హిందువులపై దాడిని సహించం: బజరంగ్ దళ్
- " హిందూ శక్తి ప్రదర్శన" యాత్రలో లక్షలాదిగా పాల్గొనాలని పిలుపు - విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పండరీనాథ్..
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493)
హైదరాబాద్ మార్చి 28 (ప్రజా మంటలు) :
"తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హిందువులపై దాడులు పెరిగిపోయాయని.. దాడులు, దౌర్జన్యాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోము" అని భజరంగ్ దళ్ హెచ్చరించింది.
రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యం కల్పిస్తూ..ముస్లిం సంతుష్టికరణకు పాల్పడుతున్నారని.. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని ఆందోళన వ్యక్తం చేసింది.
మతమార్పిడి, లవ్ జిహాద్, దేవాలయాల భూముల కబ్జా, గోహత్య వంటి అనేక హిందూ వ్యతిరేక కార్యక్రమాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది.
బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బజరంగ్ దళ్ విలేకరుల సమావేశం నిర్వహించింది.
విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పండరీనాథ్, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శ్రీ శివరాములు మాట్లాడారు.
అంతకుముందు హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే వీర హనుమాన్ విజయ యాత్ర వాల్ పోస్టర్, కరపత్రం ఆవిష్కరించారు.
ఏప్రిల్ 23న భాగ్యనగర్ లో భారీ ఎత్తున హనుమాన్ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. వీర హనుమాన్ విజయ యాత్ర ర్యాలీలో దాదాపు మూడు లక్షల మంది బజరంగ్దళ్ కార్యకర్తలు పాల్గొని హిందూ శక్తి ప్రదర్శన నిర్వహిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు నగరంలోని హిందువులంతా సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి హిందువు హనుమాన్ జయంతి మహోత్సవంలో పాల్గొనాలని ఆహ్వానించారు.
ఇటీవల కాలంలో భాగ్యనగర్ తో పాటు, రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో హిందువులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాడులను అడ్డుకొని తగిన రీతిలో జవాబు చెప్పేందుకు బజరంగ్ దళ్ సిద్ధంగా ఉందన్నారు.
భాగ్యనగరం శివారు ప్రాంతంలోని చెంగిచెర్ల పిట్టల బస్తీలో గిరిజనులపై ముస్లిం మూకల దాడిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు.
ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధితులపైనే పోలీసులు దాడి చేసి అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం ప్రజాస్వామ్య వ్యవస్థలో చీకటి అధ్యయనం అన్నారు. అన్ని మతాలకు సమానమని చెప్పుకునే భాగ్యనగరం నడిబొట్టున చంటి బిడ్డను ఎత్తుకున్న యువకుడి పై జిహాదీ మూకలు దాడికి దిగడం అమానవీయ చర్య అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా ఇప్పటికీ పోలీసులు స్పందించకపోవడం చూస్తుంటే, తెలంగాణలో రాజాకార్ల రాజ్యం ప్రారంభమైందని రుజువు అవుతుందన్నారు. నగరం మొత్తం సీసీ కెమెరాలతో నింపేసి, చీమచిటుక్కుమన్నా నిందితులను, దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పే పోలీసులు.. చార్మినార్ దగ్గర జరిగిన ఘటన, చెంగిచెర్ల ఘటనల పై ఇంకా నిందితులపై కేసులు నమోదు చేయకపోవడం హిందూ వ్యతిరేక చర్యా అని బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని.. వాటికి తగిన రీతిలో జవాబు చెప్పేందుకు హిందూ సమాజం సిద్ధంగా ఉండాలని వారు సూచించారు. హిందువుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మించుకున్నామని..
ఇక నేడు రామరాజ్యం కోసం హిందూ సమాజం సంఘటితం కావలసిన అవసరం ఆసన్నమైందని పేర్కొన్నారు. సంఘటితమైతేనే హిందూ వ్యతిరేక శక్తులు తోక ముడుస్తాయని, లేదంటే వారి ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతాయని పేర్కొన్నారు.
బజరంగ్దళ్ చేపట్టే వీర హనుమాన్ విజయ యాత్రలో భారీ సంఖ్యలో పాల్గొని హిందూ శక్తిని ప్రదర్శిద్దామని వారు పిలుపునిచ్చారు.
సమావేశంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీశ్వర్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, భాగ్యనగర్ విభాగ్ కార్యదర్శి వీరేశలింగం , బజరంగ్దళ్ నాయకులు బిరాధర్ రాము, శ్రీకాంత్, రాహుల్ తోపాటు జిల్లా కన్వీనర్లు, కో కన్వీనర్లు, ఇతర బాధ్యులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గొల్లపల్లిలో అలరించిన సాధనాసురుల విన్యాసాలు
ఆకట్టుకున్న ప్రాచీన జానపద ఇంద్రజాల ప్రదర్శనలు
గొల్లపల్లి, ఆగస్టు 09 (ప్రజా మంటలు):గొల్లపల్లి మండల కేంద్రంలో సాధనాసురులు (సాధన శూరులు) నిర్వహించిన ప్రాచీన జానపద కళా ప్రదర్శనలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. తరతరాలుగా పద్మశాలి సమాజానికి చెందిన కళాకారులు తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన ఈ అరుదైన కళను పరిరక్షిస్తూ వస్తున్నారు. సాధనాసురుల కళాకారులు... వెల్ నెస్ బై హార్ట్ ఫుల్నెస్, కన్హా ఆశ్రమం, శ్రీరామచంద్రమిషన్, ఇస్కా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకఉచితవైద్యశిభిరం
జగిత్యాల ఆగస్ట్ 9(ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని క్లబ్ ఆవరణలో ఆదివారం వెల్ నెస్ బై హార్ట్ ఫుల్నెస్, కన్హా ఆశ్రమం, శ్రీరామచంద్రమిషన్, ఇస్కా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఉచిత వైద్యశిభిరం నిర్వహించారు.
