ఇప్పుడు 'గల్ఫ్' ఎటువైపు - 'గల్ఫ్' పై కాంగ్రెస్ ఆశలు ఇప్పటికైనా తమ అవసరాలను గుర్తించాలని కార్మికుల కోరిక

On
ఇప్పుడు 'గల్ఫ్' ఎటువైపు - 'గల్ఫ్' పై కాంగ్రెస్ ఆశలు ఇప్పటికైనా తమ అవసరాలను గుర్తించాలని కార్మికుల కోరిక

ఇప్పుడు 'గల్ఫ్' ఎటువైపు - 'గల్ఫ్' పై కాంగ్రెస్ ఆశలు
ఇప్పటికైనా తమ అవసరాలను గుర్తించాలని కార్మికుల కోరిక

 హైదరాబాద్ మార్చ్ 28 (ప్రత్యేక ప్రతినిధి) :

రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో గల్ఫ్ కార్మికుల కుటుంబాల ఓటు బ్యాంకు ప్రభావం ఎలా ఉండబోతుంది అనే అంశంపై ఇటీవల ఒక ప్రాథమిక పరిశీలన జరిగింది. గతంలో రాజకీయ వ్యూహకర్తలు ప్రశాంత్ కిశోర్, సునీల్ కొనుగోలు టీములు, వివిధ సర్వే సంస్థలు చేసిన విశ్లేషణలను కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది.

తెలంగాణ లోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్, వరంగల్, హైదరాబాద్ ఎనిమిది లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని  'గల్ఫ్ మైగ్రేషన్ కారిడార్' నుంచి ప్రస్తుతం ఎంత మంది గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారు, విదేశీ మారక ద్రవ్యం ఎంత పంపించారు, గత పదేళ్లలో ఎంత మంది గల్ఫ్ నుంచి వాపస్ వచ్చారు, వారి పునరావాసం ఎలా ఉన్నది, గల్ఫ్ కార్మికుల ప్రధాన సమస్యలు ఏం ఉన్నాయి, రేషన్ కార్డులలో, ఓటర్ లిస్ట్ లో గల్ఫ్ కార్మికుల పేర్లు ఏ మేరకు తొలగించారు, గల్ఫ్ నుంచి వాపస్ వచ్చిన వారు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లాంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మేరకు చురుకుగా పాల్గొన్నారు, ఎంతమంది గెలుపొందారు, వారి రాజకీయ చైతన్యం ఏ మేరకు ఉన్నది అనే విషయాలను పరిశీలించడం జరిగింది.

2023 డిసెంబర్ 7న తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీలలో కొంతవరకు నెరవేర్చింది. గల్ఫ్ దేశాలలో మృతిచెందిన వలస కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపును ఇటీవల వేములవాడలో ప్రారంభించింది. రాష్ట్రంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ (బీఆర్ఎస్), కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి చెప్పుకోదగ్గ సంక్షేమ కార్యక్రమాలు ఏవీ చేపట్టలేదు. దేశానికి అత్యధిక విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయి. కేరళ, పంజాబ్ లాంటి రాష్ట్రాల కంటే మెరుగైన ఎన్నారై పాలసీ (ప్రవాసి విధానం) తెస్తామన్న కేసీఆర్, కేటీఆర్ ల హామీలు అటకెక్కాయి. విదేశీ పెట్టుబడులు, ఎన్నారైల పెట్టుబడులపై ఉన్న ప్రేమ ప్రవాసి కార్మికులపై లేదు. గల్ఫ్ నుంచి వాపస్ వచ్చిన వారిని ఆదుకోవడానికి కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎలాంటి పునరావాస కార్యక్రమాలు చేపట్టలేదు.

ప్రధాని మోదీకి గల్ఫ్ కార్మికులు రాసిన బహిరంగ లేఖ

ఇటీవల జగిత్యాల పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి గల్ఫ్ కార్మికులకు సామాజిక భద్రత, సంక్షేమం, కేంద్ర ప్రభుత్వ పక్షాన సౌకర్యాల కల్పన, హక్కుల గురించి వలస కార్మిక నాయకులు బహిరంగ లేఖ రాశారు. గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్, 'గల్ఫ్ కాంగ్రెస్' అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, టిపిసిసి ఎన్నారై సెల్ ఇంటర్నేషనల్  కన్వీనర్  మంద భీంరెడ్డి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ నాయకులు సయిండ్ల రాజిరెడ్డి, ఎం. నాగభూషణంలు లేఖపై సంతకాలు చేశారు.  

