ఇప్పుడు 'గల్ఫ్' ఎటువైపు - 'గల్ఫ్' పై కాంగ్రెస్ ఆశలు ఇప్పటికైనా తమ అవసరాలను గుర్తించాలని కార్మికుల కోరిక

On
ఇప్పుడు 'గల్ఫ్' ఎటువైపు - 'గల్ఫ్' పై కాంగ్రెస్ ఆశలు ఇప్పటికైనా తమ అవసరాలను గుర్తించాలని కార్మికుల కోరిక

ఇప్పుడు 'గల్ఫ్' ఎటువైపు - 'గల్ఫ్' పై కాంగ్రెస్ ఆశలు
ఇప్పటికైనా తమ అవసరాలను గుర్తించాలని కార్మికుల కోరిక

 హైదరాబాద్ మార్చ్ 28 (ప్రత్యేక ప్రతినిధి) :

రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో గల్ఫ్ కార్మికుల కుటుంబాల ఓటు బ్యాంకు ప్రభావం ఎలా ఉండబోతుంది అనే అంశంపై ఇటీవల ఒక ప్రాథమిక పరిశీలన జరిగింది. గతంలో రాజకీయ వ్యూహకర్తలు ప్రశాంత్ కిశోర్, సునీల్ కొనుగోలు టీములు, వివిధ సర్వే సంస్థలు చేసిన విశ్లేషణలను కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది.

తెలంగాణ లోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్, వరంగల్, హైదరాబాద్ ఎనిమిది లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని  'గల్ఫ్ మైగ్రేషన్ కారిడార్' నుంచి ప్రస్తుతం ఎంత మంది గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారు, విదేశీ మారక ద్రవ్యం ఎంత పంపించారు, గత పదేళ్లలో ఎంత మంది గల్ఫ్ నుంచి వాపస్ వచ్చారు, వారి పునరావాసం ఎలా ఉన్నది, గల్ఫ్ కార్మికుల ప్రధాన సమస్యలు ఏం ఉన్నాయి, రేషన్ కార్డులలో, ఓటర్ లిస్ట్ లో గల్ఫ్ కార్మికుల పేర్లు ఏ మేరకు తొలగించారు, గల్ఫ్ నుంచి వాపస్ వచ్చిన వారు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లాంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మేరకు చురుకుగా పాల్గొన్నారు, ఎంతమంది గెలుపొందారు, వారి రాజకీయ చైతన్యం ఏ మేరకు ఉన్నది అనే విషయాలను పరిశీలించడం జరిగింది.

2023 డిసెంబర్ 7న తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీలలో కొంతవరకు నెరవేర్చింది. గల్ఫ్ దేశాలలో మృతిచెందిన వలస కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపును ఇటీవల వేములవాడలో ప్రారంభించింది. రాష్ట్రంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ (బీఆర్ఎస్), కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి చెప్పుకోదగ్గ సంక్షేమ కార్యక్రమాలు ఏవీ చేపట్టలేదు. దేశానికి అత్యధిక విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయి. కేరళ, పంజాబ్ లాంటి రాష్ట్రాల కంటే మెరుగైన ఎన్నారై పాలసీ (ప్రవాసి విధానం) తెస్తామన్న కేసీఆర్, కేటీఆర్ ల హామీలు అటకెక్కాయి. విదేశీ పెట్టుబడులు, ఎన్నారైల పెట్టుబడులపై ఉన్న ప్రేమ ప్రవాసి కార్మికులపై లేదు. గల్ఫ్ నుంచి వాపస్ వచ్చిన వారిని ఆదుకోవడానికి కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎలాంటి పునరావాస కార్యక్రమాలు చేపట్టలేదు.

