కచ్చతీవు రచ్చ ఎన్నికల కోసమేనా?

On
కచ్చతీవు రచ్చ ఎన్నికల కోసమేనా?

లడాక్ ప్రజా ఉద్యమం నుండి ప్రజల దృష్టి మారాల్చడానికే బిజేపి యత్నం?

కచ్చతీవు రచ్చ ఎన్నికల కోసమేనా?

మనం ఎందుకు బంగ్లాదేశ్ కు ఎక్కువ భూభాగం ఇచ్చాం ?

సిహెచ్ వి ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్. 9391533339

రాజకీయాలలో ఎదుటివారికి ప్రాధాన్యత దక్కకుండా, వారి విమర్శలను తొక్కిపట్టే విధంగా కొత్త కథనాలను, ప్రతివిమర్శలను ముందుకు తేవడంలో బిజేపి ని మించిన చాణక్య ఎత్తుగడలు మరేవరి దగ్గర లేవనడంలో అతిశయోక్తి లేదేమో? లడాక్ లో పర్యావరణ ప్రేమికుడు, అక్కడి ప్రజల బాగోగుల కొరకు ఎన్నాళ్లుగానో శ్రమిస్తున్న సోనమ్ వాంగ్ చుక్ గత నెల రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను లెక్కచేయకుండా, ఆయన లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా, బిజేపి ఇప్పుడు కొత్తగా ఎన్నికల సమయంలో, శ్రీలంక- భారతదేశం లో మధ్య ఎప్పుడో 40 ఏళ్ల క్రితం, 1974 లో  జరిగిన కచ్చతీవు ఒడంబడిక గురించి రచ్చ రేపుతుంది.

 ప్రధాని నరేంద్ర మోడి బంగ్లాదేశ్ తో కుదుర్చుకొన్న భూమార్పిడి ఒప్పందంలో మనం నష్టపోయిన ప్రాంతం గురించి ఎందుకు మాట్లాడారు. మనకు బంగ్లా దేశ నుండి వచ్చిన భూబయగం కంటే ఎక్కువ భూబయగం మనం ఎందుకు వదులుకున్నామో ఎప్పుడైనా చెప్పారా? అరుణాచల్ ప్రాంతంలో చైనా తిష్ట వేసి వందల ఏకరాల భారత భూబయగంలో కొత్త జనవాసలను నిర్మిస్తుంటే ప్రశ్నించని వారు ఎప్పుడో జరిగిన ఒప్పందాలను ప్రశ్నించడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇదంతా దక్షిణాన, ముఖ్యంగా తమిళనాట జరుగుతున్న ఎన్నికల్లో లబ్ది పొందాదానికే అనే విషయం స్పష్టం అవుతుంది. 

కచ్చతీవు ను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు అప్పచెపితే, పదేళ్ళ పాలనలో బిజేపి ఎందుకు తిరిగి సీసుకోవడానికి ప్రయత్నంచలేదనే ప్రశ్నకు జవాబు లేదు. అలాగే లడాక్ లో, గత ఎన్నికల్లో బిజేపి వాగ్దానం చేసినట్లు ఆప్రాంతాన్ని 6 వ షెడ్యూల్ లో చేర్చి, రాష్ట్రంగా మార్చి ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న అక్కడి ప్రజల కోరికలను, ఉద్యమాలను ప్రపంచానికి తెలియకుండా అద్దుకొంటున్న మీడియా పై ఎందుకు బిజేపి నాయకత్వం ప్రశ్నించడం లేదు. లడక్ ఉద్యమ నాయకులు ప్రత్యక్షంగా చూస్తూ, అక్కడి పరిస్థితిని అవగాహన చేసుకొంటూ, గతంలో తమ ప్రజలు తిరిగిన దాదాపు 4000 వల చదరపు కి. మి. భూబయగాన్ని చైనా ఆక్రమించిందని చెపుతున్న మాటలకు ఎందుకు బిజేపి నాయకత్వం జవాబివ్వడం లేదో అందరికీ తెలుసు. 

