ఇప్పుడు 'గల్ఫ్' ఎటువైపు - 'గల్ఫ్' పై కాంగ్రెస్ ఆశలు ఇప్పటికైనా తమ అవసరాలను గుర్తించాలని కార్మికుల కోరిక

On
ఇప్పుడు 'గల్ఫ్' ఎటువైపు - 'గల్ఫ్' పై కాంగ్రెస్ ఆశలు ఇప్పటికైనా తమ అవసరాలను గుర్తించాలని కార్మికుల కోరిక

ఇప్పుడు 'గల్ఫ్' ఎటువైపు - 'గల్ఫ్' పై కాంగ్రెస్ ఆశలు
ఇప్పటికైనా తమ అవసరాలను గుర్తించాలని కార్మికుల కోరిక

 హైదరాబాద్ మార్చ్ 28 (ప్రత్యేక ప్రతినిధి) :

రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో గల్ఫ్ కార్మికుల కుటుంబాల ఓటు బ్యాంకు ప్రభావం ఎలా ఉండబోతుంది అనే అంశంపై ఇటీవల ఒక ప్రాథమిక పరిశీలన జరిగింది. గతంలో రాజకీయ వ్యూహకర్తలు ప్రశాంత్ కిశోర్, సునీల్ కొనుగోలు టీములు, వివిధ సర్వే సంస్థలు చేసిన విశ్లేషణలను కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది.

తెలంగాణ లోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్, వరంగల్, హైదరాబాద్ ఎనిమిది లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని  'గల్ఫ్ మైగ్రేషన్ కారిడార్' నుంచి ప్రస్తుతం ఎంత మంది గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారు, విదేశీ మారక ద్రవ్యం ఎంత పంపించారు, గత పదేళ్లలో ఎంత మంది గల్ఫ్ నుంచి వాపస్ వచ్చారు, వారి పునరావాసం ఎలా ఉన్నది, గల్ఫ్ కార్మికుల ప్రధాన సమస్యలు ఏం ఉన్నాయి, రేషన్ కార్డులలో, ఓటర్ లిస్ట్ లో గల్ఫ్ కార్మికుల పేర్లు ఏ మేరకు తొలగించారు, గల్ఫ్ నుంచి వాపస్ వచ్చిన వారు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లాంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మేరకు చురుకుగా పాల్గొన్నారు, ఎంతమంది గెలుపొందారు, వారి రాజకీయ చైతన్యం ఏ మేరకు ఉన్నది అనే విషయాలను పరిశీలించడం జరిగింది.

2023 డిసెంబర్ 7న తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీలలో కొంతవరకు నెరవేర్చింది. గల్ఫ్ దేశాలలో మృతిచెందిన వలస కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపును ఇటీవల వేములవాడలో ప్రారంభించింది. రాష్ట్రంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ (బీఆర్ఎస్), కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి చెప్పుకోదగ్గ సంక్షేమ కార్యక్రమాలు ఏవీ చేపట్టలేదు. దేశానికి అత్యధిక విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయి. కేరళ, పంజాబ్ లాంటి రాష్ట్రాల కంటే మెరుగైన ఎన్నారై పాలసీ (ప్రవాసి విధానం) తెస్తామన్న కేసీఆర్, కేటీఆర్ ల హామీలు అటకెక్కాయి. విదేశీ పెట్టుబడులు, ఎన్నారైల పెట్టుబడులపై ఉన్న ప్రేమ ప్రవాసి కార్మికులపై లేదు. గల్ఫ్ నుంచి వాపస్ వచ్చిన వారిని ఆదుకోవడానికి కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎలాంటి పునరావాస కార్యక్రమాలు చేపట్టలేదు.

