ఇప్పుడు 'గల్ఫ్' ఎటువైపు - 'గల్ఫ్' పై కాంగ్రెస్ ఆశలు ఇప్పటికైనా తమ అవసరాలను గుర్తించాలని కార్మికుల కోరిక

On
ఇప్పుడు 'గల్ఫ్' ఎటువైపు - 'గల్ఫ్' పై కాంగ్రెస్ ఆశలు ఇప్పటికైనా తమ అవసరాలను గుర్తించాలని కార్మికుల కోరిక

ఇప్పుడు 'గల్ఫ్' ఎటువైపు - 'గల్ఫ్' పై కాంగ్రెస్ ఆశలు
ఇప్పటికైనా తమ అవసరాలను గుర్తించాలని కార్మికుల కోరిక

 హైదరాబాద్ మార్చ్ 28 (ప్రత్యేక ప్రతినిధి) :

రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో గల్ఫ్ కార్మికుల కుటుంబాల ఓటు బ్యాంకు ప్రభావం ఎలా ఉండబోతుంది అనే అంశంపై ఇటీవల ఒక ప్రాథమిక పరిశీలన జరిగింది. గతంలో రాజకీయ వ్యూహకర్తలు ప్రశాంత్ కిశోర్, సునీల్ కొనుగోలు టీములు, వివిధ సర్వే సంస్థలు చేసిన విశ్లేషణలను కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది.

తెలంగాణ లోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్, వరంగల్, హైదరాబాద్ ఎనిమిది లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని  'గల్ఫ్ మైగ్రేషన్ కారిడార్' నుంచి ప్రస్తుతం ఎంత మంది గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారు, విదేశీ మారక ద్రవ్యం ఎంత పంపించారు, గత పదేళ్లలో ఎంత మంది గల్ఫ్ నుంచి వాపస్ వచ్చారు, వారి పునరావాసం ఎలా ఉన్నది, గల్ఫ్ కార్మికుల ప్రధాన సమస్యలు ఏం ఉన్నాయి, రేషన్ కార్డులలో, ఓటర్ లిస్ట్ లో గల్ఫ్ కార్మికుల పేర్లు ఏ మేరకు తొలగించారు, గల్ఫ్ నుంచి వాపస్ వచ్చిన వారు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లాంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మేరకు చురుకుగా పాల్గొన్నారు, ఎంతమంది గెలుపొందారు, వారి రాజకీయ చైతన్యం ఏ మేరకు ఉన్నది అనే విషయాలను పరిశీలించడం జరిగింది.

2023 డిసెంబర్ 7న తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీలలో కొంతవరకు నెరవేర్చింది. గల్ఫ్ దేశాలలో మృతిచెందిన వలస కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపును ఇటీవల వేములవాడలో ప్రారంభించింది. రాష్ట్రంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ (బీఆర్ఎస్), కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి చెప్పుకోదగ్గ సంక్షేమ కార్యక్రమాలు ఏవీ చేపట్టలేదు. దేశానికి అత్యధిక విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయి. కేరళ, పంజాబ్ లాంటి రాష్ట్రాల కంటే మెరుగైన ఎన్నారై పాలసీ (ప్రవాసి విధానం) తెస్తామన్న కేసీఆర్, కేటీఆర్ ల హామీలు అటకెక్కాయి. విదేశీ పెట్టుబడులు, ఎన్నారైల పెట్టుబడులపై ఉన్న ప్రేమ ప్రవాసి కార్మికులపై లేదు. గల్ఫ్ నుంచి వాపస్ వచ్చిన వారిని ఆదుకోవడానికి కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎలాంటి పునరావాస కార్యక్రమాలు చేపట్టలేదు.

