హిందువులపై దాడిని సహించం: బజరంగ్ దళ్

- " హిందూ శక్తి ప్రదర్శన" యాత్రలో లక్షలాదిగా పాల్గొనాలని పిలుపు - విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పండరీనాథ్..

On
హిందువులపై దాడిని సహించం: బజరంగ్ దళ్

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493)

 

హైదరాబాద్ మార్చి 28 (ప్రజా మంటలు) : 

"తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హిందువులపై దాడులు పెరిగిపోయాయని.. దాడులు, దౌర్జన్యాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోము" అని భజరంగ్ దళ్ హెచ్చరించింది.

రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యం కల్పిస్తూ..ముస్లిం సంతుష్టికరణకు పాల్పడుతున్నారని.. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని ఆందోళన వ్యక్తం చేసింది.

మతమార్పిడి, లవ్ జిహాద్, దేవాలయాల భూముల కబ్జా, గోహత్య వంటి అనేక హిందూ వ్యతిరేక కార్యక్రమాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది.

బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బజరంగ్ దళ్ విలేకరుల సమావేశం నిర్వహించింది.

విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పండరీనాథ్, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శ్రీ శివరాములు మాట్లాడారు.

అంతకుముందు హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే వీర హనుమాన్ విజయ యాత్ర వాల్ పోస్టర్, కరపత్రం ఆవిష్కరించారు.

ఏప్రిల్ 23న భాగ్యనగర్ లో భారీ ఎత్తున హనుమాన్ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. వీర హనుమాన్ విజయ యాత్ర ర్యాలీలో దాదాపు మూడు లక్షల మంది బజరంగ్దళ్ కార్యకర్తలు పాల్గొని హిందూ శక్తి ప్రదర్శన నిర్వహిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు నగరంలోని హిందువులంతా సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి హిందువు హనుమాన్ జయంతి మహోత్సవంలో పాల్గొనాలని ఆహ్వానించారు.

ఇటీవల కాలంలో భాగ్యనగర్ తో పాటు, రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో హిందువులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాడులను అడ్డుకొని తగిన రీతిలో జవాబు చెప్పేందుకు బజరంగ్ దళ్ సిద్ధంగా ఉందన్నారు. 

భాగ్యనగరం శివారు ప్రాంతంలోని చెంగిచెర్ల పిట్టల బస్తీలో గిరిజనులపై ముస్లిం మూకల దాడిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు.

ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధితులపైనే పోలీసులు దాడి చేసి అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం ప్రజాస్వామ్య వ్యవస్థలో చీకటి అధ్యయనం అన్నారు. అన్ని మతాలకు సమానమని చెప్పుకునే భాగ్యనగరం నడిబొట్టున చంటి బిడ్డను ఎత్తుకున్న యువకుడి పై జిహాదీ మూకలు దాడికి దిగడం అమానవీయ చర్య అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా ఇప్పటికీ పోలీసులు స్పందించకపోవడం చూస్తుంటే, తెలంగాణలో రాజాకార్ల రాజ్యం ప్రారంభమైందని రుజువు అవుతుందన్నారు. నగరం మొత్తం సీసీ కెమెరాలతో నింపేసి, చీమచిటుక్కుమన్నా నిందితులను, దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పే పోలీసులు.. చార్మినార్ దగ్గర జరిగిన ఘటన, చెంగిచెర్ల ఘటనల పై ఇంకా నిందితులపై కేసులు నమోదు చేయకపోవడం హిందూ వ్యతిరేక చర్యా అని బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని.. వాటికి తగిన రీతిలో జవాబు చెప్పేందుకు హిందూ సమాజం సిద్ధంగా ఉండాలని వారు సూచించారు. హిందువుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మించుకున్నామని..

ఇక నేడు రామరాజ్యం కోసం హిందూ సమాజం సంఘటితం కావలసిన అవసరం ఆసన్నమైందని పేర్కొన్నారు. సంఘటితమైతేనే హిందూ వ్యతిరేక శక్తులు తోక ముడుస్తాయని, లేదంటే వారి ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతాయని పేర్కొన్నారు.

