హిందువులపై దాడిని సహించం: బజరంగ్ దళ్
- " హిందూ శక్తి ప్రదర్శన" యాత్రలో లక్షలాదిగా పాల్గొనాలని పిలుపు - విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పండరీనాథ్..
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493)
హైదరాబాద్ మార్చి 28 (ప్రజా మంటలు) :
"తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హిందువులపై దాడులు పెరిగిపోయాయని.. దాడులు, దౌర్జన్యాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోము" అని భజరంగ్ దళ్ హెచ్చరించింది.
రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యం కల్పిస్తూ..ముస్లిం సంతుష్టికరణకు పాల్పడుతున్నారని.. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని ఆందోళన వ్యక్తం చేసింది.
మతమార్పిడి, లవ్ జిహాద్, దేవాలయాల భూముల కబ్జా, గోహత్య వంటి అనేక హిందూ వ్యతిరేక కార్యక్రమాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది.
బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బజరంగ్ దళ్ విలేకరుల సమావేశం నిర్వహించింది.
విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పండరీనాథ్, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శ్రీ శివరాములు మాట్లాడారు.
అంతకుముందు హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే వీర హనుమాన్ విజయ యాత్ర వాల్ పోస్టర్, కరపత్రం ఆవిష్కరించారు.
ఏప్రిల్ 23న భాగ్యనగర్ లో భారీ ఎత్తున హనుమాన్ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. వీర హనుమాన్ విజయ యాత్ర ర్యాలీలో దాదాపు మూడు లక్షల మంది బజరంగ్దళ్ కార్యకర్తలు పాల్గొని హిందూ శక్తి ప్రదర్శన నిర్వహిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు నగరంలోని హిందువులంతా సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి హిందువు హనుమాన్ జయంతి మహోత్సవంలో పాల్గొనాలని ఆహ్వానించారు.
ఇటీవల కాలంలో భాగ్యనగర్ తో పాటు, రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో హిందువులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాడులను అడ్డుకొని తగిన రీతిలో జవాబు చెప్పేందుకు బజరంగ్ దళ్ సిద్ధంగా ఉందన్నారు.
భాగ్యనగరం శివారు ప్రాంతంలోని చెంగిచెర్ల పిట్టల బస్తీలో గిరిజనులపై ముస్లిం మూకల దాడిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు.
ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధితులపైనే పోలీసులు దాడి చేసి అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం ప్రజాస్వామ్య వ్యవస్థలో చీకటి అధ్యయనం అన్నారు. అన్ని మతాలకు సమానమని చెప్పుకునే భాగ్యనగరం నడిబొట్టున చంటి బిడ్డను ఎత్తుకున్న యువకుడి పై జిహాదీ మూకలు దాడికి దిగడం అమానవీయ చర్య అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా ఇప్పటికీ పోలీసులు స్పందించకపోవడం చూస్తుంటే, తెలంగాణలో రాజాకార్ల రాజ్యం ప్రారంభమైందని రుజువు అవుతుందన్నారు. నగరం మొత్తం సీసీ కెమెరాలతో నింపేసి, చీమచిటుక్కుమన్నా నిందితులను, దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పే పోలీసులు.. చార్మినార్ దగ్గర జరిగిన ఘటన, చెంగిచెర్ల ఘటనల పై ఇంకా నిందితులపై కేసులు నమోదు చేయకపోవడం హిందూ వ్యతిరేక చర్యా అని బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని.. వాటికి తగిన రీతిలో జవాబు చెప్పేందుకు హిందూ సమాజం సిద్ధంగా ఉండాలని వారు సూచించారు. హిందువుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మించుకున్నామని..
ఇక నేడు రామరాజ్యం కోసం హిందూ సమాజం సంఘటితం కావలసిన అవసరం ఆసన్నమైందని పేర్కొన్నారు. సంఘటితమైతేనే హిందూ వ్యతిరేక శక్తులు తోక ముడుస్తాయని, లేదంటే వారి ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతాయని పేర్కొన్నారు.
బజరంగ్దళ్ చేపట్టే వీర హనుమాన్ విజయ యాత్రలో భారీ సంఖ్యలో పాల్గొని హిందూ శక్తిని ప్రదర్శిద్దామని వారు పిలుపునిచ్చారు.
సమావేశంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీశ్వర్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, భాగ్యనగర్ విభాగ్ కార్యదర్శి వీరేశలింగం , బజరంగ్దళ్ నాయకులు బిరాధర్ రాము, శ్రీకాంత్, రాహుల్ తోపాటు జిల్లా కన్వీనర్లు, కో కన్వీనర్లు, ఇతర బాధ్యులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తాత, నానమ్మ లను గెంటేసిన మనుమడు
.
