తెలుగు జానపద సాహిత్య పితామహులు బిరుదు. జానపద సాహిత్యానికి బిరుదు రామరాజు ఎనలేని సేవలు ఏప్రిల్ 16... బిరుదు రామరాజు జయంతి
తెలుగు జానపద సాహిత్య పితామహులు బిరుదు. జానపద సాహిత్యానికి బిరుదు రామరాజు ఎనలేని సేవలు ఏప్రిల్ 16... బిరుదు రామరాజు జయంతి
రామ కిష్టయ్య సంగన భట్ల...
9440595494
జానపద సాహిత్య రంగంలో ఆచార్య రామరాజు పేరు తెలియని వారుండరు. తెలుగు జానపద సాహిత్యం గురించి ప్రప్రథమంగా డాక్టరేటు పట్టాకోసం పరిశోధన చేసి, దేశ విశ్వ విద్యాలయాలలో జానపద సాహిత్యం పై పరిశోధన లకు ప్రవేశం కలిపించడానికి ప్రేరణ అయినారు రామరాజు. ఆయన పరిశోధన భూమికగా ఇతర విశ్వ విద్యాలయాలలో జానపద సాహిత్యం గూర్చి పరిశోధన ప్రారంభమయింది. తెలుగునాట విశ్వ విద్యాలయాల్లో జానపద సాహిత్య శాఖలను రూపొందించి, వాటిలో తమ పరిశోధనాత్మక రచనలతో, బోధనతో, మార్గ నిర్దేశనంతో ఒకతరం జానపద సాహిత్య పరిశోధకులను, అధ్యాపకులను తయారు చేసిన మార్గదర్శకులు ఆయన. భారతీయ విశ్వ విద్యాలయాల్లోని ఆదర్శ ప్రాయమైన, అరుదైన మౌలిక పరిశోధకుల్లో ఆయన అగ్రగణ్యులు. 1955లో ప్రచురించ బడిన ఆయన పరిశోధనా గ్రంథం... 'జానపద గేయ సాహిత్యము' తెలుగు జానపద అధ్యయనాలకు విజ్ఞాన సర్వస్వంగా అందుబాటులో ఉంది.
బిరుదురాజు రామరాజు 1925 ఏప్రిల్ 16 వ తేదీ దేవనూరు గ్రామంలో లక్ష్మీదేవమ్మ, బిరుదు రాజు నారాయణరాజు దంపతు లకు జన్మించాడు. ప్రాథమిక విద్యను హన్మకొండ శివార్లలోని దేవనూరు, మడికొండలలో పూర్తి చేసి, ఉన్నత చదువుల కోసం ఎనిమిదేళ్లపాటు హన్మకొండకు 14 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వచ్చింది. 3వ తరగతి నుండి ఇంటర్మీడియెట్ వరకు ఉర్దూ మీడియంలో చదువుకున్నాడు. మెట్రిక్ చదివేటప్పుడు 11వ ఆంధ్ర మహాసభల సందర్భంగా మహాత్మా గాంధీ వరంగల్ వచ్చినప్పుడు ఆనాటి సభలలో స్వచ్ఛంద సేవలకు అందించాడు. గాంధీజీతో కలిసి పాదయాత్ర చేశాడు. 1947లో కాంగ్రెస్ సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలు పాలయ్యాడు. చదువు కునే రోజుల్లో ఆర్యసమాజం ప్రభావానికి లోనైనాడు. నిజాం వ్యతిరేక రాజకీయోద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు. నిజాం కళాశాలలో బి.ఎ. చదువుతున్న సమయంలో దాశరథి కృష్ణమా చార్యతో పరిచయం ఏర్పడింది. కాళోజీ నారాయణరావు, టి.