ప్రధాని మోదీకి గల్ఫ్ కార్మికులు రాసిన బహిరంగ లేఖ

ఇటీవల జగిత్యాల పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి గల్ఫ్ కార్మికులకు సామాజిక భద్రత, సంక్షేమం, కేంద్ర ప్రభుత్వ పక్షాన సౌకర్యాల కల్పన, హక్కుల గురించి వలస కార్మిక నాయకులు బహిరంగ లేఖ రాశారు. గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్, 'గల్ఫ్ కాంగ్రెస్' అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, టిపిసిసి ఎన్నారై సెల్ ఇంటర్నేషనల్  కన్వీనర్  మంద భీంరెడ్డి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ నాయకులు సయిండ్ల రాజిరెడ్డి, ఎం. నాగభూషణంలు లేఖపై సంతకాలు చేశారు.  

గల్ఫ్ దేశాలలో 88 లక్షల మంది వలస కార్మికులు నివసిస్తున్నారని భారత ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. విదేశీ మారక ద్రవ్యాన్ని పొందే దేశాలలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నది. 2023లో 125 బిలియన్ యుఎస్ డాలర్ల (10 లక్షల 25 వేల కోట్ల రూపాయల) విలువైన విదేశీ మారకాన్ని భారతదేశం పొందింది. ఇది భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.4 శాతం. భారత్ పొందే విదేశీ మారకంలో సగానికి పైగా గల్ఫ్ దేశాల నుంచే లభిస్తున్నది. గమ్యస్థాన గల్ఫ్ దేశాల అభివృద్ధిలో పాలుపంచుకుంటూ భారతదేశానికి అత్యధిక విదేశీ మారక ద్రవ్యం పంపిస్తున్న ప్రవాస భారతీయ కార్మికుల సేవలను గుర్తించాలని మిమ్ములను కోరుతున్నాము.

గత పదేళ్లలో మీరు ప్రధాన మంత్రి హోదాలో సౌదీ అరేబియా, యూఏఈ, ఓమాన్, కువైట్, ఖతార్, బహరేన్ ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో పర్యటించారు. భారత్ - గల్ఫ్ దేశాల మధ్య మీరు చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలలో వ్యాపార వాణిజ్య ఒప్పందాలే ఎక్కువ. గల్ఫ్ వలస కార్మికుల సామాజిక భద్రత, సంక్షేమం గురించి పెద్దగా పట్టించుకోలేదు.

కరోనా సందర్బంగా వందే భారత్ ప్లయిట్స్, చార్టర్డ్ ప్లయిట్స్ లలో విదేశాల నుంచి భారత్ కు వచ్చిన మన పౌరుల నుంచి రెండింతలు, మూడింతలు విమాన చార్జీలు వసూలు చేయడం వలన పేద వలస కార్మికులు నష్టపోయారు. కరోనా సందర్బంగా హడావిడిగా వాపస్ వచ్చిన ప్రవాసి కార్మికులకు  గల్ఫ్ దేశాల కంపెనీ యాజమాన్యాల నుంచి రావలసిన ఉద్యోగ అనంతర ప్రయోజనాలు (ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్) పొందేందుకు న్యాయ సహాయాన్ని అందించండి.

భారత ప్రభుత్వం ఈ క్రింది విషయాలపై దృష్టి పెట్టాలని కోరుతున్నాము.
- ప్రవాసీ భారతీయ బీమా యోజన అనే రూ.10 లక్షల ప్రమాద బీమా పథకంలో సహజ మరణాన్ని చేర్చాలి. బీమా సౌకర్యం అందరికీ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచాలి.

-విదేశీ మారకద్రవ్యం పంపేవారికి బంగ్లాదేశ్ ప్రభుత్వం రెండున్నర శాతం ప్రోత్సాహకం ఇస్తున్నది. భారత ప్రభుత్వం కూడా ఈదిశగా ఆలోచించాలి.

-- హైదరాబాద్ లో సౌదీ అరేబియా, కువైట్ దేశాల కాన్సులేట్ లు (రాయబార కార్యాలయాలు) ఏర్పాటుకు భారత ప్రభుత్వం చొరవ చూపాలి. ఇటీవలనే యూఏఈ కాన్సులేట్ ను ఏర్పాటు చేశారు.