జగిత్యాల ఫిబ్రవరి 7(ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన రాయి భీమయ్య (85),రాయి గంగరాజు( 80)అనే వృద్ధ తాత, నానమ్మ లను మనుమడు శివ కుమార్ కొట్టి ఇంట్లోంచి గెంటి వేయగా జిల్లా కేంద్రం లోని సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ను ఆశ్రయించారు. ... శ్రీ శ్రీనివాసఆంజనేయ భవాని శంకర ఆలయంలో ఘనంగా పూర్ణాహుతి
జగిత్యాల ఫిబ్రవరి 7 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కూరగాయల మార్కెట్ లోని శ్రీ శ్రీనివాసాం జనేయ, భవాని, శంకర దేవాలయం లో వార్షికోత్సవాల్లో భాగంగా మూడవరోజు పూర్ణాహుతి స్థాపిత దేవత ప్రధాన కలశ ఉద్వాసన మహా అన్నదాన ప్రసాద వితరణ, సాయంత్రం పురవీధులలో స్వామివార్ల శోభాయాత్ర ఘనంగా జరిగింది.
ఈనాటి కార్యక్రమంలో ఆలయ ఫౌండర్,... పట్టణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డా బోగ శ్రావణి
జగిత్యాల ఫిబ్రవరి 7 (ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల మున్సిపల్ 36వ వార్డ్ అభ్యర్థి పుల్ల సుమలత-హరీష్ ,21వ జగ్గుల శిరీష కి మద్దతుగా స్థానిక అన్నపూర్ణ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్లో పాల్గొని పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి... రాయికల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది: తాటిపర్తి జీవన్ రెడ్డి
రాయికల్, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):
రాయికల్ పట్టణ కేంద్రంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, జగిత్యాల–రాయికల్ ప్రాంతాల్లో అనూహ్యమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయని, పదేళ్ల పాటు కాంగ్రెస్ జెండాను విడువకుండా కష్టకాలంలో పోరాడిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో... కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలంటే కారు గుర్తుకే ఓటు: కొప్పుల ఈశ్వర్
రామగుండం, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):
రామగుండం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో 48, 9, 39, 11, 43, 42, 13, 55, 57 డివిజన్లలో నిర్వహించిన ప్రచారంలో బీఆర్ఎస్ ఇంచార్జి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని విస్తృత ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా... రాయికల్ పట్టణంపై గులాబీ జెండా ఎగురవేస్తాం: దావ వసంత సురేష్
రాయికల్, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):
రాయికల్ పట్టణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 1, 5, 10, 11, 12 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం... సారంగాపూర్ ఫారెస్టులో ఫోక్ సాంగ్ షూటింగ్ సందడి
జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని అటవీ ప్రాంతం శనివారం రోజంతా ఫోక్ పాట చిత్రీకరణతో కళకళలాడింది. స్థానిక ప్రజల జీవనశైలిని, గ్రామీణ భావోద్వేగాలను ప్రతిబింబించే ‘కడదాకా తోడుంటనే’ అనే ఫోక్ సాంగ్ షూటింగ్ భారీ ఆసక్తి నడుమ సాగింది.
ఈ పాటను బొమ్మరిల్లు ఫోక్స్ యూట్యూబ్ ఛానల్... దళిత విద్యార్థినులకు పురుగుల అన్నం! ఆస్పత్రిలో 40 మంది విద్యార్థినులు
మంచిర్యాల ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. వసతి గృహంలో భోజనం చేసిన సుమారు 40 మంది దళిత విద్యార్థినులు ఫుడ్ పాయిజనింగ్కు గురయ్యారు. ఒక్కసారిగా విద్యార్థినులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పులతో తీవ్ర అస్వస్థతకు లోనవ్వడంతో హాస్టల్లో కలకలం రేగింది.... ఉచిత రేషన్కు గుడ్బై? నగదు బదిలీ విధానానికి కేంద్రం సిద్ధం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):
దేశవ్యాప్తంగా కోట్లాది పేదలకు ఉచిత రేషన్ రూపంలో బియ్యం, గోధుమలను అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఈ వ్యవస్థలో కీలక మార్పులకు సిద్ధమవుతోంది. ఇకపై రేషన్ దుకాణాల ద్వారా సరుకులు అందించకుండా, నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేసే విధానాన్ని అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది.
ఈ... బ్యాక్డోర్లో బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్?: కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):
రాష్ట్రంలో మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లో దొడ్డిదారిన ఉద్యోగాల నియామకాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ అంశాన్ని పలువురు నిరుద్యోగులు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు.
రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగి యువత తీవ్ర నిరాశలో ఉందని... అనుమానంతో భార్యను హతమార్చిన భర్త
జగిత్యాల, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు – అంకం భూమయ్య):
జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం అత్యంత దారుణమైన హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యపై అనుమానంతో ఓ భర్త కిరాతకుడిగా మారి, ఆమెను అమానుషంగా హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, భర్త–భార్యల మధ్య కొంతకాలంగా... రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుప లేని ప్రధాని మోదీ : పార్లమెంటరీ సంప్రదాయాలపై ప్రశ్నలు
భారత పార్లమెంటు సాంప్రదాయాల్లో అత్యంత కీలకమైనది — రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ. జవాబు. ఇది కేవలం ఒక విధి కాదు; ప్రజాస్వామ్య వ్యవస్థలో కార్యనిర్వాహక వ్యవస్థ పార్లమెంటుకు జవాబుదారీగా ఉండే సందర్భం. అలాంటి కీలక ఘట్టంలో ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో ప్రసంగించకపోవడం తీవ్ర రాజకీయ చర్చకు దారి తీసింది.... 