హయగ్రీవా చారి, ముదిగొండ సిద్ద రాజలింగం, జమలాపురం కేశవరావు తదితర యువ నాయకులతో కలిసి రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, స్టేట్ కాంగ్రెస్ ఉద్యమాలలో పాల్గొని 1947లో మూడు నెలలపాటు కారాగార శిక్ష అనుభవించాడు. 1947-50ల మధ్యకాలంలో నిజాం కళాశాలలో తెలంగాణా విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా పని చేశాడు. బి.ఎ.పూర్తయ్యాక న్యాయ శాస్త్రంలో పట్టా పొందాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీలో ఎం.ఎ. చదివే రోజులలో విద్యార్థి నాయకుడిగా గుర్తింపు పొందాడు. ఆ సమయం లో సి.నారాయణ రెడ్డితో కలిసి కొంతకాలం రామనారాయణ కవులు పేరుతో జంట కవులుగా కవిత్వం చెప్పారు. మాడపాటి హనుమంతరావు ఆంధ్రసంఘం నెలకొల్పి దానికి బిరుదురాజు రామరాజును అధ్యక్షుడిగా నియమించాడు. తెలంగాణ రచయితల సంఘానికి తొలి కార్యదర్శిగా ఉన్నాడు. కాగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డాక ఆంధ్ర రచయితల సంఘంగా మారింది. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం మార్గ దర్శకత్వంలో తెలుగు జానపద గేయసాహిత్యం అనే అంశంపై పరిశోధన చేసి దక్షిణ భారత దేశంలోనే జానపద సాహిత్యంపై మొట్టమొదటి పి.హెచ్.డి ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి సంపాదిం చాడు. సంస్కృతంలో ఎం.ఎ. చేసి అందులో కూడా డాక్టరేట్ పొందా డు.
ఉస్మానియా విశ్వ విద్యాలయంలో 1951లో ఉపన్యాసకుడిగా చేరి క్రమంగా పదోన్నతుల ద్వారా తెలుగుశాఖకు డీన్గా, అధ్యక్షు డిగా విధులు నిర్వర్తించాడు. ఆయన మార్గదర్శకత్వంలో 37 మంది పిహెచ్.డి పట్టాలు పొందా రు. రామరాజు పర్యవేక్షణలో కేతవరపు రామకోటిశాస్త్రి, కోవెల సుప్రసన్నాచార్య, ముదిగొండ వీరభద్ర శాస్త్రి, అక్కిరాజు రమాపతి రావు, అనంతలక్ష్మి, కాళిదాసు పురుషోత్తం, రవ్వా శ్రీహరి వంటి వారు తమ పరిశోధనలు చేసి డాక్టరేట్ పట్టాలను పొందడం గమనార్హం. 1983లో ప్రొఫెసర్గా పదవీ విరమణ చేశాడు.
1994లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, 1995లో భారత ప్రభుత్వం నుండి నేషనల్ ప్రొఫెషనల్షిప్, 2001లో సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ వారి శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డ్, 2003లో శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం,2006/2007లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారి 'విశిష్ట పురస్కారం', 2009లో సి.పి.బ్రౌన్ అకాడెమీ వారి తెలుగు భారతి పురస్కారం అందుకున్నాడు.