గల్ఫ్ దేశాలలో 88 లక్షల మంది వలస కార్మికులు నివసిస్తున్నారని భారత ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. విదేశీ మారక ద్రవ్యాన్ని పొందే దేశాలలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నది. 2023లో 125 బిలియన్ యుఎస్ డాలర్ల (10 లక్షల 25 వేల కోట్ల రూపాయల) విలువైన విదేశీ మారకాన్ని భారతదేశం పొందింది. ఇది భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.4 శాతం. భారత్ పొందే విదేశీ మారకంలో సగానికి పైగా గల్ఫ్ దేశాల నుంచే లభిస్తున్నది. గమ్యస్థాన గల్ఫ్ దేశాల అభివృద్ధిలో పాలుపంచుకుంటూ భారతదేశానికి అత్యధిక విదేశీ మారక ద్రవ్యం పంపిస్తున్న ప్రవాస భారతీయ కార్మికుల సేవలను గుర్తించాలని మిమ్ములను కోరుతున్నాము.

గత పదేళ్లలో మీరు ప్రధాన మంత్రి హోదాలో సౌదీ అరేబియా, యూఏఈ, ఓమాన్, కువైట్, ఖతార్, బహరేన్ ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో పర్యటించారు. భారత్ - గల్ఫ్ దేశాల మధ్య మీరు చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలలో వ్యాపార వాణిజ్య ఒప్పందాలే ఎక్కువ. గల్ఫ్ వలస కార్మికుల సామాజిక భద్రత, సంక్షేమం గురించి పెద్దగా పట్టించుకోలేదు.

కరోనా సందర్బంగా వందే భారత్ ప్లయిట్స్, చార్టర్డ్ ప్లయిట్స్ లలో విదేశాల నుంచి భారత్ కు వచ్చిన మన పౌరుల నుంచి రెండింతలు, మూడింతలు విమాన చార్జీలు వసూలు చేయడం వలన పేద వలస కార్మికులు నష్టపోయారు. కరోనా సందర్బంగా హడావిడిగా వాపస్ వచ్చిన ప్రవాసి కార్మికులకు  గల్ఫ్ దేశాల కంపెనీ యాజమాన్యాల నుంచి రావలసిన ఉద్యోగ అనంతర ప్రయోజనాలు (ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్) పొందేందుకు న్యాయ సహాయాన్ని అందించండి.

భారత ప్రభుత్వం ఈ క్రింది విషయాలపై దృష్టి పెట్టాలని కోరుతున్నాము.
- ప్రవాసీ భారతీయ బీమా యోజన అనే రూ.10 లక్షల ప్రమాద బీమా పథకంలో సహజ మరణాన్ని చేర్చాలి. బీమా సౌకర్యం అందరికీ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచాలి.

-విదేశీ మారకద్రవ్యం పంపేవారికి బంగ్లాదేశ్ ప్రభుత్వం రెండున్నర శాతం ప్రోత్సాహకం ఇస్తున్నది. భారత ప్రభుత్వం కూడా ఈదిశగా ఆలోచించాలి.

-- హైదరాబాద్ లో సౌదీ అరేబియా, కువైట్ దేశాల కాన్సులేట్ లు (రాయబార కార్యాలయాలు) ఏర్పాటుకు భారత ప్రభుత్వం చొరవ చూపాలి. ఇటీవలనే యూఏఈ కాన్సులేట్ ను ఏర్పాటు చేశారు.

-- గల్ఫ్‌లోని భారతీయ వలస కార్మికులకు బీమా, పెన్షన్‌తో కూడిన సమగ్ర సామాజిక భద్రతా పథకాన్ని అమలు చేయాలి.

- వాపస్ వచ్చిన వలసదారుల కోసం పునరేకీకరణ, పునరావాసం పథకాన్ని రూపొందించండి.

