హిందువులపై దాడిని సహించం: బజరంగ్ దళ్

- " హిందూ శక్తి ప్రదర్శన" యాత్రలో లక్షలాదిగా పాల్గొనాలని పిలుపు - విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పండరీనాథ్..

On
హిందువులపై దాడిని సహించం: బజరంగ్ దళ్

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493)

 

హైదరాబాద్ మార్చి 28 (ప్రజా మంటలు) : 

"తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హిందువులపై దాడులు పెరిగిపోయాయని.. దాడులు, దౌర్జన్యాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోము" అని భజరంగ్ దళ్ హెచ్చరించింది.

రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యం కల్పిస్తూ..ముస్లిం సంతుష్టికరణకు పాల్పడుతున్నారని.. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని ఆందోళన వ్యక్తం చేసింది.

మతమార్పిడి, లవ్ జిహాద్, దేవాలయాల భూముల కబ్జా, గోహత్య వంటి అనేక హిందూ వ్యతిరేక కార్యక్రమాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది.

బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బజరంగ్ దళ్ విలేకరుల సమావేశం నిర్వహించింది.

విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పండరీనాథ్, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శ్రీ శివరాములు మాట్లాడారు.

అంతకుముందు హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే వీర హనుమాన్ విజయ యాత్ర వాల్ పోస్టర్, కరపత్రం ఆవిష్కరించారు.

ఏప్రిల్ 23న భాగ్యనగర్ లో భారీ ఎత్తున హనుమాన్ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. వీర హనుమాన్ విజయ యాత్ర ర్యాలీలో దాదాపు మూడు లక్షల మంది బజరంగ్దళ్ కార్యకర్తలు పాల్గొని హిందూ శక్తి ప్రదర్శన నిర్వహిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు నగరంలోని హిందువులంతా సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి హిందువు హనుమాన్ జయంతి మహోత్సవంలో పాల్గొనాలని ఆహ్వానించారు.

ఇటీవల కాలంలో భాగ్యనగర్ తో పాటు, రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో హిందువులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాడులను అడ్డుకొని తగిన రీతిలో జవాబు చెప్పేందుకు బజరంగ్ దళ్ సిద్ధంగా ఉందన్నారు. 

భాగ్యనగరం శివారు ప్రాంతంలోని చెంగిచెర్ల పిట్టల బస్తీలో గిరిజనులపై ముస్లిం మూకల దాడిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు.

ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధితులపైనే పోలీసులు దాడి చేసి అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం ప్రజాస్వామ్య వ్యవస్థలో చీకటి అధ్యయనం అన్నారు. అన్ని మతాలకు సమానమని చెప్పుకునే భాగ్యనగరం నడిబొట్టున చంటి బిడ్డను ఎత్తుకున్న యువకుడి పై జిహాదీ మూకలు దాడికి దిగడం అమానవీయ చర్య అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా ఇప్పటికీ పోలీసులు స్పందించకపోవడం చూస్తుంటే, తెలంగాణలో రాజాకార్ల రాజ్యం ప్రారంభమైందని రుజువు అవుతుందన్నారు. నగరం మొత్తం సీసీ కెమెరాలతో నింపేసి, చీమచిటుక్కుమన్నా నిందితులను, దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పే పోలీసులు.. చార్మినార్ దగ్గర జరిగిన ఘటన, చెంగిచెర్ల ఘటనల పై ఇంకా నిందితులపై కేసులు నమోదు చేయకపోవడం హిందూ వ్యతిరేక చర్యా అని బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని.. వాటికి తగిన రీతిలో జవాబు చెప్పేందుకు హిందూ సమాజం సిద్ధంగా ఉండాలని వారు సూచించారు. హిందువుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మించుకున్నామని..

ఇక నేడు రామరాజ్యం కోసం హిందూ సమాజం సంఘటితం కావలసిన అవసరం ఆసన్నమైందని పేర్కొన్నారు. సంఘటితమైతేనే హిందూ వ్యతిరేక శక్తులు తోక ముడుస్తాయని, లేదంటే వారి ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతాయని పేర్కొన్నారు.

బజరంగ్దళ్ చేపట్టే వీర హనుమాన్ విజయ యాత్రలో భారీ సంఖ్యలో పాల్గొని హిందూ శక్తిని ప్రదర్శిద్దామని వారు పిలుపునిచ్చారు.

సమావేశంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీశ్వర్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, భాగ్యనగర్ విభాగ్ కార్యదర్శి వీరేశలింగం , బజరంగ్దళ్ నాయకులు బిరాధర్ రాము, శ్రీకాంత్, రాహుల్ తోపాటు జిల్లా కన్వీనర్లు, కో కన్వీనర్లు, ఇతర బాధ్యులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

State News 

జోగులాంబ అమ్మవారి ఆలయ అభివృద్ధికి ₹347 కోట్ల ప్రణాళిక - చిన్నారెడ్డి

జోగులాంబ అమ్మవారి ఆలయ అభివృద్ధికి ₹347 కోట్ల ప్రణాళిక - చిన్నారెడ్డి హైదరాబాద్ డిసెంబర్ 05 (ప్రజా మంటలు): తుంగభద్ర నది ఒడ్డున ఆలంపూర్‌లో కొలువైన పవిత్ర శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి ఆలయం అభివృద్ధికి ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. మొత్తం ₹347 కోట్లతో ఆలయాన్ని ఆధునికంగా, భక్తులకు అనుకూలంగా తీర్చిదిద్దే కార్యక్రమం రూపొందించారు. తక్షణ పనులకు ₹35 కోట్లు అవసరం బాలాలయం నిర్మాణం, వజ్రలేపనం, కుంభాభిషేకం...
Read More...
National  Comment 

ఇండిగో విమాన రద్దుల వెనుక అసలు కథ ఏమిటి?

ఇండిగో విమాన రద్దుల వెనుక అసలు కథ ఏమిటి? గత నాలుగు రోజులుుగా జరుగుతున్న ఇండిగో విమాన రద్దులపై, ప్రచారంలో ఉన్న సమాచారాన్ని ఆధారంగా తీసుకుని, కార్పొరేట్ పోరాటం కోణంలో ఒక సమగ్ర విశ్లేషణాత్మక కథనం. దేశవ్యాప్తంగా నాలుగు రోజులుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండిగో సంస్థకు చెందిన అనేక విమానాలు అకస్మాత్తుగా రద్దు కావడం, కొన్ని గంటల తరబడి ఆలస్యంగా నడవడం, ప్రయాణికులు...
Read More...
National  International   State News 

అమెరికా బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్నిప్రమాదం – ఇద్దరు తెలుగు విద్యార్థుల విషాద మరణం

అమెరికా బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్నిప్రమాదం – ఇద్దరు తెలుగు విద్యార్థుల విషాద మరణం బర్మింగ్‌హామ్ (అలబామా) డిసెంబర్ 05 (ప్రజా మంటలు): అమెరికా అలబామా రాష్ట్రంలోని బర్మింగ్‌హామ్ నగరంలో గురువారం ఉదయం జరిగిన భారీ అగ్నిప్రమాదం ఇద్దరు తెలుగు విద్యార్థుల ప్రాణాలు తీసింది. స్థానిక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు కాసేపటికే భవనం మొత్తం వ్యాపించడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అక్కడ నివాసముంటున్న మొత్తం 13 మంది...
Read More...

సోమాజిగూడలో అగ్నిప్రమాదం – శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్‌లో మంటలు

సోమాజిగూడలో అగ్నిప్రమాదం – శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్‌లో మంటలు హైదరాబాద్‌, డిసెంబర్ 05 (ప్రజా మంటలు): నగరంలోని సోమాజిగూడలో మంగళవారం సాయంత్రం పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది. భవనం ఐదో అంతస్తులో ఉన్న శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కిచెన్‌ ప్రాంతం నుంచి భారీగా పొగలు ఎగసిపడటంతో అక్కడి సిబ్బంది, భవనం నివాసితులు ఆందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న వెంటనే ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌కు...
Read More...
State News 

హన్మకొండ అడిషనల్ కలెక్టర్ ఏసీబీ వలలో

హన్మకొండ అడిషనల్ కలెక్టర్ ఏసీబీ వలలో హనుమకొండ, డిసెంబర్ 05 (ప్రజా మంటలు): హనుమకొండ అడిషనల్ కలెక్టర్‌గా, అలాగే ఇన్‌చార్జ్ డీఈవోగా పనిచేస్తున్న వెంకట్ రెడ్డి ఎసీబీ వలలో చిక్కారు. పుత్తూరు హైస్కూల్ అనుమతి పునరుద్ధరణ కోసం రూ.60,000 లంచం స్వీకరిస్తుండగా అతడిని అవినీతి నిరోధక శాఖ అధికారులు ట్రాప్ చేసినట్లు సమాచారం. వెంకట్ రెడ్డితో పాటు జూనియర్ అసిస్టెంట్ మనోజ్‌ను కూడా...
Read More...

జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబరచి జిల్లా పేరును నిలబెట్టాలి-జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్  బి.ఎస్. లత

జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబరచి జిల్లా పేరును నిలబెట్టాలి-జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్  బి.ఎస్. లత    జగిత్యాల డిసెంబర్  5 (ప్రజా మంటలు) పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియం లో జిల్లా స్థాయి పీఎం శ్రీ స్కూల్స్ ఆటల పోటీలను జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్  బి. ఎస్ లత ప్రారంభించారు. జగిత్యాల జిల్లా లోని 16 పీఎం శ్రీ స్కూల్స్ నుండి సుమారు 900 మంది విద్యార్థులు కబడ్డీ, కోకో, వాలి...
Read More...