ప్రధాని మోదీకి గల్ఫ్ కార్మికులు రాసిన బహిరంగ లేఖ

ఇటీవల జగిత్యాల పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి గల్ఫ్ కార్మికులకు సామాజిక భద్రత, సంక్షేమం, కేంద్ర ప్రభుత్వ పక్షాన సౌకర్యాల కల్పన, హక్కుల గురించి వలస కార్మిక నాయకులు బహిరంగ లేఖ రాశారు. గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్, 'గల్ఫ్ కాంగ్రెస్' అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, టిపిసిసి ఎన్నారై సెల్ ఇంటర్నేషనల్  కన్వీనర్  మంద భీంరెడ్డి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ నాయకులు సయిండ్ల రాజిరెడ్డి, ఎం. నాగభూషణంలు లేఖపై సంతకాలు చేశారు.  

గల్ఫ్ దేశాలలో 88 లక్షల మంది వలస కార్మికులు నివసిస్తున్నారని భారత ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. విదేశీ మారక ద్రవ్యాన్ని పొందే దేశాలలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నది. 2023లో 125 బిలియన్ యుఎస్ డాలర్ల (10 లక్షల 25 వేల కోట్ల రూపాయల) విలువైన విదేశీ మారకాన్ని భారతదేశం పొందింది. ఇది భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.4 శాతం. భారత్ పొందే విదేశీ మారకంలో సగానికి పైగా గల్ఫ్ దేశాల నుంచే లభిస్తున్నది. గమ్యస్థాన గల్ఫ్ దేశాల అభివృద్ధిలో పాలుపంచుకుంటూ భారతదేశానికి అత్యధిక విదేశీ మారక ద్రవ్యం పంపిస్తున్న ప్రవాస భారతీయ కార్మికుల సేవలను గుర్తించాలని మిమ్ములను కోరుతున్నాము.

గత పదేళ్లలో మీరు ప్రధాన మంత్రి హోదాలో సౌదీ అరేబియా, యూఏఈ, ఓమాన్, కువైట్, ఖతార్, బహరేన్ ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో పర్యటించారు. భారత్ - గల్ఫ్ దేశాల మధ్య మీరు చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలలో వ్యాపార వాణిజ్య ఒప్పందాలే ఎక్కువ. గల్ఫ్ వలస కార్మికుల సామాజిక భద్రత, సంక్షేమం గురించి పెద్దగా పట్టించుకోలేదు.

కరోనా సందర్బంగా వందే భారత్ ప్లయిట్స్, చార్టర్డ్ ప్లయిట్స్ లలో విదేశాల నుంచి భారత్ కు వచ్చిన మన పౌరుల నుంచి రెండింతలు, మూడింతలు విమాన చార్జీలు వసూలు చేయడం వలన పేద వలస కార్మికులు నష్టపోయారు. కరోనా సందర్బంగా హడావిడిగా వాపస్ వచ్చిన ప్రవాసి కార్మికులకు  గల్ఫ్ దేశాల కంపెనీ యాజమాన్యాల నుంచి రావలసిన ఉద్యోగ అనంతర ప్రయోజనాలు (ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్) పొందేందుకు న్యాయ సహాయాన్ని అందించండి.

భారత ప్రభుత్వం ఈ క్రింది విషయాలపై దృష్టి పెట్టాలని కోరుతున్నాము.
- ప్రవాసీ భారతీయ బీమా యోజన అనే రూ.10 లక్షల ప్రమాద బీమా పథకంలో సహజ మరణాన్ని చేర్చాలి. బీమా సౌకర్యం అందరికీ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచాలి.

-విదేశీ మారకద్రవ్యం పంపేవారికి బంగ్లాదేశ్ ప్రభుత్వం రెండున్నర శాతం ప్రోత్సాహకం ఇస్తున్నది. భారత ప్రభుత్వం కూడా ఈదిశగా ఆలోచించాలి.

-- హైదరాబాద్ లో సౌదీ అరేబియా, కువైట్ దేశాల కాన్సులేట్ లు (రాయబార కార్యాలయాలు) ఏర్పాటుకు భారత ప్రభుత్వం చొరవ చూపాలి. ఇటీవలనే యూఏఈ కాన్సులేట్ ను ఏర్పాటు చేశారు.

