ధర్మపురి యోగానంద నరసింహ ఏకాంతోత్సవం

On
ధర్మపురి యోగానంద నరసింహ ఏకాంతోత్సవం

ధర్మపురి యోగానంద నరసింహ
ఏకాంతోత్సవం

 రామ కిష్టయ్య సంగన భట్ల

 ధర్మపురి మార్చ్ 30 :
నృసింహస్వామి క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా శని వారం రాత్రి చాలా సేపటి వరకు నిర్వహించిన శ్రీ లక్ష్మీ సమేత యోగానంద నరసింహుని ఏకాంతోత్సవ వేడుకలు నేత్ర పర్వంగా సాగాయి.

స్వామి ఏకాంతోత్సవ సందర్భంగా, మహారాష్ట్ర లోని బిలోలికి చెందిన భక్తులు హర్గుల్ వార్ శంకర్ ప్రతి ఏటి లాగే సమర్పించిన వివిధ పుష్పాలతో  ఆకర్షణీయంగా స్వాముల మూల విరాట్టులను అలంకృతుల గావించారు. రాత్రి 9.30 గంటలకు ప్రారంభమై రాత్రి చాలా సేపటి వరకు కొనసాగిన స్వామివారి ఏకాంతోత్సవ కార్యక్రమంలో ముందుగా ప్రధానాలయంలో, స్వామి ఉత్సవ మూర్తులను అలంకరించి, గరుడ స్థంభం వద్ద నిలిపి, ప్రత్యేక ఉత్సవ పూజలొనరించారు. వేద, శాస్త్ర,  పురాణ, నృత్య, సంగీత, వాద్య, మౌన అదిగా గల సప్త ఆవరణ ప్రదక్షిణ లలో బోయీలు, భక్తులు స్వామివారిని ప్రధానాలయం చుట్టూ ఏడు ప్రదక్షిణలు తిప్పగా, భక్తులు అనుసరించారు.

దేవస్థానం పౌరోహితులు పురుషోత్తమా చార్య , ఆస్థాన వేద పండితులు బొజ్జా రమేశర్మల మార్గ నిర్దేశకత్వంలో దేవస్థానం ఎసి, ఈఓ శ్రీనివాస్ సంకటాల, వివిధ ఆలయాల అర్చకులు నంబి శ్రీనివాసాచార్య. రమణాచార్య, నరసింహ మూర్తి,  అశ్విన్, వంశీలు సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించారు. సప్త ప్రదక్షిణల అనంతరం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఆలయ ప్రాంగణానగల మంటపం లోని ఊయలలో లక్ష్మీ, కళ్యాణ యోగానంద నృసింహుని పవళింపు గావించి, అలౌకికానంద భరితులైన భక్తజన సమక్షంలో కన్నుల పండువగా వైకుంఠ నాథుని, లక్ష్మీదేవి ఏకాంత వేడుకలను సాంప్రదాయ రీతిలో నిర్వ హించారు. పవళింపు సేవ, నీరాజనం, మంత్రపుష్పం, ప్రసాద వితరణాదులను నిర్వహించారు. విశేషార్చనలు చేశారు. వేదవిదుల మహదాశీర్వచనాన్ని గావించి, ప్రసాద వితరణ చేశారు. 

ఘనంగా వేంకటేశ్వర పుష్పయాగం

బ్రహ్మోత్సవాలలో భాగంగా శని వారం రాత్రి శ్రీవేంకటేశ్వర స్వామి పుష్ప యాగాన్ని నిర్వహించారు.

లోక కళ్యాణార్థం ఉత్సవ పరిసమాప్తి సందర్భంగా కలియుగ వేలుపైన వెంకన్న ప్రీతికై దేవస్థాన యాజ్ఞకులు పురుషోత్తమా చార్య , వేదపండితులు బొజ్జా రమేశశర్మ, ఆచార్యత్వంలో ఆలయ ఉప ప్రధానార్చకులు  నేరేళ్ళ శ్రీనివాసా చార్య, మోహనా చార్య, విజయ్,భక్తి శ్రద్ధాసక్తులతో వాసుదేవ ద్వాదశాక్షరీ గోపాల పూజ యుక్త (నాగవెల్లి) పుష్ప యాగం కార్యక్రమాన్ని నిర్వహించారు. వేంకటేశ్వర మందిరంలోని మంటపంలో, పంచవర్ణాలతో చక్రాబ్జమును చిత్రించి, పుష్పాలం కృత శోభాయమాన పీఠమందు వేంకటనాథుని వేంచేపు చేసి, నలువైపులా ద్వార కుంభాలనుంచి రుక్, యజుర్, సామాధర్వణ వేదాలతో, శాస్త్ర సంగీతాది కళలతో స్వామిని సేవించారు.

ఈఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

బేగంపేట ప్రజా భవన్ ఎదుట ఉద్రిక్తత – తెలంగాణ జాగృతి నేతలు, మహిళల అరెస్టు

బేగంపేట ప్రజా భవన్ ఎదుట ఉద్రిక్తత – తెలంగాణ జాగృతి నేతలు, మహిళల అరెస్టు హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు): బేగంపేటలోని ప్రజా భవన్ ముందు తెలంగాణ జాగృతి నాయకులు, మహిళలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. మహిళలను అరెస్ట్ చేస్తున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న జాగృతి కార్యాలయ ఉద్యోగి లక్ష్మణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వాలన్న ఎన్నికల హామీని అమలు చేయాలని, అలాగే అంగన్‌వాడీ...
Read More...
National  Comment  International  

రష్యా - అమెరికా ఒకటైతే బంగారం ధర పడిపోతుందా?

రష్యా - అమెరికా ఒకటైతే బంగారం ధర పడిపోతుందా? బంగారం ధర ₹1 లక్షకు పడిపోతుందా? – గ్లోబల్ పవర్ షిఫ్ట్ వెనుక అసలు కథ. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1.57 లక్షలు.ఇది సాధారణ పెరుగుదల కాదు — ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నమ్మకం కదిలిన సంకేతం. ఇప్పుడు ప్రశ్న:👉 ఈ...
Read More...

జిల్లా బీజేపీ అధ్యక్షునిపై కౌన్సిలర్ల దాడి: కౌన్సిలర్ మీనా సస్పెన్షన్

జిల్లా బీజేపీ అధ్యక్షునిపై కౌన్సిలర్ల దాడి: కౌన్సిలర్ మీనా సస్పెన్షన్ మెట్‌పల్లి ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు): మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించినప్పటికీ, పార్టీ అధ్యక్షుడు రాచకొండ యాదగిరి మున్సిపల్ చైర్మన్ పదవి సాధించేందుకు ప్రయత్నించలేదని, కౌన్సిలర్లకు విప్ కూడా జారీ చేయలేదని ఆరోపిస్తూ కొంతమంది పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన నివాసంపై దాడికి దిగినట్లు సమాచారం. ఈ...
Read More...
State News 

తెలంగాణ జాగృతిలో చేరిన మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కుమారుడు మనోహర్

తెలంగాణ జాగృతిలో చేరిన మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కుమారుడు మనోహర్ హైదరాబాద్  ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు): బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, దివంగత మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కుమారుడు కావేటి మనోహర్ కుమార్ తెలంగాణ జాగృతిలో చేరారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మనోహర్ కుమార్‌కు కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. మనోహర్ కుమార్‌తో పాటు...
Read More...

కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నా… భవిష్యత్ ఏంటో గోచరించట్లేదు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నా… భవిష్యత్ ఏంటో గోచరించట్లేదు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు)కాంగ్రెస్ పార్టీలో తన భవిష్యత్‌పై ఆలోచిస్తున్నానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ —“భవిష్యత్ ఏంటో నాకు గోచరించట్లేదు. అవమానాలు ఇంకెంత కాలం భరించాలి?” అని ఆవేదన...
Read More...
Filmi News  State News 

జగిత్యాల లో సినీ హీరో అర్జున్ సందడి…

జగిత్యాల లో సినీ హీరో అర్జున్ సందడి… జగిత్యాల ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు) జగిత్యాల పట్టణంలో సినీ హీరో అర్జున్ సందడి చేశారు. స్థానిక శ్రీనివాస థియేటర్లో అర్జున్ మరియు ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ నటించిన సీతా పయనం చిత్రం ప్రదర్శింపబడుతున్న సందర్భంగా, మ్యాట్నీ షో సమయంలో థియేటర్‌ను సందర్శించి ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ,...
Read More...

