ఇప్పుడు 'గల్ఫ్' ఎటువైపు - 'గల్ఫ్' పై కాంగ్రెస్ ఆశలు ఇప్పటికైనా తమ అవసరాలను గుర్తించాలని కార్మికుల కోరిక

On
ఇప్పుడు 'గల్ఫ్' ఎటువైపు - 'గల్ఫ్' పై కాంగ్రెస్ ఆశలు ఇప్పటికైనా తమ అవసరాలను గుర్తించాలని కార్మికుల కోరిక

ఇప్పుడు 'గల్ఫ్' ఎటువైపు - 'గల్ఫ్' పై కాంగ్రెస్ ఆశలు
ఇప్పటికైనా తమ అవసరాలను గుర్తించాలని కార్మికుల కోరిక

 హైదరాబాద్ మార్చ్ 28 (ప్రత్యేక ప్రతినిధి) :

రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో గల్ఫ్ కార్మికుల కుటుంబాల ఓటు బ్యాంకు ప్రభావం ఎలా ఉండబోతుంది అనే అంశంపై ఇటీవల ఒక ప్రాథమిక పరిశీలన జరిగింది. గతంలో రాజకీయ వ్యూహకర్తలు ప్రశాంత్ కిశోర్, సునీల్ కొనుగోలు టీములు, వివిధ సర్వే సంస్థలు చేసిన విశ్లేషణలను కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది.

తెలంగాణ లోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్, వరంగల్, హైదరాబాద్ ఎనిమిది లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని  'గల్ఫ్ మైగ్రేషన్ కారిడార్' నుంచి ప్రస్తుతం ఎంత మంది గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారు, విదేశీ మారక ద్రవ్యం ఎంత పంపించారు, గత పదేళ్లలో ఎంత మంది గల్ఫ్ నుంచి వాపస్ వచ్చారు, వారి పునరావాసం ఎలా ఉన్నది, గల్ఫ్ కార్మికుల ప్రధాన సమస్యలు ఏం ఉన్నాయి, రేషన్ కార్డులలో, ఓటర్ లిస్ట్ లో గల్ఫ్ కార్మికుల పేర్లు ఏ మేరకు తొలగించారు, గల్ఫ్ నుంచి వాపస్ వచ్చిన వారు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లాంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మేరకు చురుకుగా పాల్గొన్నారు, ఎంతమంది గెలుపొందారు, వారి రాజకీయ చైతన్యం ఏ మేరకు ఉన్నది అనే విషయాలను పరిశీలించడం జరిగింది.

2023 డిసెంబర్ 7న తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీలలో కొంతవరకు నెరవేర్చింది. గల్ఫ్ దేశాలలో మృతిచెందిన వలస కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపును ఇటీవల వేములవాడలో ప్రారంభించింది. రాష్ట్రంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ (బీఆర్ఎస్), కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి చెప్పుకోదగ్గ సంక్షేమ కార్యక్రమాలు ఏవీ చేపట్టలేదు. దేశానికి అత్యధిక విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయి. కేరళ, పంజాబ్ లాంటి రాష్ట్రాల కంటే మెరుగైన ఎన్నారై పాలసీ (ప్రవాసి విధానం) తెస్తామన్న కేసీఆర్, కేటీఆర్ ల హామీలు అటకెక్కాయి. విదేశీ పెట్టుబడులు, ఎన్నారైల పెట్టుబడులపై ఉన్న ప్రేమ ప్రవాసి కార్మికులపై లేదు. గల్ఫ్ నుంచి వాపస్ వచ్చిన వారిని ఆదుకోవడానికి కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎలాంటి పునరావాస కార్యక్రమాలు చేపట్టలేదు.

