హిందువులపై దాడిని సహించం: బజరంగ్ దళ్

- " హిందూ శక్తి ప్రదర్శన" యాత్రలో లక్షలాదిగా పాల్గొనాలని పిలుపు - విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పండరీనాథ్..

On
హిందువులపై దాడిని సహించం: బజరంగ్ దళ్

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493)

 

హైదరాబాద్ మార్చి 28 (ప్రజా మంటలు) : 

"తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హిందువులపై దాడులు పెరిగిపోయాయని.. దాడులు, దౌర్జన్యాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోము" అని భజరంగ్ దళ్ హెచ్చరించింది.

రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యం కల్పిస్తూ..ముస్లిం సంతుష్టికరణకు పాల్పడుతున్నారని.. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని ఆందోళన వ్యక్తం చేసింది.

మతమార్పిడి, లవ్ జిహాద్, దేవాలయాల భూముల కబ్జా, గోహత్య వంటి అనేక హిందూ వ్యతిరేక కార్యక్రమాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది.

బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బజరంగ్ దళ్ విలేకరుల సమావేశం నిర్వహించింది.

విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పండరీనాథ్, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శ్రీ శివరాములు మాట్లాడారు.

అంతకుముందు హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే వీర హనుమాన్ విజయ యాత్ర వాల్ పోస్టర్, కరపత్రం ఆవిష్కరించారు.

ఏప్రిల్ 23న భాగ్యనగర్ లో భారీ ఎత్తున హనుమాన్ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. వీర హనుమాన్ విజయ యాత్ర ర్యాలీలో దాదాపు మూడు లక్షల మంది బజరంగ్దళ్ కార్యకర్తలు పాల్గొని హిందూ శక్తి ప్రదర్శన నిర్వహిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు నగరంలోని హిందువులంతా సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి హిందువు హనుమాన్ జయంతి మహోత్సవంలో పాల్గొనాలని ఆహ్వానించారు.

ఇటీవల కాలంలో భాగ్యనగర్ తో పాటు, రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో హిందువులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాడులను అడ్డుకొని తగిన రీతిలో జవాబు చెప్పేందుకు బజరంగ్ దళ్ సిద్ధంగా ఉందన్నారు. 

భాగ్యనగరం శివారు ప్రాంతంలోని చెంగిచెర్ల పిట్టల బస్తీలో గిరిజనులపై ముస్లిం మూకల దాడిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు.

ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధితులపైనే పోలీసులు దాడి చేసి అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం ప్రజాస్వామ్య వ్యవస్థలో చీకటి అధ్యయనం అన్నారు. అన్ని మతాలకు సమానమని చెప్పుకునే భాగ్యనగరం నడిబొట్టున చంటి బిడ్డను ఎత్తుకున్న యువకుడి పై జిహాదీ మూకలు దాడికి దిగడం అమానవీయ చర్య అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా ఇప్పటికీ పోలీసులు స్పందించకపోవడం చూస్తుంటే, తెలంగాణలో రాజాకార్ల రాజ్యం ప్రారంభమైందని రుజువు అవుతుందన్నారు. నగరం మొత్తం సీసీ కెమెరాలతో నింపేసి, చీమచిటుక్కుమన్నా నిందితులను, దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పే పోలీసులు.. చార్మినార్ దగ్గర జరిగిన ఘటన, చెంగిచెర్ల ఘటనల పై ఇంకా నిందితులపై కేసులు నమోదు చేయకపోవడం హిందూ వ్యతిరేక చర్యా అని బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని.. వాటికి తగిన రీతిలో జవాబు చెప్పేందుకు హిందూ సమాజం సిద్ధంగా ఉండాలని వారు సూచించారు. హిందువుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మించుకున్నామని..

ఇక నేడు రామరాజ్యం కోసం హిందూ సమాజం సంఘటితం కావలసిన అవసరం ఆసన్నమైందని పేర్కొన్నారు. సంఘటితమైతేనే హిందూ వ్యతిరేక శక్తులు తోక ముడుస్తాయని, లేదంటే వారి ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతాయని పేర్కొన్నారు.

