కచ్చతీవు రచ్చ ఎన్నికల కోసమేనా?

On
కచ్చతీవు రచ్చ ఎన్నికల కోసమేనా?

లడాక్ ప్రజా ఉద్యమం నుండి ప్రజల దృష్టి మారాల్చడానికే బిజేపి యత్నం?

కచ్చతీవు రచ్చ ఎన్నికల కోసమేనా?

మనం ఎందుకు బంగ్లాదేశ్ కు ఎక్కువ భూభాగం ఇచ్చాం ?

సిహెచ్ వి ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్. 9391533339

రాజకీయాలలో ఎదుటివారికి ప్రాధాన్యత దక్కకుండా, వారి విమర్శలను తొక్కిపట్టే విధంగా కొత్త కథనాలను, ప్రతివిమర్శలను ముందుకు తేవడంలో బిజేపి ని మించిన చాణక్య ఎత్తుగడలు మరేవరి దగ్గర లేవనడంలో అతిశయోక్తి లేదేమో? లడాక్ లో పర్యావరణ ప్రేమికుడు, అక్కడి ప్రజల బాగోగుల కొరకు ఎన్నాళ్లుగానో శ్రమిస్తున్న సోనమ్ వాంగ్ చుక్ గత నెల రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను లెక్కచేయకుండా, ఆయన లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా, బిజేపి ఇప్పుడు కొత్తగా ఎన్నికల సమయంలో, శ్రీలంక- భారతదేశం లో మధ్య ఎప్పుడో 40 ఏళ్ల క్రితం, 1974 లో  జరిగిన కచ్చతీవు ఒడంబడిక గురించి రచ్చ రేపుతుంది.

 ప్రధాని నరేంద్ర మోడి బంగ్లాదేశ్ తో కుదుర్చుకొన్న భూమార్పిడి ఒప్పందంలో మనం నష్టపోయిన ప్రాంతం గురించి ఎందుకు మాట్లాడారు. మనకు బంగ్లా దేశ నుండి వచ్చిన భూబయగం కంటే ఎక్కువ భూబయగం మనం ఎందుకు వదులుకున్నామో ఎప్పుడైనా చెప్పారా? అరుణాచల్ ప్రాంతంలో చైనా తిష్ట వేసి వందల ఏకరాల భారత భూబయగంలో కొత్త జనవాసలను నిర్మిస్తుంటే ప్రశ్నించని వారు ఎప్పుడో జరిగిన ఒప్పందాలను ప్రశ్నించడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇదంతా దక్షిణాన, ముఖ్యంగా తమిళనాట జరుగుతున్న ఎన్నికల్లో లబ్ది పొందాదానికే అనే విషయం స్పష్టం అవుతుంది. 

కచ్చతీవు ను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు అప్పచెపితే, పదేళ్ళ పాలనలో బిజేపి ఎందుకు తిరిగి సీసుకోవడానికి ప్రయత్నంచలేదనే ప్రశ్నకు జవాబు లేదు. అలాగే లడాక్ లో, గత ఎన్నికల్లో బిజేపి వాగ్దానం చేసినట్లు ఆప్రాంతాన్ని 6 వ షెడ్యూల్ లో చేర్చి, రాష్ట్రంగా మార్చి ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న అక్కడి ప్రజల కోరికలను, ఉద్యమాలను ప్రపంచానికి తెలియకుండా అద్దుకొంటున్న మీడియా పై ఎందుకు బిజేపి నాయకత్వం ప్రశ్నించడం లేదు. లడక్ ఉద్యమ నాయకులు ప్రత్యక్షంగా చూస్తూ, అక్కడి పరిస్థితిని అవగాహన చేసుకొంటూ, గతంలో తమ ప్రజలు తిరిగిన దాదాపు 4000 వల చదరపు కి. మి. భూబయగాన్ని చైనా ఆక్రమించిందని చెపుతున్న మాటలకు ఎందుకు బిజేపి నాయకత్వం జవాబివ్వడం లేదో అందరికీ తెలుసు. 

