జీవన్ రెడ్డి పార్టీ మార్పు – రాజకీయ సమీకరణాల్లో కొత్త మలుపా? లేక ముగింపుకు నాంది?
గత వైభవం – ప్రారంభంలో శక్తివంతమైన ఎదుగుదల
జగిత్యాలపై అధిక భావోద్వేగం – బలమా? బలహీనతా?
తెలంగాణ రాజకీయాల్లో అప్పుడప్పుడూ వ్యక్తిగత నిర్ణయాలు పెద్ద చర్చలకు దారి తీస్తాయి. అలాంటి నిర్ణయాల్లో ఒకటి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం,. వెనుక ఉన్న రాజకీయ లెక్కలు, వ్యక్తిగత పరిస్థితులు, స్థానిక వర్గ రాజకీయాలు— అన్ని కలిసి చూస్తే ఇది కేవలం పార్టీ మార్పు కాదు, ఒక దీర్ఘకాల రాజకీయ ప్రయాణంలో కీలక మలుపుగా కనిపిస్తోంది.
గత వైభవం – ప్రారంభంలో శక్తివంతమైన ఎదుగుదల
జీవన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే, ప్రారంభ దశలోనే మంచి అవకాశాలు దక్కాయి. 1981 లో మల్యాల పంచాయతీ సమితి అధ్యక్షులుగా, 1983 లో తెలుగు దేశం పార్టీ నుండి, మొదటిసారి ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా, మంత్రి వర్గంలో స్థానం పొందడం ఆయన రాజకీయ ప్రతిభకు నిదర్శనం. అయితే, ఆ విజయాన్ని స్థిరమైన ఆధిపత్యంగా మార్చుకోవడంలో మాత్రం ఆయన పూర్తిగా సక్సెస్ కాలేకపోయారు.
1980ల నుంచే జగిత్యాల నియోజకవర్గం వర్గ రాజకీయాలకు కేంద్రమైంది. ఒక దశలో ఆయన ప్రభావం ఉన్నప్పటికీ, తర్వాతి కాలంలో వరుసగా ఎదురైన రాజకీయ ప్రతిబంధకాలు ఆయన స్థాయిని తగ్గించాయి.
జగిత్యాల రాజకీయ వాస్తవం – వర్గాల ఆధిపత్య పోరు
జగిత్యాల నియోజకవర్గంలో ప్రధానంగా వెలమ, రెడ్డి వర్గాల మధ్య పోటీ కీలక పాత్ర పోషించింది. 1983 నుండి 2014వరకు ఈ ప్రాంతంలో అధికారం మారుతూ వచ్చినా, ఒక వర్గం పూర్తిగా ఆధిపత్యం చెలాయించలేకపోయింది.
గతంలో వేల రాజకీయ ఆధిపత్యం ఉన్న ఈ నియోజకవర్గం 1983 ఎన్నికల్లో రెడ్డి వర్గానికి దక్కింది. ఆతరువాత, 1985,1994, 2009, ఎన్నికలలో బీసీ వర్గాలకు చెందిన గుడిసెల రాజేశం గౌడ్, ఎలుగందుల రమణ విజయం సాధించి జీవన్ రెడ్డికి చెక్ పెట్టారు.
అంటే వేలం నాయకత్వం. పరిస్థితులకు అనుకూలంగా బీసీలకు మద్దతు ప్రకటించడంతో, రెడ్డి వర్గానికి ఎదురుదెబ్బ తలిగింది. కానీ, పదకొండు సార్లు పోటీ చేసిన జీవన్ రెడ్డి 6 సార్లు గెలిచి వెలమ వర్గాన్ని 2018 వరకు అడ్డుకున్నారు.
అయితే 2018 తర్వాత పరిస్థితులు మారాయి. వెలమ వర్గం ప్రభావం పెరగడంతో, బీసీ నాయకులలో ఐక్యత లేకపోవడం, BRS పార్టీ వెలమ నాయకులకే ప్రాధాన్యత ఈయడంతో, జీవన్ రెడ్డి శకానికి ముగింపు పలికినట్లు అయింది.
జీవన్ రెడ్డి వరుస పరాజయాలు ఎదుర్కొన్నారు. 2023 ఎన్నికల్లో కూడా ఓటమి పాలవడం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నార్థక చిహ్నం పెట్టింది.
కాంగ్రెస్లో అసంతృప్తి – మార్పుకు దారితీసిన కారణం
జీవన్ రెడ్డి పార్టీ మార్పుకు ప్రధాన కారణం కాంగ్రెస్లో పెరిగిన అసంతృప్తి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గెలిచిన నాయకులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం, ఓడిపోయిన వారికి తక్కువ అవకాశాలు ఇవ్వడం ఆయనను నిరాశకు గురిచేసింది.