బజరంగ్దళ్ చేపట్టే వీర హనుమాన్ విజయ యాత్రలో భారీ సంఖ్యలో పాల్గొని హిందూ శక్తిని ప్రదర్శిద్దామని వారు పిలుపునిచ్చారు.

సమావేశంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీశ్వర్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, భాగ్యనగర్ విభాగ్ కార్యదర్శి వీరేశలింగం , బజరంగ్దళ్ నాయకులు బిరాధర్ రాము, శ్రీకాంత్, రాహుల్ తోపాటు జిల్లా కన్వీనర్లు, కో కన్వీనర్లు, ఇతర బాధ్యులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

ధర్మపురి మం "నేరెళ్ల లోనే జవహర్ నవోదయ నెలకొల్పాలని కేంద్రమంత్రికి ప్రభుత్వ విప్, ఎంపి వినతి

ధర్మపురి మం ఢిల్లీ ఫిబ్రవరి 11 ( ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్రంలోని ధర్మపురి మండలం నేరెళ్లలో జవహర్ నవోదయ విద్యాలయాన్ని సకాలంలో అమలు చేయాలని కేంద్ర విద్య శాఖ మంత్రివర్యులు ధర్మేంద్ర ప్రధాన్ కలిసిన ప్రభుత్వ విప్పు లక్ష్మణ్ కుమార్  *కేంద్ర ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయన్ని ధర్మపురి మండలం నేరెళ్లలో మంజూరు చేయగా దాన్ని తరలించకుండ...
Read More...
Local News 

ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జగిత్యాల ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు)జగిత్యాల రూరల్ మం అంబర్ పేట గ్రామములో కొండపై స్వయంభుగా వెలసినశ్రీవేంకటేశ్వర స్వామి వారి 25 వ వార్షిక బ్రహ్మోత్సవాలు  లో భాగంగా  మంగళవారం రెండవ రోజులో భాగంగా ఘనంగానిర్వహించిన కార్యక్రమాలు విశ్వక్సేన విధి వాసుదేవ పుణ్యాహవాచనం, అంకురారోపణ ముత్సాంగ్గ్రహణం, ఆచార్య రిత్వికరణం, వైనతేయ ప్రతిష్టా విధి...
Read More...
Local News  State News 

రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 

రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం  రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం  రైతుల సంక్షేమం కోసం రూ. 55,256 కోట్లు వ్యయం చేసిన ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే రైతులకు మేలు పదేళ్ల కాలంలో రైతులకు బీ.ఆర్.ఎస్. చేసిందేమీ లేదు  - రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి  హైదరాబాద్ ఫిబ్రవరి 11: కాంగ్రెస్...
Read More...
Local News 

సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్​ ఫిబ్రవరి 11 (

సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి  సికింద్రాబాద్​ ఫిబ్రవరి 11 ( సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్​ ఫిబ్రవరి 11 (ప్రజామంటలు): పద్మారావునగర్​ లోని స్కందగిరి శ్రీసుబ్రహ్మాణ్యస్వామి ఆలయాన్ని మాజీ మంత్రి,రాష్ర్ట బీజేపీ నాయకులు మర్రి శశిధర్​ రెడ్డి మంగళవారం సందర్శించారు. తైపూసం పాల్గుడి కావడి పౌర్ణమి వేడుకల సందర్బంగా స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు మర్రిశశిధర్​ రెడ్డిని శాలువాతో...
Read More...
Local News 

జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం

జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం సికింద్రాబాద్​, ఫిబ్రవరి 11 ( ప్రజామంటలు): బన్సీలాల్ పేట్ లోని చాచా నెహ్రూ నగర్ కమ్యునిటీ హాలులో మంగళవారం జరిగిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.  రెయిన్ బో ఫౌండేషన్ ఇండియా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రైయిన్ బో కమ్యూనిటీ కేర్...
Read More...

