోధకులను, అధ్యాపకులను తయారు చేసిన మార్గదర్శకులు ఆయన. భారతీయ  విశ్వ విద్యాలయాల్లోని ఆదర్శ ప్రాయమైన, అరుదైన మౌలిక పరిశోధకుల్లో ఆయన అగ్రగణ్యులు. 1955లో ప్రచురించ బడిన ఆయన పరిశోధనా గ్రంథం... 'జానపద గేయ సాహిత్యము' తెలుగు జానపద అధ్యయనాలకు విజ్ఞాన సర్వస్వంగా అందుబాటులో ఉంది. 

బిరుదురాజు రామరాజు 1925 ఏప్రిల్ 16 వ తేదీ దేవనూరు గ్రామంలో లక్ష్మీదేవమ్మ, బిరుదు రాజు నారాయణరాజు దంపతు లకు జన్మించాడు. ప్రాథమిక విద్యను హన్మకొండ శివార్లలోని దేవనూరు, మడికొండలలో పూర్తి చేసి, ఉన్నత చదువుల కోసం ఎనిమిదేళ్లపాటు హన్మకొండకు 14 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వచ్చింది. 3వ తరగతి నుండి ఇంటర్మీడియెట్ వరకు ఉర్దూ మీడియంలో చదువుకున్నాడు. మెట్రిక్ చదివేటప్పుడు 11వ ఆంధ్ర మహాసభల సందర్భంగా మహాత్మా గాంధీ వరంగల్ వచ్చినప్పుడు  ఆనాటి సభలలో స్వచ్ఛంద సేవలకు అందించాడు. గాంధీజీతో కలిసి పాదయాత్ర చేశాడు. 1947లో కాంగ్రెస్ సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలు పాలయ్యాడు. చదువు కునే రోజుల్లో  ఆర్యసమాజం ప్రభావానికి లోనైనాడు. నిజాం వ్యతిరేక రాజకీయోద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు. నిజాం కళాశాలలో బి.ఎ. చదువుతున్న సమయంలో దాశరథి కృష్ణమా చార్యతో పరిచయం ఏర్పడింది. కాళోజీ నారాయణరావు, టి.హయగ్రీవా చారి, ముదిగొండ సిద్ద రాజలింగం, జమలాపురం కేశవరావు తదితర యువ నాయకులతో కలిసి రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, స్టేట్ కాంగ్రెస్ ఉద్యమాలలో పాల్గొని 1947లో మూడు నెలలపాటు కారాగార శిక్ష అనుభవించాడు. 1947-50ల మధ్యకాలంలో నిజాం కళాశాలలో తెలంగాణా విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా పని చేశాడు. బి.ఎ.పూర్తయ్యాక న్యాయ శాస్త్రంలో పట్టా పొందాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీలో ఎం.ఎ. చదివే రోజులలో విద్యార్థి నాయకుడిగా గుర్తింపు పొందాడు. ఆ సమయం లో సి.నారాయణ రెడ్డితో కలిసి కొంతకాలం రామనారాయణ కవులు పేరుతో జంట కవులుగా కవిత్వం చెప్పారు. మాడపాటి హనుమంతరావు ఆంధ్రసంఘం నెలకొల్పి దానికి బిరుదురాజు రామరాజును అధ్యక్షుడిగా నియమించాడు. తెలంగాణ రచయితల సంఘానికి తొలి  కార్యదర్శిగా ఉన్నాడు. కాగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డాక ఆంధ్ర రచయితల సంఘంగా మారింది. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం మార్గ దర్శకత్వంలో తెలుగు జానపద గేయసాహిత్యం అనే అంశంపై పరిశోధన చేసి దక్షిణ భారత దేశంలోనే జానపద సాహిత్యంపై మొట్టమొదటి పి.హెచ్.డి ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి సంపాదిం చాడు. సంస్కృతంలో ఎం.ఎ. చేసి అందులో కూడా డాక్టరేట్ పొందా డు.