అంతేకాకుండా, స్థానికంగా కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ఇతర నేతలను ముందుకు తేవడం వల్ల ఆయన స్థానం క్రమంగా బలహీనపడింది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో చివరకు పార్టీని వీడే నిర్ణయం తీసుకున్నారు.
బీఆర్ఎస్లో భవిష్యత్తు – అవకాశాలా? లేక అనిశ్చితి?
బీఆర్ఎస్లో చేరడం ద్వారా జీవన్ రెడ్డి రాజకీయంగా పునరుద్ధరణ పొందుతారా అన్నది పెద్ద ప్రశ్న. ప్రస్తుతం ఆయన వయస్సు 75 ఏళ్లు. రాజకీయాల్లో వారసత్వం లేకపోవడం కూడా ఒక పెద్ద లోపంగా కనిపిస్తోంది.
కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకురాకపోవడం వల్ల ఆయన తర్వాత నాయకత్వం కొనసాగించే వ్యక్తి లేరు. ఇది పార్టీలు కూడా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడానికి ఒక కారణంగా మారుతోంది. పార్టీలో కూడా, రెండవ తరం నాయకత్వాన్ని ఆయన ప్రోత్సహించలేదు.
పట్టణ ఓటర్లు – కీలక బలహీనత
జీవన్ రెడ్డి రాజకీయాల్లో మరో ముఖ్యమైన అంశం పట్టణ ఓటర్ల మద్దతు లేకపోవడం. జగిత్యాల పట్టణంలో ఆయనకు ఎప్పుడూ స్పష్టమైన మెజార్టీ రాలేదు. గ్రామీణ ఓట్లతో గెలిచిన సందర్భాలు ఉన్నా, పట్టణ ఓటర్లు మాత్రం ఆయనకు అనుకూలంగా లేరు.
ఇది భవిష్యత్తులో మరింత పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది.
నియోజకవర్గాల పునర్విభజన – కొత్త సవాళ్లు
వచ్చే ఎన్నికల ముందు నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది. జగిత్యాల నియోజకవర్గం స్వరూపం మారితే, జీవన్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నది పెద్ద ప్రశ్న.
ఒకవేళ పట్టణ కేంద్రంగా నియోజకవర్గం మారితే, ఆయన గెలుపు అవకాశాలు మరింత తగ్గే అవకాశం ఉంది. రిజర్వేషన్ మార్పులు కూడా ఆయన రాజకీయ లెక్కలను పూర్తిగా మార్చేయవచ్చు.
జగిత్యాలపై అధిక భావోద్వేగం – బలమా? బలహీనతా?
జీవన్ రెడ్డి రాజకీయాల్లో ఒక ముఖ్యమైన అంశం జగిత్యాలపై ఉన్న అతిప్రేమ. ఆయన అన్నిటిని వదిలి జగిత్యాలకే పరిమితమయ్యారు.
ఈ భావోద్వేగం ఒకవైపు ఆయనకు గుర్తింపునిచ్చినా, మరోవైపు రాజకీయ అవకాశాలను పరిమితం చేసింది. కొత్త ప్రాంతాల్లో ఎదగలేకపోవడం ఆయనకు నష్టంగా మారింది.
తగ్గుతున్న నాయకత్వ ప్రభావం
ప్రస్తుత పరిస్థితుల్లో జీవన్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నా, బీఆర్ఎస్లో ఉన్నా, ఆయన ప్రభావం పరిమితంగానే ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఆయన పాత్ర ఎక్కువగా మీడియా వ్యాఖ్యలకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాజకీయంగా చూస్తే, ఇది ఒక శక్తివంతమైన నాయకుడి ప్రయాణంలో చివరి దశగా విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ మార్పు ఆయనకు కొత్త జీవం పోస్తుందా, లేక ఇది ముగింపుకు నాంది అవుతుందా అన్నది వచ్చే కాలమే తేల్చాలి..
More News...
