హిందువులపై దాడిని సహించం: బజరంగ్ దళ్
- " హిందూ శక్తి ప్రదర్శన" యాత్రలో లక్షలాదిగా పాల్గొనాలని పిలుపు - విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పండరీనాథ్..
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493)
హైదరాబాద్ మార్చి 28 (ప్రజా మంటలు) :
"తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హిందువులపై దాడులు పెరిగిపోయాయని.. దాడులు, దౌర్జన్యాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోము" అని భజరంగ్ దళ్ హెచ్చరించింది.
రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యం కల్పిస్తూ..ముస్లిం సంతుష్టికరణకు పాల్పడుతున్నారని.. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని ఆందోళన వ్యక్తం చేసింది.
మతమార్పిడి, లవ్ జిహాద్, దేవాలయాల భూముల కబ్జా, గోహత్య వంటి అనేక హిందూ వ్యతిరేక కార్యక్రమాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది.
బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బజరంగ్ దళ్ విలేకరుల సమావేశం నిర్వహించింది.
విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పండరీనాథ్, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శ్రీ శివరాములు మాట్లాడారు.
అంతకుముందు హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే వీర హనుమాన్ విజయ యాత్ర వాల్ పోస్టర్, కరపత్రం ఆవిష్కరించారు.
ఏప్రిల్ 23న భాగ్యనగర్ లో భారీ ఎత్తున హనుమాన్ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. వీర హనుమాన్ విజయ యాత్ర ర్యాలీలో దాదాపు మూడు లక్షల మంది బజరంగ్దళ్ కార్యకర్తలు పాల్గొని హిందూ శక్తి ప్రదర్శన నిర్వహిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు నగరంలోని హిందువులంతా సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి హిందువు హనుమాన్ జయంతి మహోత్సవంలో పాల్గొనాలని ఆహ్వానించారు.
ఇటీవల కాలంలో భాగ్యనగర్ తో పాటు, రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో హిందువులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాడులను అడ్డుకొని తగిన రీతిలో జవాబు చెప్పేందుకు బజరంగ్ దళ్ సిద్ధంగా ఉందన్నారు.
భాగ్యనగరం శివారు ప్రాంతంలోని చెంగిచెర్ల పిట్టల బస్తీలో గిరిజనులపై ముస్లిం మూకల దాడిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు.
ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధితులపైనే పోలీసులు దాడి చేసి అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం ప్రజాస్వామ్య వ్యవస్థలో చీకటి అధ్యయనం అన్నారు. అన్ని మతాలకు సమానమని చెప్పుకునే భాగ్యనగరం నడిబొట్టున చంటి బిడ్డను ఎత్తుకున్న యువకుడి పై జిహాదీ మూకలు దాడికి దిగడం అమానవీయ చర్య అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా ఇప్పటికీ పోలీసులు స్పందించకపోవడం చూస్తుంటే, తెలంగాణలో రాజాకార్ల రాజ్యం ప్రారంభమైందని రుజువు అవుతుందన్నారు. నగరం మొత్తం సీసీ కెమెరాలతో నింపేసి, చీమచిటుక్కుమన్నా నిందితులను, దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పే పోలీసులు.. చార్మినార్ దగ్గర జరిగిన ఘటన, చెంగిచెర్ల ఘటనల పై ఇంకా నిందితులపై కేసులు నమోదు చేయకపోవడం హిందూ వ్యతిరేక చర్యా అని బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని.. వాటికి తగిన రీతిలో జవాబు చెప్పేందుకు హిందూ సమాజం సిద్ధంగా ఉండాలని వారు సూచించారు. హిందువుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మించుకున్నామని..
ఇక నేడు రామరాజ్యం కోసం హిందూ సమాజం సంఘటితం కావలసిన అవసరం ఆసన్నమైందని పేర్కొన్నారు. సంఘటితమైతేనే హిందూ వ్యతిరేక శక్తులు తోక ముడుస్తాయని, లేదంటే వారి ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతాయని పేర్కొన్నారు.
బజరంగ్దళ్ చేపట్టే వీర హనుమాన్ విజయ యాత్రలో భారీ సంఖ్యలో పాల్గొని హిందూ శక్తిని ప్రదర్శిద్దామని వారు పిలుపునిచ్చారు.
సమావేశంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీశ్వర్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, భాగ్యనగర్ విభాగ్ కార్యదర్శి వీరేశలింగం , బజరంగ్దళ్ నాయకులు బిరాధర్ రాము, శ్రీకాంత్, రాహుల్ తోపాటు జిల్లా కన్వీనర్లు, కో కన్వీనర్లు, ఇతర బాధ్యులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మోంబాసా సాటర్ డే క్లబ్ ఫండ్ రైజింగ్లో MOMTA సభ్యుల ప్రదర్శన
సికింద్రాబాద్, డిసెంబర్ 07 ( ప్రజామంటలు) :
కెన్యా లోని మోంబాసా తెలుగు అసోసియేషన్ ( MOMTA) ఆధ్వర్యంలో ఫండ్ రైజింగ్ కొరకు "సాటర్ డే క్లబ్" నిర్వహించిన అసోసియేషన్ సభ్యుల సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది. బోర్ వెల్లుల ఏర్పాటు, విద్యార్థుల విద్యా సహాయం, భారీ నీటి నిల్వ ట్యాంకుల విరాళం, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు... కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు సత్యసాయి సేవా సమితి చేయూత
కొండగట్టు, డిసెంబర్ 06 (ప్రజా మంటలు):స్థానికంగా జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 20 మంది చిరు వ్యాపారుల షాపులు పూర్తిగా కాలిపోవడంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. పరిస్థితి తెలుసుకున్న భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల తరఫున తక్షణ సహాయం అందించారు.