ఉస్మానియా విశ్వ విద్యాలయంలో 1951లో ఉపన్యాసకుడిగా చేరి క్రమంగా పదోన్నతుల ద్వారా తెలుగుశాఖకు డీన్‌గా, అధ్యక్షు డిగా విధులు నిర్వర్తించాడు. ఆయన మార్గదర్శకత్వంలో 37 మంది పిహెచ్.డి పట్టాలు పొందా రు. రామరాజు పర్యవేక్షణలో కేతవరపు రామకోటిశాస్త్రి, కోవెల సుప్రసన్నాచార్య, ముదిగొండ వీరభద్ర శాస్త్రి, అక్కిరాజు రమాపతి రావు, అనంతలక్ష్మి, కాళిదాసు పురుషోత్తం, రవ్వా శ్రీహరి వంటి వారు తమ పరిశోధనలు చేసి డాక్టరేట్ పట్టాలను పొందడం గమనార్హం. 1983లో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశాడు.
1994లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం  గౌరవ డాక్టరేట్, 1995లో భారత ప్రభుత్వం నుండి నేషనల్ ప్రొఫెషనల్‌షిప్, 2001లో  సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ వారి శివానంద ఎమినెంట్ సిటిజన్‌ అవార్డ్, 2003లో  శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం,2006/2007లో  పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారి 'విశిష్ట పురస్కారం', 2009లో  సి.పి.బ్రౌన్ అకాడెమీ వారి తెలుగు భారతి పురస్కారం అందుకున్నాడు.

ప్రాచీన సంస్కృతాంధ్ర గ్రంథాల్ని పరిశీలించి, పరిష్కరించి మొదటి సారిగా వెలుగులోకి తేవడానికి విశేష కృషి చేశాడు. సంస్కృతంలో పీహెచ్‌డీ చేసి 'సంస్కృత సాహిత్యానికి ఆంధ్రుల సహకారం' అనే గ్రంథంగా తన వ్యాసాన్ని ప్రచురించాడు. తాళపత్ర గ్రంథాల్ని సేకరించి పలు వ్యాసాల ద్వారా  వాటిని పరిచయం చేశాడు. సంస్కృత భాషా సాహిత్యాలకు ఆంధ్రులు చేసిన సేవను గూర్చి విడిగా ఒక పెద్ద పరిశోధన గ్రంధ రచనే చేశాడు. శరత్ చంద్ర ఛటర్జీ, మున్షీ ప్రేమ్‌చంద్ వంటి అగ్ర రచయితల రచనలను తొలిసారిగా తెలుగులోకి అనువదించి  సాహిత్యాభి మానులకు పరిచయం చేశాడు. ఉర్దూ, హిందీ, ఆంగ్ల  భాషలలో మంచి ప్రావీణ్యం ఉన్న పండితుడు రామరాజు గురు గోవింద్ సింగ్ చరిత్ర,  జాతక కథలను హిందీ నుండి తెలుగులోకి అనువదించాడు. ఉర్దూ-తెలుగు నిఘంటువును కూడా రూపొందిం చాడు. ఆంగ్లంలో  దేశంలోని వివిధ ప్రాంతాలలో అనేక ఉపన్యాసాలు ఇస్తూ, అనేక పుస్తకాలు వ్రాసాడు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు యాభైకి పైగా విశ్వ విద్యాలయాలతో అనుబంధం కలిగి ఉండి, పలు యూనివర్సిటీలకు విజిటింగ్ ప్రొఫెసర్‌గా పని చేశాడు. తెలుగు జానపద అధ్యయనాల గాడ్‌ఫాదర్ గా కీర్తించబడే ఆచార్య రామరాజు, 2010, ఫిబ్రవరి 8 న హైదరాబాదులో మరణించాడు.

Tags
Join WhatsApp

More News...