ప్రధాని మోదీకి గల్ఫ్ కార్మికులు రాసిన బహిరంగ లేఖ

ఇటీవల జగిత్యాల పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి గల్ఫ్ కార్మికులకు సామాజిక భద్రత, సంక్షేమం, కేంద్ర ప్రభుత్వ పక్షాన సౌకర్యాల కల్పన, హక్కుల గురించి వలస కార్మిక నాయకులు బహిరంగ లేఖ రాశారు. గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్, 'గల్ఫ్ కాంగ్రెస్' అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, టిపిసిసి ఎన్నారై సెల్ ఇంటర్నేషనల్  కన్వీనర్  మంద భీంరెడ్డి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ నాయకులు సయిండ్ల రాజిరెడ్డి, ఎం. నాగభూషణంలు లేఖపై సంతకాలు చేశారు.  

గల్ఫ్ దేశాలలో 88 లక్షల మంది వలస కార్మికులు నివసిస్తున్నారని భారత ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. విదేశీ మారక ద్రవ్యాన్ని పొందే దేశాలలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నది. 2023లో 125 బిలియన్ యుఎస్ డాలర్ల (10 లక్షల 25 వేల కోట్ల రూపాయల) విలువైన విదేశీ మారకాన్ని భారతదేశం పొందింది. ఇది భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.4 శాతం. భారత్ పొందే విదేశీ మారకంలో సగానికి పైగా గల్ఫ్ దేశాల నుంచే లభిస్తున్నది. గమ్యస్థాన గల్ఫ్ దేశాల అభివృద్ధిలో పాలుపంచుకుంటూ భారతదేశానికి అత్యధిక విదేశీ మారక ద్రవ్యం పంపిస్తున్న ప్రవాస భారతీయ కార్మికుల సేవలను గుర్తించాలని మిమ్ములను కోరుతున్నాము.

గత పదేళ్లలో మీరు ప్రధాన మంత్రి హోదాలో సౌదీ అరేబియా, యూఏఈ, ఓమాన్, కువైట్, ఖతార్, బహరేన్ ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో పర్యటించారు. భారత్ - గల్ఫ్ దేశాల మధ్య మీరు చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలలో వ్యాపార వాణిజ్య ఒప్పందాలే ఎక్కువ. గల్ఫ్ వలస కార్మికుల సామాజిక భద్రత, సంక్షేమం గురించి పెద్దగా పట్టించుకోలేదు.

కరోనా సందర్బంగా వందే భారత్ ప్లయిట్స్, చార్టర్డ్ ప్లయిట్స్ లలో విదేశాల నుంచి భారత్ కు వచ్చిన మన పౌరుల నుంచి రెండింతలు, మూడింతలు విమాన చార్జీలు వసూలు చేయడం వలన పేద వలస కార్మికులు నష్టపోయారు. కరోనా సందర్బంగా హడావిడిగా వాపస్ వచ్చిన ప్రవాసి కార్మికులకు  గల్ఫ్ దేశాల కంపెనీ యాజమాన్యాల నుంచి రావలసిన ఉద్యోగ అనంతర ప్రయోజనాలు (ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్) పొందేందుకు న్యాయ సహాయాన్ని అందించండి.

భారత ప్రభుత్వం ఈ క్రింది విషయాలపై దృష్టి పెట్టాలని కోరుతున్నాము.
- ప్రవాసీ భారతీయ బీమా యోజన అనే రూ.10 లక్షల ప్రమాద బీమా పథకంలో సహజ మరణాన్ని చేర్చాలి. బీమా సౌకర్యం అందరికీ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచాలి.

-విదేశీ మారకద్రవ్యం పంపేవారికి బంగ్లాదేశ్ ప్రభుత్వం రెండున్నర శాతం ప్రోత్సాహకం ఇస్తున్నది. భారత ప్రభుత్వం కూడా ఈదిశగా ఆలోచించాలి.

-- హైదరాబాద్ లో సౌదీ అరేబియా, కువైట్ దేశాల కాన్సులేట్ లు (రాయబార కార్యాలయాలు) ఏర్పాటుకు భారత ప్రభుత్వం చొరవ చూపాలి. ఇటీవలనే యూఏఈ కాన్సులేట్ ను ఏర్పాటు చేశారు.

