కచ్చతీవు రచ్చ ఎన్నికల కోసమేనా?

On
కచ్చతీవు రచ్చ ఎన్నికల కోసమేనా?

లడాక్ ప్రజా ఉద్యమం నుండి ప్రజల దృష్టి మారాల్చడానికే బిజేపి యత్నం?

కచ్చతీవు రచ్చ ఎన్నికల కోసమేనా?

మనం ఎందుకు బంగ్లాదేశ్ కు ఎక్కువ భూభాగం ఇచ్చాం ?

సిహెచ్ వి ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్. 9391533339

రాజకీయాలలో ఎదుటివారికి ప్రాధాన్యత దక్కకుండా, వారి విమర్శలను తొక్కిపట్టే విధంగా కొత్త కథనాలను, ప్రతివిమర్శలను ముందుకు తేవడంలో బిజేపి ని మించిన చాణక్య ఎత్తుగడలు మరేవరి దగ్గర లేవనడంలో అతిశయోక్తి లేదేమో? లడాక్ లో పర్యావరణ ప్రేమికుడు, అక్కడి ప్రజల బాగోగుల కొరకు ఎన్నాళ్లుగానో శ్రమిస్తున్న సోనమ్ వాంగ్ చుక్ గత నెల రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను లెక్కచేయకుండా, ఆయన లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా, బిజేపి ఇప్పుడు కొత్తగా ఎన్నికల సమయంలో, శ్రీలంక- భారతదేశం లో మధ్య ఎప్పుడో 40 ఏళ్ల క్రితం, 1974 లో  జరిగిన కచ్చతీవు ఒడంబడిక గురించి రచ్చ రేపుతుంది.

 ప్రధాని నరేంద్ర మోడి బంగ్లాదేశ్ తో కుదుర్చుకొన్న భూమార్పిడి ఒప్పందంలో మనం నష్టపోయిన ప్రాంతం గురించి ఎందుకు మాట్లాడారు. మనకు బంగ్లా దేశ నుండి వచ్చిన భూబయగం కంటే ఎక్కువ భూబయగం మనం ఎందుకు వదులుకున్నామో ఎప్పుడైనా చెప్పారా? అరుణాచల్ ప్రాంతంలో చైనా తిష్ట వేసి వందల ఏకరాల భారత భూబయగంలో కొత్త జనవాసలను నిర్మిస్తుంటే ప్రశ్నించని వారు ఎప్పుడో జరిగిన ఒప్పందాలను ప్రశ్నించడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇదంతా దక్షిణాన, ముఖ్యంగా తమిళనాట జరుగుతున్న ఎన్నికల్లో లబ్ది పొందాదానికే అనే విషయం స్పష్టం అవుతుంది. 

కచ్చతీవు ను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు అప్పచెపితే, పదేళ్ళ పాలనలో బిజేపి ఎందుకు తిరిగి సీసుకోవడానికి ప్రయత్నంచలేదనే ప్రశ్నకు జవాబు లేదు. అలాగే లడాక్ లో, గత ఎన్నికల్లో బిజేపి వాగ్దానం చేసినట్లు ఆప్రాంతాన్ని 6 వ షెడ్యూల్ లో చేర్చి, రాష్ట్రంగా మార్చి ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న అక్కడి ప్రజల కోరికలను, ఉద్యమాలను ప్రపంచానికి తెలియకుండా అద్దుకొంటున్న మీడియా పై ఎందుకు బిజేపి నాయకత్వం ప్రశ్నించడం లేదు. లడక్ ఉద్యమ నాయకులు ప్రత్యక్షంగా చూస్తూ, అక్కడి పరిస్థితిని అవగాహన చేసుకొంటూ, గతంలో తమ ప్రజలు తిరిగిన దాదాపు 4000 వల చదరపు కి. మి. భూబయగాన్ని చైనా ఆక్రమించిందని చెపుతున్న మాటలకు ఎందుకు బిజేపి నాయకత్వం జవాబివ్వడం లేదో అందరికీ తెలుసు. 