-- గల్ఫ్‌లోని భారతీయ వలస కార్మికులకు బీమా, పెన్షన్‌తో కూడిన సమగ్ర సామాజిక భద్రతా పథకాన్ని అమలు చేయాలి.

- వాపస్ వచ్చిన వలసదారుల కోసం పునరేకీకరణ, పునరావాసం పథకాన్ని రూపొందించండి.

- ఎమిగ్రేషన్ యాక్టు 1983 ని ఆధునికీకరించాలి. చాలా ఏళ్లుగా న్యూ ఎమిగ్రేషన్ బిల్ పెండింగ్ లో ఉన్నది.

-- ద్వైపాక్షిక కార్మిక ఒప్పందాలను క్రమం తప్పకుండా సమీక్షించడానికి గల్ఫ్ దేశాలతో సంయుక్త కమిటీలను ఏర్పాటు చేయాలి.

-- విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్లే వారందరికీ ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షణ (ప్రీ-డిపార్చర్ ఓరియంటేషన్ మరియు ట్రైనింగ్ - పీడీఓటి ని నిర్బంధంగా అమలు చేయాలి.

-      భారత దేశం నుంచి విదేశాలకు వెళ్లే ప్రతి పౌరుడి వివరాలను భారతీయ విమానాశ్రయాల్లో రిజిస్ట్రేషన్ చేయాలి. అలాగే  విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలి. 

- భారతదేశంలో చదువుకుంటున్న గల్ఫ్ కార్మికుల పిల్లలకు ఆయా విద్యా సంస్థలలో రిజర్వేషన్ కోటా అమలు చేయాలి.

- ప్రస్తుత ప్రభుత్వాలు అమలు చేస్తున్న సామాజిక సంక్షేమ పథకాలలో గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న కార్మికులు, గల్ఫ్ దేశాల నుంచి వాపస్ వచ్చి గ్రామాలలో ఉన్న వారిని లబ్ధిదారులుగా పరిగణించాలి. రేషన్ కార్డు లేదనే సాకుతో సంక్షేమ పథకాలకు వారిని దూరం చేయొద్దు. 

సీఎం ను కలిసిన గల్ఫ్ ఎన్నారైలు

కాంగ్రెస్ పార్టీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ టీపీసీసీ ఎన్నారై విభాగం ప్రతినిధులు, గల్ఫ్ సంఘాల నాయకులు మార్చి 2న సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చేనందుకు జీవో విడుదల గురించి కసరత్తు చేయాలని సీఎం కార్యదర్శి షానవాజ్ ఖాసీంను రేవంత్ రెడ్డి వెంటనే ఆదేశించారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు, ఎన్నారైల సంక్షేమ బోర్డు, హెల్ప్ లైన్ ఏర్పాటు, గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు హామీల అమలుపై దృష్టి పెట్టాలని చేయాలని వారు కోరారు. దుబాయి పర్యటనకు రావాలని ఆహ్వానించారు. 

 

ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి నేతృత్వంలో టిపిసిసి ఎన్నారై సెల్ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్, గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, టిపిసిసి ఎన్నారై సెల్ ఇంటర్నేషనల్ కన్వీనర్ మంద భీంరెడ్డి, ఓమాన్ లోని ఇండియన్ సోషల్ క్లబ్ తెలంగాణ విభాగం అధ్యక్షులు గుండేటి గణేష్, నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్ పర్సన్ సిస్టర్ లిసీ జోసెఫ్ లు గల్ఫ్ సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మెడిపెల్లి సత్యం, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి లు ఆ బృందంలో ఉన్నారు.

Tags
Join WhatsApp

More News...

