కచ్చతీవు రచ్చ ఎన్నికల కోసమేనా?
లడాక్ ప్రజా ఉద్యమం నుండి ప్రజల దృష్టి మారాల్చడానికే బిజేపి యత్నం?
కచ్చతీవు రచ్చ ఎన్నికల కోసమేనా?
మనం ఎందుకు బంగ్లాదేశ్ కు ఎక్కువ భూభాగం ఇచ్చాం ?
సిహెచ్ వి ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్. 9391533339
రాజకీయాలలో ఎదుటివారికి ప్రాధాన్యత దక్కకుండా, వారి విమర్శలను తొక్కిపట్టే విధంగా కొత్త కథనాలను, ప్రతివిమర్శలను ముందుకు తేవడంలో బిజేపి ని మించిన చాణక్య ఎత్తుగడలు మరేవరి దగ్గర లేవనడంలో అతిశయోక్తి లేదేమో? లడాక్ లో పర్యావరణ ప్రేమికుడు, అక్కడి ప్రజల బాగోగుల కొరకు ఎన్నాళ్లుగానో శ్రమిస్తున్న సోనమ్ వాంగ్ చుక్ గత నెల రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను లెక్కచేయకుండా, ఆయన లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా, బిజేపి ఇప్పుడు కొత్తగా ఎన్నికల సమయంలో, శ్రీలంక- భారతదేశం లో మధ్య ఎప్పుడో 40 ఏళ్ల క్రితం, 1974 లో జరిగిన కచ్చతీవు ఒడంబడిక గురించి రచ్చ రేపుతుంది.
ప్రధాని నరేంద్ర మోడి బంగ్లాదేశ్ తో కుదుర్చుకొన్న భూమార్పిడి ఒప్పందంలో మనం నష్టపోయిన ప్రాంతం గురించి ఎందుకు మాట్లాడారు. మనకు బంగ్లా దేశ నుండి వచ్చిన భూబయగం కంటే ఎక్కువ భూబయగం మనం ఎందుకు వదులుకున్నామో ఎప్పుడైనా చెప్పారా? అరుణాచల్ ప్రాంతంలో చైనా తిష్ట వేసి వందల ఏకరాల భారత భూబయగంలో కొత్త జనవాసలను నిర్మిస్తుంటే ప్రశ్నించని వారు ఎప్పుడో జరిగిన ఒప్పందాలను ప్రశ్నించడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇదంతా దక్షిణాన, ముఖ్యంగా తమిళనాట జరుగుతున్న ఎన్నికల్లో లబ్ది పొందాదానికే అనే విషయం స్పష్టం అవుతుంది.
కచ్చతీవు ను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు అప్పచెపితే, పదేళ్ళ పాలనలో బిజేపి ఎందుకు తిరిగి సీసుకోవడానికి ప్రయత్నంచలేదనే ప్రశ్నకు జవాబు లేదు. అలాగే లడాక్ లో, గత ఎన్నికల్లో బిజేపి వాగ్దానం చేసినట్లు ఆప్రాంతాన్ని 6 వ షెడ్యూల్ లో చేర్చి, రాష్ట్రంగా మార్చి ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న అక్కడి ప్రజల కోరికలను, ఉద్యమాలను ప్రపంచానికి తెలియకుండా అద్దుకొంటున్న మీడియా పై ఎందుకు బిజేపి నాయకత్వం ప్రశ్నించడం లేదు. లడక్ ఉద్యమ నాయకులు ప్రత్యక్షంగా చూస్తూ, అక్కడి పరిస్థితిని అవగాహన చేసుకొంటూ, గతంలో తమ ప్రజలు తిరిగిన దాదాపు 4000 వల చదరపు కి. మి. భూబయగాన్ని చైనా ఆక్రమించిందని చెపుతున్న మాటలకు ఎందుకు బిజేపి నాయకత్వం జవాబివ్వడం లేదో అందరికీ తెలుసు.