కచ్చతీవు అనే దాదాపు 250 హెక్టారాల విస్తీర్ణం గల చిన్న, దీవి రామేశ్వరం నుండి 333 కి. మి. దూరంలో, శ్రీలంక లోని నేడుంతీవి (డేల్ఫ్ ఐలాండ్) నుండి 24 కి. మి. దూరంలో  ఉంటుంది. ఈ దీవి జనావాసలకు అనుకూలంగా ఉండకపోవడం తో ఎవరు ఈ దీవిని అంతగా అపట్టించుకోలేదు. కానీ మత్స్యసంపదకు నెలవైన ఈ ప్రాంతంలో ఎప్పుడు భారతదేశ-శ్రీలంక మత్స్యకారుల మధ్య గొడవలు జరడంతో, అప్పటి ఇందిరా గాంధీ-సిరిమావో భాండారనాయకే ప్రభుత్వాలు ఒక ఒడంబడిక కుదుర్చుకొని, కచ్చుతీవిని శ్రీలంకకు అప్పచెప్పారు. ఆసమయంలో అక్కడ ఇతర ఖనిజ సంపద, చములు నిక్షేపాలు ఉన్నాయనే విషయం తెలుసుకొని, ఏఎ సమస్యను ఎంత తొందరగా ముగించుకొంటే అంతా మంచిదని, చమురు నిక్షేపల విషయం శ్రీలంక కు తెలియడానే విషయాన్ని అప్పటి విదేశాంగ శాఖ కార్యదర్శి కేవల సింగ్- తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ల మధ్య జరిగిన లేఖలలో స్పష్టంగా పేర్కొన్నారు.

కన్యాకుమారి ప్రాంతంలోని చమురు నిక్షేపాలు స్వంతం

కచ్చతీవు ఇవ్వడం వల్ల అక్కడి కన్యాకుమారి దగ్గరిkachatheevu EEZ combined దాదాపు 4000 కి. మీ. విస్తీర్ణంలోని తీరప్రాంతం అంతా భారతదేశ సార్వభౌమాధఏకరం గల ఈఈజెడ్  (ప్రత్యేక ఆర్థిక మండలి)గా శ్రీలంక గుర్తించింది. మనం ఇచ్చింది 280 ఎకరాల (1.6 కి. మీ పొడవు – 300 మీ వెడల్పు) దీవి. ఇది ఉన్న ప్రాంతంలో మత్స్యకారుల మధ్య గోడవలే కాకుండా, స్మగ్లింగ్, మత్తుపదార్థాల రవాణా, చైనా, పాకిస్తాన్ లాంటి దేశాల ఉనికికి నెలవుగా కాకూడదనే అప్పటి ప్రభుత్వాలు ఏఎ ఒప్పందాన్ని చేసుకొన్నట్లు చరిత్ర చెపుతుంది. ఏఎ దీవి ఇవ్వడం వల్ల మనకు 4000 చదరపు కి. మి ల విస్తీర్ణంలో భారతదేశానికి ఈఈజెడ్ ప్రతిపత్తిని శ్రీ లంక ఒప్పుకొందనే వశయాన్ని మరచిపోకూడదు.

లేకుంటే కచ్ లోని మరో “సర్ క్రీక్” లా మారేది ?

కచ్చతీవు సమస్య బిజేపి కి తమిళనాడులో ఓట్లు దండుకోవడానికి ఒక ఆయుధంగా వాడుకొంటుందని తమిళ పార్టీలు భావిస్తున్నాయి. తమిళనాట కాంగ్రెస్-ది ఎం కె కూతమిని దెబ్బతీయడానికి అక్కడి ప్రజలలో విద్వేషాలు రెపడానికి ఏదోక ఆయుధంగా మారుచుకోంటుంది. దక్షిణాన ఉనికి లేని బిజేపి రాజేకీయంగా నిలదొక్కుకొని, ఏదో సాధించాలనుకోవడంలో తప్పు లేదు. కానీ మానిన గాయాలను రేపి, రెండు దేశాల ప్రజలలో ద్వేషం పెంచడానికి చేసే ప్రయత్నాలే సరికాదని తమిళ ప్రజలు భావిస్తున్నారు.

శ్రీలంక ప్రభుత్వం ఏఎ విమర్శలపై స్పందిస్తూ, ఇదొక ముగిసిన అంశామని, దీనిపై ఇప్పుడు చర్చించడం అనవసరమని ప్రకటించింది. అప్పుడు ఏఎ సమస్యను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోకుంటే, శ్రీలంక అంతర్జాతీయ కోర్టులు దావా వేస్తే, ఏఎ సమస్య కాశ్మీరీ సమస్యల అయిప్పటికి తేలేది కాదు. ఈ ప్రాంతం రెండు దేశాల మత్స్యకారుల మధ్య రావనకాష్టమలా ఘర్షణలతో మరిన్ని కొత్త సమస్యలకు దారితీసేదని అప్పటి దౌత్యవేత్తలు అంటున్నారు. ఇప్పటికీ గుజరాత్ లోని కచ్ ప్రాంతం లోని “సర్ క్రీక్”  సమస్యతో అక్కడి భారతీయ మత్స్యకారులు పాకిస్తాన్ జైళ్ళలో మగ్గుతున్న విషయం మారిచిపోకూడదు.