కచ్చతీవు అనే దాదాపు 250 హెక్టారాల విస్తీర్ణం గల చిన్న, దీవి రామేశ్వరం నుండి 333 కి. మి. దూరంలో, శ్రీలంక లోని నేడుంతీవి (డేల్ఫ్ ఐలాండ్) నుండి 24 కి. మి. దూరంలో  ఉంటుంది. ఈ దీవి జనావాసలకు అనుకూలంగా ఉండకపోవడం తో ఎవరు ఈ దీవిని అంతగా అపట్టించుకోలేదు. కానీ మత్స్యసంపదకు నెలవైన ఈ ప్రాంతంలో ఎప్పుడు భారతదేశ-శ్రీలంక మత్స్యకారుల మధ్య గొడవలు జరడంతో, అప్పటి ఇందిరా గాంధీ-సిరిమావో భాండారనాయకే ప్రభుత్వాలు ఒక ఒడంబడిక కుదుర్చుకొని, కచ్చుతీవిని శ్రీలంకకు అప్పచెప్పారు. ఆసమయంలో అక్కడ ఇతర ఖనిజ సంపద, చములు నిక్షేపాలు ఉన్నాయనే విషయం తెలుసుకొని, ఏఎ సమస్యను ఎంత తొందరగా ముగించుకొంటే అంతా మంచిదని, చమురు నిక్షేపల విషయం శ్రీలంక కు తెలియడానే విషయాన్ని అప్పటి విదేశాంగ శాఖ కార్యదర్శి కేవల సింగ్- తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ల మధ్య జరిగిన లేఖలలో స్పష్టంగా పేర్కొన్నారు.

కన్యాకుమారి ప్రాంతంలోని చమురు నిక్షేపాలు స్వంతం

కచ్చతీవు ఇవ్వడం వల్ల అక్కడి కన్యాకుమారి దగ్గరిkachatheevu EEZ combined దాదాపు 4000 కి. మీ. విస్తీర్ణంలోని తీరప్రాంతం అంతా భారతదేశ సార్వభౌమాధఏకరం గల ఈఈజెడ్  (ప్రత్యేక ఆర్థిక మండలి)గా శ్రీలంక గుర్తించింది. మనం ఇచ్చింది 280 ఎకరాల (1.6 కి. మీ పొడవు – 300 మీ వెడల్పు) దీవి. ఇది ఉన్న ప్రాంతంలో మత్స్యకారుల మధ్య గోడవలే కాకుండా, స్మగ్లింగ్, మత్తుపదార్థాల రవాణా, చైనా, పాకిస్తాన్ లాంటి దేశాల ఉనికికి నెలవుగా కాకూడదనే అప్పటి ప్రభుత్వాలు ఏఎ ఒప్పందాన్ని చేసుకొన్నట్లు చరిత్ర చెపుతుంది. ఏఎ దీవి ఇవ్వడం వల్ల మనకు 4000 చదరపు కి. మి ల విస్తీర్ణంలో భారతదేశానికి ఈఈజెడ్ ప్రతిపత్తిని శ్రీ లంక ఒప్పుకొందనే వశయాన్ని మరచిపోకూడదు.

లేకుంటే కచ్ లోని మరో “సర్ క్రీక్” లా మారేది ?

కచ్చతీవు సమస్య బిజేపి కి తమిళనాడులో ఓట్లు దండుకోవడానికి ఒక ఆయుధంగా వాడుకొంటుందని తమిళ పార్టీలు భావిస్తున్నాయి. తమిళనాట కాంగ్రెస్-ది ఎం కె కూతమిని దెబ్బతీయడానికి అక్కడి ప్రజలలో విద్వేషాలు రెపడానికి ఏదోక ఆయుధంగా మారుచుకోంటుంది. దక్షిణాన ఉనికి లేని బిజేపి రాజేకీయంగా నిలదొక్కుకొని, ఏదో సాధించాలనుకోవడంలో తప్పు లేదు. కానీ మానిన గాయాలను రేపి, రెండు దేశాల ప్రజలలో ద్వేషం పెంచడానికి చేసే ప్రయత్నాలే సరికాదని తమిళ ప్రజలు భావిస్తున్నారు.

శ్రీలంక ప్రభుత్వం ఏఎ విమర్శలపై స్పందిస్తూ, ఇదొక ముగిసిన అంశామని, దీనిపై ఇప్పుడు చర్చించడం అనవసరమని ప్రకటించింది. అప్పుడు ఏఎ సమస్యను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోకుంటే, శ్రీలంక అంతర్జాతీయ కోర్టులు దావా వేస్తే, ఏఎ సమస్య కాశ్మీరీ సమస్యల అయిప్పటికి తేలేది కాదు. ఈ ప్రాంతం రెండు దేశాల మత్స్యకారుల మధ్య రావనకాష్టమలా ఘర్షణలతో మరిన్ని కొత్త సమస్యలకు దారితీసేదని అప్పటి దౌత్యవేత్తలు అంటున్నారు. ఇప్పటికీ గుజరాత్ లోని కచ్ ప్రాంతం లోని “సర్ క్రీక్”  సమస్యతో అక్కడి భారతీయ మత్స్యకారులు పాకిస్తాన్ జైళ్ళలో మగ్గుతున్న విషయం మారిచిపోకూడదు.