State News 

తెలంగాణ ఆదాయ సమీకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

తెలంగాణ ఆదాయ సమీకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. హైదరాబాద్, జూలై 1 (ప్రజా మంటలు): రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాలను సాధించేందుకు ఆదాయ సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదాయ లీకేజీలను పూర్తిగా అరికట్టి, వాటిపై నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేక చేజింగ్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ సమీకరణపై జరిగిన ఉన్నతస్థాయి...
Read More...
Local News 

ఐజేయు కృషితో జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులో 50 శాతం రాయితీ 

ఐజేయు కృషితో జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులో 50 శాతం రాయితీ  టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు  జగిత్యాల జూలై 01(ప్రజా మంటలు):టియుడబ్ల్యూజే  ఐజేయు  కృషితో జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులో 50 శాతం రాయితీ లభించిందని టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా సమీపంలో గల టియుడబ్ల్యూజే ఐజేయు అనుబంధ ప్రెస్...
Read More...
Local News  State News 

ఆడబిడ్డగా పార్టీ పెట్టిన.. రాష్ట్రం అజెండా మార్చుతా -కల్వకుంట్ల కవిత

ఆడబిడ్డగా పార్టీ పెట్టిన.. రాష్ట్రం అజెండా మార్చుతా -కల్వకుంట్ల కవిత సికింద్రాబాద్‌లో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ.. ఉచిత విద్య, వైద్యమే లక్ష్యం: కల్వకుంట్ల కవిత హైదరాబాద్, జూలై 1 (ప్రజా మంటలు): సికింద్రాబాద్‌లోని సీతాఫల్ మండిలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండాను పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో అజెండా మారాల్సిన అవసరం ఉందన్నారు. పేదలు, మధ్యతరగతి...
Read More...
National  State News 

విజయ్‌పై తప్పుడు ప్రచారం చేయొద్దు.. ఆరోపణలకు ఆధారాలు చూపాలి: మంత్రి నిర్మల్ కుమార్

విజయ్‌పై తప్పుడు ప్రచారం చేయొద్దు.. ఆరోపణలకు ఆధారాలు చూపాలి: మంత్రి నిర్మల్ కుమార్ చెన్నై, జూలై 01 (ప్రజా మంటలు): తమిళనాడు మంత్రి నిర్మల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, నటుడు, టీవీకే (TVK) అధ్యక్షుడు విజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. వైకోతో పాటు మరెవరైనా ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేస్తే, వారిని టీవీకే తరఫున మళ్లీ గెలిపిస్తానని ముఖ్యమంత్రి విజయ్ ఎక్కడా చెప్పలేదని ఆయన పేర్కొన్నారు. అలాంటి...
Read More...
Local News 

రాయికల్ మండలం మహితాపూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే  సంజయ్ శ్రీకారం

రాయికల్ మండలం మహితాపూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే  సంజయ్ శ్రీకారం జగిత్యాల, జూలై 01 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మహితాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ భూమిపూజ చేసి ప్రారంభించారు.అనంతరం గ్రామంలో ఐదు మంది లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు...
Read More...
State News 

తెలంగాణ రైతు భరోసా నిధుల విడుదల

తెలంగాణ రైతు భరోసా నిధుల విడుదల హైదరాబాద్, జూన్ 30 (ప్రజా మంటలు): తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద తొలి విడతగా 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482.02 కోట్లు జమ చేసింది. హైదరాబాద్‌లో నిర్వహించిన రైతు భరోసా సదస్సులో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిధులను విడుదల చేశారు.ప్రభుత్వం వచ్చే తొమ్మిది రోజుల్లో మొత్తం రూ.9...
Read More...
State News 

బీజేపీ తెలంగాణకు సవతి తల్లి ప్రేమ చూపుతోంది.. ముషీరాబాద్ జండా పండగలో  కల్వకుంట్ల కవిత

