ఇప్పుడు 'గల్ఫ్' ఎటువైపు - 'గల్ఫ్' పై కాంగ్రెస్ ఆశలు ఇప్పటికైనా తమ అవసరాలను గుర్తించాలని కార్మికుల కోరిక
ఇప్పుడు 'గల్ఫ్' ఎటువైపు - 'గల్ఫ్' పై కాంగ్రెస్ ఆశలు
ఇప్పటికైనా తమ అవసరాలను గుర్తించాలని కార్మికుల కోరిక
హైదరాబాద్ మార్చ్ 28 (ప్రత్యేక ప్రతినిధి) :
రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో గల్ఫ్ కార్మికుల కుటుంబాల ఓటు బ్యాంకు ప్రభావం ఎలా ఉండబోతుంది అనే అంశంపై ఇటీవల ఒక ప్రాథమిక పరిశీలన జరిగింది. గతంలో రాజకీయ వ్యూహకర్తలు ప్రశాంత్ కిశోర్, సునీల్ కొనుగోలు టీములు, వివిధ సర్వే సంస్థలు చేసిన విశ్లేషణలను కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది.
తెలంగాణ లోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్, వరంగల్, హైదరాబాద్ ఎనిమిది లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని 'గల్ఫ్ మైగ్రేషన్ కారిడార్' నుంచి ప్రస్తుతం ఎంత మంది గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారు, విదేశీ మారక ద్రవ్యం ఎంత పంపించారు, గత పదేళ్లలో ఎంత మంది గల్ఫ్ నుంచి వాపస్ వచ్చారు, వారి పునరావాసం ఎలా ఉన్నది, గల్ఫ్ కార్మికుల ప్రధాన సమస్యలు ఏం ఉన్నాయి, రేషన్ కార్డులలో, ఓటర్ లిస్ట్ లో గల్ఫ్ కార్మికుల పేర్లు ఏ మేరకు తొలగించారు, గల్ఫ్ నుంచి వాపస్ వచ్చిన వారు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లాంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మేరకు చురుకుగా పాల్గొన్నారు, ఎంతమంది గెలుపొందారు, వారి రాజకీయ చైతన్యం ఏ మేరకు ఉన్నది అనే విషయాలను పరిశీలించడం జరిగింది.
2023 డిసెంబర్ 7న తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీలలో కొంతవరకు నెరవేర్చింది. గల్ఫ్ దేశాలలో మృతిచెందిన వలస కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపును ఇటీవల వేములవాడలో ప్రారంభించింది. రాష్ట్రంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ (బీఆర్ఎస్), కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి చెప్పుకోదగ్గ సంక్షేమ కార్యక్రమాలు ఏవీ చేపట్టలేదు. దేశానికి అత్యధిక విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయి. కేరళ, పంజాబ్ లాంటి రాష్ట్రాల కంటే మెరుగైన ఎన్నారై పాలసీ (ప్రవాసి విధానం) తెస్తామన్న కేసీఆర్, కేటీఆర్ ల హామీలు అటకెక్కాయి. విదేశీ పెట్టుబడులు, ఎన్నారైల పెట్టుబడులపై ఉన్న ప్రేమ ప్రవాసి కార్మికులపై లేదు. గల్ఫ్ నుంచి వాపస్ వచ్చిన వారిని ఆదుకోవడానికి కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎలాంటి పునరావాస కార్యక్రమాలు చేపట్టలేదు.
ప్రధాని మోదీకి గల్ఫ్ కార్మికులు రాసిన బహిరంగ లేఖ
ఇటీవల జగిత్యాల పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి గల్ఫ్ కార్మికులకు సామాజిక భద్రత, సంక్షేమం, కేంద్ర ప్రభుత్వ పక్షాన సౌకర్యాల కల్పన, హక్కుల గురించి వలస కార్మిక నాయకులు బహిరంగ లేఖ రాశారు. గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్, 'గల్ఫ్ కాంగ్రెస్' అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, టిపిసిసి ఎన్నారై సెల్ ఇంటర్నేషనల్ కన్వీనర్ మంద భీంరెడ్డి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ నాయకులు సయిండ్ల రాజిరెడ్డి, ఎం. నాగభూషణంలు లేఖపై సంతకాలు చేశారు.
