ధర్మపురి యోగానంద నరసింహ ఏకాంతోత్సవం

On
ధర్మపురి యోగానంద నరసింహ ఏకాంతోత్సవం

ధర్మపురి యోగానంద నరసింహ
ఏకాంతోత్సవం

 రామ కిష్టయ్య సంగన భట్ల

 ధర్మపురి మార్చ్ 30 :
నృసింహస్వామి క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా శని వారం రాత్రి చాలా సేపటి వరకు నిర్వహించిన శ్రీ లక్ష్మీ సమేత యోగానంద నరసింహుని ఏకాంతోత్సవ వేడుకలు నేత్ర పర్వంగా సాగాయి.

స్వామి ఏకాంతోత్సవ సందర్భంగా, మహారాష్ట్ర లోని బిలోలికి చెందిన భక్తులు హర్గుల్ వార్ శంకర్ ప్రతి ఏటి లాగే సమర్పించిన వివిధ పుష్పాలతో  ఆకర్షణీయంగా స్వాముల మూల విరాట్టులను అలంకృతుల గావించారు. రాత్రి 9.30 గంటలకు ప్రారంభమై రాత్రి చాలా సేపటి వరకు కొనసాగిన స్వామివారి ఏకాంతోత్సవ కార్యక్రమంలో ముందుగా ప్రధానాలయంలో, స్వామి ఉత్సవ మూర్తులను అలంకరించి, గరుడ స్థంభం వద్ద నిలిపి, ప్రత్యేక ఉత్సవ పూజలొనరించారు. వేద, శాస్త్ర,  పురాణ, నృత్య, సంగీత, వాద్య, మౌన అదిగా గల సప్త ఆవరణ ప్రదక్షిణ లలో బోయీలు, భక్తులు స్వామివారిని ప్రధానాలయం చుట్టూ ఏడు ప్రదక్షిణలు తిప్పగా, భక్తులు అనుసరించారు.

దేవస్థానం పౌరోహితులు పురుషోత్తమా చార్య , ఆస్థాన వేద పండితులు బొజ్జా రమేశర్మల మార్గ నిర్దేశకత్వంలో దేవస్థానం ఎసి, ఈఓ శ్రీనివాస్ సంకటాల, వివిధ ఆలయాల అర్చకులు నంబి శ్రీనివాసాచార్య. రమణాచార్య, నరసింహ మూర్తి,  అశ్విన్, వంశీలు సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించారు. సప్త ప్రదక్షిణల అనంతరం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఆలయ ప్రాంగణానగల మంటపం లోని ఊయలలో లక్ష్మీ, కళ్యాణ యోగానంద నృసింహుని పవళింపు గావించి, అలౌకికానంద భరితులైన భక్తజన సమక్షంలో కన్నుల పండువగా వైకుంఠ నాథుని, లక్ష్మీదేవి ఏకాంత వేడుకలను సాంప్రదాయ రీతిలో నిర్వ హించారు. పవళింపు సేవ, నీరాజనం, మంత్రపుష్పం, ప్రసాద వితరణాదులను నిర్వహించారు. విశేషార్చనలు చేశారు. వేదవిదుల మహదాశీర్వచనాన్ని గావించి, ప్రసాద వితరణ చేశారు. 

ఘనంగా వేంకటేశ్వర పుష్పయాగం

బ్రహ్మోత్సవాలలో భాగంగా శని వారం రాత్రి శ్రీవేంకటేశ్వర స్వామి పుష్ప యాగాన్ని నిర్వహించారు.

లోక కళ్యాణార్థం ఉత్సవ పరిసమాప్తి సందర్భంగా కలియుగ వేలుపైన వెంకన్న ప్రీతికై దేవస్థాన యాజ్ఞకులు పురుషోత్తమా చార్య , వేదపండితులు బొజ్జా రమేశశర్మ, ఆచార్యత్వంలో ఆలయ ఉప ప్రధానార్చకులు  నేరేళ్ళ శ్రీనివాసా చార్య, మోహనా చార్య, విజయ్,భక్తి శ్రద్ధాసక్తులతో వాసుదేవ ద్వాదశాక్షరీ గోపాల పూజ యుక్త (నాగవెల్లి) పుష్ప యాగం కార్యక్రమాన్ని నిర్వహించారు. వేంకటేశ్వర మందిరంలోని మంటపంలో, పంచవర్ణాలతో చక్రాబ్జమును చిత్రించి, పుష్పాలం కృత శోభాయమాన పీఠమందు వేంకటనాథుని వేంచేపు చేసి, నలువైపులా ద్వార కుంభాలనుంచి రుక్, యజుర్, సామాధర్వణ వేదాలతో, శాస్త్ర సంగీతాది కళలతో స్వామిని సేవించారు.

ఈఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News  Filmi News  Science   State News 

ఐబొమ్మ.. ఇక ‘నో బొమ్మే' నా? వెండితెరకు శని: రవి అరెస్ట్ – అసలు ఏం జరుగుతుంది?

ఐబొమ్మ.. ఇక ‘నో బొమ్మే' నా? వెండితెరకు శని: రవి అరెస్ట్ – అసలు ఏం జరుగుతుంది? హైదరాబాద్, నవంబర్ 15 (ప్రజా మంటలు) తెలంగాణలో అత్యంత చర్చనీయాంశంగా మారిన పిరేటెడ్ సినిమా సైట్ ‘ఐబొమ్మ’ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ సైట్‌ను నడిపిస్తున్న వ్యక్తిగా భావిస్తున్న **ఇమ్మడి రవి (ఐ రవి)**ను శనివారం ఉదయం కూకట్పల్లి ప్రాంతంలో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే ఫ్రాన్స్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రవిని...
Read More...

రాజీ ద్వారానే సత్వర న్యాయం సీనియర్ సివిల్ జడ్జి డి.నాగేశ్వర్.

రాజీ ద్వారానే సత్వర న్యాయం సీనియర్ సివిల్ జడ్జి డి.నాగేశ్వర్. మెట్టుపల్లి నవంబర్ 15 (ప్రజామంటలు దగ్గుల అశోక్) పరస్పరం రాజీ పడటం ద్వారానే సత్వర న్యాయం జరుగుతుందని సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. శనివారం మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, దీర్ఘ కాలికాంగ కేసుల్ని కొట్లాడకుండా, రాజీ చేసుకోవడం...
Read More...

ఎం ఎన్ కే విట్టల్ సెంట్రల్ కోర్టులో ఘనంగా శివపార్వతి కళ్యాణం

ఎం ఎన్ కే విట్టల్ సెంట్రల్ కోర్టులో ఘనంగా శివపార్వతి కళ్యాణం సికింద్రాబాద్,  నవంబర్ 15 (ప్రజా మంటలు):  న్యూ బోయిగూడలోని సెంట్రల్ కోర్టు అపార్టుమెంటు వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంటు డాక్టర్ జి. హనుమాన్లు, జి. వనిత జ్యోతి ప్రజ్వలనతో  ప్రారంభమైన అభిషేకం కార్యక్రమంలో వందలాదిమంది తమ స్వహస్తాలతో క్షీరాభిషేకం చేశారు. అనంతరం అపార్టుమెంటు దంపతులు కన్యాదాతలుగా వ్యవహరించి శివపార్వతి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు.   కార్తీక ఏకాదశి పర్వదినాన...
Read More...
Local News  State News 

రోటరీ ఇంటర్నేషనల్ యంగ్ అచీవర్ అవార్డు–2025కి ఆకర్షణ

రోటరీ ఇంటర్నేషనల్ యంగ్ అచీవర్ అవార్డు–2025కి ఆకర్షణ సికింద్రాబాద్,  నవంబర్ 15 (ప్రజా మంటలు):  హైదరాబాద్‌కు చెందిన 14 ఏళ్ల ఆకర్షణ అద్భుత ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రోటరీ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఆర్‌టిఎన్. ఫ్రాన్సిస్కో అరెజ్జో చేతుల మీదుగా ఆమె Rotary International Young Achiever Award 2025ను హ్యూమానిటేరియన్ సర్వీస్ విభాగంలో అందుకున్నారు. ఈ అవార్డ్‌ను పొందిన వారిలో ఆమెనే...
Read More...
Local News 

వశిష్ట కళాశాలలో బీర్సా ముండా 150వ జయంతి

వశిష్ట కళాశాలలో బీర్సా ముండా 150వ జయంతి సికింద్రాబాద్,  నవంబర్ 15 ( ప్రజా మంటలు):  ఎబీవీపీ సికింద్రాబాద్ జిల్లా, ఎస్‌ఆర్ నగర్ శాఖ ఆధ్వర్యంలో వశిష్ట కళాశాలలో భగవాన్ బీర్సా ముండా 150వ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో మాట్లాడిన ఎబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు బీర్సా ముండా గాంధీ, నేతాజీ, అల్లూరి, భగత్ సింగ్‌లతో సమానమైన ఆదివాసి స్వాతంత్ర్య వీరుడని చెప్పారు....
Read More...
National  Filmi News  International   State News 