-- గల్ఫ్‌లోని భారతీయ వలస కార్మికులకు బీమా, పెన్షన్‌తో కూడిన సమగ్ర సామాజిక భద్రతా పథకాన్ని అమలు చేయాలి.

- వాపస్ వచ్చిన వలసదారుల కోసం పునరేకీకరణ, పునరావాసం పథకాన్ని రూపొందించండి.

- ఎమిగ్రేషన్ యాక్టు 1983 ని ఆధునికీకరించాలి. చాలా ఏళ్లుగా న్యూ ఎమిగ్రేషన్ బిల్ పెండింగ్ లో ఉన్నది.

-- ద్వైపాక్షిక కార్మిక ఒప్పందాలను క్రమం తప్పకుండా సమీక్షించడానికి గల్ఫ్ దేశాలతో సంయుక్త కమిటీలను ఏర్పాటు చేయాలి.

-- విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్లే వారందరికీ ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షణ (ప్రీ-డిపార్చర్ ఓరియంటేషన్ మరియు ట్రైనింగ్ - పీడీఓటి ని నిర్బంధంగా అమలు చేయాలి.

-      భారత దేశం నుంచి విదేశాలకు వెళ్లే ప్రతి పౌరుడి వివరాలను భారతీయ విమానాశ్రయాల్లో రిజిస్ట్రేషన్ చేయాలి. అలాగే  విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలి. 

- భారతదేశంలో చదువుకుంటున్న గల్ఫ్ కార్మికుల పిల్లలకు ఆయా విద్యా సంస్థలలో రిజర్వేషన్ కోటా అమలు చేయాలి.

- ప్రస్తుత ప్రభుత్వాలు అమలు చేస్తున్న సామాజిక సంక్షేమ పథకాలలో గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న కార్మికులు, గల్ఫ్ దేశాల నుంచి వాపస్ వచ్చి గ్రామాలలో ఉన్న వారిని లబ్ధిదారులుగా పరిగణించాలి. రేషన్ కార్డు లేదనే సాకుతో సంక్షేమ పథకాలకు వారిని దూరం చేయొద్దు. 

సీఎం ను కలిసిన గల్ఫ్ ఎన్నారైలు

కాంగ్రెస్ పార్టీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ టీపీసీసీ ఎన్నారై విభాగం ప్రతినిధులు, గల్ఫ్ సంఘాల నాయకులు మార్చి 2న సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చేనందుకు జీవో విడుదల గురించి కసరత్తు చేయాలని సీఎం కార్యదర్శి షానవాజ్ ఖాసీంను రేవంత్ రెడ్డి వెంటనే ఆదేశించారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు, ఎన్నారైల సంక్షేమ బోర్డు, హెల్ప్ లైన్ ఏర్పాటు, గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు హామీల అమలుపై దృష్టి పెట్టాలని చేయాలని వారు కోరారు. దుబాయి పర్యటనకు రావాలని ఆహ్వానించారు. 

 

ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి నేతృత్వంలో టిపిసిసి ఎన్నారై సెల్ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్, గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, టిపిసిసి ఎన్నారై సెల్ ఇంటర్నేషనల్ కన్వీనర్ మంద భీంరెడ్డి, ఓమాన్ లోని ఇండియన్ సోషల్ క్లబ్ తెలంగాణ విభాగం అధ్యక్షులు గుండేటి గణేష్, నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్ పర్సన్ సిస్టర్ లిసీ జోసెఫ్ లు గల్ఫ్ సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మెడిపెల్లి సత్యం, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి లు ఆ బృందంలో ఉన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

డబల్ బెడ్ రూమ్, ఇందిరమ్మ ఇళ్ల అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