ప్రధాని మోదీకి గల్ఫ్ కార్మికులు రాసిన బహిరంగ లేఖ

ఇటీవల జగిత్యాల పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి గల్ఫ్ కార్మికులకు సామాజిక భద్రత, సంక్షేమం, కేంద్ర ప్రభుత్వ పక్షాన సౌకర్యాల కల్పన, హక్కుల గురించి వలస కార్మిక నాయకులు బహిరంగ లేఖ రాశారు. గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్, 'గల్ఫ్ కాంగ్రెస్' అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, టిపిసిసి ఎన్నారై సెల్ ఇంటర్నేషనల్  కన్వీనర్  మంద భీంరెడ్డి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ నాయకులు సయిండ్ల రాజిరెడ్డి, ఎం. నాగభూషణంలు లేఖపై సంతకాలు చేశారు.  

గల్ఫ్ దేశాలలో 88 లక్షల మంది వలస కార్మికులు నివసిస్తున్నారని భారత ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. విదేశీ మారక ద్రవ్యాన్ని పొందే దేశాలలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నది. 2023లో 125 బిలియన్ యుఎస్ డాలర్ల (10 లక్షల 25 వేల కోట్ల రూపాయల) విలువైన విదేశీ మారకాన్ని భారతదేశం పొందింది. ఇది భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.4 శాతం. భారత్ పొందే విదేశీ మారకంలో సగానికి పైగా గల్ఫ్ దేశాల నుంచే లభిస్తున్నది. గమ్యస్థాన గల్ఫ్ దేశాల అభివృద్ధిలో పాలుపంచుకుంటూ భారతదేశానికి అత్యధిక విదేశీ మారక ద్రవ్యం పంపిస్తున్న ప్రవాస భారతీయ కార్మికుల సేవలను గుర్తించాలని మిమ్ములను కోరుతున్నాము.

గత పదేళ్లలో మీరు ప్రధాన మంత్రి హోదాలో సౌదీ అరేబియా, యూఏఈ, ఓమాన్, కువైట్, ఖతార్, బహరేన్ ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో పర్యటించారు. భారత్ - గల్ఫ్ దేశాల మధ్య మీరు చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలలో వ్యాపార వాణిజ్య ఒప్పందాలే ఎక్కువ. గల్ఫ్ వలస కార్మికుల సామాజిక భద్రత, సంక్షేమం గురించి పెద్దగా పట్టించుకోలేదు.

కరోనా సందర్బంగా వందే భారత్ ప్లయిట్స్, చార్టర్డ్ ప్లయిట్స్ లలో విదేశాల నుంచి భారత్ కు వచ్చిన మన పౌరుల నుంచి రెండింతలు, మూడింతలు విమాన చార్జీలు వసూలు చేయడం వలన పేద వలస కార్మికులు నష్టపోయారు. కరోనా సందర్బంగా హడావిడిగా వాపస్ వచ్చిన ప్రవాసి కార్మికులకు  గల్ఫ్ దేశాల కంపెనీ యాజమాన్యాల నుంచి రావలసిన ఉద్యోగ అనంతర ప్రయోజనాలు (ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్) పొందేందుకు న్యాయ సహాయాన్ని అందించండి.

భారత ప్రభుత్వం ఈ క్రింది విషయాలపై దృష్టి పెట్టాలని కోరుతున్నాము.
- ప్రవాసీ భారతీయ బీమా యోజన అనే రూ.10 లక్షల ప్రమాద బీమా పథకంలో సహజ మరణాన్ని చేర్చాలి. బీమా సౌకర్యం అందరికీ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచాలి.

-విదేశీ మారకద్రవ్యం పంపేవారికి బంగ్లాదేశ్ ప్రభుత్వం రెండున్నర శాతం ప్రోత్సాహకం ఇస్తున్నది. భారత ప్రభుత్వం కూడా ఈదిశగా ఆలోచించాలి.

-- హైదరాబాద్ లో సౌదీ అరేబియా, కువైట్ దేశాల కాన్సులేట్ లు (రాయబార కార్యాలయాలు) ఏర్పాటుకు భారత ప్రభుత్వం చొరవ చూపాలి. ఇటీవలనే యూఏఈ కాన్సులేట్ ను ఏర్పాటు చేశారు.

-- గల్ఫ్‌లోని భారతీయ వలస కార్మికులకు బీమా, పెన్షన్‌తో కూడిన సమగ్ర సామాజిక భద్రతా పథకాన్ని అమలు చేయాలి.

