తెలుగు జానపద సాహిత్య పితామహులు బిరుదు.      జానపద సాహిత్యానికి బిరుదు రామరాజు ఎనలేని సేవలు ఏప్రిల్ 16... బిరుదు రామరాజు జయంతి

On
తెలుగు జానపద సాహిత్య పితామహులు బిరుదు.      జానపద సాహిత్యానికి బిరుదు రామరాజు ఎనలేని సేవలు ఏప్రిల్ 16... బిరుదు రామరాజు జయంతి

తెలుగు జానపద సాహిత్య పితామహులు బిరుదు.      జానపద సాహిత్యానికి బిరుదు రామరాజు ఎనలేని సేవలు ఏప్రిల్ 16... బిరుదు రామరాజు జయంతి

 రామ కిష్టయ్య సంగన భట్ల...
      9440595494

 జానపద సాహిత్య రంగంలో ఆచార్య రామరాజు పేరు తెలియని వారుండరు. తెలుగు జానపద సాహిత్యం గురించి ప్రప్రథమంగా డాక్టరేటు పట్టాకోసం పరిశోధన చేసి, దేశ విశ్వ విద్యాలయాలలో జానపద సాహిత్యం పై పరిశోధన లకు ప్రవేశం కలిపించడానికి ప్రేరణ అయినారు రామరాజు. ఆయన పరిశోధన భూమికగా ఇతర విశ్వ విద్యాలయాలలో జానపద సాహిత్యం గూర్చి పరిశోధన ప్రారంభమయింది. తెలుగునాట విశ్వ విద్యాలయాల్లో జానపద సాహిత్య శాఖలను రూపొందించి, వాటిలో తమ పరిశోధనాత్మక రచనలతో, బోధనతో, మార్గ నిర్దేశనంతో ఒకతరం జానపద సాహిత్య పరిశోధకులను, అధ్యాపకులను తయారు చేసిన మార్గదర్శకులు ఆయన. భారతీయ  విశ్వ విద్యాలయాల్లోని ఆదర్శ ప్రాయమైన, అరుదైన మౌలిక పరిశోధకుల్లో ఆయన అగ్రగణ్యులు. 1955లో ప్రచురించ బడిన ఆయన పరిశోధనా గ్రంథం... 'జానపద గేయ సాహిత్యము' తెలుగు జానపద అధ్యయనాలకు విజ్ఞాన సర్వస్వంగా అందుబాటులో ఉంది. 

బిరుదురాజు రామరాజు 1925 ఏప్రిల్ 16 వ తేదీ దేవనూరు గ్రామంలో లక్ష్మీదేవమ్మ, బిరుదు రాజు నారాయణరాజు దంపతు లకు జన్మించాడు. ప్రాథమిక విద్యను హన్మకొండ శివార్లలోని దేవనూరు, మడికొండలలో పూర్తి చేసి, ఉన్నత చదువుల కోసం ఎనిమిదేళ్లపాటు హన్మకొండకు 14 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వచ్చింది. 3వ తరగతి నుండి ఇంటర్మీడియెట్ వరకు ఉర్దూ మీడియంలో చదువుకున్నాడు. మెట్రిక్ చదివేటప్పుడు 11వ ఆంధ్ర మహాసభల సందర్భంగా మహాత్మా గాంధీ వరంగల్ వచ్చినప్పుడు  ఆనాటి సభలలో స్వచ్ఛంద సేవలకు అందించాడు. గాంధీజీతో కలిసి పాదయాత్ర చేశాడు. 1947లో కాంగ్రెస్ సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలు పాలయ్యాడు. చదువు కునే రోజుల్లో  ఆర్యసమాజం ప్రభావానికి లోనైనాడు. నిజాం వ్యతిరేక రాజకీయోద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు. నిజాం కళాశాలలో బి.ఎ. చదువుతున్న సమయంలో దాశరథి కృష్ణమా చార్యతో పరిచయం ఏర్పడింది. కాళోజీ నారాయణరావు, టి.హయగ్రీవా చారి, ముదిగొండ సిద్ద రాజలింగం, జమలాపురం కేశవరావు తదితర యువ నాయకులతో కలిసి రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, స్టేట్ కాంగ్రెస్ ఉద్యమాలలో పాల్గొని 1947లో మూడు నెలలపాటు కారాగార శిక్ష అనుభవించాడు. 1947-50ల మధ్యకాలంలో నిజాం కళాశాలలో తెలంగాణా విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా పని చేశాడు. బి.ఎ.పూర్తయ్యాక న్యాయ శాస్త్రంలో పట్టా పొందాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీలో ఎం.ఎ. చదివే రోజులలో విద్యార్థి నాయకుడిగా గుర్తింపు పొందాడు. ఆ సమయం లో సి.నారాయణ రెడ్డితో కలిసి కొంతకాలం రామనారాయణ కవులు పేరుతో జంట కవులుగా కవిత్వం చెప్పారు. మాడపాటి హనుమంతరావు ఆంధ్రసంఘం నెలకొల్పి దానికి బిరుదురాజు రామరాజును అధ్యక్షుడిగా నియమించాడు. తెలంగాణ రచయితల సంఘానికి తొలి  కార్యదర్శిగా ఉన్నాడు. కాగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డాక ఆంధ్ర రచయితల సంఘంగా మారింది. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం మార్గ దర్శకత్వంలో తెలుగు జానపద గేయసాహిత్యం అనే అంశంపై పరిశోధన చేసి దక్షిణ భారత దేశంలోనే జానపద సాహిత్యంపై మొట్టమొదటి పి.హెచ్.డి ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి సంపాదిం చాడు. సంస్కృతంలో ఎం.ఎ. చేసి అందులో కూడా డాక్టరేట్ పొందా డు.

