జీవన్ రెడ్డి పార్టీ మార్పు – రాజకీయ సమీకరణాల్లో కొత్త మలుపా? లేక ముగింపుకు నాంది?
గత వైభవం – ప్రారంభంలో శక్తివంతమైన ఎదుగుదల
జగిత్యాలపై అధిక భావోద్వేగం – బలమా? బలహీనతా?
తెలంగాణ రాజకీయాల్లో అప్పుడప్పుడూ వ్యక్తిగత నిర్ణయాలు పెద్ద చర్చలకు దారి తీస్తాయి. అలాంటి నిర్ణయాల్లో ఒకటి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం,. వెనుక ఉన్న రాజకీయ లెక్కలు, వ్యక్తిగత పరిస్థితులు, స్థానిక వర్గ రాజకీయాలు— అన్ని కలిసి చూస్తే ఇది కేవలం పార్టీ మార్పు కాదు, ఒక దీర్ఘకాల రాజకీయ ప్రయాణంలో కీలక మలుపుగా కనిపిస్తోంది.
గత వైభవం – ప్రారంభంలో శక్తివంతమైన ఎదుగుదల
జీవన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే, ప్రారంభ దశలోనే మంచి అవకాశాలు దక్కాయి. 1981 లో మల్యాల పంచాయతీ సమితి అధ్యక్షులుగా, 1983 లో తెలుగు దేశం పార్టీ నుండి, మొదటిసారి ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా, మంత్రి వర్గంలో స్థానం పొందడం ఆయన రాజకీయ ప్రతిభకు నిదర్శనం. అయితే, ఆ విజయాన్ని స్థిరమైన ఆధిపత్యంగా మార్చుకోవడంలో మాత్రం ఆయన పూర్తిగా సక్సెస్ కాలేకపోయారు.
1980ల నుంచే జగిత్యాల నియోజకవర్గం వర్గ రాజకీయాలకు కేంద్రమైంది. ఒక దశలో ఆయన ప్రభావం ఉన్నప్పటికీ, తర్వాతి కాలంలో వరుసగా ఎదురైన రాజకీయ ప్రతిబంధకాలు ఆయన స్థాయిని తగ్గించాయి.
జగిత్యాల రాజకీయ వాస్తవం – వర్గాల ఆధిపత్య పోరు
జగిత్యాల నియోజకవర్గంలో ప్రధానంగా వెలమ, రెడ్డి వర్గాల మధ్య పోటీ కీలక పాత్ర పోషించింది. 1983 నుండి 2014వరకు ఈ ప్రాంతంలో అధికారం మారుతూ వచ్చినా, ఒక వర్గం పూర్తిగా ఆధిపత్యం చెలాయించలేకపోయింది.
గతంలో వేల రాజకీయ ఆధిపత్యం ఉన్న ఈ నియోజకవర్గం 1983 ఎన్నికల్లో రెడ్డి వర్గానికి దక్కింది. ఆతరువాత, 1985,1994, 2009, ఎన్నికలలో బీసీ వర్గాలకు చెందిన గుడిసెల రాజేశం గౌడ్, ఎలుగందుల రమణ విజయం సాధించి జీవన్ రెడ్డికి చెక్ పెట్టారు.
అంటే వేలం నాయకత్వం. పరిస్థితులకు అనుకూలంగా బీసీలకు మద్దతు ప్రకటించడంతో, రెడ్డి వర్గానికి ఎదురుదెబ్బ తలిగింది. కానీ, పదకొండు సార్లు పోటీ చేసిన జీవన్ రెడ్డి 6 సార్లు గెలిచి వెలమ వర్గాన్ని 2018 వరకు అడ్డుకున్నారు.
అయితే 2018 తర్వాత పరిస్థితులు మారాయి. వెలమ వర్గం ప్రభావం పెరగడంతో, బీసీ నాయకులలో ఐక్యత లేకపోవడం, BRS పార్టీ వెలమ నాయకులకే ప్రాధాన్యత ఈయడంతో, జీవన్ రెడ్డి శకానికి ముగింపు పలికినట్లు అయింది.
జీవన్ రెడ్డి వరుస పరాజయాలు ఎదుర్కొన్నారు. 2023 ఎన్నికల్లో కూడా ఓటమి పాలవడం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నార్థక చిహ్నం పెట్టింది.
కాంగ్రెస్లో అసంతృప్తి – మార్పుకు దారితీసిన కారణం
జీవన్ రెడ్డి పార్టీ మార్పుకు ప్రధాన కారణం కాంగ్రెస్లో పెరిగిన అసంతృప్తి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గెలిచిన నాయకులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం, ఓడిపోయిన వారికి తక్కువ అవకాశాలు ఇవ్వడం ఆయనను నిరాశకు గురిచేసింది.
అంతేకాకుండా, స్థానికంగా కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ఇతర నేతలను ముందుకు తేవడం వల్ల ఆయన స్థానం క్రమంగా బలహీనపడింది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో చివరకు పార్టీని వీడే నిర్ణయం తీసుకున్నారు.