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి : జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ 

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి : జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్      మెట్పల్లి  / ఇబ్రహీంపట్నం/ మేడిపల్లి డిసెంబర్ 5 (ప్రజా మంటలు)  శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా అన్ని వర్గాల ప్రజలు సహకరించాలి  ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరిచే ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో సాగేందుకు పోలీస్ శాఖ పరంగా కావలసిన భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పి...
Read More...
Local News 

బలిదానాలు వద్దు  బరి గీసి పోరాడుదాం–బీసీఐఎఫ్ చైర్మన్, మాజీ ఐఏఎస్ చిరంజీవిలు 

బలిదానాలు వద్దు  బరి గీసి పోరాడుదాం–బీసీఐఎఫ్ చైర్మన్, మాజీ ఐఏఎస్ చిరంజీవిలు  సికింద్రాబాద్, డిసెంబర్ 05 (విప్రజామంటలు): బీసీలకు 42శాతం  రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుని ఆత్మహుతికి ప్రయత్నించి, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందిన సాయి ఈశ్వర్ చారి మృతదేహాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులను మాజీ ఐఏఎస్ చిరంజీవులు పరామర్శించారు. అనంతరం ఆయన...
Read More...
Local News 

జగిత్యాల గ్రామాల్లో ఏకగ్రీవ సర్పంచ్ ఎన్నికలు – జీవన్ రెడ్డి శుభాకాంక్షలు

జగిత్యాల గ్రామాల్లో ఏకగ్రీవ సర్పంచ్ ఎన్నికలు – జీవన్ రెడ్డి శుభాకాంక్షలు జగిత్యాల (రూరల్) డిసెంబర్ (ప్రజా మంటలు): జగిత్యాల రూరల్ మండలం చర్లపల్లిలో సర్పంచ్ మేడిపల్లి వనిత ఆనంద్, ఉప సర్పంచ్ దుమల సుమన్‌తో పాటు ఆరు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోవైపు కన్నపూర్ గ్రామంలో పోట్టవత్తిని సతీష్ సర్పంచ్‌గా ఏకగ్రీవం అయ్యారు. ఇందిరా భవన్‌లో రెండు గ్రామాల ఎన్నికైన ప్రతినిధులు మాజీ మంత్రి ...
Read More...
State News 

“ప్రాణాలు ఇవ్వడం పంథా కాదు” - సాయి ఈశ్వర్ చారి భౌతిక ఖాయానికి కవిత నివాళి

“ప్రాణాలు ఇవ్వడం పంథా కాదు” - సాయి ఈశ్వర్ చారి భౌతిక ఖాయానికి కవిత నివాళి జగద్గిరిగుట్ట, డిసెంబర్ 5 (ప్రజా మంటలు): బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్‌తో ఆత్మహత్య చేసిన సాయి ఈశ్వర్ చారి భౌతిక ఖాయానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. అనంతరం ఆయన భార్య, తల్లి, పిల్లలను ఓదార్చారు. కవిత గారు మాట్లాడుతూ,“సాయి ఈశ్వరాచారి మరణం చాలా బాధాకరం. చావు సొల్యూషన్ కాదు.”“బీసీ...
Read More...

నిబందనల ప్రకారం పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

నిబందనల ప్రకారం పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ జగిత్యాల డిసెంబర్ 5 (ప్రజా మంటలు)పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జోనల్ అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఎన్నికల నిబందనల ప్రకారం పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని  జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సూచించారు. జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్  సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై...
Read More...
Local News 

ఎన్నికల పీఓల–శిక్షణ కార్యక్రమం ప్రారంభం

ఎన్నికల పీఓల–శిక్షణ కార్యక్రమం ప్రారంభం ఇబ్రహీంపట్నం డిసెంబర్ 5 (ప్రజా మంటలు - దగ్గుల అశోక్):ఇబ్రహీంపట్నం మండలంలోని జడ్పీహెచ్‌ఎస్‌లో శుక్రవారం జరిగిన మొదటి విడత ఎన్నికల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్వయంగా హాజరై పర్యవేక్షించారు. పోలింగ్ డే నాడు పీఓలు, ప్రొసీడింగ్ ఆఫీసర్‌లు చేపట్టాల్సిన బాధ్యతలు, పోలింగ్ ప్రక్రియలో అనుసరించాల్సిన నిబంధనలు, భద్రతా చర్యలు, ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగంపై...
Read More...