కచ్చతీవు అనే దాదాపు 250 హెక్టారాల విస్తీర్ణం గల చిన్న, దీవి రామేశ్వరం నుండి 333 కి. మి. దూరంలో, శ్రీలంక లోని నేడుంతీవి (డేల్ఫ్ ఐలాండ్) నుండి 24 కి. మి. దూరంలో  ఉంటుంది. ఈ దీవి జనావాసలకు అనుకూలంగా ఉండకపోవడం తో ఎవరు ఈ దీవిని అంతగా అపట్టించుకోలేదు. కానీ మత్స్యసంపదకు నెలవైన ఈ ప్రాంతంలో ఎప్పుడు భారతదేశ-శ్రీలంక మత్స్యకారుల మధ్య గొడవలు జరడంతో, అప్పటి ఇందిరా గాంధీ-సిరిమావో భాండారనాయకే ప్రభుత్వాలు ఒక ఒడంబడిక కుదుర్చుకొని, కచ్చుతీవిని శ్రీలంకకు అప్పచెప్పారు. ఆసమయంలో అక్కడ ఇతర ఖనిజ సంపద, చములు నిక్షేపాలు ఉన్నాయనే విషయం తెలుసుకొని, ఏఎ సమస్యను ఎంత తొందరగా ముగించుకొంటే అంతా మంచిదని, చమురు నిక్షేపల విషయం శ్రీలంక కు తెలియడానే విషయాన్ని అప్పటి విదేశాంగ శాఖ కార్యదర్శి కేవల సింగ్- తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ల మధ్య జరిగిన లేఖలలో స్పష్టంగా పేర్కొన్నారు.

కన్యాకుమారి ప్రాంతంలోని చమురు నిక్షేపాలు స్వంతం

కచ్చతీవు ఇవ్వడం వల్ల అక్కడి కన్యాకుమారి దగ్గరిkachatheevu EEZ combined దాదాపు 4000 కి. మీ. విస్తీర్ణంలోని తీరప్రాంతం అంతా భారతదేశ సార్వభౌమాధఏకరం గల ఈఈజెడ్  (ప్రత్యేక ఆర్థిక మండలి)గా శ్రీలంక గుర్తించింది. మనం ఇచ్చింది 280 ఎకరాల (1.6 కి. మీ పొడవు – 300 మీ వెడల్పు) దీవి. ఇది ఉన్న ప్రాంతంలో మత్స్యకారుల మధ్య గోడవలే కాకుండా, స్మగ్లింగ్, మత్తుపదార్థాల రవాణా, చైనా, పాకిస్తాన్ లాంటి దేశాల ఉనికికి నెలవుగా కాకూడదనే అప్పటి ప్రభుత్వాలు ఏఎ ఒప్పందాన్ని చేసుకొన్నట్లు చరిత్ర చెపుతుంది. ఏఎ దీవి ఇవ్వడం వల్ల మనకు 4000 చదరపు కి. మి ల విస్తీర్ణంలో భారతదేశానికి ఈఈజెడ్ ప్రతిపత్తిని శ్రీ లంక ఒప్పుకొందనే వశయాన్ని మరచిపోకూడదు.

లేకుంటే కచ్ లోని మరో “సర్ క్రీక్” లా మారేది ?

కచ్చతీవు సమస్య బిజేపి కి తమిళనాడులో ఓట్లు దండుకోవడానికి ఒక ఆయుధంగా వాడుకొంటుందని తమిళ పార్టీలు భావిస్తున్నాయి. తమిళనాట కాంగ్రెస్-ది ఎం కె కూతమిని దెబ్బతీయడానికి అక్కడి ప్రజలలో విద్వేషాలు రెపడానికి ఏదోక ఆయుధంగా మారుచుకోంటుంది. దక్షిణాన ఉనికి లేని బిజేపి రాజేకీయంగా నిలదొక్కుకొని, ఏదో సాధించాలనుకోవడంలో తప్పు లేదు. కానీ మానిన గాయాలను రేపి, రెండు దేశాల ప్రజలలో ద్వేషం పెంచడానికి చేసే ప్రయత్నాలే సరికాదని తమిళ ప్రజలు భావిస్తున్నారు.