-- గల్ఫ్‌లోని భారతీయ వలస కార్మికులకు బీమా, పెన్షన్‌తో కూడిన సమగ్ర సామాజిక భద్రతా పథకాన్ని అమలు చేయాలి.

- వాపస్ వచ్చిన వలసదారుల కోసం పునరేకీకరణ, పునరావాసం పథకాన్ని రూపొందించండి.

- ఎమిగ్రేషన్ యాక్టు 1983 ని ఆధునికీకరించాలి. చాలా ఏళ్లుగా న్యూ ఎమిగ్రేషన్ బిల్ పెండింగ్ లో ఉన్నది.

-- ద్వైపాక్షిక కార్మిక ఒప్పందాలను క్రమం తప్పకుండా సమీక్షించడానికి గల్ఫ్ దేశాలతో సంయుక్త కమిటీలను ఏర్పాటు చేయాలి.

-- విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్లే వారందరికీ ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షణ (ప్రీ-డిపార్చర్ ఓరియంటేషన్ మరియు ట్రైనింగ్ - పీడీఓటి ని నిర్బంధంగా అమలు చేయాలి.

-      భారత దేశం నుంచి విదేశాలకు వెళ్లే ప్రతి పౌరుడి వివరాలను భారతీయ విమానాశ్రయాల్లో రిజిస్ట్రేషన్ చేయాలి. అలాగే  విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలి. 

- భారతదేశంలో చదువుకుంటున్న గల్ఫ్ కార్మికుల పిల్లలకు ఆయా విద్యా సంస్థలలో రిజర్వేషన్ కోటా అమలు చేయాలి.

- ప్రస్తుత ప్రభుత్వాలు అమలు చేస్తున్న సామాజిక సంక్షేమ పథకాలలో గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న కార్మికులు, గల్ఫ్ దేశాల నుంచి వాపస్ వచ్చి గ్రామాలలో ఉన్న వారిని లబ్ధిదారులుగా పరిగణించాలి. రేషన్ కార్డు లేదనే సాకుతో సంక్షేమ పథకాలకు వారిని దూరం చేయొద్దు. 

సీఎం ను కలిసిన గల్ఫ్ ఎన్నారైలు

కాంగ్రెస్ పార్టీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ టీపీసీసీ ఎన్నారై విభాగం ప్రతినిధులు, గల్ఫ్ సంఘాల నాయకులు మార్చి 2న సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చేనందుకు జీవో విడుదల గురించి కసరత్తు చేయాలని సీఎం కార్యదర్శి షానవాజ్ ఖాసీంను రేవంత్ రెడ్డి వెంటనే ఆదేశించారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు, ఎన్నారైల సంక్షేమ బోర్డు, హెల్ప్ లైన్ ఏర్పాటు, గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు హామీల అమలుపై దృష్టి పెట్టాలని చేయాలని వారు కోరారు. దుబాయి పర్యటనకు రావాలని ఆహ్వానించారు. 

 

ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి నేతృత్వంలో టిపిసిసి ఎన్నారై సెల్ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్, గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, టిపిసిసి ఎన్నారై సెల్ ఇంటర్నేషనల్ కన్వీనర్ మంద భీంరెడ్డి, ఓమాన్ లోని ఇండియన్ సోషల్ క్లబ్ తెలంగాణ విభాగం అధ్యక్షులు గుండేటి గణేష్, నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్ పర్సన్ సిస్టర్ లిసీ జోసెఫ్ లు గల్ఫ్ సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మెడిపెల్లి సత్యం, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి లు ఆ బృందంలో ఉన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

అన్నపూర్ణ మాత సేవ వారి అన్న ప్రసాద వితరణ లో పాల్గొన్న చైర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ 