డబల్ బెడ్ రూమ్, ఇందిరమ్మ ఇళ్ల అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల అక్టోబర్ 15 (ప్రజా మంటలు)  పట్టణము లో అర్బన్ హౌసింగ్ కాలని డబల్ బెడ్ రూం,ఇందిరమ్మ ఇండ్ల కాలని నూకపల్లి లో అభివృద్ధి పనులను మున్సిపల్ అధికారులు,జగిత్యాల పట్టణ నాయకులతో కలిసి  పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  అర్బన్ హౌసింగ్ కాలనీ శివారు లో జగిత్యాల డంపింగ్ యార్డు ను పరిశీలించి,డంపింగ్...
Read More...
Local News 

36 వ వార్డులో అభివృద్ధి పనికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

36 వ వార్డులో అభివృద్ధి పనికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల అక్టోబర్ 15 (ప్రజా మంటలు)పట్టణ 36వ వార్డులో 36 లక్షలతో సీసీ డ్రైనేజీ స్లాబ్ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు గిరి నాగభూషణం, అడువల జ్యోతి లక్ష్మణ్ ,కమిషనర్ స్పందన, డి ఈ ఆనంద్, ఏ ఈ...
Read More...
Local News 

ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడమే నిజమైన విజయం కొత్తగా ఎంపికైన డిఎస్పి లను అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడమే నిజమైన విజయం  కొత్తగా ఎంపికైన డిఎస్పి లను అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్     జగిత్యాల అక్టోబర్ 15 ( ప్రజా మంటలు)   జిల్లా కు చెందిన అభ్యర్థులు ఇటీవల వెలువడిన  గ్రూప్ -1 ఫలితాల్లో   డిఎస్పి (Deputy Superintendent of Police) హోదాకు ఎంపికైన విష్ణువర్ధన్ రెడ్డి, ప్రతిభ లు బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా  ఈ...
Read More...
Local News 

ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల అక్టోబర్ 15 ( ప్రజా మంటలు)పట్టణము లో అరవింద్ నగర్ లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల పురాణిపేట లో 13.50 లక్షలతో నూతనంగా నిర్మించిన సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  ఈ కార్యక్రమంలో డి ఈఓ రాము,జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్,మాజీ మున్సిపల్ చైర్మన్...
Read More...
State News 

ప్రజా సమస్యలను తెలుసుకొని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే మా లక్ష్యం - కల్వకుంట్ల కవిత

ప్రజా సమస్యలను తెలుసుకొని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే  మా లక్ష్యం - కల్వకుంట్ల కవిత అక్టోబర్ 25- ఫిబ్రవరి 13 వరకు - నిజామాబాద్ లో ప్రారంభం హైదరాబాద్ లో ముగింపు హైదరాబాద్ అక్టోబర్ 15 (ప్రజా మంటలు): తెలంగాణ ప్రజల కష్టాలను, జిల్లాలోని ప్రజా సమస్యలను తెలుసుకోవడానికే, " జాగృతి జనం బాట" పేర యాత్ర చేపట్టినట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈరోజు తమ కార్యాలయంలో...
Read More...
Local News 

సిఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్సీ ఎల్ రమణ 

సిఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్సీ ఎల్ రమణ     జగిత్యాల అక్టోబర్ 15 ( ప్రజా మంటలు)జిల్లాకు చెందిన పదిహేను మంది లబ్ధిదారులకు  సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన  2,65,500/- రూపాయలు విలువగల చెక్కులను  జగిత్యాల ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ లబ్ధిదారులకు అందజేశారు.    ఈ కార్యక్రమంలో  బి  ఆర్ ఎస్ పట్టణ...
Read More...
Local News  State News 

సెంట్రల్గే లైబ్రరీ గేటు వద్దనే గ్రూప్-1 అభ్యర్థులతో కవిత "మాట ముచ్చట"

సెంట్రల్గే లైబ్రరీ గేటు వద్దనే గ్రూప్-1 అభ్యర్థులతో కవిత విద్యార్థులతో కలిసి చాయ్ తాగిన కవిత, పోలీసుల అదుపులో తెలంగాణ జాగృతి నాయకులు
Read More...
Local News 