- ఎమిగ్రేషన్ యాక్టు 1983 ని ఆధునికీకరించాలి. చాలా ఏళ్లుగా న్యూ ఎమిగ్రేషన్ బిల్ పెండింగ్ లో ఉన్నది.

-- ద్వైపాక్షిక కార్మిక ఒప్పందాలను క్రమం తప్పకుండా సమీక్షించడానికి గల్ఫ్ దేశాలతో సంయుక్త కమిటీలను ఏర్పాటు చేయాలి.

-- విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్లే వారందరికీ ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షణ (ప్రీ-డిపార్చర్ ఓరియంటేషన్ మరియు ట్రైనింగ్ - పీడీఓటి ని నిర్బంధంగా అమలు చేయాలి.

-      భారత దేశం నుంచి విదేశాలకు వెళ్లే ప్రతి పౌరుడి వివరాలను భారతీయ విమానాశ్రయాల్లో రిజిస్ట్రేషన్ చేయాలి. అలాగే  విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలి. 

- భారతదేశంలో చదువుకుంటున్న గల్ఫ్ కార్మికుల పిల్లలకు ఆయా విద్యా సంస్థలలో రిజర్వేషన్ కోటా అమలు చేయాలి.

- ప్రస్తుత ప్రభుత్వాలు అమలు చేస్తున్న సామాజిక సంక్షేమ పథకాలలో గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న కార్మికులు, గల్ఫ్ దేశాల నుంచి వాపస్ వచ్చి గ్రామాలలో ఉన్న వారిని లబ్ధిదారులుగా పరిగణించాలి. రేషన్ కార్డు లేదనే సాకుతో సంక్షేమ పథకాలకు వారిని దూరం చేయొద్దు. 

సీఎం ను కలిసిన గల్ఫ్ ఎన్నారైలు

కాంగ్రెస్ పార్టీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ టీపీసీసీ ఎన్నారై విభాగం ప్రతినిధులు, గల్ఫ్ సంఘాల నాయకులు మార్చి 2న సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చేనందుకు జీవో విడుదల గురించి కసరత్తు చేయాలని సీఎం కార్యదర్శి షానవాజ్ ఖాసీంను రేవంత్ రెడ్డి వెంటనే ఆదేశించారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు, ఎన్నారైల సంక్షేమ బోర్డు, హెల్ప్ లైన్ ఏర్పాటు, గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు హామీల అమలుపై దృష్టి పెట్టాలని చేయాలని వారు కోరారు. దుబాయి పర్యటనకు రావాలని ఆహ్వానించారు. 

 

ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి నేతృత్వంలో టిపిసిసి ఎన్నారై సెల్ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్, గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, టిపిసిసి ఎన్నారై సెల్ ఇంటర్నేషనల్ కన్వీనర్ మంద భీంరెడ్డి, ఓమాన్ లోని ఇండియన్ సోషల్ క్లబ్ తెలంగాణ విభాగం అధ్యక్షులు గుండేటి గణేష్, నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్ పర్సన్ సిస్టర్ లిసీ జోసెఫ్ లు గల్ఫ్ సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మెడిపెల్లి సత్యం, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి లు ఆ బృందంలో ఉన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

నామినేషన్ల కేంద్రాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్ బి. సత్యప్రసాద్

నామినేషన్ల కేంద్రాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలి:  కలెక్టర్ బి. సత్యప్రసాద్ (అంకం భూమయ్య)  గొల్లపల్లి డిసెంబర్ 03 (ప్రజా మంటలు):  గ్రామ పంచాయతీ మూడవ విడత ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 3 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా బుధవారం గొల్లపెల్లి మండల కేంద్రం తొ పాటు చిల్వకోడూర్, తిరుమలాపూర్ గ్రామంలో  పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ తీరును...
Read More...
Local News 

గొల్లపల్లి సర్పంచ్ అభ్యర్థి గా  నామినేషన్ దాఖలు చేసిన నల్ల నీరజ _సతీశ్ రెడ్డి 

గొల్లపల్లి సర్పంచ్ అభ్యర్థి గా  నామినేషన్ దాఖలు చేసిన  నల్ల నీరజ _సతీశ్ రెడ్డి  (అంకం భూమయ్య) గొల్లపల్లి డిసెంబర్  03, (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండల కేంద్రంలో  సర్పంచ్ అభ్యర్థిగా నల్ల నీరజ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు  అనంతరం ఆమె మాట్లాడుతూ   నన్ను గెలిపిస్తే ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తా అని  స్థానికంగా తాను ప్రజల్లోనే ఉంటూ గ్రామ యువత సమక్షంలో
Read More...
National  State News 