కచ్చతీవు అనే దాదాపు 250 హెక్టారాల విస్తీర్ణం గల చిన్న, దీవి రామేశ్వరం నుండి 333 కి. మి. దూరంలో, శ్రీలంక లోని నేడుంతీవి (డేల్ఫ్ ఐలాండ్) నుండి 24 కి. మి. దూరంలో ఉంటుంది. ఈ దీవి జనావాసలకు అనుకూలంగా ఉండకపోవడం తో ఎవరు ఈ దీవిని అంతగా అపట్టించుకోలేదు. కానీ మత్స్యసంపదకు నెలవైన ఈ ప్రాంతంలో ఎప్పుడు భారతదేశ-శ్రీలంక మత్స్యకారుల మధ్య గొడవలు జరడంతో, అప్పటి ఇందిరా గాంధీ-సిరిమావో భాండారనాయకే ప్రభుత్వాలు ఒక ఒడంబడిక కుదుర్చుకొని, కచ్చుతీవిని శ్రీలంకకు అప్పచెప్పారు. ఆసమయంలో అక్కడ ఇతర ఖనిజ సంపద, చములు నిక్షేపాలు ఉన్నాయనే విషయం తెలుసుకొని, ఏఎ సమస్యను ఎంత తొందరగా ముగించుకొంటే అంతా మంచిదని, చమురు నిక్షేపల విషయం శ్రీలంక కు తెలియడానే విషయాన్ని అప్పటి విదేశాంగ శాఖ కార్యదర్శి కేవల సింగ్- తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ల మధ్య జరిగిన లేఖలలో స్పష్టంగా పేర్కొన్నారు.
కన్యాకుమారి ప్రాంతంలోని చమురు నిక్షేపాలు స్వంతం
కచ్చతీవు ఇవ్వడం వల్ల అక్కడి కన్యాకుమారి దగ్గరి
దాదాపు 4000 కి. మీ. విస్తీర్ణంలోని తీరప్రాంతం అంతా భారతదేశ సార్వభౌమాధఏకరం గల ఈఈజెడ్ (ప్రత్యేక ఆర్థిక మండలి)గా శ్రీలంక గుర్తించింది. మనం ఇచ్చింది 280 ఎకరాల (1.6 కి. మీ పొడవు – 300 మీ వెడల్పు) దీవి. ఇది ఉన్న ప్రాంతంలో మత్స్యకారుల మధ్య గోడవలే కాకుండా, స్మగ్లింగ్, మత్తుపదార్థాల రవాణా, చైనా, పాకిస్తాన్ లాంటి దేశాల ఉనికికి నెలవుగా కాకూడదనే అప్పటి ప్రభుత్వాలు ఏఎ ఒప్పందాన్ని చేసుకొన్నట్లు చరిత్ర చెపుతుంది. ఏఎ దీవి ఇవ్వడం వల్ల మనకు 4000 చదరపు కి. మి ల విస్తీర్ణంలో భారతదేశానికి ఈఈజెడ్ ప్రతిపత్తిని శ్రీ లంక ఒప్పుకొందనే వశయాన్ని మరచిపోకూడదు.
లేకుంటే కచ్ లోని మరో “సర్ క్రీక్” లా మారేది ?
కచ్చతీవు సమస్య బిజేపి కి తమిళనాడులో ఓట్లు దండుకోవడానికి ఒక ఆయుధంగా వాడుకొంటుందని తమిళ పార్టీలు భావిస్తున్నాయి. తమిళనాట కాంగ్రెస్-ది ఎం కె కూతమిని దెబ్బతీయడానికి అక్కడి ప్రజలలో విద్వేషాలు రెపడానికి ఏదోక ఆయుధంగా మారుచుకోంటుంది. దక్షిణాన ఉనికి లేని బిజేపి రాజేకీయంగా నిలదొక్కుకొని, ఏదో సాధించాలనుకోవడంలో తప్పు లేదు. కానీ మానిన గాయాలను రేపి, రెండు దేశాల ప్రజలలో ద్వేషం పెంచడానికి చేసే ప్రయత్నాలే సరికాదని తమిళ ప్రజలు భావిస్తున్నారు.