సామ శ్రీనాథ్ కుటుంబ సభ్యులు, మహేష్ మొదలైన వారు... కాసేపు హాయిగా నవ్వుకోండి..చాలా సీరియస్ అంశం?
నేటి సామాజిక ఆలోచనలపై వ్యంగ్య రచన
(జర్నలిస్ట్ నాగ్ రాజ్ FB నుండి)
ఇందాక ఆకలేసి, దారిలో పంచెకట్టు దోశ సెంటర్ కనిపిస్తే వెళ్లా.
మెనూ చెక్ చేసి,"ఓ ఘీంకారం దోశ.. టోకెన్ ఇవ్వు" అనడిగా.
(అంటే ఏనుగు అరుపు కాదు) -ed
"అది ఘీంకారం కాదు, ఘీ కారం" అన్నాడాయన కోపంగా.
"ఓహ్,... జగిత్యాలలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శుభాకాంక్షల పరంపర
జగిత్యాల డిసెంబర్ 07 (ప్రజా మంటలు):
కన్వెన్షన్ హాల్లో శృంగేరి శారద పీఠ ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారి మహాభారత ప్రవచన మహాయజ్ఞం రెండో రోజు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రవచన... ఇండిగో సీఈఓ కు dgca నోటీస్
న్యూ ఢిల్లీ డిసెంబర్ 06;
ఇండిగో flights ఆలస్యాలు, క్రూ కొరత, ప్రయాణీకుల అసౌకర్యంపై దేశవ్యాప్తంగా వచ్చిన తీవ్ర విమర్శల నేపథ్యంలో, డీజీసీఏ నేరంగా ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. “మీపై తగిన అమలు చర్య ఎందుకు ప్రారంభించకూడదు?” అనే ప్రశ్నకు సంబంధించి, ఎల్బర్స్ 24 గంటల్లోపు వివరణ ఇవ్వాలని... IND vs SA: జైస్వాల్ తొలి వన్డే సెంచరీ – భారత్కు ఘన విజయం, సిరీస్ కైవసం
విశాఖపట్నం డిసెంబర్ 06:
టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ వన్డేల్లో తన మొదటి సెంచరీ నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో బోచ్ బౌలింగ్లో సింగిల్ తీసుకుని శతకం పూర్తి చేశాడు.
ఆరంభంలో రోహిత్ శర్మ (75) వేగంగా రాణించినా మహరాజ్ బౌలింగ్లో ఔటయ్యాడు. కోహ్లీ (33*)తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు.... తెలంగాణ ను దేశంలో ఆదర్శంగా నిలపడమే లక్ష్యం: రేవంత్ రెడ్డి
నల్లగొండ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఇప్పటికే వరి ఉత్పత్తి, శాంతి భద్రతలు, విద్య, వైద్య రంగం, మాదకద్రవ్యాల నియంత్రణలో దేశంలో నంబర్ వన్గా నిలిచిందని తెలిపారు. ఇందులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,... తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే :జగిత్యాల ఆర్డీవో మధుసూదన్
జగిత్యాల డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
వయోవృద్ధులైన తల్లిదండ్రులను పోషించాల్సిన భాద్యత పిల్లలదే నని విస్మరిస్తే జైలు శిక్ష జరిమానా తదితర చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగిత్యాల డివిజన్ ఆర్డీవో, వయో వృద్ధుల ట్రిబ్యునల్ చైర్మన్ పి. మధుసూదన్ హెచ్చరించారు. శనివారం ఆర్డీవో ఛాంబర్లో వృద్ధుల నిరాధరణ కేసులను విచారించారు.
జగిత్యాల రూరల్ మండలం గుల్లపేట... తులగంగవ్వ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు నివాళి
మెటుపల్లి డిసెంబర్ 06:మెట్పల్లి అంబేద్కర్ పార్క్లో డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా తుల గంగవ్వ ట్రస్ట్ చైర్మన్ డా. తుల రాజేందర్ కుమార్ అంబేద్కర్ సంఘాల నాయకులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. గ్రామాల్లో కోతుల బెడద నివారించే అభ్యర్థులనే గెలిపించండి : తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం పిలుపు
సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజామంటలు):
తెలంగాణ గ్రామాలను వేధిస్తున్న కోతుల సమస్యను పరిష్కరించగల అభ్యర్థులనే రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించాలని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (జై కిసాన్) విజ్ఞప్తి చేసింది. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్ లో ఫోరం ప్రతినిధులు మాట్లాడారు. కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యను... రాయికల్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి
రాయికల్ డిసెంబర్ 6(ప్రజా మంటలు)*గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులు సిబ్బంది విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి*
అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి శనివారం రాయికల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, నమోదు చేసిన రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి
ఈ... అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి. -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు
మెట్టుపల్లి డిసెంబర్ 6 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
భారత రత్న డా. బి. ఆర్. ఆశయాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. శనివారం అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన... 