అన్నపూర్ణ మాత సేవ వారి అన్న ప్రసాద వితరణ లో పాల్గొన్న చైర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్     జగిత్యాల ఏప్రిల్ 17(ప్రజా మంటలు)బీట్ చౌరస్తా లో నిర్వహించిన  అమావాస్య అన్నపూర్ణ మాత సేవ ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్  హాజరై భక్తులకు స్వయంగా వడ్డించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో సేవాభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.  కార్యక్రమములో...
Read More...
Local News 

ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి జగిత్యాల ఏప్రిల్ 17(ప్రజా మంటలు)టీజీఈజెఏసి జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో  నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మిక , పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీ విస్తృతస్థాయి కార్యనిర్వాహక సమావేశం (తేది: 07-04-2026) లో తీసుకున్న తీర్మానాల మేరకు జెఏసి రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్  మరియు సెక్రటరీ...
Read More...
Local News 

సురభి గోషాలలో గో గ్రాసం పంపిణీ

సురభి గోషాలలో గో గ్రాసం పంపిణీ   జగిత్యాల రూరల్ ఏప్రిల్ 17 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రానికి సమీపంలోని తాటిపల్లి సురభి గోశాలలో గోవుల గ్రాసం గడ్డి, తవుడు, మేత  కోసం ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. జగిత్యాల వాస్తవ్యులైన ఊటూరి అశోక్ కుమార్, తాటికొండ శ్రీనివాస్, బాసెట్టి లవ కుమార్, ప్రతినెల అమావాస్య రోజు ఒక్కొక్కరివద్ద 100 చొప్పున, వసూలు చేసి...
Read More...
State News 

ప్రత్యేక తెలంగాణ అస్తిత్వాల పరిరక్షణకు ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’ ఆవిర్భావం

ప్రత్యేక తెలంగాణ అస్తిత్వాల పరిరక్షణకు ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’ ఆవిర్భావం    ఆవిర్భావ సభ వివరాలు:* 📅 తేదీ: ఏప్రిల్ 19, 2026 (ఆదివారం)* 🕙 సమయం: ఉదయం 10 గంటలకు* 📌 వేదిక: రవీంద్రభారతి    హైదరాబాద్, ఏప్రిల్ 17 (ప్రజా మంటలు):    తెలంగాణ భూమి కేవలం భౌగోళిక పరిమితి మాత్రమే కాకుండా వేల సంవత్సరాల సాంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక అస్తిత్వాలకు ప్రతీకగా నిలిచిందని...
Read More...
State News 

మారోజు వీరన్న అనుచరుల మద్దతుతో జాగృతి పార్టీకి బలమైన ఊపు: కవిత

మారోజు వీరన్న అనుచరుల మద్దతుతో జాగృతి పార్టీకి బలమైన ఊపు: కవిత హైదరాబాద్, ఏప్రిల్ 17 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పడబోయే కొత్త రాజకీయ పార్టీకి మారోజు వీరన్న అనుచరులు, సీపీయూఎస్ఐ (CPUSI), దళిత బహుజన రాజ్యాధికార సంస్థ మద్దతు ప్రకటించాయి. జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కలిసి సీపీయూఎస్ఐ కేంద్ర కమిటీ కార్యదర్శి కోదండం, రాష్ట్ర కార్యదర్శి వెంకన్న, దళిత...
Read More...
Local News 

జాతీయ వాగ్దేవి పురస్కారం అందుకున్న మహేశ్వర శర్మ

జాతీయ వాగ్దేవి పురస్కారం అందుకున్న మహేశ్వర శర్మ   రాయికల్ ఏప్రిల్ 16 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు కు చెందిన తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ కు కందుకూరి వీరేశలింగం పంతులు స్మారక జాతీయ వాగ్దేవి పురస్కారాన్ని గురువారం ఆచార్య పద్మశ్రీ  కొలకనూరి ఇనాక్ ,  జాతీయ తెలుగు సారస్వత పరిషత్ కార్యనిర్వహక...
Read More...
Local News 