శ్రీలంక ప్రభుత్వం ఏఎ విమర్శలపై స్పందిస్తూ, ఇదొక ముగిసిన అంశామని, దీనిపై ఇప్పుడు చర్చించడం అనవసరమని ప్రకటించింది. అప్పుడు ఏఎ సమస్యను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోకుంటే, శ్రీలంక అంతర్జాతీయ కోర్టులు దావా వేస్తే, ఏఎ సమస్య కాశ్మీరీ సమస్యల అయిప్పటికి తేలేది కాదు. ఈ ప్రాంతం రెండు దేశాల మత్స్యకారుల మధ్య రావనకాష్టమలా ఘర్షణలతో మరిన్ని కొత్త సమస్యలకు దారితీసేదని అప్పటి దౌత్యవేత్తలు అంటున్నారు. ఇప్పటికీ గుజరాత్ లోని కచ్ ప్రాంతం లోని “సర్ క్రీక్”  సమస్యతో అక్కడి భారతీయ మత్స్యకారులు పాకిస్తాన్ జైళ్ళలో మగ్గుతున్న విషయం మారిచిపోకూడదు.

Tags
Join WhatsApp

More News...

Local News 

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు కల్పించిన మంత్రికి ధన్యవాదాలు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు కల్పించిన మంత్రికి ధన్యవాదాలు కాగజ్‌నగర్, నవంబర్ 20 (ప్రజా మంటలు): రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు తప్పనిసరిగా అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో కఠిన ఆదేశాలు జారీ చేసిన విషయం సీనియర్ సిటిజెన్స్‌లో హర్షాన్ని కలిగించింది. సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మార్త...
Read More...
Local News 

న్యూ అశోక్ నగర్‌లో కార్తీక దీపోత్సవం

న్యూ అశోక్ నగర్‌లో కార్తీక దీపోత్సవం సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ బౌద్ధనగర్ డివిజన్ న్యూ అశోక్ నగర్ పార్సిగుట్టలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో గురువారం  కార్తీక మాసం చివరి రోజున బీజేపీ సీనియర్ మహిళా నేత మేకల కీర్తి హర్ష కిరణ్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె,...
Read More...
Local News 

చిలకలగూడ పోలీసులకు శిక్షణ :ముగిసిన రెండు రోజుల ట్రైనింగ్ క్యాంప్

చిలకలగూడ పోలీసులకు శిక్షణ :ముగిసిన రెండు రోజుల ట్రైనింగ్ క్యాంప్ సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) : రాష్ట్ర డిజిపి బి. శివధర్ రెడ్డి, సిటీ కమిషనర్ సజ్జనార్ ఆదేశాల మేరకు చిలకలగూడ డివిజన్ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు గురువారం రెండో రోజూ కొనసాగాయి. పోలీస్  సిబ్బందికి ఫైనాన్షియల్, సెల్ఫ్ డిసిప్లిన్‌, తదితర అంశాలపై ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ టీ.టీ. లిజేశ్, ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవడంపై న్యూ...
Read More...

బీసీ రిజర్వేషన్లు, ట్రిపుల్ ఆర్ భూమి సమస్య, కు మద్దతుగా ఉద్యమం - కవిత

బీసీ రిజర్వేషన్లు, ట్రిపుల్ ఆర్ భూమి సమస్య, కు మద్దతుగా ఉద్యమం - కవిత మియాపూర్/ షాద్ నగర్ నవంబర్ 20 (ప్రజా మంటలు) : రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జాగృతి జనంబాట కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పలు బస్తీలు, గ్రామాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులను సందర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, ప్రభుత్వంపై స్పందన తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శేరిలింగంపల్లి...
Read More...
Local News  State News 

హైదరాబాద్‌లో లాజిస్టిక్స్ నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రారంభం

హైదరాబాద్‌లో లాజిస్టిక్స్ నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రారంభం సికింద్రాబాద్,  నవంబర్ 20 (ప్రజా మంటలు):  భారత సరకు రవాణా రంగం భారీ వృద్ధి దశలోకి ప్రవేశిస్తోందని, దానికి అనుగుణంగా ఆధునిక నైపుణ్య శక్తి అవసరమని కేంద్ర సహాయ మంత్రి జయంత్ చౌధరి తెలిపారు. హైదరాబాద్ ఎన్ఎస్‌టీఐ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన లాజిస్టిక్స్ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. లాజిస్టిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్...
Read More...
Local News 

వెల్లుల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో "బాల్య వివాహా"లపై అవగాహన సదస్సు. 