- వాపస్ వచ్చిన వలసదారుల కోసం పునరేకీకరణ, పునరావాసం పథకాన్ని రూపొందించండి.

- ఎమిగ్రేషన్ యాక్టు 1983 ని ఆధునికీకరించాలి. చాలా ఏళ్లుగా న్యూ ఎమిగ్రేషన్ బిల్ పెండింగ్ లో ఉన్నది.

-- ద్వైపాక్షిక కార్మిక ఒప్పందాలను క్రమం తప్పకుండా సమీక్షించడానికి గల్ఫ్ దేశాలతో సంయుక్త కమిటీలను ఏర్పాటు చేయాలి.

-- విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్లే వారందరికీ ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షణ (ప్రీ-డిపార్చర్ ఓరియంటేషన్ మరియు ట్రైనింగ్ - పీడీఓటి ని నిర్బంధంగా అమలు చేయాలి.

-      భారత దేశం నుంచి విదేశాలకు వెళ్లే ప్రతి పౌరుడి వివరాలను భారతీయ విమానాశ్రయాల్లో రిజిస్ట్రేషన్ చేయాలి. అలాగే  విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలి. 

- భారతదేశంలో చదువుకుంటున్న గల్ఫ్ కార్మికుల పిల్లలకు ఆయా విద్యా సంస్థలలో రిజర్వేషన్ కోటా అమలు చేయాలి.

- ప్రస్తుత ప్రభుత్వాలు అమలు చేస్తున్న సామాజిక సంక్షేమ పథకాలలో గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న కార్మికులు, గల్ఫ్ దేశాల నుంచి వాపస్ వచ్చి గ్రామాలలో ఉన్న వారిని లబ్ధిదారులుగా పరిగణించాలి. రేషన్ కార్డు లేదనే సాకుతో సంక్షేమ పథకాలకు వారిని దూరం చేయొద్దు. 

సీఎం ను కలిసిన గల్ఫ్ ఎన్నారైలు

కాంగ్రెస్ పార్టీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ టీపీసీసీ ఎన్నారై విభాగం ప్రతినిధులు, గల్ఫ్ సంఘాల నాయకులు మార్చి 2న సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చేనందుకు జీవో విడుదల గురించి కసరత్తు చేయాలని సీఎం కార్యదర్శి షానవాజ్ ఖాసీంను రేవంత్ రెడ్డి వెంటనే ఆదేశించారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు, ఎన్నారైల సంక్షేమ బోర్డు, హెల్ప్ లైన్ ఏర్పాటు, గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు హామీల అమలుపై దృష్టి పెట్టాలని చేయాలని వారు కోరారు. దుబాయి పర్యటనకు రావాలని ఆహ్వానించారు. 

 

ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి నేతృత్వంలో టిపిసిసి ఎన్నారై సెల్ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్, గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, టిపిసిసి ఎన్నారై సెల్ ఇంటర్నేషనల్ కన్వీనర్ మంద భీంరెడ్డి, ఓమాన్ లోని ఇండియన్ సోషల్ క్లబ్ తెలంగాణ విభాగం అధ్యక్షులు గుండేటి గణేష్, నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్ పర్సన్ సిస్టర్ లిసీ జోసెఫ్ లు గల్ఫ్ సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మెడిపెల్లి సత్యం, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి లు ఆ బృందంలో ఉన్నారు.

Tags
Join WhatsApp

More News...