వెల్ నెస్ బై హార్ట్ ఫుల్నెస్ జనరల్ మేనేజర్ భరద్వాజ్, ఇస్కా ఫౌండేషన్ నిర్వాహకులు మంచాల క్రిష్ణ, రెడ్ క్రాస్ సొసైటీ... మహిళపై లైంగిక దాడి, బెదిరింపులు.. నలుగురు నిందితుల అరెస్ట్
జగిత్యాల ga, ఆగస్టు 08 (ప్రజా మంటలు):
మహిళపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు పాల్పడిన నలుగురు నిందితులను మల్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 3న నూకపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీలో బాధితురాలు తనకు... హర్ ఘర్ తిరంగా – తిరంగా యాత్రలో భాగంగా మాజీ సైనికుడు దూరిశెట్టి కిరణ్ కుమార్ను సన్మానించిన డా. బోగ శ్రావణి
జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు)భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం పిలుపు మేరకు నిర్వహిస్తున్న "హర్ ఘర్ తిరంగా – తిరంగా యాత్ర" కార్యక్రమంలో భాగంగా, భారత త్రివిధ దళాల్లో సేవలందించి పదవీ విరమణ పొందిన మాజీ సైనికుడు దూరిశెట్టి కిరణ్ కుమార్ ని బీజేపీ జగిత్యాల నియోజకవర్గ... బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ డా. బోగ శ్రావణి కి పోచమ్మ తల్లి బోనాల జాతర ఆహ్వాన పత్రిక అందజేత
జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా జగిత్యాల జిల్లా యూట్యూబర్స్ కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోచమ్మ తల్లి బోనాల జాతర మహోత్సవం సందర్భంగా ఆహ్వాన పత్రికను బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ డా. బోగ శ్రావణికి బోనాల జాతర వర్కింగ్ కమిటీ సభ్యులు, జగిత్యాల జిల్లా కళాకారులు మర్యాదపూర్వకంగా అందజేశారు.
ఈ సందర్భంగా... తల్లిపాలే శిశువుకు తొలి వరం – మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్
జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు )పట్టణంలోని స్థానిక 43వ వార్డు వాణీనగర్ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు సంప్రదాయబద్ధంగా శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాశన, అక్షరాభ్యాసం కార్యక్రమాలను నిర్వహించి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ సమీండ్ల... విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి – మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్
జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు)పట్టణంలోని నవ్య గర్ల్స్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన "పరిచయ్–2K26" ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ విద్య జీవితానికి బలమైన పునాది అని, ఈ దశలో విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను... సామాజిక న్యాయ తెలంగాణ కోసం టీఆర్ఎస్ సంకల్పం
హైదరాబాద్, ఆగస్టు 06 (ప్రజా మంటలు):
సామాజిక న్యాయ తెలంగాణ సాధన లక్ష్యంగా టీఆర్ఎస్ నిర్వహించిన **"సామాజిక న్యాయ సంకల్ప సభ"**లో పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత కీలక ప్రసంగం చేశారు. ఈ సభ దేశంలోని కోట్లాది మంది వెనుకబడిన వర్గాల జీవితాలను మార్చే ఉద్యమానికి నాంది అవుతుందని ఆమె పేర్కొన్నారు.
తాను బీసీల కోసం... ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయ సాధనే ఆయనకు నిజమైన నివాళి – మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్
జగిత్యాల ఆగస్ట్ 6(ప్రజా మంటలు)
మున్సిపాలిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా కరీంనగర్ రోడ్లోని జయశంకర్ విగ్రహం వద్ద, గొల్లపల్లి రోడ్లోని విగ్రహం వద్ద, అలాగే మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా జయంతి కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర... ధనం ఉంటే దాన స్వభావము ఉండాలి బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేష్ శర్మ
కోరుట్ల ఆగస్టు 5 ( ప్రజా మంటలు)
సిరిసిల్ల రాజేంద్ర శర్మ 9348422113
ధనమున్న వ్యక్తికి దాన స్వభావం ఉండాలని అదేవిధంగా శక్తి ఉంటే క్షమాగుణం ఉండాలని శృంగేరి శారదా పీఠ ఆస్థాన పౌరాణికులు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి శిష్యులు గర్రెపల్లి మహేష్ శర్మ అన్నారు. కోరుట్ల పట్టణములో సనాతన ధర్మ ప్రచార సమితి కోరుట్ల... తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపునకు మహారాష్ట్ర అనుమతులు ఇప్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ, ఆగస్టు 5 (ప్రజా మంటలు):ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు 150–152 మీటర్లకు పెంచేందుకు మహారాష్ట్ర అనుమతులు ఇప్పించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కోరారు. ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన కేంద్ర మంత్రిని కలిశారు.148 మీటర్లతో పోలిస్తే 152... నల్లమల్లలో చెంచు గిరిజనుల జీవన పరిస్థితులపై మానవ హక్కుల కమిషన్ చైర్మన్ క్షేత్రస్థాయి పరిశీలన
విద్య, వైద్యం, సంక్షేమం, మౌలిక వసతులపై అధికారులతో సమగ్ర సమీక్ష – చెంచు కుటుంబాలతో ముఖాముఖిహైదరాబాద్, ఆగస్టు 5 (ప్రజా మంటలు):
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న చెంచు గిరిజనుల జీవన పరిస్థితులను తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్... 