Tags
Join WhatsApp

More News...

మైనర్ లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్

మైనర్ లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ జగిత్యాల మార్చి 30(ప్రజా మంటలు)పట్టణం లో ట్రాఫిక్ ఎస్ ఐ, టౌన్ ఎస్ ఐ ఆద్వర్యం లో  సోమవారం ద్విచక్ర వాహనాలు నడుపుతున్న దాదాపు 50 మంది మైనర్ లను పట్టుకున్న ట్రాఫిక్ మరియు పట్టణ పోలీసులు... ట్రాఫిక్ పోలీసుస్టేషన్కు తరలించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్  ఇక పై మైనర్...
Read More...
Local News 

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు మాజీ కౌన్సిలర్ జయ శ్రీ వినతి

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు మాజీ కౌన్సిలర్ జయ శ్రీ వినతి    జగిత్యాల మార్చి 30 ( ప్రజా మంటలు)పట్టణానికి చెందిన ఇల్లు లేని నిరుపేదల కొరకు నూకపెల్లి వద్ద డబల్ బెడ్ రూమ్ ఇండ్లు 4520 కట్టడం జరిగింది. వాటిలో 520 ఇండ్ల నిర్మాణం వద్ద డ్రైనేజీ వాటర్ కొరకు సంపు ఏర్పాటు చేసి దాని నుండి మోటార్ల ద్వారా బయటకు పంపింగ్ చేసే విధానం...
Read More...
State News 

రవీంద్రభారతిలో ప్రజాప్రతినిధుల సాంస్కృతిక వేడుకలు –

రవీంద్రభారతిలో ప్రజాప్రతినిధుల సాంస్కృతిక వేడుకలు  – హైదరాబాద్ మార్చ్ 30 (ప్రజా మంటలు); శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్వహించిన ప్రజాప్రతినిధుల సాంస్కృతిక వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి A. Revanth Reddy జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రవీంద్రభారతిలో జరిగిన ఈ వేడుకల్లో మండలి చైర్మన్ Gutta Sukender Reddy, ఉప ముఖ్యమంత్రి Mallu Bhatti Vikramarka...
Read More...
Local News 

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయా: క్షమాపణలు తెలిపిన కల్వకుంట్ల కవిత

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయా: క్షమాపణలు తెలిపిన కల్వకుంట్ల కవిత హైదరాబాద్, మార్చ్ 30 (ప్రజా మంటలు): ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నిర్వహించిన ధర్నాకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయానని అంగీకరిస్తూ క్షమాపణలు తెలిపారు.ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల...
Read More...
Local News 

విద్యార్థుల భవిష్యత్ దిశానిర్దేశంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం - ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

 విద్యార్థుల భవిష్యత్ దిశానిర్దేశంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం - ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల మార్చ్ 29 (ప్రజా మంటలు): విద్యార్థుల భవిష్యత్ దిశానిర్దేశంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం అని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పేర్కొన్నారు.జగిత్యాల రూరల్ మండలంలోని అంతర్గం గ్రామంలో మండల పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందిన గడ్డం మహిపాల్ రెడ్డి గారి పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమం అంతర్గం...
Read More...
National  Opinion  State News 

చరిత్రలో, చరిత్రతో కలిసి నిలిచిన జగిత్యాల మహోన్నత చరిత్రకారుడు, విద్యా శిఖరం 

చరిత్రలో, చరిత్రతో కలిసి నిలిచిన జగిత్యాల మహోన్నత చరిత్రకారుడు, విద్యా శిఖరం  - సిహెచ్ వి ప్రభాకర్ రావు. సీనియర్ జర్నలిస్ట్  🔹 ప్రారంభ జీవితం మరియు నేపథ్యండా॥ జైశెట్టి రమణయ్యగారు 9 మే 1938న జగిత్యాలలో జన్మించారు. నిండు జీవితం అనుభవించి, 88 ఏళ్ల వయసులో,  శ్రీరామనవమి, మార్చ్ 27, 2026 రోజున పరమపదించారు. నడిచే గ్రంథాలయంగా చెప్పుకొనే రమణయ్య గారి మరణం జగిత్యాల విద్యావేత్తలకు,...
Read More...
Local News 