బీఆర్ఎస్లో భవిష్యత్తు – అవకాశాలా? లేక అనిశ్చితి?
బీఆర్ఎస్లో చేరడం ద్వారా జీవన్ రెడ్డి రాజకీయంగా పునరుద్ధరణ పొందుతారా అన్నది పెద్ద ప్రశ్న. ప్రస్తుతం ఆయన వయస్సు 75 ఏళ్లు. రాజకీయాల్లో వారసత్వం లేకపోవడం కూడా ఒక పెద్ద లోపంగా కనిపిస్తోంది.
కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకురాకపోవడం వల్ల ఆయన తర్వాత నాయకత్వం కొనసాగించే వ్యక్తి లేరు. ఇది పార్టీలు కూడా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడానికి ఒక కారణంగా మారుతోంది. పార్టీలో కూడా, రెండవ తరం నాయకత్వాన్ని ఆయన ప్రోత్సహించలేదు.
పట్టణ ఓటర్లు – కీలక బలహీనత
జీవన్ రెడ్డి రాజకీయాల్లో మరో ముఖ్యమైన అంశం పట్టణ ఓటర్ల మద్దతు లేకపోవడం. జగిత్యాల పట్టణంలో ఆయనకు ఎప్పుడూ స్పష్టమైన మెజార్టీ రాలేదు. గ్రామీణ ఓట్లతో గెలిచిన సందర్భాలు ఉన్నా, పట్టణ ఓటర్లు మాత్రం ఆయనకు అనుకూలంగా లేరు.
ఇది భవిష్యత్తులో మరింత పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది.
నియోజకవర్గాల పునర్విభజన – కొత్త సవాళ్లు
వచ్చే ఎన్నికల ముందు నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది. జగిత్యాల నియోజకవర్గం స్వరూపం మారితే, జీవన్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నది పెద్ద ప్రశ్న.
ఒకవేళ పట్టణ కేంద్రంగా నియోజకవర్గం మారితే, ఆయన గెలుపు అవకాశాలు మరింత తగ్గే అవకాశం ఉంది. రిజర్వేషన్ మార్పులు కూడా ఆయన రాజకీయ లెక్కలను పూర్తిగా మార్చేయవచ్చు.
జగిత్యాలపై అధిక భావోద్వేగం – బలమా? బలహీనతా?
జీవన్ రెడ్డి రాజకీయాల్లో ఒక ముఖ్యమైన అంశం జగిత్యాలపై ఉన్న అతిప్రేమ. ఆయన అన్నిటిని వదిలి జగిత్యాలకే పరిమితమయ్యారు.
ఈ భావోద్వేగం ఒకవైపు ఆయనకు గుర్తింపునిచ్చినా, మరోవైపు రాజకీయ అవకాశాలను పరిమితం చేసింది. కొత్త ప్రాంతాల్లో ఎదగలేకపోవడం ఆయనకు నష్టంగా మారింది.
తగ్గుతున్న నాయకత్వ ప్రభావం
ప్రస్తుత పరిస్థితుల్లో జీవన్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నా, బీఆర్ఎస్లో ఉన్నా, ఆయన ప్రభావం పరిమితంగానే ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఆయన పాత్ర ఎక్కువగా మీడియా వ్యాఖ్యలకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాజకీయంగా చూస్తే, ఇది ఒక శక్తివంతమైన నాయకుడి ప్రయాణంలో చివరి దశగా విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ మార్పు ఆయనకు కొత్త జీవం పోస్తుందా, లేక ఇది ముగింపుకు నాంది అవుతుందా అన్నది వచ్చే కాలమే తేల్చాలి..
More News...
<%- node_title %>
<%- node_title %>
కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం* *బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు
*
జగిత్యాల జిల్లా ఆగస్టు17 {ప్రజా మంటలు}
మల్యాల మండలం కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 25 మందికి ప్రయాణికులు గాయపడగా క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మల్యాల మండలం కొండగట్టు సమీపంలో జగిత్యాల నుంచి... బృందావనం ఫ్యామిలీ రిసార్ట్లో ఘనంగా లలితా సహస్రనామ పారాయణం
కొండగట్టు ఆగస్టు 16 (ప్రజా మంటలు)మల్యాల మండలం కొండగట్టు బృందావనం ఫ్యామిలీ రిసార్ట్ లో ఆదివారం శ్రావణమాసం పర్వదినాన్ని పురస్కరించుకొని ఇంటింటా లలిత పారాయణ కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా కలశ గణాధిపతి గౌరీ పూజ తొలతగా నిర్వహించి అమ్మవారి విగ్రహానికి పల రసాలు పంచామృతాలతో అభిషేకం చేసి వివిధ రకాలైన పుష్పాలతో అమ్మవారిని... 22-ఏ జాబితాలోని భూముల హక్కుదారులు ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 15 (ప్రజా మంటలు): నిషేధిత జాబితా (22-ఏ)లో చేరిన భూముల హక్కుదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి భరోసా ఇచ్చారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూములను మినహాయించి, మిగిలిన భూములకు సర్వే నంబర్లకు బై-నంబర్లు కేటాయించి హక్కుదారుల సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
హైదరాబాద్లోని కూకట్పల్లి కేపీహెచ్బీ... ఘనంగా చిలుకమర్రి పరాంకుశాచార్య సంస్మరణ వేడుక
రాయికల్ ఆగస్టు 15 (ప్రజా మంటలు)రాయికల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ లో చిలుకమర్రి పరాంకుశాచార్య సంస్మరణ సమావేశం జరిగింది, ఈ కార్యక్రమంలో పరాంకుశ ఆచార్య తనయుడు అడ్వకేట్ మదన్మోహన్ రాయికల్ సరస్వతి శిశు మందిర్ పునర్నిర్మాణానికి తన వంతు విరాళంగా రూ. 1,11,111/- భవన నిర్మాణ కమిటీకి అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా... హరిహరాలయంలో మాతలచే శ్రీ లలిత సహస్రనామ పారాయణం ఉంజల్ సేవ
జగిత్యాల ఆగస్టు 14లోక కళ్యాణార్థం పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ లలితా సహస్రనామ సామూహిక పారాయణం ఊంజల్ సేవా కార్యక్రమం నిర్వహించారు.