బజరంగ్దళ్ చేపట్టే వీర హనుమాన్ విజయ యాత్రలో భారీ సంఖ్యలో పాల్గొని హిందూ శక్తిని ప్రదర్శిద్దామని వారు పిలుపునిచ్చారు.

సమావేశంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీశ్వర్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, భాగ్యనగర్ విభాగ్ కార్యదర్శి వీరేశలింగం , బజరంగ్దళ్ నాయకులు బిరాధర్ రాము, శ్రీకాంత్, రాహుల్ తోపాటు జిల్లా కన్వీనర్లు, కో కన్వీనర్లు, ఇతర బాధ్యులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News  State News 

ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో - బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలి

ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో  - బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలి రైల్ రోకోకు భీం ఆర్మీ మద్దతు ఎమ్మెల్సీ కవితను కలిసి సంఘీభావం ప్రకటించిన నాయకులు హైదరాబాద్ జూలై 05 : ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం చేపట్టిన ఈ ఉద్యమంలో పౌర  సమాజం కలిసి...
Read More...
Local News 

అనాధ పిల్లలకు సాయం చేయడం ఆదర్శనీయం..

అనాధ పిల్లలకు సాయం చేయడం ఆదర్శనీయం.. చిన్నారులకు బ్లాంకెట్లు, జ్యూస్ ప్యాకెట్ల పంపిణీ సికింద్రాబాద్ జూలై 05 (ప్రజామంటలు): అనాథ పిల్లలకు సహాయం చేయడంలో ప్రతి ఒక్కరూ మానవత దృక్పథంతో స్పందించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. బన్సీలాల్‌పేట కృష్ణానగర్ కాలనీలోని ఆక్సిలియం నవజీవన అనాథ బాలిక ఆశ్రమంలో శనివారం చిలకలగూడకు చెందిన రామగిరి ప్రభాకర్ చిన్నారి బాలికలకు బ్లాంకెట్లు, జ్యూస్ ప్యాకెట్లను పంపిణీ...
Read More...
Local News 

కల్వకుంట్ల కవిత తో జాగృతి వైస్ ప్రెసిడెంట్ మంచాల వరలక్ష్మీ భేటి

కల్వకుంట్ల కవిత తో జాగృతి వైస్ ప్రెసిడెంట్  మంచాల వరలక్ష్మీ భేటి సికింద్రాబాద్ జూలై 05 (ప్రజామంటలు ): తెలంగాణ జాగృతి అద్యక్షురాలు కల్వకుంట్ల కవిత ను జాగృతి ఉపాద్యక్షురాలు మంచాల వరలక్ష్మీ శనివారం ఆమె నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. గత ఆరు నెలలుగా అమెరికా పర్యటనలో ఉన్న మంచాల వరలక్ష్మీ ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చారు. తన ఆత్మీయ సోదరి కల్వకుంట్ల కవితను కలసి యోగ...
Read More...
Local News 

ధర్మపురి మండల కేంద్రంలో  పర్యటించిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్

ధర్మపురి మండల కేంద్రంలో  పర్యటించిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్    (గొల్లపల్లి ధర్మపురి ) జూలై 05 (ప్రజా మంటలు): జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ శనివారం ధర్మపురి మండల కేంద్రంలో  పర్యటించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి, ప్రమాదకర స్థితిలో ఉన్న తరగతి గదులను తక్షణమే కూల్చి వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తరువాత సానిటేషన్ అంశంపై అధికారులతో సమీక్షించారు. డ్రైనేజీ,కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచి పరిశుభ్రత...
Read More...
Local News 

చదువుతోపాటు సంస్కారం అందించాలి -గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్

చదువుతోపాటు సంస్కారం అందించాలి  -గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్    జగిత్యాల జూలై 5 : (ప్రజా మంటలు) విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారం అందిస్తేనే అది నిజమైన విద్య అని గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్ అన్నారు.  సరస్వతీ విద్యాపీఠం అనుబంధ గీత విద్యాలయం పాఠశాల 1995-96 బ్యాచ్ ఎస్ఎస్సి విద్యార్థులు పాఠశాలకు రూ. ఒక లక్ష విలువైనడెస్క్లను అందజేశారు.  ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన...
Read More...
Local News 

జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక"*

జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక *"  జగిత్యాల జులై 5( ప్రజా మంటలు)   పట్టణం లోనీ జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో  ఆషాఢ మాసం పురస్కరించుకొని  *" ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక "* పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఇది ఆషాడ మాసంలో మహిళలు జరుపుకునే ఒక సాంప్రదాయ వేడుక. ఈ వేడుకలో మహిళలు గోరింటాకును చేతులకు, కాళ్లకు...
Read More...
Local News 

జగిత్యాలలో ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ ఉచిత మెగా వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరణ

జగిత్యాలలో ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ ఉచిత మెగా వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరణ    జగిత్యాల జూలై 5(ప్రజా మంటలు)  జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎల్. రమణ గారి కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్.రమణ  సూచన మెరకు ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ, అపోలో రీచ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో తేదీ: 8.7.2025 మంగళవారం రోజున ఉదయం 9గంటల నుండి
Read More...
Local News 

ధరూర్ క్యాంప్  ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.

ధరూర్ క్యాంప్  ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్. జగిత్యాల జూలై5( ప్రజా  మంటలు    )                                                                                                                                                                                        శనివారం రోజున జగిత్యాల జిల్లా కేంద్రంలోని  ధరూర్ క్యాంప్ ఈ వీ ఎం గోడౌన్ కేంద్రంను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు  జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.  ఈ  వి ఎం భద్రతకు  సంబంధించి ప్రతి నెలలో తనిఖీ. చేయనున్నారు. ఈవీఎం గోడౌన్ కేంద్రంను కలెక్టర్...
Read More...
State News 

బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి 

బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి  హైదరాబాద్ జూలై 05: సోషల్ మీడియాలో ద్వారా బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల విషయంలో ఎలాంటి జాలి చూపకుండా దోషుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి...
Read More...
Local News  State News 

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు - ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు - ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు సిద్దిపేట జూలై 05: తాము చెప్పిందే వినాలని తమకు సంబంధించిన వారికే ఇందిరమ్మ ఇండ్లు, ఇతర పథకాలు ఇవ్వాలని హుకుం హారిచేస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరుతో సిద్దిపేట జిల్లాలో బెదిరిపోతున్న కింది ఉద్యోగులు ఒక్కొకటి వెలుగులోకి వస్తున్నాయి. తాము చెప్పింది చేయకపోతే బదిలీలు, సస్పెండ్ చేయిస్తామని బెదిరింపులు,కాంగ్రెస్ నాయకుల వేధింపులను భరించలేక ఉద్యోగులు లీవ్ పెట్టి...
Read More...
Local News  State News 

సిరిసిల్ల TV9 రిపోర్టర్‌‌ ప్రసాద్‌‌ మృతి

సిరిసిల్ల TV9 రిపోర్టర్‌‌ ప్రసాద్‌‌ మృతి కేటీఆర్, బండి సంజయ్, పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాస్‌‌ సంతాపం సిరిసిల్ల జూలై 05: సీనియర్ జర్నలిస్ట్,టీవీ9 సిరిసిల్ల  రిపోర్టర్  ప్రసాద్ ఆకస్మికంగా మృతి చెందారు. ప్రసాద్ మృతి  పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రగాఢ సానుభూతి...
Read More...
Local News  State News 

ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ - పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు

ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ - పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు   -స్థానిక సంస్థల ఎన్నికల్లో టి.జె.ఎస్. కు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి   (చుక్కా గంగా రెడ్డి - సీనియర్ జర్నలిస్ట్) హైదరాబాద్ జూలై 05: తెలంగాణ ఉద్యమాల రథ సారధి, ఎమ్మెల్సీ, తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో తెలంగాణ జనసమితి బృందం భేటీ అయ్యారు. రాబోయే...
Read More...