నిబంధనలు పాటించని స్లీపర్ బస్సుల నిలిపివేయండి NHRC ఆదేశాలు

నిబంధనలు పాటించని స్లీపర్ బస్సుల నిలిపివేయండి NHRC ఆదేశాలు ప్రైవేటు స్లీపర్ బస్సులకు గట్టి దెబ్బ — అన్ని రాష్ట్రాలకు NHRC కీలక ఆదేశాలు ఇంటర్నెట్ డెస్క్, డిసెంబర్ 03 (ప్రజా మంటలు): దేశవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర భయాందోళన సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు స్లీపర్ బస్సుల్లో చోటుచేసుకుంటున్న ఘోర ప్రమాదాలు అనేక కుటుంబాలను దుఃఖంలో ముంచాయి. ఈ నేపథ్యంలో జాతీయ...
Read More...
Crime  State News 

చాంద్రాయణగుట్టలో రెండు మృతదేహాలు కలకలం — డ్రగ్స్ అధిక మోతాదే కారణమా?

చాంద్రాయణగుట్టలో రెండు మృతదేహాలు కలకలం — డ్రగ్స్ అధిక మోతాదే కారణమా? హైదరాబాద్, డిసెంబర్ 03 (ప్రజా మంటలు): నగరంలోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం హడలెత్తించింది. రోమన్ హోటల్ ఎదుట నిలిపివున్న ఓ ఆటోలో ఇద్దరి మృతదేహాలు కనిపించడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించగా, మృతులను జహంగీర్ (24), **ఇర్ఫాన్ (25)**గా గుర్తించారు....
Read More...
Local News  State News 

నిజాయితీకి నిదర్శనం: రోడ్డుపై దొరికిన రూ.400ను పోలీసులకు అప్పగించిన ఇద్దరు విద్యార్థులు

నిజాయితీకి నిదర్శనం: రోడ్డుపై దొరికిన రూ.400ను పోలీసులకు అప్పగించిన ఇద్దరు విద్యార్థులు హన్మకొండ, డిసెంబర్ 03 (ప్రజా మంటలు): హన్మకొండ నగరంలోని పెగడపల్లి డబ్బాలు జంక్షన్ వద్ద ఇద్దరు చిన్నారులు చూపించిన నిజాయితీ ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. ఏకశిల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు పూజిత మరియు లిథివిక్ తమ బడికి వెళ్లే మార్గంలో రహదారిపై పడిఉన్న రూ.400 నగదు కనిపించడంతో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడే...
Read More...

ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై సంజయ్ సావంత్ మృతి

ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై సంజయ్ సావంత్ మృతి హైదరాబాద్, డిసెంబర్ 03 (ప్రజా మంటలు): రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో విషాదం నెలకొంది. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై సంజయ్ సావంత్ (58) సోమవారం ఉదయం అనూహ్యంగా మృతి చెందారు. ఉదయం తన పనిఘంటలు ప్రారంభించకముందు మంచం మీద అపస్మారక స్థితిలో పడి ఉన్నట్టు స్టేషన్ సిబ్బంది గమనించారు. వెంటనే సహచర పోలీసులు...
Read More...
National  Comment 

"చల్ ఉరుకుండ్రి..! వాస్తవ కథనం

అల్లే రమేష్.సిరిసిల్ల  :సెల్: 9030391963.               కుర్చిలకుసోనిబాపు సోచైస్తుండు.ఇంతాజేసిన వంగుతలేరు.ఎంత మర్శిపోధమన్నా కోడి కండ్ల ముందే మెదులుతుంది.బాపు గిట్ల జేస్తుండేదని కిందోల్లంతా మాడుపు మొకాం పెట్టుకున్నారు. ఎన్నిజేయల్నో అన్ని జేసిన ఇగ ఇప్పుడు ఏం జేయలే...అసలే ముంగిట  పెద్దుర్ల్ల జాతరలు ఉ ఉన్నాయీ బాపు మనుసుల లేదు.ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి.ఇంతట్ల చేయికింది ఉత్తయ్యి ఉరుకుంటొచ్చిండు. బాపు                   మునుపటి...
Read More...
Local News 