అంతకుముందు గణపతి గౌరీ దేవతల పంచామృత అభిషేకము నిర్వహించి శ్రీ లలిత అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో షోడశ ఉపచార పూజలు నిర్వహించారు. శ్రీ సూక్త... పెన్షన్లకు దరఖాస్తులు తీసుకోవడమే తప్ప పెన్షన్లు ఇవ్వడం లేదు తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత
జగిత్యాల ఆగస్టు 14 (ప్రజా మంటలు)రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్లకు పలుమార్లు దరఖాస్తులు తీసుకోవడమే తప్ప ఇవ్వడం లేదని ఆరోపించారు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత శుక్రవారం సారంగాపూర్ మండల కేంద్రంలో బి ఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరులతో ఆమె మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాల పూర్తయిందని... ఎన్నికల ప్రణాళికలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
జగిత్యాల ఆగస్టు 14 (ప్రజా మంటలు) కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గీతా కార్మికులకు ఇచ్చిన హామీల అమలు చేయాలని రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రానికి అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సుయాత్ర చేరుకుంది. జగిత్యాల జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ బస్సు... పవిత్రమైన శ్రావణమాసాన్ని పురస్కరించుకొని పరమశివునికి పంచామృత అభిషేకాలు
జగిత్యాల ఆగస్ట్ 13( ప్రజా మంటలు)పవిత్రమైన శ్రావణమాసాన్ని పురస్కరించుకొని పరమశివుని మూల విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ప్రతి ఏటా లాగే శ్రావణమాసం సందర్భంగా ఆలయాన్ని సంప్రదాయపద్ధంగా సర్వాంగ సుందరంగా అలంకరించారు.
తొలుతగా గణపతి ఉపనిషత్తులతో గణపతి పూజ, అనంతరం నారాయణ ఉపనిషత్తులతో శ్రీ సీతారామచంద్రుల పరివార... వెల్గటూర్లో 80 మంది లబ్ధిదారులకు రూ.25.56 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు
వెల్గటూర్, ఆగస్టు 13 (ప్రజా మంటలు):
వెల్గటూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని 80 మంది లబ్ధిదారులకు రూ.25.56 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనారోగ్యం,... హిందూ–ముస్లింలు నాకు రెండు కళ్లలాంటి వారు: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 13:
హిందూ–ముస్లింల మధ్య తనకు ఎలాంటి వ్యత్యాసం లేదని, ఇరువర్గాలు తనకు రెండు కళ్లలాంటి వారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన యువత తెలంగాణ రైజింగ్ కోసం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
హైదరాబాద్ బంజారాహిల్స్లోని కొమురం భీమ్... బీర్ పూర్ లో ఎసిబి దాడులు - రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన గిర్ధావర్
బీర్ పూర్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, ప్రజా మంటలు, ఆగస్ట్ 13:
జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.లంచం తీసుకుంటున్న రెవెన్యూ శాఖ గిర్ధావర్ రాహుల్ ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
బాధితురాలికి సంబంధించిన 12 గుంటల భూమిని సాదాబైనామా ద్వారా... కరీంనగర్ డైరీ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
జగిత్యాల ఆగస్టు 13 : ప్రతినిధి, ప్రజా మంటలు,
జగిత్యాల పట్టణంలోనీ కరీంనగర్ డైరీ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు గురు వారం తనిఖీలు చేశారు. 600 ఐస్ క్రీములు ఏప్రిల్ మాసంలోని తేదీ తయారీ ఉండగా ఫ్రీజర్ సరిగా పనిచేయక ఐస్ క్రీములు ఫంగస్ తో పాటు మెల్ట్ కావటంతో డైరీ నిర్వాహకులను ప్రశ్నించారు.... 