శ్రీలంక ప్రభుత్వం ఏఎ విమర్శలపై స్పందిస్తూ, ఇదొక ముగిసిన అంశామని, దీనిపై ఇప్పుడు చర్చించడం అనవసరమని ప్రకటించింది. అప్పుడు ఏఎ సమస్యను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోకుంటే, శ్రీలంక అంతర్జాతీయ కోర్టులు దావా వేస్తే, ఏఎ సమస్య కాశ్మీరీ సమస్యల అయిప్పటికి తేలేది కాదు. ఈ ప్రాంతం రెండు దేశాల మత్స్యకారుల మధ్య రావనకాష్టమలా ఘర్షణలతో మరిన్ని కొత్త సమస్యలకు దారితీసేదని అప్పటి దౌత్యవేత్తలు అంటున్నారు. ఇప్పటికీ గుజరాత్ లోని కచ్ ప్రాంతం లోని “సర్ క్రీక్” సమస్యతో అక్కడి భారతీయ మత్స్యకారులు పాకిస్తాన్ జైళ్ళలో మగ్గుతున్న విషయం మారిచిపోకూడదు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఫిస్కల్ డెఫిసిట్ నుంచి Debt-to-GDP రేషియోకు బడ్జెట్ మార్పు
న్యూఢిల్లీ డిసెంబర్ 12 :
ఈ ఏడాది బడ్జెట్లో మోదీ ప్రభుత్వం ఒక కీలక ఆర్థిక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు భారత ఆర్థిక విధానానికి ప్రధాన సూచికగా పరిగణించిన ఫిస్కల్ డెఫిసిట్ స్థానంలో, ప్రభుత్వం ఇప్పుడు Debt-to-GDP Ratio (దేశం మొత్తం అప్పు – మొత్తం ఆర్థిక ఉత్పత్తి పోలిక)ను కేంద్రంగా ఉంచుతోంది.... వెనిజులా తీరంలో ‘స్కిప్పర్’ చమురు నౌక స్వాధీనం
వాషింగ్టన్/కరాకస్ డీసెంబర్ 12:
వెనిజువెలా తీరానికి సమీపంలో ‘స్కిప్పర్’ అనే చమురు ట్యాంకర్ను స్వాధీనం చేసుకోవడం ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మడురో ప్రభుత్వంపై తీసుకుంటున్న చర్యలు మరో కొత్త దశలోకి చేరాయి. మడురోను అధికారం నుండి దూరం చేయడమే లక్ష్యంగా ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు, ఆర్థిక నిర్బంధం, సైనిక ఒత్తిడిని క్రమంగా పెంచుతోంది.... బాల కార్మికులు, బాల్య వివాహాలు లేని గ్రామంగా తీర్చిదిద్దండి- కొత్త సర్పంచ్ లకు ఆశ్రిత సంస్థ విజ్ఞప్తి
సికింద్రాబాద్, డిసెంబర్ 12 (ప్రజామంటలు):
.ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల మద్దతుతో విజయం సాధించిన ప్రతి ఒక్కరు. గ్రామ అభివృద్ధిని, బాలల హక్కుల సాధన లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాలని కొత్త సర్పంచ్ లకు ఆశ్రిత సంస్థ విజ్ఞప్తి చేసింది. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఇటీవల పోటీ చేసి గెలుపొందిన నూతన సర్పంచులకు ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ... హైదరాబాద్లో విద్యాసంస్థల దయనీయ పరిస్థితులపై ఆందోళన
హైదరాబాద్, డిసెంబర్ 12 (ప్రజా మంటలు):
జాగృతి జనంబాట కార్యక్రమం మూడో రోజు భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్ జిల్లాలోని అంబర్పేట్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో పర్యటించారు. అంబర్పేట్ నియోజకవర్గంలో కాచిగూడ ప్రభుత్వ విద్యాసంస్థలు మరియు చె నంబర్ బ్రిడ్జి కిందనున్న రోడ్డును ఆమె స్వయంగా పరిశీలించారు.