State News 

దేవాదుల భూసేకరణకు జూన్ 2లోపు ₹600 కోట్లు –రేవంత్ రెడ్డి

దేవాదుల భూసేకరణకు జూన్ 2లోపు ₹600 కోట్లు –రేవంత్ రెడ్డి ములుగు జిల్లా (ప్రజా మంటలు):ములుగు జిల్లాలోని జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం (JCRDLIS)లో భాగంగా భూసేకరణ కోసం జూన్ 2వ తేదీలోపు ₹600 కోట్ల నిధులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి A. రేవంత్ రెడ్డి ప్రకటించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోపు అన్ని అంచనాలను ప్రభుత్వ ఆమోదానికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.  దేవాదుల పంప్...
Read More...
Local News 

మల్యాల వరద కాలువలో కారు పడి తిర్మణి రమణ మృతి – పెగడపల్లిలో విషాదం

మల్యాల వరద కాలువలో కారు పడి తిర్మణి రమణ మృతి – పెగడపల్లిలో విషాదం జగిత్యాల జిల్లా (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెగడపల్లి మండలం సుద్ధపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్ తిర్మణి రమణ మల్యాల వరద కాలువలో కారుతో సహా మృతిచెందిన స్థితిలో కనిపించారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు...
Read More...
Local News 

భీమ్‌రాజుపల్లి ఉపసర్పంచ్ భర్తను పరామర్శించిన మంత్రి సతీమణి కాంతా కుమారి

భీమ్‌రాజుపల్లి ఉపసర్పంచ్ భర్తను పరామర్శించిన మంత్రి సతీమణి కాంతా కుమారి గొల్లపల్లి, ఫిబ్రవరి 22 (ప్రజా మంటలు):గొల్లపల్లి మండలంలోని భీమ్‌రాజుపల్లి గ్రామ ఉపసర్పంచ్ బొమ్మెన రాజమ్మ భర్త బొమ్మన భీమయ్య అనారోగ్యానికి గురికావడంతో, విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి  కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా కాంతా కుమారి భీమయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆర్థిక సాయం అందించారు....
Read More...
Local News 

పీపుల్స్ యువసేన ఆధ్వర్యంలో సివిల్స్ అభ్యర్థికి ₹5,000 ఆర్థిక చేయూత

పీపుల్స్ యువసేన ఆధ్వర్యంలో సివిల్స్ అభ్యర్థికి ₹5,000 ఆర్థిక చేయూత గొల్లపల్లి, ఫిబ్రవరి 22 (ప్రజా మంటలు): ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన యువతి అజ్మీరా రాజేశ్వరి సివిల్స్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న సందర్భంగా పీపుల్స్ యువసేన ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ చదువు మరియు క్రీడలపై అపార ఆసక్తితో కృషి చేస్తున్న రాజేశ్వరి, హైదరాబాద్‌లోని Koti Women's College లో...
Read More...
State News 

అనాథపీలలకు ఆర్థిక సహాయం అందించిన సూరజ్ శివశంకర్

అనాథపీలలకు ఆర్థిక సహాయం అందించిన సూరజ్ శివశంకర్ జగిత్యాల, ఫిబ్రవరి 22 (ప్రజా మంటలు): అనారోగ్య కారణాలతో తల్లిదండ్రులు ఇద్దరూ మృతి చెందడంతో అనాధలైన పిల్లలకు రూ.12,000 ఆర్థిక సహాయం అందించి సామాజిక సేవకులు మానవత్వాన్ని చాటారు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక సేవకులు సూరజ్ శివ శంకర్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఈ సహాయాన్ని అందించారు. పెద్దపల్లి మండలం కొత్తపెళ్లి గ్రామానికి...
Read More...
Local News 

ఓసీ ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ కోసం ఫిబ్రవరి 23న ఢిల్లీలో మహా ధర్నా

ఓసీ ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ కోసం ఫిబ్రవరి 23న ఢిల్లీలో మహా ధర్నా జగిత్యాల ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు); నిరుపేద ఓసీ (ఓపెన్ కేటగిరీ) – ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) ప్రజల రాజ్యాంగ, చట్టబద్ధ హక్కుల పరిరక్షణ లక్ష్యంగా ఓసీ (ఎస్‌డబ్ల్యూఏఎఫ్) ఇతర కులాల సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య – ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మహా ధర్నా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ మహా...
Read More...
Local News 