ఉస్మానియా విశ్వ విద్యాలయంలో 1951లో ఉపన్యాసకుడిగా చేరి క్రమంగా పదోన్నతుల ద్వారా తెలుగుశాఖకు డీన్‌గా, అధ్యక్షు డిగా విధులు నిర్వర్తించాడు. ఆయన మార్గదర్శకత్వంలో 37 మంది పిహెచ్.డి పట్టాలు పొందా రు. రామరాజు పర్యవేక్షణలో కేతవరపు రామకోటిశాస్త్రి, కోవెల సుప్రసన్నాచార్య, ముదిగొండ వీరభద్ర శాస్త్రి, అక్కిరాజు రమాపతి రావు, అనంతలక్ష్మి, కాళిదాసు పురుషోత్తం, రవ్వా శ్రీహరి వంటి వారు తమ పరిశోధనలు చేసి డాక్టరేట్ పట్టాలను పొందడం గమనార్హం. 1983లో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశాడు.
1994లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం  గౌరవ డాక్టరేట్, 1995లో భారత ప్రభుత్వం నుండి నేషనల్ ప్రొఫెషనల్‌షిప్, 2001లో  సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ వారి శివానంద ఎమినెంట్ సిటిజన్‌ అవార్డ్, 2003లో  శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం,2006/2007లో  పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారి 'విశిష్ట పురస్కారం', 2009లో  సి.పి.బ్రౌన్ అకాడెమీ వారి తెలుగు భారతి పురస్కారం అందుకున్నాడు.

ప్రాచీన సంస్కృతాంధ్ర గ్రంథాల్ని పరిశీలించి, పరిష్కరించి మొదటి సారిగా వెలుగులోకి తేవడానికి విశేష కృషి చేశాడు. సంస్కృతంలో పీహెచ్‌డీ చేసి 'సంస్కృత సాహిత్యానికి ఆంధ్రుల సహకారం' అనే గ్రంథంగా తన వ్యాసాన్ని ప్రచురించాడు. తాళపత్ర గ్రంథాల్ని సేకరించి పలు వ్యాసాల ద్వారా  వాటిని పరిచయం చేశాడు. సంస్కృత భాషా సాహిత్యాలకు ఆంధ్రులు చేసిన సేవను గూర్చి విడిగా ఒక పెద్ద పరిశోధన గ్రంధ రచనే చేశాడు. శరత్ చంద్ర ఛటర్జీ, మున్షీ ప్రేమ్‌చంద్ వంటి అగ్ర రచయితల రచనలను తొలిసారిగా తెలుగులోకి అనువదించి  సాహిత్యాభి మానులకు పరిచయం చేశాడు. ఉర్దూ, హిందీ, ఆంగ్ల  భాషలలో మంచి ప్రావీణ్యం ఉన్న పండితుడు రామరాజు గురు గోవింద్ సింగ్ చరిత్ర,  జాతక కథలను హిందీ నుండి తెలుగులోకి అనువదించాడు. ఉర్దూ-తెలుగు నిఘంటువును కూడా రూపొందిం చాడు. ఆంగ్లంలో  దేశంలోని వివిధ ప్రాంతాలలో అనేక ఉపన్యాసాలు ఇస్తూ, అనేక పుస్తకాలు వ్రాసాడు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు యాభైకి పైగా విశ్వ విద్యాలయాలతో అనుబంధం కలిగి ఉండి, పలు యూనివర్సిటీలకు విజిటింగ్ ప్రొఫెసర్‌గా పని చేశాడు. తెలుగు జానపద అధ్యయనాల గాడ్‌ఫాదర్ గా కీర్తించబడే ఆచార్య రామరాజు, 2010, ఫిబ్రవరి 8 న హైదరాబాదులో మరణించాడు.