వంగర పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ వార్షిక తనిఖీలు

వంగర పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ వార్షిక తనిఖీలు స్వాగతం పలికిన ఎస్సై దివ్య
Read More...
Local News 

పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి : ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి 

పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి : ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి  (అంకం భూమయ్య)    గొల్లపల్లి డిసెంబర్   02 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలంలో మూడో విడత  జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు మండల ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి  పిలుపునిచ్చారు. ఎన్నికల నేపథ్యంలో మండలంలోని ప్రజలకు పలు సూచనలు జారీ చేసారు. స్వేచ్ఛా, నిష్పక్షపాత ఎన్నికలు జరగాలంటే ప్రతి ఓటరు...
Read More...

గ్రామ పంచాయతీ ఎన్నికలు సమర్దవంతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్_ 7 మండలాల్లోని 144 గ్రామాలు, 1276 వార్డులకు రెండవ విడత నామినేషన్ల స్వీకరణ  నేటితో ముగింపు

గ్రామ పంచాయతీ ఎన్నికలు సమర్దవంతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్_  7 మండలాల్లోని 144 గ్రామాలు, 1276 వార్డులకు రెండవ విడత నామినేషన్ల స్వీకరణ  నేటితో ముగింపు రాయికల్ డిసెంబర్ 2 (ప్రజా మంటలు)-నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్     .  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రిజర్వేషన్ల వివరాలు నోటీస్ బోర్డుపై సక్రమంగా ప్రదర్శించబడ్డాయా అనే  విషయాన్ని జిల్లా కలెక్టర్  పరిశీలించారు. ప్రస్తుతం వరకు ఎన్ని నామినేషన్లు స్వీకరించబడ్డాయి, అలాగే నామినేషన్ల...
Read More...

కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు  ఆర్థిక సహాయం అందజేసి దాతృత్వం చాటుకున్న చాంబర్ ఆఫ్ కామర్స్ జగిత్యాల హోల్ సేల్ అండ్ కిరాణా వర్తక సంఘం

కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు  ఆర్థిక సహాయం అందజేసి దాతృత్వం చాటుకున్న చాంబర్ ఆఫ్ కామర్స్ జగిత్యాల హోల్ సేల్ అండ్ కిరాణా వర్తక సంఘం కొండగట్టు డిసెంబర్ 2 ( ప్రజా మంటలు)    ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వాహకులు మాట్లాడుతూ ఇలాంటి దురదృష్టకర సంఘటన బాధాకరమైన విషయమని మాకు చేతనైన సహాయాన్ని అందజేస్తున్నామని మేము అందజేసిన నగదు ద్వారా మళ్లీ చిరు వ్యాపారాన్ని కొనసాగించుకొని వారి జీవితాలను ముందుకు సాగించుకునే ప్రక్రియ కు తోడ్పడాలని కోరుకుంటూ ప్రజలంతా ఆన్లైన్ వ్యాపారాలను ప్రోత్సహించకుండా...
Read More...

రెడ్కో ఉమ్మడి జిల్లా మేనేజర్ గా దురిశెట్టి మనోహర్ నియామకం

రెడ్కో ఉమ్మడి జిల్లా మేనేజర్ గా దురిశెట్టి మనోహర్ నియామకం    మెట్ పెల్లి డిసెంబర్ 2(ప్రజా మంటలు)(సౌడాల కమలాకర్) రెడ్ కో జిల్లా మేనేజర్ గా దురిశెట్టి మనోహర్ ను ప్రభుత్వం నియమించింది. కాగా  ఈ పదవిలో అతను ఏడాదికాలం పాటు కొనసాగుతారు. విద్యుత్ సంస్థలో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించిన అనుభవం, వినియోగదారులు, రైతులతో విస్తృత పరిచయాలు ఉండటం వల్ల హరిత ఇంధన ఉత్పత్తి...
Read More...