గల్ఫ్ దేశాలలో 88 లక్షల మంది వలస కార్మికులు నివసిస్తున్నారని భారత ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. విదేశీ మారక ద్రవ్యాన్ని పొందే దేశాలలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నది. 2023లో 125 బిలియన్ యుఎస్ డాలర్ల (10 లక్షల 25 వేల కోట్ల రూపాయల) విలువైన విదేశీ మారకాన్ని భారతదేశం పొందింది. ఇది భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.4 శాతం. భారత్ పొందే విదేశీ మారకంలో సగానికి పైగా గల్ఫ్ దేశాల నుంచే లభిస్తున్నది. గమ్యస్థాన గల్ఫ్ దేశాల అభివృద్ధిలో పాలుపంచుకుంటూ భారతదేశానికి అత్యధిక విదేశీ మారక ద్రవ్యం పంపిస్తున్న ప్రవాస భారతీయ కార్మికుల సేవలను గుర్తించాలని మిమ్ములను కోరుతున్నాము.
గత పదేళ్లలో మీరు ప్రధాన మంత్రి హోదాలో సౌదీ అరేబియా, యూఏఈ, ఓమాన్, కువైట్, ఖతార్, బహరేన్ ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో పర్యటించారు. భారత్ - గల్ఫ్ దేశాల మధ్య మీరు చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలలో వ్యాపార వాణిజ్య ఒప్పందాలే ఎక్కువ. గల్ఫ్ వలస కార్మికుల సామాజిక భద్రత, సంక్షేమం గురించి పెద్దగా పట్టించుకోలేదు.
కరోనా సందర్బంగా వందే భారత్ ప్లయిట్స్, చార్టర్డ్ ప్లయిట్స్ లలో విదేశాల నుంచి భారత్ కు వచ్చిన మన పౌరుల నుంచి రెండింతలు, మూడింతలు విమాన చార్జీలు వసూలు చేయడం వలన పేద వలస కార్మికులు నష్టపోయారు. కరోనా సందర్బంగా హడావిడిగా వాపస్ వచ్చిన ప్రవాసి కార్మికులకు గల్ఫ్ దేశాల కంపెనీ యాజమాన్యాల నుంచి రావలసిన ఉద్యోగ అనంతర ప్రయోజనాలు (ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్) పొందేందుకు న్యాయ సహాయాన్ని అందించండి.
భారత ప్రభుత్వం ఈ క్రింది విషయాలపై దృష్టి పెట్టాలని కోరుతున్నాము.
- ప్రవాసీ భారతీయ బీమా యోజన అనే రూ.10 లక్షల ప్రమాద బీమా పథకంలో సహజ మరణాన్ని చేర్చాలి. బీమా సౌకర్యం అందరికీ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచాలి.
-విదేశీ మారకద్రవ్యం పంపేవారికి బంగ్లాదేశ్ ప్రభుత్వం రెండున్నర శాతం ప్రోత్సాహకం ఇస్తున్నది. భారత ప్రభుత్వం కూడా ఈదిశగా ఆలోచించాలి.
-- హైదరాబాద్ లో సౌదీ అరేబియా, కువైట్ దేశాల కాన్సులేట్ లు (రాయబార కార్యాలయాలు) ఏర్పాటుకు భారత ప్రభుత్వం చొరవ చూపాలి. ఇటీవలనే యూఏఈ కాన్సులేట్ ను ఏర్పాటు చేశారు.
-- గల్ఫ్లోని భారతీయ వలస కార్మికులకు బీమా, పెన్షన్తో కూడిన సమగ్ర సామాజిక భద్రతా పథకాన్ని అమలు చేయాలి.
- వాపస్ వచ్చిన వలసదారుల కోసం పునరేకీకరణ, పునరావాసం పథకాన్ని రూపొందించండి.
- ఎమిగ్రేషన్ యాక్టు 1983 ని ఆధునికీకరించాలి. చాలా ఏళ్లుగా న్యూ ఎమిగ్రేషన్ బిల్ పెండింగ్ లో ఉన్నది.
-- ద్వైపాక్షిక కార్మిక ఒప్పందాలను క్రమం తప్పకుండా సమీక్షించడానికి గల్ఫ్ దేశాలతో సంయుక్త కమిటీలను ఏర్పాటు చేయాలి.
-- విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్లే వారందరికీ ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షణ (ప్రీ-డిపార్చర్ ఓరియంటేషన్ మరియు ట్రైనింగ్ - పీడీఓటి ని నిర్బంధంగా అమలు చేయాలి.
- భారత దేశం నుంచి విదేశాలకు వెళ్లే ప్రతి పౌరుడి వివరాలను భారతీయ విమానాశ్రయాల్లో రిజిస్ట్రేషన్ చేయాలి. అలాగే విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలి.