Tags

More News...

Local News 

భార్య చనిపోగా భర్త మానసిక వేదనతో  ఆత్మహత్య

భార్య చనిపోగా భర్త మానసిక వేదనతో  ఆత్మహత్య భార్య చనిపోగా భర్త మానసిక వేదనతో ఆత్మహత్య ఇబ్రహీంపట్నం జనవరి 20( ప్రజా మంటలు): ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని  గోదురు గ్రామానికి చెందిన రెబ్బసి శాంత మూడు నెలల క్రితం మరణించగా తన భర్త రెబ్బసి ఆశన్న, భార్య గురించి తలుచుకుంటూ మానసిక వేదనకు గురవుతూ ప్రతిరోజు బాధపడుతుండెవాడని  సోమవారం  ఇటలీ ఎవరు లేని సమయంలో...
Read More...
Local News 

మధ్యాహ్న భోజన పథకం లో పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలి - వర్కర్స్ యూనియన్ వినతి పత్రం

మధ్యాహ్న భోజన పథకం లో పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలి - వర్కర్స్ యూనియన్ వినతి పత్రం   మధ్యాహ్న భోజన పథకం లో పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలి - వర్కర్స్ యూనియన్ వినతి పత్రం మెట్టుపల్లి జనవరి 20( ప్రజా మంటలు) తెలంగాణ రాష్ట్ర ఏఐటీయూసీ అనుబంధ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో  పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలని మెట్పల్లిలోని మండల విద్యాశాఖ అధికారికి మధ్యాహ్న భోజన...
Read More...
Local News 

మీత అయ్య వార్ల అధ్యక్షునిగా తిరు కోవేల నరసయ్య, 

మీత అయ్య వార్ల అధ్యక్షునిగా తిరు కోవేల నరసయ్య,  మీత అయ్య వార్ల అధ్యక్షునిగా తిరు కోవేల నరసయ్య,  మెట్టుపల్లి జనవరి 26 (ప్రజా మంటలు) మెట్టుపల్లి  డివిజన్ మిత అయ్యవారు అధ్యక్షుని గా తిరు కోవెల  నరసయ్య, ఉపాధ్యక్షులుగా సాత్పడిఅశోక్, ప్రధాన కార్యదర్శిగా గడ్డల కాంతయ్య, కోశాధికారి గా ధర్మపురి పురుషోత్తం ను ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు మెట్టుపల్లి లో సోమవారం జరిగిన మిత అయ్యవార్ల...
Read More...
Local News 

ధర్మపురి క్షేత్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి  ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ 

ధర్మపురి క్షేత్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి  ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్  ధర్మపురి క్షేత్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి  ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్  ధర్మపురి జనవరి 20:   దక్షిణ కాశీగా, హరిహర క్షేత్రంగా, గోదావరి తీరాన వెలసి, మున్సిపాలిటీ, మండల, నియోజక వర్గ కేంద్రంగా, నిత్య భక్త జన సందడితో అలరారే ధర్మపురి క్షేత్రం సమగ్రాభివృద్ధికి కృషి సల్పగనని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరిలక్ష్మణ్ కుమార్...
Read More...
Local News 

కాంగ్రెస్​ నేతలు కంటి పరీక్షలు  చేయించుకోవాలి  * బీఆర్​ఎస్​ హాయంలో చేసిన పనులు కనిపించడం లేదా..?

కాంగ్రెస్​ నేతలు కంటి పరీక్షలు  చేయించుకోవాలి  * బీఆర్​ఎస్​ హాయంలో చేసిన పనులు కనిపించడం లేదా..? కాంగ్రెస్​ నేతలు కంటి పరీక్షలు  చేయించుకోవాలి  * బీఆర్​ఎస్​ హాయంలో చేసిన పనులు కనిపించడం లేదా..? సికింద్రాబాద్, జనవరి 20 (ప్రజామంటలు): బీఆర్​ఎస్​ ప్రభుత్వం చేసిన అభివృద్ది పనులు కాంగ్రెస్​ నాయకులకు కనింపించకపోతే, కంటి పరీక్షలు చేయించుకోవాలని బన్సీలాల్​ పేట డివిజన్​ బీఆర్​ఎస్​ ప్రెసిడెంట్​ ఎల్​.వెంకటేశన్​ రాజు పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...మాజీ మంత్రి,...
Read More...
Local News 