National 

న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చే కుట్ర: NCERT క్లాస్–8 పాఠ్యపుస్తకంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చే కుట్ర: NCERT క్లాస్–8 పాఠ్యపుస్తకంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: క్లాస్–8 సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థను అవినీతిగ్రస్త సంస్థగా చిత్రీకరించడం వెనుక “లోతైన, పద్ధతిగల కుట్ర” ఉందని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.స్వయంచాలకంగా (సుయో మోటు) కేసును విచారించిన ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం,ఈ పాఠ్యాంశాలు చిన్న వయసు విద్యార్థుల “అమాయక మనసుల్లో”...
Read More...

నాగర్ కర్నూలు జిల్లా లో పసికందు మృతికి కారణమైన వారిపై చర్యలకు డిమాండ్

నాగర్ కర్నూలు జిల్లా లో పసికందు మృతికి కారణమైన వారిపై చర్యలకు డిమాండ్ జగిత్యాల ఫిబ్రవరి 26 (ప్రజా మంటలు)నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామము మల్లన్న  జాతరలో రెండు నెలల పసికందు మౌనికను కాలుతో తన్ని ఆ చిన్నారి మరణానికి కారణమైన అగ్రకుల అహంకారాన్ని ప్రదర్శించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ బిసి ఎస్సి ఎస్టి ఐక్య సంఘాల ఆధ్వర్యంలో ఆ చిన్నారి ఆత్మకు శాంతి...
Read More...
Local News 

పకడ్బందీగా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ

పకడ్బందీగా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ జగిత్యాల ఫిబ్రవరి 26 ( ప్రజా మంటలు)మేడిపెల్లి, కోరుట్ల, మెట్ పెల్లి మరియు ఇబ్రహీంపట్నం మండలాల్లోని  పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా గురువారం మేడిపెల్లి  కోరుట్ల, మెట్ పెల్లి మరియు ఇబ్రహీంపట్నం లో పరీక్ష కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్...
Read More...
Local News 

ఇంటర్మీడియట్ పరీక్షలు – భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ అధికారులు

ఇంటర్మీడియట్ పరీక్షలు – భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ అధికారులు   జగిత్యాల ఫిబ్రవరి 26 ( ప్రజా మంటలు)జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని పరీక్షల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేసినటట్లు జిల్లా ఎస్పి అశోక్ కుమార్  తెలిపారు. పరీక్షలు పారదర్శకంగా, ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రతీ పరీక్షా...
Read More...
Local News 

ఈషా గౌతమ స్కూల్ పవర్ ప్లే 2026 స్పోర్ట్స్ మీట్- పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ఈషా గౌతమ స్కూల్ పవర్ ప్లే 2026 స్పోర్ట్స్ మీట్- పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్    జగిత్యాల ఫిబ్రవరి 26 (ప్రజా మంటలు)  జిల్లా కేంద్రంలోని ఈషా, గౌతమ స్కూల్ వారి పవర్ ప్లే 2026 స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో పాల్గొనీ స్పోర్ట్స్ మీట్ జెండా ఆవిష్కరణ చేసి  స్పోర్ట్స్ మీట్ ప్రారంభించినజగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  నేటి సమాజంలో విద్య తో పాటు క్రీడలు చాలా...
Read More...
National  International  

ఇజ్రాయెల్‌తో భారత్ దృఢంగా నిలుస్తుంది: క్నెసెట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం

ఇజ్రాయెల్‌తో భారత్ దృఢంగా నిలుస్తుంది: క్నెసెట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం టెలిఆవివ్ ఫిబ్రవరి 26: ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పార్లమెంట్ **క్నెసెట్**‌ను ఉద్దేశించి ప్రసంగించారు. అక్టోబర్ 7, 2023న హమాస్ జరిపిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ, “ఇజ్రాయెల్‌తో భారత్ సంపూర్ణ విశ్వాసంతో దృఢంగా నిలుస్తుంది” అని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై భారత్‌కు జీరో టాలరెన్స్ విధానం ఉందని, ఇందులో ఎలాంటి...
Read More...
Local News 