- భారతదేశంలో చదువుకుంటున్న గల్ఫ్ కార్మికుల పిల్లలకు ఆయా విద్యా సంస్థలలో రిజర్వేషన్ కోటా అమలు చేయాలి.
- ప్రస్తుత ప్రభుత్వాలు అమలు చేస్తున్న సామాజిక సంక్షేమ పథకాలలో గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న కార్మికులు, గల్ఫ్ దేశాల నుంచి వాపస్ వచ్చి గ్రామాలలో ఉన్న వారిని లబ్ధిదారులుగా పరిగణించాలి. రేషన్ కార్డు లేదనే సాకుతో సంక్షేమ పథకాలకు వారిని దూరం చేయొద్దు.
సీఎం ను కలిసిన గల్ఫ్ ఎన్నారైలు
కాంగ్రెస్ పార్టీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ టీపీసీసీ ఎన్నారై విభాగం ప్రతినిధులు, గల్ఫ్ సంఘాల నాయకులు మార్చి 2న సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చేనందుకు జీవో విడుదల గురించి కసరత్తు చేయాలని సీఎం కార్యదర్శి షానవాజ్ ఖాసీంను రేవంత్ రెడ్డి వెంటనే ఆదేశించారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు, ఎన్నారైల సంక్షేమ బోర్డు, హెల్ప్ లైన్ ఏర్పాటు, గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు హామీల అమలుపై దృష్టి పెట్టాలని చేయాలని వారు కోరారు. దుబాయి పర్యటనకు రావాలని ఆహ్వానించారు.
ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి నేతృత్వంలో టిపిసిసి ఎన్నారై సెల్ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్, గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, టిపిసిసి ఎన్నారై సెల్ ఇంటర్నేషనల్ కన్వీనర్ మంద భీంరెడ్డి, ఓమాన్ లోని ఇండియన్ సోషల్ క్లబ్ తెలంగాణ విభాగం అధ్యక్షులు గుండేటి గణేష్, నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్ పర్సన్ సిస్టర్ లిసీ జోసెఫ్ లు గల్ఫ్ సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మెడిపెల్లి సత్యం, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి లు ఆ బృందంలో ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన
హైదరాబాద్, ఆగస్టు 24 (ప్రజా మంటలు): తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు వెల్లడించారు. బ్రిటన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్కు తిరిగి వచ్చిన సీఎం సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో... గురుకులాలు, ఫీజు రీయింబర్స్మెంట్పై ప్రభుత్వం నిర్లక్ష్యం- కొప్పుల
జగిత్యాల, ఆగస్టు 24 (ప్రజా మంటలు):
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన విద్యా అవకాశాలను ప్రస్తుత ప్రభుత్వం దెబ్బతీస్తోందని విమర్శించారు. సోమవారం... బైపాస్ రోడ్డుపై బయోమెడికల్ వ్యర్థాలు.. మున్సిపల్ హెచ్చరిక బోర్డు కళ్లముందే నిర్లక్ష్యం
జగిత్యాల, ఆగస్టు 24 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలో హాస్పిటల్ వ్యర్థాల నిర్వహణపై నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. బైపాస్ రోడ్డులోని మోతె డౌన్ చౌరస్తా వద్ద కెనాల్పై ‘బయో హజార్డ్’, ‘ఇన్ఫెక్షియస్’ అని ముద్రించిన హాస్పిటల్ వ్యర్థాలను గుర్తుతెలియని వ్యక్తులు పడేసి వెళ్లారు.
ఈ ప్రాంతంలో చెత్త వేస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని... నేటి అర్ధరాత్రి నుండి ఆటోల బంద్ _ప్రజలు సహకరించాలి
జగిత్యాల ఆగస్ట్ 23 (ప్రజా మంటలు)
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 9348422113
నేటి అర్ధరాత్రి నుండి జగిత్యాల జిల్లా స్థాయిలో రాష్ట్ర పిలుపుమేరకు ఆటోలు బంద్ నిర్వహిస్తున్నట్లు ఆటో డ్రైవర్లు తెలిపారు. విధి లేని పరిస్థితుల్లోనే తాము బందుకు శ్రీకారం చుట్టామని ప్రజలు తమ పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో... మహిళా ఉద్యోగి ఆరోపణలన్నీ ఆవాస్తవం - ది మనోహార్ హోటల్ చైర్మన్ డీవీ మనోహర్ వెల్లడి..