అంగరంగ వైభవంగా శ్రీ రాములవారి పట్టాభిషేకం

అంగరంగ వైభవంగా శ్రీ రాములవారి పట్టాభిషేకం    జగిత్యాల మార్చి 28 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో గల సీతారామచంద్రస్వామి ఆలయం (ఎడ్లంగడి) లో శుక్రవారం సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించగా శనివారం పట్టాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు విషెస్ సంఖ్యలో పాల్గొన్నారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ప్రత్యేక వేదికపై సీతారాముల పరివారం ఉత్సవమూర్తులను...
Read More...
State News 

జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు గా సంఘనబట్ల దినేష్ నియామకం 

జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు గా సంఘనబట్ల దినేష్ నియామకం  ధర్మపురి, మార్చ్ 28 (ప్రజా మంటలు): ధర్మపురికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సంఘనబట్ల దినేష్‌కు కీలక పదవి దక్కింది. తెలంగాణ పబ్లిక్ లైబ్రరీల చట్టం, 1960 ప్రకారం ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ మేరకు, ఆయనను జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ (జిల్లా గ్రంథాలయ సమస్థ) చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి....
Read More...
Local News 

జగిత్యాలలో హజ్ యాత్రికులకు వాక్సినేషన్ ప్రారంభం – ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పరిశీలన

జగిత్యాలలో హజ్ యాత్రికులకు వాక్సినేషన్ ప్రారంభం – ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పరిశీలన జగిత్యాల మార్చ్ 28 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని మాతా శిశు హాస్పిటల్‌లో హజ్ యాత్రికులకు వాక్సినేషన్ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో జరుగుతున్న సేవలను పరిశీలిస్తూ, మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను సమీక్షించారు. ఇటీవల ప్రారంభించిన క్రిటికల్ కేర్ యూనిట్ హాస్పిటల్‌ను కూడా సందర్శించి...
Read More...
National  Local News  International   Social  State News 

పోలాండ్ దేశ దేవుడు మన భారత దేశ రాజు. - అతనిని దూషిస్తే మరణ శిక్ష !!!

పోలాండ్ దేశ దేవుడు మన భారత దేశ రాజు. - అతనిని దూషిస్తే మరణ శిక్ష !!! (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/ 9348422113).  హైదరాబాద్ 27 మార్చి (ప్రజా మంటలు) :  పోలాండ్ కు భారతదేశం పై అంత మమకారం ఎందుకు?  పోలాండ్లో ఈ భారత రాజును దూషిస్తే మరణశిక్ష. మన దేశపు రాజు, పోలాండ్ దేశపు దేవుడు శ్రీ శ్రీ రాజా  సాహబ్ దిగ్విజయ్ సింగ్.  కానీ భారతీయులకు...
Read More...
Local News 

ప్రముఖ చరిత్రకారుడు జైశెట్టి రమణయ్య మృతి.. కేసీఆర్, కవిత సంతాపం

ప్రముఖ చరిత్రకారుడు జైశెట్టి రమణయ్య మృతి.. కేసీఆర్, కవిత సంతాపం జగిత్యాల, మార్చి 27 (ప్రజా మంటలు): ప్రముఖ చరిత్రకారుడు, రిటైర్డ్ లెక్చరర్ జైశెట్టి రమణయ్య (85) అనారోగ్యంతో మరణించారు. ఆదివారం 29 వ తేదీన జగిత్యాల లలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.   జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ సభ్యులు మంచాలబీసీ...
Read More...
National  State News 

ఏప్రిల్ 25న కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన – తెలంగాణ రాజకీయాల్లో కొత్త దిశ?

ఏప్రిల్ 25న కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన – తెలంగాణ రాజకీయాల్లో కొత్త దిశ? నిజామాబాద్, మార్చ్ 27 (ప్రజా మంటలు): తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులకు నాంది పలుకుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు. తమ సంస్థ అయిన తెలంగాణ జాగృతి త్వరలో రాజకీయ పార్టీగా మారబోతోందని వెల్లడించారు.ఏప్రిల్ 25న మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ వేదికగా పార్టీ జెండా, అజెండాను అధికారికంగా ప్రకటించనున్నట్లు...
Read More...