జగిత్యాల మున్సిపాలిటీ నూతన చైర్‌పర్సన్‌గా సమీండ్ల వాణి పదవీ బాధ్యతల స్వీకరణ

జగిత్యాల మున్సిపాలిటీ నూతన చైర్‌పర్సన్‌గా సమీండ్ల వాణి పదవీ బాధ్యతల స్వీకరణ .జగిత్యాల, ఫిబ్రవరి 26 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ నూతన చైర్‌పర్సన్‌గా సమీండ్ల వాణి శ్రీనివాస్ గారు అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై నూతన చైర్‌పర్సన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ కమిషనర్...
Read More...
Local News 

పకడ్బందీగా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పకడ్బందీగా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ  బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు  పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల ఫిబ్రవరి 25 ( ప్రజా మంటలు)ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా బుధవారం జగిత్యాల ఎస్.కె.ఎన్.ఆర్ (బాలుర) జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో నిర్వహణ విధానం, ప్రశ్నపత్రాల భద్రత, హాల్ టికెట్ల పరిశీలన ప్రక్రియలను ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ పరిశీలించారు....
Read More...
Local News 

ఇంటర్ మరియు పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా  నిర్వహించాలి_ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

ఇంటర్ మరియు పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా  నిర్వహించాలి_ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి    జగిత్యాల ఫిబ్రవరి 24 (ప్రజా మంటలు)పరీక్షా కేంద్రాలకు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండాలి పరీక్షా సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలి ఇంటర్ మరియు పదవ తరగతి పరీక్షల నిర్వహణ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
Read More...
Local News 

గడ్డి మందు వినియోగంలో రైతుల ఆలోచనలో మార్పు రావాలి డా ఏం.మహేశ్ రెడ్డి 

గడ్డి మందు వినియోగంలో రైతుల ఆలోచనలో మార్పు రావాలి డా ఏం.మహేశ్ రెడ్డి  జగిత్యాల రూరల్ ఫిబ్రవరి 24 ( ప్రజా మంటలు)పారాక్వాట్ గడ్డి మందు పూర్తిగా నిశేదించాలి దీని వినియోగంలో రైతుల్లో మార్పు రావాలని వైద్యులు మర్రి మహేష్ రెడ్డి అన్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపురం గ్రామంలో డా,,మర్రి మహేష్ రెడ్డి ఆద్వర్యంలో పారాక్వాట్ గడ్డి మందు మరియు ఉచిత వైద్య శిబిరం మంగళవారం నిర్వహించబడింది....
Read More...
Local News 

ఎమ్మెల్యే ,పలువురు మంత్రులతో సీఎం ను కలిసిన మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి

ఎమ్మెల్యే ,పలువురు మంత్రులతో సీఎం ను కలిసిన మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి జగిత్యాల ఫిబ్రవరి 24 ( ప్రజా మంటలు)జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ గా నూతనంగా ఎన్నికైన సమిండ్ల వాణీ శ్రీనివాస్ జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మన్  కుమార్ తో  కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు   ఎనుముల రేవంత్ రెడ్డి ని,రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ఈ...
Read More...
Local News 

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావును మర్యాదపూర్వకంగా కలిసిన జగిత్యాల రాయికల్ బిజెపి కౌన్సిలర్ లు

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావును మర్యాదపూర్వకంగా కలిసిన జగిత్యాల రాయికల్ బిజెపి కౌన్సిలర్ లు హైదరాబాద్ ఫిబ్రవరి 23 (ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన జగిత్యాల్ నియోజకవర్గ జగిత్యాల మరియు రాయికల్ పట్టణ కౌన్సిలర్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు ని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు  ధర్మపురి అరవింద్  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. బోగ శ్రావణి  తో కలిసి హైదరాబాద్ లో...
Read More...