ఈ పుణ్య భూమిలో పుట్టడం మన పూర్వజన్మ సుకృతం_ శ్రీశ్రీశ్రీ విశ్వకతీర్థ స్వామీజీ

ఈ పుణ్య భూమిలో పుట్టడం మన పూర్వజన్మ సుకృతం_ శ్రీశ్రీశ్రీ విశ్వకతీర్థ స్వామీజీ జగిత్యాల ఏప్రిల్ 16 (ప్రజా మంటలు)ఈ పుణ్య భూమిలో పుట్టడం మన పూర్వజన్మ సుకృతమని శ్రీ శ్రీ శ్రీ విశ్వక తీర్థ స్వామీజీ అన్నారు.ఈ భూమిపై పుట్టిన వారికి ఇద్దరు తల్లులు ఒకరు కన్నతల్లి ఆమెకు పుట్టిన వారిని పోషిస్తుంది మరొకరు భూమాత ఆమె భారత మాత పుట్టిన నుండి గిట్టిన తర్వాత...
Read More...
Local News 

అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం కార్యక్రమం

అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం కార్యక్రమం జగిత్యాల ఏప్రిల్ 16 ( ప్రజా మంటలు)  ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20 వరకు వారం రోజులపాటు అగ్నిమాపక అమరవీరుల స్మారక వారోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రం ఆవరణలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సైదులు ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ   ఈ...
Read More...
Local News 

కెసిఆర్ బహిరంగ సభ వేదిక నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

కెసిఆర్ బహిరంగ సభ వేదిక నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జగిత్యాల ఏప్రిల్ 16 ( ప్రజా మంటలు ఈ నెల 20 తేదీన కెసిఆర్ బహిరంగ సభలో సందర్భంగా‌ జగిత్యాల జిల్లా కేంద్రంలోని మిని స్టేడియం లో నిర్వహించనున్న బహిరంగ సభకు స్టేజి నిర్మాణ పనులను జగిత్యాల జిల్లా ఇంఛార్జి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి , ధర్మపురి ఇంచార్జ్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు...
Read More...
Local News 

ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను పకడ్బందీగా అమలుచేయాలి _జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను పకడ్బందీగా అమలుచేయాలి _జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మేడిపల్లి ఏప్రిల్ 16 ( ప్రజా మంటలు)అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలి జిల్లాలో నిర్వహించనున్న ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక మండల స్థాయి సమావేశాలను అత్యంత పకడ్బందీగా, ప్రజా పాలన ప్రతిబింబించేలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.  ఈ సమావేశాలు చారిత్రాత్మకంగా...
Read More...
Local News 

జగిత్యాల జిల్లాలోని ప్రతిభ కనబర్చిన మైనారిటీ గురుకులం విద్యార్థులకు సన్మానం

జగిత్యాల జిల్లాలోని ప్రతిభ కనబర్చిన మైనారిటీ గురుకులం విద్యార్థులకు సన్మానం         జగిత్యాల ఏప్రిల్ 16 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లాలోని తెలంగాణ మైనారిటి రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటి మైనారిటీ గురుకులం విద్యార్థులను అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడీస్) శ్రీ. బి.రాజ గౌడ్  ఇంటర్ ఫలితాలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించారు. కుమారి. నేల్లెంకుల నందిత అనే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని (ఏం.పి.సి.) వార్షిక పరీక్షల ఫలితాల్లో 470...
Read More...
Local News 

సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల ప్రధాన బాధ్యత

సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల ప్రధాన బాధ్యత జగిత్యాల ఏప్రిల్ 16 (ప్రజా మంటలు)"అరైవ్ అలైవ్ " కార్యక్రమంలో భాగంగా వాహన డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “ అరైవ్ అలైవ్" కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,  ఆదేశాల...
Read More...