వెల్లుల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెట్టుపల్లి నవంబర్ 20(ప్రజా మంటలు దగ్గుల అశోక్)   మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ జగిత్యాల ఆధ్వర్యంలో మెట్టుపల్లి మండలంలోని వెల్లుల్ల గ్రామపంచాయతీ ఆవరణలో మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో "బాల్య వివాహా"లపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జిల్లా బాలల పరిరక్షణ విభాగo నుండి పరిరక్షణ అధికారి పడాల సురేష్ బాల్య ....
Read More...
Local News  State News 

కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు గాంధీలో ప్రారంభం

కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు గాంధీలో ప్రారంభం రూ.పది లక్షల ఆపరేషన్ గాంధీలో ఉచితం... సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) : పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న చిన్నారులకు గాంధీ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు  అందుబాటులోకి వచ్చాయి.  చెవి-ముక్కు-గొంతు విభాగం ఆధ్వర్యంలో జీరో నుంచి ఐదేళ్ల వయసు ఉన్న  పిల్లలకు ఈ సేవలను అందిస్తున్నారు. ఈమేరకు గాంధీలో తొలిరోజు  గురువారం...
Read More...

మల్లాపూర్‌లో విఏఓ పై కాంగ్రెస్ నాయకుల అరాచకం – సరిత నిరాహార దీక్ష

మల్లాపూర్‌లో విఏఓ పై కాంగ్రెస్ నాయకుల అరాచకం – సరిత నిరాహార దీక్ష మల్లాపూర్ నవంబర్ 20 (ప్రజా మంటలు): మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో విఏఓగా విధులు నిర్వర్తిస్తున్న బలహీన వర్గాల మహిళ ఎనుగంటి సరితను లక్ష్యంగా చేసుకుని గ్రామ కాంగ్రెస్ నాయకులు వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార దుర్వినియోగంతో ఉద్యోగం నుంచి తొలగించి, ఆర్డర్ కాపీ ఇచ్చినప్పటికీ తిరిగి విధుల్లోకి అనుమతించకపోవడంతో సరిత తీవ్ర...
Read More...

ఆత్మ నిర్భర్ పథక లక్ష్యసాధనకు కృషి చేయాలి

ఆత్మ నిర్భర్ పథక లక్ష్యసాధనకు కృషి చేయాలి జగిత్యాల నవంబర్ 20 (ప్రజా మంటలు)ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్బర్ పథకం అమలు పై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీ సమావేశము స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర పథకం అమలు, మరియు లక్ష్య సాధనకై...
Read More...

తెలంగాణ బీజేపిలో విభేధాలు లేవు: ఈటల రాజేందర్

తెలంగాణ బీజేపిలో విభేధాలు లేవు: ఈటల రాజేందర్ కరీంనగర్ నవంబర్ 20 (ప్రజా మంటలు): తెలంగాణ బీజేపీలో ఎలాంటి అంతర్గత విభేధాలు లేవని, సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నది అసత్యమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హుజురాబాద్ పర్యటన అనంతరం కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ నివాసం వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. “ఏ పార్టీ లోనైనా విభేదాలు సహజమే. కానీ...
Read More...
Crime  State News 

దళిత యువకుడి కస్టోడియల్ డెత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి: కల్వకుంట్ల కవిత

దళిత యువకుడి కస్టోడియల్ డెత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి: కల్వకుంట్ల కవిత హైదరాబాద్ నవంబర్ 20 (ప్రజా మంటలు): సుర్యాపేటలో కర్ల రాజేశ్ అనే దళిత యువకుడు కస్టడీలో జరిగిన అనుమానాస్పద మరణం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేపుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పోలీసుల దుర్వినియోగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత ఈ ఘటనపై స్పందిస్తూ,“దళిత బిడ్డను పోలీసులు నిర్దాక్ష్యణంగా...
Read More...
Local News  State News 

అరుదైన ఆపరేషన్ చేసి బాలుడికి పునర్జన్మ ఇచ్చిన గాంధీ వైద్యులు

అరుదైన ఆపరేషన్ చేసి బాలుడికి పునర్జన్మ ఇచ్చిన గాంధీ వైద్యులు కిలో కు పైగా బరువు ఉన్న ప్లీహం తొలగింపు సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో తొలిసారిగా 7 ఏళ్ల బాలుడికి ల్యాపరోస్కోపిక్ విధానంలో ప్లీహము తొలగించే శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. పీడియాట్రిక్ సర్జరీ విభాగం ప్రొఫెసర్,హెచ్‌ఓడీ డాక్టర్ నాగార్జున ఆధ్వర్యంలో ఈ శస్త్రచికిత్స జరిగింది. మంచిర్యాల జిల్లా అకినేపల్లి...
Read More...