ప్రాచీన సంస్కృతాంధ్ర గ్రంథాల్ని పరిశీలించి, పరిష్కరించి మొదటి సారిగా వెలుగులోకి తేవడానికి విశేష కృషి చేశాడు. సంస్కృతంలో పీహెచ్డీ చేసి 'సంస్కృత సాహిత్యానికి ఆంధ్రుల సహకారం' అనే గ్రంథంగా తన వ్యాసాన్ని ప్రచురించాడు. తాళపత్ర గ్రంథాల్ని సేకరించి పలు వ్యాసాల ద్వారా వాటిని పరిచయం చేశాడు. సంస్కృత భాషా సాహిత్యాలకు ఆంధ్రులు చేసిన సేవను గూర్చి విడిగా ఒక పెద్ద పరిశోధన గ్రంధ రచనే చేశాడు. శరత్ చంద్ర ఛటర్జీ, మున్షీ ప్రేమ్చంద్ వంటి అగ్ర రచయితల రచనలను తొలిసారిగా తెలుగులోకి అనువదించి సాహిత్యాభి మానులకు పరిచయం చేశాడు. ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాషలలో మంచి ప్రావీణ్యం ఉన్న పండితుడు రామరాజు గురు గోవింద్ సింగ్ చరిత్ర, జాతక కథలను హిందీ నుండి తెలుగులోకి అనువదించాడు. ఉర్దూ-తెలుగు నిఘంటువును కూడా రూపొందిం చాడు. ఆంగ్లంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో అనేక ఉపన్యాసాలు ఇస్తూ, అనేక పుస్తకాలు వ్రాసాడు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు యాభైకి పైగా విశ్వ విద్యాలయాలతో అనుబంధం కలిగి ఉండి, పలు యూనివర్సిటీలకు విజిటింగ్ ప్రొఫెసర్గా పని చేశాడు. తెలుగు జానపద అధ్యయనాల గాడ్ఫాదర్ గా కీర్తించబడే ఆచార్య రామరాజు, 2010, ఫిబ్రవరి 8 న హైదరాబాదులో మరణించాడు.
More News...
<%- node_title %>
<%- node_title %>
“భారతం తటస్థం కాదు… శాంతి పక్షాన ఉంది” – ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ–పుటిన్ కీలక సందేశం
రెడ్ కార్పెట్ స్వాగతం – రాజ్ఘాట్ నివాళలు
మోదీ–పుతిన్ కీలక సందేశాలు
23వ భారత్–రష్యా వార్షిక సమ్మిట్
న్యూఢిల్లీ, డిసెంబర్ 05 (ప్రజా మంటలు):రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ భారత్ పర్యటన రెండో రోజు కీలక దశలోకి ప్రవేశించింది. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఉక్రెయిన్ యుద్ధం, రక్షణ సహకారం,... చెరువుల పరిరక్షణ, వైద్య సేవల లోపాలు సరిచేయండి : కవిత డిమాండ్
హైదరాబాద్, డిసెంబర్ 05 (ప్రజా మంటలు):
జాగృతి జనంబాటలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక సమస్యలను పరిశీలించారు. షాపూర్ నగర్లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) లో సేవల లోపాలను గుర్తించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పరికి చెరువు కబ్జాలపై ఘాటుగా స్పందించారు.... గాంధీనగర్ సర్పంచ్ ఏకగ్రీవం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు
గాంధీనగర్ సర్పంచ్ ఏకగ్రీవం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు
భీమదేవరపల్లి, డిసెంబర్ 5 (ప్రజామంటలు) :
గాంధీనగర్ గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన కేతిరి లక్ష్మారెడ్డి శుక్రవారం హైదరాబాద్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ను మర్యాద పూర్వకంగా కలిసి అభివాదం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,... హయత్నగర్లో కిలాడీ లేడీ అరెస్ట్ – ఎనిమిది బ్లాక్మెయిల్ కేసులు
హైదరాబాద్ డిసెంబర్ 05 (ప్రజా మంటలు):
పురుషులను వ్యాపారం పేరుతో ట్రాప్ చేసి, సన్నిహితంగా ఉన్న సందర్భాలను రహస్యంగా చిత్రీకరించి, ఆ తర్వాత భారీ మొత్తాలు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న ఒక కిలాడీ లేడీని హయత్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల సమాచారం ప్రకారం, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ మహిళపై ఇప్పటికే ఎనిమిది... భీం రెడ్డి గూడెం , నాయకపు గూడెం, గ్రామపంచాయతీ ఏకగ్రీవ పాలకవర్గాలను అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
సారంగాపూర్ డిసెంబర్ 5(ప్రజా మంటలు)మండల భీం రెడ్డి గూడెం,నాయకపు గూడెం గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ పూర్తయి సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డ్ సభ్యులకు ఒక్కో నామినేషన్ రాగా నూతన పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక శుక్రవారం జగిత్యాలలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలవగా నూతన పాలకవర్గం సర్పంచ్... అంబేద్కర్ విగ్రహానికి నివాళులతో ముత్తారంలో ఉరడి భారతి ప్రచారానికి శ్రీకారం
అంబేద్కర్ విగ్రహానికి నివాళులతో ముత్తారంలో ఉరడి భారతి ప్రచారానికి శ్రీకారం
* అభయాంజనేయ ఆశీస్సులతో ప్రచార ప్రారంభం – సర్పంచ్ అభ్యర్థి ఊరడి భారతి జైపాల్ రెడ్డి
భీమదేవరపల్లి, డిసెంబర్ 5 (ప్రజామంటలు):
ముత్తారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఊరడి భారతి జైపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ఉదృతంగా ప్రారంభించారు. శుక్రవారం ఉదయం ఆయన కుటుంబ... ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు – సీఎం రేవంత్ రెడ్డి
ఆదిలాబాద్ డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
ఆదిలాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల భాగంగా ఆదిలాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో మాట్లాడారు.
తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు... IndiGo సంక్షోభం: దేశవ్యాప్తంగా 175 ఫ్లైట్లు రద్దు — బెంగళూరులో ఒక్కరోజులో 73 రద్దు
బెంగళూరు, డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
దేశంలో అతి పెద్ద ఎయిర్లైన్ అయిన ఇండిగోలో కొనసాగుతున్న సిబ్బంది కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. డిసెంబర్ 4 ఉదయం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 175 ఇండిగో ఫ్లైట్లు రద్దయ్యాయి. వీటిలో బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక్కరోజులోనే 73 ఫ్లైట్లు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర... చెరువులు, ఫ్లైఓవర్, ఎస్టీపీ—ప్రజా సమస్యలపై కవిత ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్/మేడ్చల్–మల్కాజిగిరి (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాట కార్యక్రమంలో భాగంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో పలు ప్రాంతాలను సందర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గరగా పరిశీలించి, ప్రభుత్వం మరియు ప్రజా ప్రతినిధుల వైఖరిపై ఘాటుగా వ్యాఖ్యానించారు.
రామంతపూర్: ఐలమ్మ విగ్రహానికి నివాళులు – చెరువు పరిశీలన
కవిత రామంతపూర్ ఇందిరానగర్లోని చాకలి... ఘనంగా ముగిసిన గురు చరిత్ర పారాయణం
జగిత్యాల డిసెంబర్ 4 (ప్రజా మంటలు)దత్త జయంతి పురస్కరించుకొని స్థానిక షిరిడి సాయి మందిరంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న గురు చరిత్ర పారాయణం గురువారం ముగిసింది. ప్రముఖ పౌరాణిక పండితులు సభాపతి బ్రహ్మశ్రీ తిగుళ్ల విశు శర్మ, రాజేశ్వర శర్మ, వైదిక కార్యక్రమ క్రతువు నిర్వహించారు.
సామూహిక పంచామృత అభిషేకం, అష్టోత్తర శతనామార్చన,... పలు వార్డుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 4( ప్రజా మంటలు)జగిత్యాల పట్టణ కొత్త బస్టాండ్ నుండి నర్సింగ్ కళాశాల రోడ్డులో 1 కోటి రూపాయలతో డ్రైనేజీ ,20వ వార్డులో 20 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన డిఈ ఆనంద్ కె డి సి... బాబ్రీ మసీదు వ్యాఖ్యలతో వివాదం – తృణమూల్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్పై సస్పెన్షన్
కోల్కతా, డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
బెంగాల్లో బాబ్రీ మసీదు పునాది వేస్తామని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలకు గురైన తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ పై పార్టీ కఠిన చర్యలు తీసుకుంది. భరత్పూర్ నియోజకవర్గానికి చెందిన ఈ ఎమ్మెల్యేను పార్టీ అధికారికంగా సస్పెండ్ చేసినట్లు TMC ప్రకటించింది.
హుమాయున్ కబీర్... 