నిరాశ్రయుల కోసం 295వ అన్నదాన కార్యక్రమం

నిరాశ్రయుల కోసం 295వ అన్నదాన కార్యక్రమం సికింద్రాబాద్,  ఫిబ్రవరి 22 (ప్రజా మంటలు):  హైదరాబాద్ నగరంలో నిరాశ్రయులు, అనాథలు, సంచారజాతుల కోసం ఆదివారం 295వ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతినెల రెండవ, నాల్గవ ఆదివారాల్లో జరిగే ఈ సేవా కార్యక్రమంలో భాగంగా నగరంలోని పలు రహదారులపై అవసరమైన వారికి ఆహారం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో స్కై ఫౌండేషన్ ఫౌండర్ & ప్రెసిడెంట్ డా....
Read More...
Local News  State News 

వాట్సాప్ నంబర్ 8712441912 - సత్వర విద్యుత్ సేవలకు వాట్సాప్ చాట్ బాట్

వాట్సాప్ నంబర్ 8712441912 - సత్వర విద్యుత్ సేవలకు వాట్సాప్ చాట్ బాట్ (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  హైదరాబాద్, 22 ఫిబ్రవరి (ప్రజా మంటలు) : దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) తన వినియోగదారులకు మరింత సమర్థవంతమైన, సులభమైన సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ఈ దిశగా వినియోగదారులు విద్యుత్ సేవలను నేరుగా తమ మొబైల్ ఫోన్ ద్వారానే పొందేలా...
Read More...
National  International   Economy  

ట్రంప్ గ్లోబల్ టారిఫ్ 15%: భారత్‌పై ఎలాంటి ప్రభావం ఎంత?

ట్రంప్ గ్లోబల్ టారిఫ్ 15%: భారత్‌పై ఎలాంటి ప్రభావం ఎంత? ట్రంప్ మళ్ళీ 10 నుండి 15% సుంకాల పెంపు ప్రభావం - ఒక విశ్లేషణ  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన గ్లోబల్ టారిఫ్ పెంపు నిర్ణయం భారత్‌కు గణనీయమైన ఆర్థిక ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. శనివారం (ఫిబ్రవరి 21, 2026) ట్రంప్ మాట్లాడుతూ, ప్రపంచ దేశాలపై విధించదలచుకున్న టారిఫ్‌ను...
Read More...
Local News  State News 

హీలింగ్ క్యాపిటల్ గా హైదరాబాద్. - రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.

హీలింగ్ క్యాపిటల్ గా హైదరాబాద్. - రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  ఫార్మా రాజధానిగా అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న హైదరాబాద్ ను హీలింగ్ క్యాపిటల్ గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా, అవకాశాలను అందిపుచ్చుకునేలా హెల్త్ కేర్...
Read More...
Local News 

తెలంగాణ మాజీ మంత్రి టి. హరీష్ రావు సమక్షంలో భారతదేశంలో రూఫ్‌టాప్ సోలార్ వినియోగాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు 'RENGY' యాప్ ప్రారంభం

తెలంగాణ మాజీ మంత్రి టి. హరీష్ రావు సమక్షంలో భారతదేశంలో రూఫ్‌టాప్ సోలార్ వినియోగాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు 'RENGY' యాప్ ప్రారంభం (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). హైదరాబాద్ 21 ఫిబ్రవరి (ప్రజా మంటలు) :  నివాస గృహాల ఇంధన అవసరాల కోసం డిజిటల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందిస్తున్న క్లీన్-టెక్ ఎనర్జీ సంస్థ 'రెంజి’ (Rengy) ప్రైవేట్ లిమిటెడ్'. నేడు (21 ఫిబ్రవరి 2026) తన ప్రతిష్టాత్మక RENGY యాప్‌ను ప్రారంభించింది తెలంగాణ మాజీ మంత్రి...
Read More...
Local News 

సీనియర్ సిటిజెన్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు — జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్

సీనియర్ సిటిజెన్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు — జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్    జగిత్యాల, ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు):సీనియర్ సిటిజెన్ల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాలలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీనియర్ సిటిజెన్స్, పెన్షనర్స్ సంఘాల ప్రతినిధులు—జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో—ఎమ్మెల్యేను కలిసి...
Read More...