జీవన్ రెడ్డి పార్టీ మార్పు – రాజకీయ సమీకరణాల్లో కొత్త మలుపా? లేక ముగింపుకు నాంది?
గత వైభవం – ప్రారంభంలో శక్తివంతమైన ఎదుగుదల
జగిత్యాలపై అధిక భావోద్వేగం – బలమా? బలహీనతా?
తెలంగాణ రాజకీయాల్లో అప్పుడప్పుడూ వ్యక్తిగత నిర్ణయాలు పెద్ద చర్చలకు దారి తీస్తాయి. అలాంటి నిర్ణయాల్లో ఒకటి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం,. వెనుక ఉన్న రాజకీయ లెక్కలు, వ్యక్తిగత పరిస్థితులు, స్థానిక వర్గ రాజకీయాలు— అన్ని కలిసి చూస్తే ఇది కేవలం పార్టీ మార్పు కాదు, ఒక దీర్ఘకాల రాజకీయ ప్రయాణంలో కీలక మలుపుగా కనిపిస్తోంది.
గత వైభవం – ప్రారంభంలో శక్తివంతమైన ఎదుగుదల
జీవన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే, ప్రారంభ దశలోనే మంచి అవకాశాలు దక్కాయి. 1981 లో మల్యాల పంచాయతీ సమితి అధ్యక్షులుగా, 1983 లో తెలుగు దేశం పార్టీ నుండి, మొదటిసారి ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా, మంత్రి వర్గంలో స్థానం పొందడం ఆయన రాజకీయ ప్రతిభకు నిదర్శనం. అయితే, ఆ విజయాన్ని స్థిరమైన ఆధిపత్యంగా మార్చుకోవడంలో మాత్రం ఆయన పూర్తిగా సక్సెస్ కాలేకపోయారు.
1980ల నుంచే జగిత్యాల నియోజకవర్గం వర్గ రాజకీయాలకు కేంద్రమైంది. ఒక దశలో ఆయన ప్రభావం ఉన్నప్పటికీ, తర్వాతి కాలంలో వరుసగా ఎదురైన రాజకీయ ప్రతిబంధకాలు ఆయన స్థాయిని తగ్గించాయి.
జగిత్యాల రాజకీయ వాస్తవం – వర్గాల ఆధిపత్య పోరు
జగిత్యాల నియోజకవర్గంలో ప్రధానంగా వెలమ, రెడ్డి వర్గాల మధ్య పోటీ కీలక పాత్ర పోషించింది. 1983 నుండి 2014వరకు ఈ ప్రాంతంలో అధికారం మారుతూ వచ్చినా, ఒక వర్గం పూర్తిగా ఆధిపత్యం చెలాయించలేకపోయింది.
గతంలో వేల రాజకీయ ఆధిపత్యం ఉన్న ఈ నియోజకవర్గం 1983 ఎన్నికల్లో రెడ్డి వర్గానికి దక్కింది. ఆతరువాత, 1985,1994, 2009, ఎన్నికలలో బీసీ వర్గాలకు చెందిన గుడిసెల రాజేశం గౌడ్, ఎలుగందుల రమణ విజయం సాధించి జీవన్ రెడ్డికి చెక్ పెట్టారు.
అంటే వేలం నాయకత్వం. పరిస్థితులకు అనుకూలంగా బీసీలకు మద్దతు ప్రకటించడంతో, రెడ్డి వర్గానికి ఎదురుదెబ్బ తలిగింది. కానీ, పదకొండు సార్లు పోటీ చేసిన జీవన్ రెడ్డి 6 సార్లు గెలిచి వెలమ వర్గాన్ని 2018 వరకు అడ్డుకున్నారు.
అయితే 2018 తర్వాత పరిస్థితులు మారాయి. వెలమ వర్గం ప్రభావం పెరగడంతో, బీసీ నాయకులలో ఐక్యత లేకపోవడం, BRS పార్టీ వెలమ నాయకులకే ప్రాధాన్యత ఈయడంతో, జీవన్ రెడ్డి శకానికి ముగింపు పలికినట్లు అయింది.
జీవన్ రెడ్డి వరుస పరాజయాలు ఎదుర్కొన్నారు. 2023 ఎన్నికల్లో కూడా ఓటమి పాలవడం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నార్థక చిహ్నం పెట్టింది.
కాంగ్రెస్లో అసంతృప్తి – మార్పుకు దారితీసిన కారణం
జీవన్ రెడ్డి పార్టీ మార్పుకు ప్రధాన కారణం కాంగ్రెస్లో పెరిగిన అసంతృప్తి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గెలిచిన నాయకులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం, ఓడిపోయిన వారికి తక్కువ అవకాశాలు ఇవ్వడం ఆయనను నిరాశకు గురిచేసింది.