గ్లోబ్ ట్రాటర్ (SSMB29) – మహేష్ బాబు, రాజమౌళి సినిమా టీజర్ విడుదల

గ్లోబ్ ట్రాటర్ (SSMB29) – మహేష్ బాబు, రాజమౌళి సినిమా టీజర్ విడుదల హైదరాబాద్, నవంబర్ 15 (ప్రజా మంటలు): ఎస్‌.ఎస్‌. రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్‌–వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా ‘గ్లోబ్ ట్రాటర్’ (వర్కింగ్ టైటిల్ SSMB29), అధికారికంగా ‘వారణాసి’ అనే టైటిల్‌తో గ్రాండ్ ఈవెంట్‌లో టీజర్‌ను ఆవిష్కరించారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఫస్ట్...
Read More...
National  International   State News 

మాధ్యమాలు ఏకపక్షంగా మారాయి: ప్రపంచంలో చెత్త టీవీ న్యూస్ ఛానల్స్‌లోనే..

మాధ్యమాలు ఏకపక్షంగా మారాయి: ప్రపంచంలో చెత్త టీవీ న్యూస్ ఛానల్స్‌లోనే.. “భారత మీడియా విమర్శించే శక్తిని కోల్పోయింది నితీష్, మోడీ, రాహుల్ – ఎవ్వరూ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు న్యూఢిల్లీ నవంబర్ 15: భారత టెలివిజన్ వార్తా ఛానల్స్ నాణ్యతపై ప్రముఖ పాత్రికేయుడు, ది హిందూ మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ ఎన్‌. రామ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్‌ ఎన్నికల మీడియా కవరేజ్‌పై ‘ది వైర్‌’ కోసం...
Read More...

గౌతమ ఉన్నత పాఠశాలలో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు 

గౌతమ ఉన్నత పాఠశాలలో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు  జగిత్యాల నవంబర్ 15 (ప్రజా మంటలు) గౌతమ ఎడ్యుకేషన్ సొసైటీ విద్యాసంస్థల్లో  రెండు రోజులుగా చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా శనివారం గౌతమ ఉన్నత పాఠశాల లో చిల్డ్రన్స్ డే వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు . సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను  ఎంతగానో...
Read More...

పదేళ్ల బాలికపై లైంగిక దాడి: కేరళలో బీజేపీ నేతకు జీవిత ఖైదు

పదేళ్ల బాలికపై లైంగిక దాడి: కేరళలో బీజేపీ నేతకు జీవిత ఖైదు థలసేరి / కన్నూర్ నవంబర్ 15: కేరళలోని పలాథాయి పాఠశాలలో 10 ఏళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో బీజేపీ మాజీ నేత కె. పద్మరాజన్ కు థలసేరి POCSO ఫాస్ట్-ట్రాక్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. ఈ తీర్పుతో ఐదేళ్లుగా నడుస్తున్న ఈ కీలక కేసు ముగిసింది. ఘటన ఎలా జరిగింది? 2020...
Read More...

రాజీమార్గమే రాజ మార్గం

రాజీమార్గమే రాజ మార్గం జగిత్యాల నవంబర్ 15 (ప్రజా మంటలు)రాజీమార్గమే రాజమార్గమని జిల్లా న్యాయమూర్తి రత్నప్రభవతి అన్నారు .శనివారం చీఫ్ రిజిస్టర్ ఆదేశాలతో జిల్లా కేంద్రంలో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ పెండింగ్ కేసులు సివిల్ తగాదాలు చెక్ బౌన్స్ మ్యారేజ్ ఇష్యూస్ స్పెషల్ లోక్ అదాలత్ లో  పరిశీలించుకోవచ్చునని తెలిపారు. చిన్నచిన్న...
Read More...

నౌగామ్ బ్లాస్ట్‌: ‘కిటికీ తీసే సరికి పోలీస్ స్టేషన్‌ మంటల్లో…

నౌగామ్ బ్లాస్ట్‌: ‘కిటికీ తీసే సరికి పోలీస్ స్టేషన్‌ మంటల్లో… శ్రీనగర్/నౌగామ్ (జమ్మూకాశ్మీర్) నవంబర్ 15; నౌగామ్ సెక్టార్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న భారీ పేలుడు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. అకస్మాత్తుగా వచ్చిన ఈ బ్లాస్ట్‌తో ప్రాంతమంతా ఒకేసారి షాక్‌కు గురై, కుటుంబాలు చిన్నపిల్లలతో సహా రాత్రి చీకటి మధ్య ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. స్థానికుల మాటల్లో—“కిటికీ తీసే సరికి...
Read More...
National  State News 

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విజయం తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ నేతల కీలక భేటీలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విజయం తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ నేతల కీలక భేటీలు న్యూ ఢిల్లీ నవంబర్ 15 (ప్రజా మంటలు): జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో, తెలంగాణ ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా జాతీయ నేతలు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీలను భేటీ అయ్యారు. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 98,888...
Read More...