గాంధీ ఆసుపత్రి ఆవరణలో నిరాశ్రయుల దుర్బర జీవితం…

గాంధీ ఆసుపత్రి ఆవరణలో నిరాశ్రయుల దుర్బర జీవితం… సికింద్రాబాద్, ఫిబ్రవరి 16 ( ప్రజామంటలు):  గాంధీ ఆసుపత్రి ఆవరణలో ఆశ్రయం లేక జీవనం సాగిస్తున్న నిరాశ్రయుల జీవితాలు గుండెల్ని పిండేసే  దృశ్యాలుగా మారుతున్నాయి. ఎవరి ఆదరణ లేక, కనీస సౌకర్యాలు లేక కొందరు ఫుట్‌పాత్‌లనే ఇంటిగా మార్చుకుని రోజులు గడుపుతున్నారు. అన్నదానాల కోసం చేరిన వారు, కాలక్రమేణా అక్కడే జీవితం గడపాల్సిన పరిస్థితికి చేరుకున్నారు.అనారోగ్యంతో...
Read More...

న్యాయవాది ఖాదీర్ హత్య నిందితులకు కఠిన శిక్షలు విధించాలి

న్యాయవాది ఖాదీర్ హత్య నిందితులకు కఠిన శిక్షలు విధించాలి మెట్టుపల్లి ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్) రంగారెడ్డి బార్ అసోసియేషన్ సభ్యులు యండి. ఖాదీర్పై దాడి చేసి హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మెట్టుపల్లి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం మెట్టుపల్లి కోర్టులో న్యాయవాదులు ఖాదీర్ హత్యకు...
Read More...

హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గా దండి లక్ష్మీ కొమురయ్య

హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గా దండి లక్ష్మీ కొమురయ్య హుస్నాబాద్ | ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నేడు జరిగిన ప్రత్యేక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. 14వ వార్డు సభ్యులు దండి లక్ష్మీ కొమురయ్యను హుస్నాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా, 7వ వార్డు సభ్యులు చిత్తారి పద్మ రవీందర్ను వైస్ చైర్‌పర్సన్‌గా...
Read More...
Local News 

రాయికల్ మున్సిపల్ పీఠంపై ఎగిరిన గులాబీ జెండా

రాయికల్ మున్సిపల్ పీఠంపై ఎగిరిన గులాబీ జెండా ఐదు సీట్లు గెలుచుకున్న బీజేపీ లో నిరాశ రాయికల్  ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు): జగిత్యాల నియోజకవర్గంలోని రాయికల్ పట్టణ మున్సిపాలిటీపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పట్టు సాధించింది. మొత్తం 7 మంది కౌన్సిలర్ల మద్దతుతో బీఆర్ఎస్ అధికారాన్ని కైవసం చేసుకుంది. ▪️ మున్సిపల్ చైర్మన్‌గా కట్కం రవీందర్ ఎన్నిక▪️ వైస్ చైర్మన్‌గా...
Read More...

ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వేముల నాగలక్ష్మి (కాంగ్రెస్) ఎన్నిక

ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వేముల నాగలక్ష్మి (కాంగ్రెస్) ఎన్నిక ధర్మపురి | ఫిబ్రవరి 16 – ప్రజా మంటలు ధర్మపురి మున్సిపల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వేముల నాగలక్ష్మిను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపిక చేశారు. అదే సమయంలో, వైస్ చైర్మన్‌గా ఇందారపు రామన్నను తిరిగి నియమించారు. ▪️ మొదటినుంచి ప్రచారంలో ఉన్న అభ్యర్థి కాకుండా కొత్త అభ్యర్థికి...
Read More...

జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక: గెలిచింది సంజయ్ వర్గమా? లేక రేవంత్ రాజకీయ పంతమా?

జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక: గెలిచింది సంజయ్ వర్గమా? లేక రేవంత్ రాజకీయ పంతమా? జగిత్యాల రాజకీయాల్లో సంచలన మార్పు: కొత్త సమీకరణలు ? (ప్రత్యేక విశ్లేషణాత్మక కథనం) జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా సమిండ్ల వాణి ఎన్నిక కావడం కేవలం స్థానిక పదవి మార్పు కాదు. ఇది కాంగ్రెస్ లోపలి శక్తి సమీకరణాల్లో ఒక కీలక మలుపు. బయటికి చూస్తే ఇది👉 సంజయ్ కుమార్ వర్గ విజయం...
Read More...