గాంధీనగర్ పీఎస్ పరిధిలో డ్రగ్స్ పై అవేర్నెస్

గాంధీనగర్ పీఎస్ పరిధిలో డ్రగ్స్ పై అవేర్నెస్ సికింద్రాబాద్, అక్టోబర్‌ 14 (ప్రజామంటలు): సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్, సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి  సూచనల మేరకు గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో డ్రగ్స్‌ మరియు అక్రమ రవాణాపై మంగళవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కవాడిగూడ సత్వా మాల్‌, బన్సీలాల్పేట సీసీ నగర్‌లో డ్రగ్స్ పై అవేర్నెస్ కార్యక్రమాలను నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్‌ బోస్‌ కిరణ్‌,...
Read More...
Local News 

థరూర్ క్యాంప్ బడిలో ప్రపంచ మానసిక ఆరోగ్య అవగాహన

థరూర్ క్యాంప్ బడిలో ప్రపంచ మానసిక ఆరోగ్య అవగాహన జగిత్యాల అక్టోబర్ 14 (ప్రజా మంటలు): ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా, జెడ్పిహెచ్ఎస్ ధరూర్ క్యాంప్ పాఠశాలలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమము ఏర్పాటు చేశారు.   ఎన్ సీ డీ ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ అర్చన, సైకియాట్రిస్ట్ డాక్టర్ డింపుల్ హాజరై,విద్యార్థులు అందరూ ఒత్తిడి లేకుండా చదువుకోవాలని, మానసికంగా సంసిద్ధంగా ఈ...
Read More...
Local News  Crime 

మేడిపల్లి మండలంలో గంజాయి పట్టివేత

మేడిపల్లి మండలంలో గంజాయి పట్టివేత మేడిపల్లి అక్టోబర్ 14 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మేడిపల్లి గ్రామ శివారులో మంగళవారం ఎస్సై M. శ్రీధర్ రెడ్డి గంజాయి  తరలిస్తున్నారని గుర్తించి, వారివద్ద una గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు. పోలీసులు గ్రామ శివారులో అనుమానాస్పదంగా ఉన్న తాండ్రియాల కు చెందిన బద్దం నాగరాజు (26),  కథలాపూర్ మండలం...
Read More...
Local News 

గాంధీ మెడికల్ కాలేజీలో పీజీలకు సీపీఆర్ పై అవెర్నెస్

గాంధీ మెడికల్ కాలేజీలో పీజీలకు సీపీఆర్ పై అవెర్నెస్ సికింద్రాబాద్, అక్టోబర్ 14 (ప్రజామంటలు) : గాంధీ మెడికల్‌ కాలేజీలో జరుగుతున్న సీపీఆర్‌ ( కార్డియో ఫల్మనరీ రిస్యూసిటేషన్ )  అవగాహన వారంలో భాగంగా మంగళవారం రెండవ రోజు ఏహెచ్ఎస్ వైద్య విద్యార్థుల కోసం ప్రత్యక్ష ప్రదర్శనలతో కూడిన ప్రాక్టికల్‌ సీపీఆర్‌ అవగాహన సెషన్‌ నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన, ప్రాణరక్షణలో సీపీఆర్‌ ప్రాధాన్యం,...
Read More...
Local News 

పట్టణం అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే డా.సంజయ్ సమీక్ష

పట్టణం అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే డా.సంజయ్ సమీక్ష జగిత్యాల అక్టోబర్ 14(ప్రజా    మంటలుఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జగిత్యాల పట్టణం లో అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  జగిత్యాల పట్టణం వివిధ వార్డులలో TUFIDC , జనరల్ ఫండ్ తో చేపట్టిన రోడ్లు డ్రైనేజీ పనులు వర్షాల వల్ల పనులు నిలిచిపోయాయి అట్టి...
Read More...