గురుకులాలు, ఫీజు రీయింబర్స్మెంట్పై ప్రభుత్వం నిర్లక్ష్యం- కొప్పుల
విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న రేవంత్ ప్రభుత్వం: కొప్పుల ఈశ్వర్
జగిత్యాల, ఆగస్టు 24 (ప్రజా మంటలు):
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన విద్యా అవకాశాలను ప్రస్తుత ప్రభుత్వం దెబ్బతీస్తోందని విమర్శించారు. సోమవారం జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, మార్క్ఫెడ్ లోక బాపురెడ్డి తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలే ప్రధాన ఆధారమని, రాష్ట్రంలో దాదాపు 2,000 పాఠశాలలు మూతపడటం లేదా సక్రమంగా పనిచేయకపోవడంతో అడ్మిషన్లు సుమారు 1.26 లక్షల మేర తగ్గాయని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో 1,023 గురుకులాలను ఏర్పాటు చేసి 7 నుంచి 8 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరిపై ఏడాదికి సుమారు రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తూ నాణ్యమైన విద్య అందించామని తెలిపారు.
ప్రస్తుత ప్రభుత్వ హయాంలో గురుకులాల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు, నాణ్యమైన భోజనం కూడా అందడం లేదని ఆయన ఆరోపించారు. వివిధ కారణాలతో 107 మంది విద్యార్థులు మృతి చెందినప్పటికీ వాటికి దారితీసిన కారణాలను సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయడం లేదని విమర్శించారు. గురుకుల వ్యవస్థను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తోందని అన్నారు.
కేసీఆర్ హయాంలో గురుకుల పాఠశాలలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కేసీఆర్కు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ప్రస్తుత ముఖ్యమంత్రి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గురుకుల వ్యవస్థను దెబ్బతీస్తున్నారని ఆయన ఆరోపించారు. గురుకులాల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో పిల్లలను అక్కడ చేర్పించేందుకు తల్లిదండ్రులు భయపడుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు.
‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్’ విధానం తీసుకురావడం వెనుక ఉన్న గురుకుల వ్యవస్థను బలహీనపరిచే ఉద్దేశాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కో నియోజకవర్గానికి సుమారు రూ.15,600 కోట్ల అంచనా వ్యయంతో కొత్త భవనాల నిర్మాణం చేపట్టడం ద్వారా నాయకులు, కాంట్రాక్టర్లకు ప్రయోజనం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఉన్న గురుకులాలను అభివృద్ధి చేయకుండా కొత్త విధానాల పేరుతో విద్యార్థులను, విద్యా వ్యవస్థను గందరగోళానికి గురిచేయడం సరికాదన్నారు.
ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం ద్వారా వేలాది మందికి ప్రయోజనం కలిగిందని తెలిపారు. 2014 నాటికి సుమారు 9,000 మందికి ఉన్న అవకాశాలను తమ ప్రభుత్వ హయాంలో 26,000 మందికి విస్తరించామని చెప్పారు. ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించి రాష్ట్రంలోని 236 పాఠశాలలకు సుమారు రూ.250 కోట్ల బకాయిలు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.
ఫీజులు చెల్లించకపోవడంతో కొన్ని విద్యాసంస్థలు విద్యార్థులను గేట్ల వద్ద నిలబెడుతున్నాయని, సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని కొప్పుల ఈశ్వర్ అన్నారు. పుస్తకాలు, దుస్తులు, షూలు కూడా విద్యార్థులే కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.11,300 కోట్లకు చేరుకున్నాయని, దీంతో విద్యార్థులు ధర్నాలు, రాస్తారోకోలకు దిగాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు.
పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97 కూడా విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని 59 ప్రభుత్వ, 97 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల ద్వారా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద విద్యార్థులకు లభిస్తున్న విద్యా అవకాశాలను ఈ నిర్ణయం దెబ్బతీస్తుందని అన్నారు. పాలిటెక్నిక్ రెండో సంవత్సరం పూర్తి చేసిన అనంతరం నేరుగా బీటెక్లో చేరే అవకాశాలు కూడా విద్యార్థులు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను లేబర్ డిపార్ట్మెంట్లోని ఐటీఐలు, స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. దీనివల్ల విద్యార్థులతో పాటు అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 400 మందికి పైగా కాంట్రాక్ట్ లెక్చరర్లను పర్మినెంట్ చేసి, ప్రమోషన్లు కల్పిస్తూ పాలిటెక్నిక్ వ్యవస్థను బలోపేతం చేశామని తెలిపారు.
జీవో 97ను వెంటనే రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయకుండా, సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
ప్రభుత్వ వ్యవస్థలు బలహీనపడటంతో పేదలు, కూలీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలే ఎక్కువగా నష్టపోతున్నాయని ఆయన అన్నారు. సామాన్యుల పిల్లల చదువు, భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితిపై ప్రజలు, మేధావులు, విద్యావంతులు ఆలోచించాలని కొప్పుల ఈశ్వర్ కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గురుకులాలు, ఫీజు రీయింబర్స్మెంట్పై ప్రభుత్వం నిర్లక్ష్యం- కొప్పుల
జగిత్యాల, ఆగస్టు 24 (ప్రజా మంటలు):
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన విద్యా అవకాశాలను ప్రస్తుత ప్రభుత్వం దెబ్బతీస్తోందని విమర్శించారు. సోమవారం... బైపాస్ రోడ్డుపై బయోమెడికల్ వ్యర్థాలు.. మున్సిపల్ హెచ్చరిక బోర్డు కళ్లముందే నిర్లక్ష్యం
జగిత్యాల, ఆగస్టు 24 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలో హాస్పిటల్ వ్యర్థాల నిర్వహణపై నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. బైపాస్ రోడ్డులోని మోతె డౌన్ చౌరస్తా వద్ద కెనాల్పై ‘బయో హజార్డ్’, ‘ఇన్ఫెక్షియస్’ అని ముద్రించిన హాస్పిటల్ వ్యర్థాలను గుర్తుతెలియని వ్యక్తులు పడేసి వెళ్లారు.
ఈ ప్రాంతంలో చెత్త వేస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని... నేటి అర్ధరాత్రి నుండి ఆటోల బంద్ _ప్రజలు సహకరించాలి
జగిత్యాల ఆగస్ట్ 23 (ప్రజా మంటలు)
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 9348422113
నేటి అర్ధరాత్రి నుండి జగిత్యాల జిల్లా స్థాయిలో రాష్ట్ర పిలుపుమేరకు ఆటోలు బంద్ నిర్వహిస్తున్నట్లు ఆటో డ్రైవర్లు తెలిపారు. విధి లేని పరిస్థితుల్లోనే తాము బందుకు శ్రీకారం చుట్టామని ప్రజలు తమ పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో... మహిళా ఉద్యోగి ఆరోపణలన్నీ ఆవాస్తవం - ది మనోహార్ హోటల్ చైర్మన్ డీవీ మనోహర్ వెల్లడి..
సికింద్రాబాద్,ఆగస్ట్ 22 (ప్రజామంటలు):
తమ సంస్థలో ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కమ్ గెస్ట్ రిలేషన్స్ మేనేజర్గా పనిచేసిన కొరపు లావణ్య చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమని, తీవ్ర నిరాధారమైనవని హోటల్ 'ది మనోహర్' చైర్మన్ డీవీ మనోహర్ స్పష్టం చేశారు. శనివారం బేగంపేటలోని హోటల్ 'ది మనోహర్'లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లావణ్య... యాదవులను కురుమ కులంలో కలపవద్దు
సికింద్రాబాద్,ఆగస్ట్ 22 (ప్రజామంటలు):
యాదవ సామాజిక వర్గాన్ని కురుమ కులంలో కలపడానికి కుట్రలు జరుగుతున్నాయని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం, కురుమ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్, సభ్యులు ఆర్. జయప్రకాష్, టి. సుదర్శన్లను కలిసి... జర్నలిస్టులపై ఇక అక్రమ కేసులు చెల్లవా? వైరల్ మెసేజ్లో నిజమెంత?