#Draft: Add Your Title

#Draft: Add Your Title మహాంకాళి పీఎస్​ పరిధిలో యువతి మిస్సింగ్​సికింద్రాబాద్​ ఫిబ్రవరి 11 (ప్రజామంటలు): సికింద్రాబాద్​ మహాంకాళి పీఎస్​ పరిధిలో ఓ యువతి మిస్సింగ్​ అయింది. ఇన్​స్పెక్టర్​ పరశురామ్​ తెలిపిన వివరాల ప్రకారం..సుభాష్​ నగర్​ కు చెందిన బట్టిన్వర్​ నేహా(19) ప్యాట్నీ సెంటర్​ లోని చెన్నై షాపింగ్​ మాల్​ లో సేల్స్​ గర్ల్​ గా పనిచేస్తోంది. ఈనెల...
Read More...
Local News 

స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు

స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు సికింద్రాబాద్​ ఫిబ్రవరి 11 (ప్రజామంటలు) : పద్మారావునగర్​ లోని స్కందగిరి శ్రీసుబ్రహ్మాణ్యస్వామి ఆలయంలో మంగళవారం తైపూసం పాలకావడి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి, శ్రీసుబ్రహ్మాణ్యస్వామి వార్లను దర్శించుకున్నారు. భుజాన పాల కలశంతో కూడిన కావడిని ఎత్తుకొని ఆలయం చుట్టు ప్రదక్షిణ...
Read More...
Local News 

నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్ 

నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్  ▪️ జగిత్యాల ఫిబ్రవరి 11(ప్రజా మంటలు)  హైదరాబాదులో నిర్వహించిన నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్  తెలంగాణ మైనార్టీ జూనియర్ కాలేజ్ విద్యార్థి  ఎండీ అయా నొద్దీన్ ( ఏం పీ సి 1 సం:) గోల్డ్ మెడల్ సాధించినందుకు  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  గారు అభినందించారు ఈ కార్యక్రమంలో మైనార్టీ జూనియర్ కళాశాల...
Read More...
Local News 

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు జగిత్యాల ఫిబ్రవరి 11(ప్రజా మంటలు)300 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన జగిత్యాల రూరల్ మం  అంబారి పేట  శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే దేవాలయం వద్ద బోర్డును ఏర్పాటు చేశామని, ఏ మతాన్ని గానీ వ్యక్తులను గానీ కించపరచాలనే ఉద్దేశం తమ గ్రామస్తులకు లేదని అంబారిపేట గ్రామస్తులు స్పష్టం చేశారు....
Read More...
Local News 

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు జగిత్యాల ఫిబ్రవరి 11(ప్రజా మంటలు)300 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన జగిత్యాల రూరల్ మం  అంబారి పేట  శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే దేవాలయం వద్ద బోర్డును ఏర్పాటు చేశామని, ఏ మతాన్ని గానీ వ్యక్తులను గానీ కించపరచాలనే ఉద్దేశం తమ గ్రామస్తులకు లేదని అంబారిపేట గ్రామస్తులు స్పష్టం చేశారు....
Read More...
Local News 

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి బ్రహ్మోత్సవ  ఆహ్వాన పత్రిక అందజేత

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి బ్రహ్మోత్సవ  ఆహ్వాన పత్రిక అందజేత    జగిత్యాల ఫిబ్రవరి 11(ప్రజా మంటలు)పట్టణంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  నివాసంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి పురాని పేట , బోయవాడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో హాజరు కావాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ  కి ఆహ్వాన పత్రిక అందజేశారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి...
Read More...
National  International   State News 

మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి

మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి అమెరికా విదేశీ అవినీతి చట్టాన్ని ట్రంప్ సస్పెండ్ చేశారు; అదానీ గ్రూప్ స్టాక్స్ పెరిగాయి మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి వాషింగ్టన్, ఫిబ్రవరి 11: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ అధికారులకు లంచం ఇవ్వకుండా అమెరికా కంపెనీలు నిషేధించే చట్టం అమలును నిలిపివేయడానికి ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసిన తర్వాత,...
Read More...