ప్రతి బ్యాంక్ ఏటీఎం వద్ద తప్పనిసరిగా  సెక్యూరిటీ గార్డు, సిసి కెమెరాలు, అలారం సిస్టం ఏర్పాటు చేయాలి

ప్రతి బ్యాంక్ ఏటీఎం వద్ద తప్పనిసరిగా  సెక్యూరిటీ గార్డు, సిసి కెమెరాలు, అలారం సిస్టం ఏర్పాటు చేయాలి ఎస్పీ అశోక్   జగిత్యాల జనవరి 20(  ప్రజా మంటలు  )జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా  వ్యాప్తంగా  ఉన్న  వివిధ బ్యాంకుల్లో పని చేస్తున్న బ్యాంకు అధికారులతో  బ్యాంకుల, ఏటీఎంల  వద్ద భద్రతా ప్రమాణాలు, సిసి కెమెరాల ఏర్పాటు, ఆర్థిక నేరాలు, గతంలో   జరిగిన బ్యాంకు మరియు ఏటీఎం సంబందించిన నేరాల గురించి, భవిష్యత్తు లో...
Read More...
Local News 

మాదిగల మహా ప్రదర్శనకు బీసీలుగా మద్దతిద్దాం బీసీ నేత దరువు అంజన్న

మాదిగల మహా ప్రదర్శనకు బీసీలుగా మద్దతిద్దాం  బీసీ నేత దరువు అంజన్న   జగిత్యాల జనవరి 20(ప్రజా మంటలు   )      ఫిబ్రవరి ఏడవ తారీఖున హైదరాబాద్ మహానగరంలో మందకృష్ణ మాదిగ జరపతల పెట్టిన లక్ష డప్పులు వేల గొంతుల మహాప్రదర్శనకు బీసీలుగా తరలిరావాలని బీసీ కవులు కళాకారులు మేధావుల ఐక్యవేదిక కన్వీనర్  దరువు అంజన్న పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం లో   ఉద్యమకారులు,కవి మోహన్ బైరాగి మాట్లాడుతూ ,...
Read More...
Local News 

పోలీస్ శాఖను మరింత ప్రజలకు చేరువ చేయడానికే గ్రీవెన్స్ డే 

పోలీస్ శాఖను మరింత ప్రజలకు చేరువ చేయడానికే గ్రీవెన్స్ డే    జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   జగిత్యాల జనవరి 20 (ప్రజా మంటలు )  ప్రజల సౌకర్యార్థం ప్రజలకు మరింత చేరువ కావడానికి  నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా   జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన  13 మంది అర్జీదారులతో నేరుగా  మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో
Read More...
Local News 

పిల్లల భద్రతే  మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ 

పిల్లల భద్రతే  మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  జగిత్యాల జనవరి 20(ప్రజా మంటలు   )పిల్లల భద్రతే మాకు ముఖ్యం రోడ్డు ప్రమాద నివారణ లో అందరూ భాగస్వాములు కావాలి స్కూల్ వాహనాలకు ఎలాంటి చిన్న ప్రమాదం జరిగిన సంబంధిత డ్రైవరు, యాజమాన్యం పై  కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్పీ  అశోక్ అన్నారు. విద్యాసంస్థల ప్రతి వాహనానికి తప్పనిసరిగా రోడ్  ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారి...
Read More...
Local News 

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలి

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ జగిత్యాల జనవరి 20( ప్రజా మంటలు ) అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. జిల్లాలో 14 వార్డులో 60 లక్షలతో, 15 వ వార్డులో 20...
Read More...
National  International  

ఈరోజు రాత్రి 10.30కి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం 

ఈరోజు రాత్రి 10.30కి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం  ఈరోజు రాత్రి 10.30కి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం  వాషింగ్టన్ జనవరి 20: ఆమెరికా సంయుక్త రాష్ట్రాల 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది; 'అమెరికా ఎదుర్కొంటున్న ప్రతి సంక్షోభాన్ని పరిష్కరిస్తాను' అని ఆయన విజయ ర్యాలీలో అన్నారు.చలి ఉష్ణోగ్రతల కారణంగా, ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రధాన హాల్ లోపల జరుగుతుంది....
Read More...