Tags
Join WhatsApp

More News...

State News 

గురుకుల హాస్టళ్లలో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించాలి : THRC

గురుకుల హాస్టళ్లలో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించాలి : THRC హైదరాబాద్, ఆగస్టు 31 (ప్రజా మంటలు): గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్‌ఆర్‌సీ) సూచించింది. బెల్లంపల్లి బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై కమిషన్ హెచ్‌ఆర్‌సీ నంబర్ 3034/2026 కింద సుమోటో కేసు నమోదు చేసింది. 2026...
Read More...
State News 

బంగారు తెలంగాణ కాదు.. బహుజన తెలంగాణ కావాలి - కవిత

బంగారు తెలంగాణ కాదు.. బహుజన తెలంగాణ కావాలి - కవిత కాంగ్రెస్‌పై పోరాటం.. టీఆర్ఎస్ నిర్మాణం | ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ నిజామాబాద్, ఆగస్టు 31 (ప్రజా మంటలు):తెలంగాణకు ఇప్పుడు కావాల్సింది బంగారు తెలంగాణ కాదని, బహుజన తెలంగాణ అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల జీవితాల్లో ఆశించిన స్థాయిలో...
Read More...
Local News 

ఉద్యోగుల ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలి సెప్టెంబర్ 10న ఛలో హైదరాబాద్ టీజీజెఏసి రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్

ఉద్యోగుల ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలి సెప్టెంబర్ 10న ఛలో హైదరాబాద్ టీజీజెఏసి రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ జగిత్యాల ఆగస్టు 31 (ప్రజా మంటలు)    టీజీజెఏసి జగిత్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, జిల్లా చైర్మన్ మిర్యాల నాగేందర్ రెడ్డి మరియు కందుకూరి రవిబాబు  ఆధ్వర్యంలో, టీఎన్జీవో జిల్లా కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశం లో రాష్ట్ర  టి జి ఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్  మారం జగదీశ్వర్  ముఖ్య అతిధిగా పాల్గొని...
Read More...
Local News  State News 

చేనేత కార్మికులకు షరతులు లేకుండా పెన్షన్లు మంజూరు చేయాలి

చేనేత కార్మికులకు షరతులు లేకుండా పెన్షన్లు మంజూరు చేయాలి గొల్లపల్లి, ఆగస్టు 31 (ప్రజా మంటలు): రాష్ట్రంలోని 50 సంవత్సరాలు పైబడిన చేనేత కార్మికులకు ప్రభుత్వం అందించే చేయూత పెన్షన్లను ఎలాంటి కఠిన నిబంధనలు, షరతులు లేకుండా సరళతరం చేసి వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ చేనేత ఐక్యవేదిక జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి అంకం భూమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన...
Read More...
Local News 

గొల్లపల్లిలో లయన్స్ క్లబ్ చే ఉచిత కంటి వైద్య శిబిరం

గొల్లపల్లిలో లయన్స్ క్లబ్ చే ఉచిత కంటి వైద్య శిబిరం గొల్లపల్లి, ఆగస్టు 31, ప్రజా మంటలు: గొల్లపల్లి మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గొల్లపల్లి గ్రామపంచాయతీ వద్ద జరిగిన ఈ శిబిరాన్ని ధర్మపురి సీఐ రామ్ నరసింహారెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బొమ్మన కుమార్, ప్రోగ్రామింగ్ చైర్మన్, ఉప సర్పంచ్...
Read More...
Local News 

క్యాన్సర్ బాధితుడికి ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆర్థిక సాయం: రిటైర్డ్ ఉద్యోగి శ్రీనివాస్‌కు ఎమ్మెల్యే ప్రశంస.!