సికింద్రాబాద్,ఆగస్ట్ 22 (ప్రజామంటలు):
తమ సంస్థలో ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కమ్ గెస్ట్ రిలేషన్స్ మేనేజర్గా పనిచేసిన కొరపు లావణ్య చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమని, తీవ్ర నిరాధారమైనవని హోటల్ 'ది మనోహర్' చైర్మన్ డీవీ మనోహర్ స్పష్టం చేశారు. శనివారం బేగంపేటలోని హోటల్ 'ది మనోహర్'లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లావణ్య... యాదవులను కురుమ కులంలో కలపవద్దు
సికింద్రాబాద్,ఆగస్ట్ 22 (ప్రజామంటలు):
యాదవ సామాజిక వర్గాన్ని కురుమ కులంలో కలపడానికి కుట్రలు జరుగుతున్నాయని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం, కురుమ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్, సభ్యులు ఆర్. జయప్రకాష్, టి. సుదర్శన్లను కలిసి... జర్నలిస్టులపై ఇక అక్రమ కేసులు చెల్లవా? వైరల్ మెసేజ్లో నిజమెంత?
న్యూఢిల్లీ, ఆగస్టు 22 (ప్రజా మంటలు):
దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చిందంటూ సోషల్ మీడియా, వాట్సాప్లో వైరల్ అవుతున్న ఓ సందేశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. “పెన్నుతో వార్తలు రాసే జర్నలిస్టులు, వీడియో కెమెరాలతో వార్తలను కవర్ చేసే రిపోర్టర్లు, శాటిలైట్ న్యూస్ చానళ్లు, యూట్యూబ్ న్యూస్ ఛానళ్లు, ప్రింట్ మీడియా సంస్థల్లో పనిచేసే... ఘనంగా కుంకుమార్చనలు, విశేష సంఖ్యలో పాల్గొన్న మహిళలు
జగిత్యాల ఆగస్టు 21 (ప్రజా మంటలు)పవిత్ర శ్రావణమాసాన్ని పురస్కరించుకొని శ్రీ వరలక్ష్మి వ్రతం సందర్భంగా జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం నంబి వేణుగోపాల ఆచార్య ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు.
భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పూజా ద్రవ్యాలు ఆలయం పక్షాన అందజేశారు .
కార్యక్రమం అనంతరం తీర్థ... అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు - మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
రూ.32 కోట్లతో నూకలపల్లి 2బీహెచ్కే కాలనీకి మౌలిక వసతుల కల్పన
రేషన్ దుకాణం, బస్సు సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్కు మంత్రి ఆదేశాలు
భూ రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
- ఏడాదిన్నరలో రీ - సర్వే పూర్తి
ధర్మపురికి రెవెన్యూ డివిజన్, సబ్రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయాలి
- మంత్రి అడ్లూరి... ఎల్కతుర్తిలో కారులో అనుమానాస్పద మృతదేహం కలకలం
ఎల్కతుర్తి, ఆగస్టు 21 (ప్రజా మంటలు): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని 12వ వార్డులో కారులో అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. రెండు రోజులుగా రోడ్డుపక్కన పార్క్ చేసి ఉన్న కారులో నుంచి శుక్రవారం దుర్వాసన రావడంతో బాటసారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఎల్కతుర్తి పోలీసులు... వేములవాడలో ఫోక్ సాంగ్ ఆర్టిస్ట్పై భార్య ఫిర్యాదు
వేములవాడ, ఆగస్టు 20 (ప్రజా మంటలు):
వేములవాడలోని రెడ్డి భవన్లో తన భర్త ఈశ్వర్ సాయిని మాధురి రాథోడ్తో ఒకే గదిలో గుర్తించానని ఆరోపిస్తూ ఆయన భార్య శరణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. శరణ్య ఫిర్యాదు మేరకు వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
ఫోక్ సాంగ్స్లో నటించిన ఈశ్వర్ సాయి,... 2 వేల మంది అన్ఫిట్ దరఖాస్తుదారులకు న్యాయం చేయాలి: కవిత
హైదరాబాద్, ఆగస్టు 19 (ప్రజా మంటలు):
సింగరేణిలో అన్ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు 2 వేల మంది కార్మికులను మెడికల్ బోర్డు ద్వారా అన్ఫిట్ చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పెండింగ్ దరఖాస్తులన్నీ పరిష్కారమయ్యే వరకు ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహించాలని కోరారు.
హెచ్ఎంఎస్ జనరల్... 