బీజేపీ తెలంగాణకు సవతి తల్లి ప్రేమ చూపుతోంది.. ముషీరాబాద్ జండా పండగలో  కల్వకుంట్ల కవిత   హైదరాబాద్, జూన్ 30 (ప్రజా మంటలు): తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్ర నాయకుడు వేణుమాధవ్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని, బీజేపీ తెలంగాణపై "సవతి తల్లి ప్రేమ" ప్రదర్శిస్తోందని ఆరోపించారు.కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బీజేపీ నాయకులు పదేపదే ఆరోపిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి దర్యాప్తు లేదా...
Read More...
State News 

2 లక్షల ఉద్యోగాలు, 20 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కల్వకుంట్ల కవిత ధర్నా, డిమాండ్

2 లక్షల ఉద్యోగాలు, 20 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కల్వకుంట్ల కవిత ధర్నా, డిమాండ్ హైదరాబాద్, జూన్ 29 (ప్రజా మంటలు): ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సోమవారం దిల్‌సుఖ్‌నగర్ చౌరస్తాలో నిరుద్యోగులతో కలిసి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం స్పందించే వరకు నిరుద్యోగుల వెన్నంటి...
Read More...
National  Local News  State News 

పోలియో చుక్కలను వేసి చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపాలి - పి.సి.సి సేవాదళ్ సెక్రటరీ బోగోజి ముఖేష్ ఖన్నా

పోలియో చుక్కలను వేసి చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపాలి - పి.సి.సి సేవాదళ్ సెక్రటరీ బోగోజి ముఖేష్ ఖన్నా (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113) జగిత్యాల 28 జూన్ ( ప్రజా మంటలు) :  జాతీయ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా 0-5 ఏండ్ల వయస్సు ఉన్న పిల్లలకు తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలను వేసి చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపాలని పి.సి.సి సేవాదళ్ సెక్రటరీ బోగోజి ముఖేష్ ఖన్నా వెల్లడించారు. పోలియో...
Read More...
Local News 

యూపీఏ, ఎన్డీఏ పాలనల్లో ధరల పెరుగుదలపై సోషల్ మీడియాలో వైరల్ పోస్టు

యూపీఏ, ఎన్డీఏ పాలనల్లో ధరల పెరుగుదలపై సోషల్ మీడియాలో వైరల్ పోస్టు న్యూఢిల్లీ, జూన్ 28 (ప్రజా మంటలు):మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం (2004–2014), ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం (2014–2026) హయాంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను పోలుస్తూ ఒక గ్రాఫిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (2004–2014) పాలనలోని ధరలు, ఆ...
Read More...
National  Crime  State News 

తమిళనాడు ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షుడు పి.డి. అరసకుమార్ అరెస్ట్

తమిళనాడు ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షుడు పి.డి. అరసకుమార్ అరెస్ట్ రూ.100 కోట్ల ప్రైవేట్ పాఠశాలల అనుమతుల మోసం కేసు చెన్నై, జూన్ 28 (ప్రజా మంటలు): తమిళనాడులో ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వ అనుమతులు, శాశ్వత గుర్తింపు (Recognition), గ్రేడ్ అప్‌గ్రేడేషన్, డీటీసీపీ (DTCP), సీఎండీఏ (CMDA) అనుమతులు ఇప్పిస్తానని నమ్మబలికి రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు ప్రైవేట్...
Read More...
Local News 

మంచాల రామేశం స్మారకార్థం ఆర్వో వాటర్ ప్లాంటేషన్ వితరణ

మంచాల రామేశం స్మారకార్థం ఆర్వో వాటర్ ప్లాంటేషన్ వితరణ జగిత్యాల జూన్ 22(ప్రజా మంటలు)జగిత్యాల పట్టణంలోని క్రిటికల్ కేర్ హాస్పిటల్ యందు మంచాల రామేశం స్మారకార్థం మంచాల కృష్ణ  ఏర్పాటు చేసిన ఆర్వో (ఆర్ ఓ) వాటర్ ప్లాంట్‌ను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మరియు జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంచాల కృష్ణ...
Read More...