క్యాన్సర్ బాధితుడికి ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆర్థిక సాయం: రిటైర్డ్ ఉద్యోగి శ్రీనివాస్‌కు ఎమ్మెల్యే ప్రశంస.! జగిత్యాల ఆగస్ట్ 31(ప్రజా  మంటలు) ఆరోగ్య పరిరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని, గుట్కా, తంబాకు వంటి ప్రాణాంతక అలవాట్లకు దూరంగా ఉండాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణానికి చెందిన విశ్రాంత ఉద్యోగి శ్రీనివాస్ దాతల సహకారంతో సమకూర్చిన రూ.40,000 ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డా. సంజయ్ కుమార్...
Read More...
Crime  State News 

తుక్కుగూడలో నర్సు దారుణ హత్య.. భద్రత లేని విశ్రాంతి గదులపై తీవ్ర విమర్శలు

తుక్కుగూడలో నర్సు దారుణ హత్య.. భద్రత లేని విశ్రాంతి గదులపై తీవ్ర విమర్శలు హైదరాబాద్‌ ఆగస్ట్ 31 (ప్రజా మంటలు): తుక్కుగూడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న 35 ఏళ్ల నర్సు దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఆస్పత్రి సమీపంలోని మెకానిక్‌ షాపులో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన సైనా ఉల్లా ఖాన్‌ను నిందితుడిగా...
Read More...
Local News 

ఎన్ని విమర్శలు చేసినా జగిత్యాల అభివృద్ధి ఆగదు: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ఎన్ని విమర్శలు చేసినా జగిత్యాల అభివృద్ధి ఆగదు: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల, ఆగస్టు 30 (ప్రజా మంటలు): జగిత్యాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధి పనులు ఆగబోవని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సీనియర్ నాయకుడు తాటిపర్తి జీవన్‌రెడ్డి చేసిన విమర్శలకు స్పందించారు....
Read More...
Local News  Spiritual  

రోగుల సహాయకులకు పదేళ్లుగా ఉచిత అన్నప్రసాదం

రోగుల సహాయకులకు పదేళ్లుగా ఉచిత అన్నప్రసాదం జగిత్యాల, ఆగస్టు 30 (ప్రజా మంటలు): జగిత్యాల సత్యసాయి సేవా సమితి, సత్యసాయి నిత్య అన్నదాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి నిత్యాన్న ప్రసాద సేవా పథకం 10వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రోగుల సహాయకులకు ఉచితంగా అన్నప్రసాదం అందిస్తున్న ఈ కార్యక్రమానికి జగిత్యాల...
Read More...
State News 

జగిత్యాల బీజేపీలో అసమ్మతి సెగలు

జగిత్యాల బీజేపీలో అసమ్మతి సెగలు (సిరిసిల్ల రాజేందర్ శర్మ) జగిత్యాల, ఆగస్టు 29:జగిత్యాల జిల్లాలో భారతీయ జనతా పార్టీ అంతర్గత రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మూడు దశాబ్దాలుగా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుని పనిచేస్తున్న సీనియర్ నాయకులు, కార్యకర్తలు తమకు పార్టీలో తగిన గుర్తింపు లభించడం లేదనే అసంతృప్తితో ఒకే వేదికపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కోరుట్ల సమీపంలోని ఓ...
Read More...
Local News 

తెలుగు భాషా ఫోరం ఆధ్వర్యంలో పద్య పఠన పోటీలు 

తెలుగు భాషా ఫోరం ఆధ్వర్యంలో పద్య పఠన పోటీలు     జగిత్యాల ఆగస్ట్ 29(ప్రజా మంటలు)జిల్లా భాషోపాధ్యాయులు మరో బృహత్తర కార్యక్రమానికి  శ్రీకారం చుట్టారు. తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషకు ఆయుపట్టు పద్యం. తెలుగు భాషా సొగసుకు శిఖరాగ్రమైన ప్రక్రియ పద్య సాహిత్యం. పై అంశాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా డీఈవో కె.రాము అనుమతి తీసుకుని, తెలుగు భాషా ఫోరం లెటర్ ప్యాడ్...
Read More...
State News 

డ్యూటీలో ఉన్న తమ్ముడికి రాఖీ కట్టిన అక్క

డ్యూటీలో ఉన్న తమ్ముడికి రాఖీ కట్టిన అక్క కరీంనగర్, ఆగస్టు 28 (ప్రజా మంటలు): రక్షాబంధన్ సందర్భంగా కరీంనగర్ జిల్లాలో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే సంఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న తమ్ముడి వద్దకు వెళ్లిన అక్క రోడ్డుపైనే బస్సును ఆపించి రాఖీ కట్టింది.గోదావరిఖని నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు డ్రైవర్ మెండ రాజు తిమ్మాపూర్ మండలం రేణికుంట...
Read More...