కాచిగూడ ప్రభుత్వ స్కూల్,... అల్లూరి సీతారామ రాజు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం – 9 మంది మృతి
విశాఖపట్నం డిసెంబర్ 12:
అల్లూరి సీతారామ రాజు జిల్లా చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డు మరోసారి దారుణ ప్రమాదానికి వేదికైంది. శుక్రవారం ఉదయం రాజుగారి మెట్ట వద్ద ఒక ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడి భారీ విషాదం చోటుచేసుకుంది. బస్సులో ఉన్న మొత్తం 35 మంది యాత్రికుల్లో తొమ్మిది మంది అక్కడిక్కడే మృతి చెందగా, మరికొందరు... వార్డు అభ్యర్థి చుక్క గంగారెడ్డి – ఐదు కోట్ల అభివృద్ధి పనులకు హామీ
బుగ్గారం, డిసెంబర్ 12 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా 12వ వార్డులో పోటీ చేస్తున్న తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి ఇచ్చిన హామీలతో స్థానిక రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.
ప్రజలను పలకరిస్తూ ప్రచారంలో పాల్గొన్న... 2వ వార్డులో జోరందుకొన్న అంకం విజయ భూమయ్య ప్రచారం
గొల్లపల్లి డిసెంబర్ 12 (ప్రజా మంటలు):మండల కేంద్రంలోని 2వ వార్డులో ఎన్నికల సందడి మరింత వేడెక్కుతోంది. గౌను గుర్తుతో పోటీ చేస్తున్న అభ్యర్థి అంకం విజయ భూమయ్య తన ప్రచారాన్ని భారీగా చేపట్టారు. ప్రజలను కలిసిన ఆమె,వారు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను తెలుసుకుని… వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు.... కోరుట్లలో విచిత్ర ఘటన – మద్యం మత్తులో బ్యాలెట్ పత్రాలను నమిలేసిన ఓటరు
కోరుట్ల, డిసెంబర్ 12 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రక్రియలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటరు బ్యాలెట్ పత్రాలను నమిలేయడంతో ప్రాంతంలో చిన్నపాటి కలకలం రేగింది.
గ్రామానికి చెందిన వృద్ధుడు పిట్టల వెంకటి మద్యం సేవించి 4వ వార్డు పోలింగ్... సీడ్ బిల్లు–2025 పై రైతులు, నిపుణుల నుంచి అభిప్రాయాల సేకరణ
సికింద్రాబాద్, డిసెంబర్ 11 (ప్రజామంటలు):
తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టీడీఎఫ్) నిర్వహిస్తున్న టీడీఎఫ్ జైకిసాన్ ప్రాజెక్ట్ లో భాగంగా సీడ్ బిల్–2025 పై రైతులు, వ్యవసాయ నిపుణుల అభిప్రాయాలు, సూచనలను సేకరించింది. ఆన్లైన్ కాన్ఫరెన్స్ లు, వెబినార్ ల ద్వారా తీసుకున్న అభిప్రాయాల నివేదికను గురువారం కేంద్ర వ్యవసాయ & రైతుల సంక్షేమ శాఖ... దేశానికి అనేక ఆణిముత్యాలను అందించిన విద్యాసంస్థ ఇది : రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
సికింద్రాబాద్, డిసెంబర్ 11 (ప్రజామంటలు) :
దేశానికి అనేక ఆణిముత్యాలను అందించిన విద్యాసంస్థగా సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ నిలిచిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. రెజిమెంటల్ బజార్లో జరిగిన సెయింట్ ఫ్రాన్సిస్ బాలికల హైస్కూల్ 175వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాలికల విద్యకు 175 ఏళ్లుగా సేవ చేస్తూ ఎందరో ఐఏఎస్, ఐపీఎస్,... అఖండ 2 సినిమా టికెట్ ధరల పెంపు జీవోను రద్దు చేసిన హైకోర్టు
హైదరాబాద్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు):బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా కోసం ప్రభుత్వ ధరల కంటే అధికంగా టికెట్ రేట్లు వసూలు చేయడానికి అనుమతిస్తూ జారీ చేసిన జీవోను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. టికెట్ రేట్లు పెంచడానికి సరైన ఆధారాలు, సమగ్ర కారణాలు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇవ్వడం చట్టానికి... నాన్బెయిలబుల్ వారెంట్ ప్రచారం అసత్యం: కొండా సురేఖ ఖండన:
హైదరాబాద్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు):
తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి గా పనిచేస్తున్న కొండా సురేఖపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేశారన్న వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం కావడం పట్ల ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమాచారంలో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు.
మంత్రి కొండా సురేఖ వివరణ... 