న్యూఢిల్లీ, ఆగస్టు 22 (ప్రజా మంటలు):
దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చిందంటూ సోషల్ మీడియా, వాట్సాప్లో వైరల్ అవుతున్న ఓ సందేశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. “పెన్నుతో వార్తలు రాసే జర్నలిస్టులు, వీడియో కెమెరాలతో వార్తలను కవర్ చేసే రిపోర్టర్లు, శాటిలైట్ న్యూస్ చానళ్లు, యూట్యూబ్ న్యూస్ ఛానళ్లు, ప్రింట్ మీడియా సంస్థల్లో పనిచేసే... ఘనంగా కుంకుమార్చనలు, విశేష సంఖ్యలో పాల్గొన్న మహిళలు
జగిత్యాల ఆగస్టు 21 (ప్రజా మంటలు)పవిత్ర శ్రావణమాసాన్ని పురస్కరించుకొని శ్రీ వరలక్ష్మి వ్రతం సందర్భంగా జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం నంబి వేణుగోపాల ఆచార్య ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు.
భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పూజా ద్రవ్యాలు ఆలయం పక్షాన అందజేశారు .
కార్యక్రమం అనంతరం తీర్థ... అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు - మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
రూ.32 కోట్లతో నూకలపల్లి 2బీహెచ్కే కాలనీకి మౌలిక వసతుల కల్పన
రేషన్ దుకాణం, బస్సు సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్కు మంత్రి ఆదేశాలు
భూ రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
- ఏడాదిన్నరలో రీ - సర్వే పూర్తి
ధర్మపురికి రెవెన్యూ డివిజన్, సబ్రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయాలి
- మంత్రి అడ్లూరి... ఎల్కతుర్తిలో కారులో అనుమానాస్పద మృతదేహం కలకలం
ఎల్కతుర్తి, ఆగస్టు 21 (ప్రజా మంటలు): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని 12వ వార్డులో కారులో అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. రెండు రోజులుగా రోడ్డుపక్కన పార్క్ చేసి ఉన్న కారులో నుంచి శుక్రవారం దుర్వాసన రావడంతో బాటసారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఎల్కతుర్తి పోలీసులు... వేములవాడలో ఫోక్ సాంగ్ ఆర్టిస్ట్పై భార్య ఫిర్యాదు
వేములవాడ, ఆగస్టు 20 (ప్రజా మంటలు):
వేములవాడలోని రెడ్డి భవన్లో తన భర్త ఈశ్వర్ సాయిని మాధురి రాథోడ్తో ఒకే గదిలో గుర్తించానని ఆరోపిస్తూ ఆయన భార్య శరణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. శరణ్య ఫిర్యాదు మేరకు వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
ఫోక్ సాంగ్స్లో నటించిన ఈశ్వర్ సాయి,... 2 వేల మంది అన్ఫిట్ దరఖాస్తుదారులకు న్యాయం చేయాలి: కవిత
హైదరాబాద్, ఆగస్టు 19 (ప్రజా మంటలు):
సింగరేణిలో అన్ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు 2 వేల మంది కార్మికులను మెడికల్ బోర్డు ద్వారా అన్ఫిట్ చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పెండింగ్ దరఖాస్తులన్నీ పరిష్కారమయ్యే వరకు ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహించాలని కోరారు.
హెచ్ఎంఎస్ జనరల్... పేదల కోసం ‘భూలక్ష్మి’ పథకం - కల్వకుంట్ల కవిత
సామాజిక న్యాయం కోసం మళ్లీ భూ పంపిణీ జరగాలి: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఆగస్టు 18 (ప్రజా మంటలు):
తెలంగాణలో నిజమైన సామాజిక న్యాయం సాధించాలంటే మళ్లీ భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తమ పార్టీ అధికారంలోకి... 