అంతేకాకుండా, స్థానికంగా కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ఇతర నేతలను ముందుకు తేవడం వల్ల ఆయన స్థానం క్రమంగా బలహీనపడింది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో చివరకు పార్టీని వీడే నిర్ణయం తీసుకున్నారు.
బీఆర్ఎస్లో భవిష్యత్తు – అవకాశాలా? లేక అనిశ్చితి?
బీఆర్ఎస్లో చేరడం ద్వారా జీవన్ రెడ్డి రాజకీయంగా పునరుద్ధరణ పొందుతారా అన్నది పెద్ద ప్రశ్న. ప్రస్తుతం ఆయన వయస్సు 75 ఏళ్లు. రాజకీయాల్లో వారసత్వం లేకపోవడం కూడా ఒక పెద్ద లోపంగా కనిపిస్తోంది.
కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకురాకపోవడం వల్ల ఆయన తర్వాత నాయకత్వం కొనసాగించే వ్యక్తి లేరు. ఇది పార్టీలు కూడా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడానికి ఒక కారణంగా మారుతోంది. పార్టీలో కూడా, రెండవ తరం నాయకత్వాన్ని ఆయన ప్రోత్సహించలేదు.
పట్టణ ఓటర్లు – కీలక బలహీనత
జీవన్ రెడ్డి రాజకీయాల్లో మరో ముఖ్యమైన అంశం పట్టణ ఓటర్ల మద్దతు లేకపోవడం. జగిత్యాల పట్టణంలో ఆయనకు ఎప్పుడూ స్పష్టమైన మెజార్టీ రాలేదు. గ్రామీణ ఓట్లతో గెలిచిన సందర్భాలు ఉన్నా, పట్టణ ఓటర్లు మాత్రం ఆయనకు అనుకూలంగా లేరు.
ఇది భవిష్యత్తులో మరింత పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది.
నియోజకవర్గాల పునర్విభజన – కొత్త సవాళ్లు
వచ్చే ఎన్నికల ముందు నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది. జగిత్యాల నియోజకవర్గం స్వరూపం మారితే, జీవన్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నది పెద్ద ప్రశ్న.
ఒకవేళ పట్టణ కేంద్రంగా నియోజకవర్గం మారితే, ఆయన గెలుపు అవకాశాలు మరింత తగ్గే అవకాశం ఉంది. రిజర్వేషన్ మార్పులు కూడా ఆయన రాజకీయ లెక్కలను పూర్తిగా మార్చేయవచ్చు.
జగిత్యాలపై అధిక భావోద్వేగం – బలమా? బలహీనతా?
జీవన్ రెడ్డి రాజకీయాల్లో ఒక ముఖ్యమైన అంశం జగిత్యాలపై ఉన్న అతిప్రేమ. ఆయన అన్నిటిని వదిలి జగిత్యాలకే పరిమితమయ్యారు.
ఈ భావోద్వేగం ఒకవైపు ఆయనకు గుర్తింపునిచ్చినా, మరోవైపు రాజకీయ అవకాశాలను పరిమితం చేసింది. కొత్త ప్రాంతాల్లో ఎదగలేకపోవడం ఆయనకు నష్టంగా మారింది.
తగ్గుతున్న నాయకత్వ ప్రభావం
ప్రస్తుత పరిస్థితుల్లో జీవన్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నా, బీఆర్ఎస్లో ఉన్నా, ఆయన ప్రభావం పరిమితంగానే ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఆయన పాత్ర ఎక్కువగా మీడియా వ్యాఖ్యలకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాజకీయంగా చూస్తే, ఇది ఒక శక్తివంతమైన నాయకుడి ప్రయాణంలో చివరి దశగా విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ మార్పు ఆయనకు కొత్త జీవం పోస్తుందా, లేక ఇది ముగింపుకు నాంది అవుతుందా అన్నది వచ్చే కాలమే తేల్చాలి..
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎన్నికల వాగ్దానాలు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్కు బీసీ నాయకులు వినతి
జగిత్యాల మే 7(ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం లో అదనపు కలెక్టర్ జి. రాజగౌడ్ కి వినతి పత్రం అందజేసిన బీసీ నాయకులు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాగ్దానములో ఇచ్చిన హామీ ప్రకారము 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. పెండింగ్ స్కాలర్ షిప్లను విడుదల చేయాలి.
బీసీ రాష్ట్ర కార్యదర్శి... సైబర్ నేరాల డ్రగ్స్ వినియోగంపై పోలీస్ కళా బృందం అవగాహన సదస్సు
గొల్లపల్లి మే 18 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో సోమవారం ఎండపల్లి మండలంలోని చర్లపల్లి గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు .
ఈ సందర్భంగా వెల్గటూర్ ఎస్ఐ,ఉదయ్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం, సైబర్ నేరాలు,... TG EAPCET – 2026 ఫలితాలలో జ్యోతి పూర్వ విద్యార్థుల ఘన విజయం
జగిత్యాల మే 17 (ప్రజా మంటలు)ఆదివారం విడుదల అయిన TG EAPCET – 2026 ఫలితాలలో JYOTHI HIGH SCHOOL IIT ACADEMY పూర్వ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి సంస్థ ఖ్యాతిని మరింత పెంచారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించి విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులను సంస్థ... నీతి, నిజాయితీకి మారుపేరు డాక్టర్ జస్టిస్ జి. చంద్రయ్యకు నివాళులు: మాజీ మంత్రి రాజేశం గౌడ్
హైదరాబాద్, మే 16 (ప్రజా మంటలు):
విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి, మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ జస్టిస్ జి. చంద్రయ్య అకాల మరణం బాధాకరమని మాజీ సీనియర్ మంత్రి గొడిశెల రాజేశం గౌడ్, మాజీ న్యాయమూర్తి నవ మోహన్ రావు, పాత్రికేయులు ప్రభాకర్ రావు, ఎల్జేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మినేని వికాస్... ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల మే 15 ( ప్రజా మంటలు) :
ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణలో విద్యాశాఖ వారోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం జిల్లా గ్రంథాలయ సంస్థ – జగిత్యాల ఆధ్వర్యంలో ఓల్డ్ బస్ స్టాండ్ జిల్లా గ్రంథాలయంలో గ్రంథాలయ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి... తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానం పైలాన్ వేరే చోటుకు మార్చాలని బ్రాహ్మణ సంఘం చే నిరసన.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
ఖమ్మం మే 15 (ప్రజా మంటలు) :
నగరంలో లకారం ట్యాంక్ బండ్ సెంటర్లో భారత మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భముగా ఏర్పాటు చేసినటువంటి కాంస్య విగ్రహము. ప్రాంతంలో తుమ్మల నాగేశ్వరరావు 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో చేసినటువంటి కార్యక్రమాల... బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పథకాలను బ్రాహ్మణులు సద్వినియోగపరచుకోవాలి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
బండ్లగూడ, నాగోల్ మే 14(ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పథకాలను బ్రాహ్మణ సద్వినియోగపరచుకోవాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ వైస్ చైర్మన్ పదవి బాధ్యతల స్వీకరణ ఉత్సవం గురువారం బండ్లగూడ, నాగోల్... “తెలంగాణ దళిత సాహిత్య చరిత్రను విస్మరించొద్దు” :బి.ఎస్. రాములు బహిరంగ లేఖ..
హైదరాబాద్ మే 14 (ప్రజా మంటలు):తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురిస్తున్న పునాస ఎప్రిల్-జూన్ 2026 సంచికలో ప్రచురితమైన “తెలుగు సాహిత్యంలో అంబేద్కర్ ప్రభావం” వ్యాసంపై ప్రముఖ సామాజిక తత్వవేత్త, రచయిత, బీసీ కమీషన్ తొలి చైర్మన్ బి.ఎస్. రాములు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు కోయి కోటేశ్వరరావుకు బహిరంగ లేఖ రాశారు.... బండి సంజయ్ కుమారుడిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేయాలి: కవిత
హైదరాబాద్ మే 13 (ప్రజా మంటలు):
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి విదేశాలకు పారిపోకుండా చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని, ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.బుధవారం... కొండగట్టు అంజన్న భక్తులకు ఎం ఎస్ ఆర్ డి ఎఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ
కొండగట్టు మే 12 ( ప్రజా మంటలు)హనుమాన్ పెద్ద జయంతిని పురస్కరించుకుని కొండగట్టు అంజన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తుల సౌకర్యార్థం మ స్పోర్ట్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్* ( ఎం ఎస్ ఆర్ డి ఎఫ్) ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ సేవా కార్యక్రమం నిర్వహించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులకు అరటి... కొండగట్టు గిరి ప్రదక్షిణకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
కొండగట్టు, మే 11 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు అంజన్న ఆలయంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకున్న మంత్రి, అంజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మంత్రికి... ట్రై సైకిల్స్ ను అందజేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, డి ఎస్పీ పురుషోత్తం రెడ్డి
జగిత్యాల మే 10 (ప్రజా మంటలు)
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో, ఆపి ప్రైవేంటివ్ హెల్త్ క్లినిక్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో దివ్యాంగ విద్యార్థులకు ట్రై సైకిల్స్ ను అందజేసే కార్యక్రమం జరిగింది.
జిల్లా కేంద్రంలోని పావని కంటి హాస్పిటల్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ జగిత్యాల పూర్వ అధ్యక్షుడు, శాసన... 