<%- node_title %>
<%- node_title %>
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ రెండు సుమోటో కేసులు నమోదు
హైదరాబాద్, జూలై 3 (ప్రజా మంటలు):
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ రెండు వేర్వేరు అంశాలపై స్వయంస్పూర్తితో (సుమోటో) కేసులు నమోదు చేసింది.మొదటి కేసులో రాజన్న సిరిసిల్ల జిల్లా బొంగులకింద గ్రామంలో నాలుగేళ్ల చిన్నారిపై వీధికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనను కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర నివేదికను ఆగస్టు... బోడుప్పల్ భూ పోరాటం: కల్వకుంట్ల కవిత అరెస్ట్
హైదరాబాద్, జూలై 2 (ప్రజా మంటలు):
బోడుప్పల్లో తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలాల హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన చేపట్టిన భూ పోరాటం ఉద్రిక్తంగా మారింది. ఆందోళనలో పాల్గొన్న కల్వకుంట్ల కవితతో పాటు వందలాది మంది నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భూ... రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రక్షణ సేన నాయకుల ముందుస్తు అరెస్టులు
హైదరాబాద్, జూలై 02 (ప్రజా మంటలు):
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రక్షణ సేన నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించనున్న భూపోరాటానికి హాజరయ్యే అవకాశమున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.తెలంగాణ ఉద్యమకారులతో కలిసి భూపోరాటానికి టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.... తెలంగాణ ఆదాయ సమీకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
హైదరాబాద్, జూలై 1 (ప్రజా మంటలు):
రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాలను సాధించేందుకు ఆదాయ సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదాయ లీకేజీలను పూర్తిగా అరికట్టి, వాటిపై నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేక చేజింగ్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ సమీకరణపై జరిగిన ఉన్నతస్థాయి... ఐజేయు కృషితో జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులో 50 శాతం రాయితీ
టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు
జగిత్యాల జూలై 01(ప్రజా మంటలు):టియుడబ్ల్యూజే ఐజేయు కృషితో జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులో 50 శాతం రాయితీ లభించిందని టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా సమీపంలో గల టియుడబ్ల్యూజే ఐజేయు అనుబంధ ప్రెస్... ఆడబిడ్డగా పార్టీ పెట్టిన.. రాష్ట్రం అజెండా మార్చుతా -కల్వకుంట్ల కవిత
సికింద్రాబాద్లో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ.. ఉచిత విద్య, వైద్యమే లక్ష్యం: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జూలై 1 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్లోని సీతాఫల్ మండిలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండాను పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో అజెండా మారాల్సిన అవసరం ఉందన్నారు. పేదలు, మధ్యతరగతి... విజయ్పై తప్పుడు ప్రచారం చేయొద్దు.. ఆరోపణలకు ఆధారాలు చూపాలి: మంత్రి నిర్మల్ కుమార్
చెన్నై, జూలై 01 (ప్రజా మంటలు):
తమిళనాడు మంత్రి నిర్మల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, నటుడు, టీవీకే (TVK) అధ్యక్షుడు విజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. వైకోతో పాటు మరెవరైనా ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేస్తే, వారిని టీవీకే తరఫున మళ్లీ గెలిపిస్తానని ముఖ్యమంత్రి విజయ్ ఎక్కడా చెప్పలేదని ఆయన పేర్కొన్నారు. అలాంటి... రాయికల్ మండలం మహితాపూర్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సంజయ్ శ్రీకారం
జగిత్యాల, జూలై 01 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మహితాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ భూమిపూజ చేసి ప్రారంభించారు.అనంతరం గ్రామంలో ఐదు మంది లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు... తెలంగాణ రైతు భరోసా నిధుల విడుదల
హైదరాబాద్, జూన్ 30 (ప్రజా మంటలు):
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద తొలి విడతగా 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482.02 కోట్లు జమ చేసింది. హైదరాబాద్లో నిర్వహించిన రైతు భరోసా సదస్సులో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిధులను విడుదల చేశారు.ప్రభుత్వం వచ్చే తొమ్మిది రోజుల్లో మొత్తం రూ.9... బీజేపీ తెలంగాణకు సవతి తల్లి ప్రేమ చూపుతోంది.. ముషీరాబాద్ జండా పండగలో కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జూన్ 30 (ప్రజా మంటలు):
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్ర నాయకుడు వేణుమాధవ్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని, బీజేపీ తెలంగాణపై "సవతి తల్లి ప్రేమ" ప్రదర్శిస్తోందని ఆరోపించారు.కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బీజేపీ నాయకులు పదేపదే ఆరోపిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి దర్యాప్తు లేదా... 2 లక్షల ఉద్యోగాలు, 20 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కల్వకుంట్ల కవిత ధర్నా, డిమాండ్
హైదరాబాద్, జూన్ 29 (ప్రజా మంటలు):
ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సోమవారం దిల్సుఖ్నగర్ చౌరస్తాలో నిరుద్యోగులతో కలిసి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం స్పందించే వరకు నిరుద్యోగుల వెన్నంటి... పోలియో చుక్కలను వేసి చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపాలి - పి.సి.సి సేవాదళ్ సెక్రటరీ బోగోజి ముఖేష్ ఖన్నా
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)
జగిత్యాల 28 జూన్ ( ప్రజా మంటలు) :
జాతీయ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా 0-5 ఏండ్ల వయస్సు ఉన్న పిల్లలకు తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలను వేసి చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపాలని పి.సి.సి సేవాదళ్ సెక్రటరీ బోగోజి ముఖేష్ ఖన్నా వెల్లడించారు.
పోలియో... 