హిందువులపై దాడిని సహించం: బజరంగ్ దళ్
- " హిందూ శక్తి ప్రదర్శన" యాత్రలో లక్షలాదిగా పాల్గొనాలని పిలుపు - విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పండరీనాథ్..
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493)
హైదరాబాద్ మార్చి 28 (ప్రజా మంటలు) :
"తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హిందువులపై దాడులు పెరిగిపోయాయని.. దాడులు, దౌర్జన్యాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోము" అని భజరంగ్ దళ్ హెచ్చరించింది.
రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యం కల్పిస్తూ..ముస్లిం సంతుష్టికరణకు పాల్పడుతున్నారని.. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని ఆందోళన వ్యక్తం చేసింది.
మతమార్పిడి, లవ్ జిహాద్, దేవాలయాల భూముల కబ్జా, గోహత్య వంటి అనేక హిందూ వ్యతిరేక కార్యక్రమాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది.
బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బజరంగ్ దళ్ విలేకరుల సమావేశం నిర్వహించింది.
విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పండరీనాథ్, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శ్రీ శివరాములు మాట్లాడారు.
అంతకుముందు హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే వీర హనుమాన్ విజయ యాత్ర వాల్ పోస్టర్, కరపత్రం ఆవిష్కరించారు.
ఏప్రిల్ 23న భాగ్యనగర్ లో భారీ ఎత్తున హనుమాన్ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. వీర హనుమాన్ విజయ యాత్ర ర్యాలీలో దాదాపు మూడు లక్షల మంది బజరంగ్దళ్ కార్యకర్తలు పాల్గొని హిందూ శక్తి ప్రదర్శన నిర్వహిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు నగరంలోని హిందువులంతా సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి హిందువు హనుమాన్ జయంతి మహోత్సవంలో పాల్గొనాలని ఆహ్వానించారు.
ఇటీవల కాలంలో భాగ్యనగర్ తో పాటు, రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో హిందువులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాడులను అడ్డుకొని తగిన రీతిలో జవాబు చెప్పేందుకు బజరంగ్ దళ్ సిద్ధంగా ఉందన్నారు.
భాగ్యనగరం శివారు ప్రాంతంలోని చెంగిచెర్ల పిట్టల బస్తీలో గిరిజనులపై ముస్లిం మూకల దాడిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు.
ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధితులపైనే పోలీసులు దాడి చేసి అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం ప్రజాస్వామ్య వ్యవస్థలో చీకటి అధ్యయనం అన్నారు. అన్ని మతాలకు సమానమని చెప్పుకునే భాగ్యనగరం నడిబొట్టున చంటి బిడ్డను ఎత్తుకున్న యువకుడి పై జిహాదీ మూకలు దాడికి దిగడం అమానవీయ చర్య అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా ఇప్పటికీ పోలీసులు స్పందించకపోవడం చూస్తుంటే, తెలంగాణలో రాజాకార్ల రాజ్యం ప్రారంభమైందని రుజువు అవుతుందన్నారు. నగరం మొత్తం సీసీ కెమెరాలతో నింపేసి, చీమచిటుక్కుమన్నా నిందితులను, దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పే పోలీసులు.. చార్మినార్ దగ్గర జరిగిన ఘటన, చెంగిచెర్ల ఘటనల పై ఇంకా నిందితులపై కేసులు నమోదు చేయకపోవడం హిందూ వ్యతిరేక చర్యా అని బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని.. వాటికి తగిన రీతిలో జవాబు చెప్పేందుకు హిందూ సమాజం సిద్ధంగా ఉండాలని వారు సూచించారు. హిందువుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మించుకున్నామని..
ఇక నేడు రామరాజ్యం కోసం హిందూ సమాజం సంఘటితం కావలసిన అవసరం ఆసన్నమైందని పేర్కొన్నారు. సంఘటితమైతేనే హిందూ వ్యతిరేక శక్తులు తోక ముడుస్తాయని, లేదంటే వారి ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతాయని పేర్కొన్నారు.
బజరంగ్దళ్ చేపట్టే వీర హనుమాన్ విజయ యాత్రలో భారీ సంఖ్యలో పాల్గొని హిందూ శక్తిని ప్రదర్శిద్దామని వారు పిలుపునిచ్చారు.
సమావేశంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీశ్వర్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, భాగ్యనగర్ విభాగ్ కార్యదర్శి వీరేశలింగం , బజరంగ్దళ్ నాయకులు బిరాధర్ రాము, శ్రీకాంత్, రాహుల్ తోపాటు జిల్లా కన్వీనర్లు, కో కన్వీనర్లు, ఇతర బాధ్యులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయం: జి. రాజేశం గౌడ్
హైదరాబాద్, జనవరి 18 (ప్రజా మంటలు):
మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి, తెలంగాణ తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్ ఎన్టీఆర్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1985–1990 మధ్యకాలంలో ఎన్టీఆర్ దూరదృష్టి, ప్రజాహిత పాలనతో న్యాయవ్యవస్థలో సంస్కరణలు, మహిళలకు... నిజాంపేట్ లో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి
సికింద్రాబాద్, జనవరి 18 ( ప్రజా మంటలు):
దివంగత మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా నిజాంపేట్ లో ఆదివారం పలువురు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా నిజాంపేట్ అధ్యక్షులు పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ..బీసీ, ఎస్సీ,ఎస్టీలకు రాజకీయ అవకాశాలు... స్వర్గీయ ఎన్టీరామారావు 30వ వర్ధంతి.. నివాళి అర్పించిన ఎన్టీఆర్ అభిమానులు
గొల్లపల్లి జనవరి 18 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం కేంద్రంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలు, వేసి అభిమానులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ బీసీ రాష్ట్ర సెల్ ఉపాధ్యక్షులు ఓరగంటి భార్గవ్, మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్, బడుగు బలహీన వర్గాల నాయకుడుగానిరుపేద గుండెల్లో దేవుడిగా ఉన్నారని అన్నారు.
నాడు పేద ప్రజల... ఎన్నికల హామీల అమలే ప్రజాప్రభుత్వ లక్ష్యం – గృహ జ్యోతి పథకం లబ్ధిదారులకు పత్రాల పంపిణీ
చిగురుమామిడి, జనవరి 18 (ప్రజా మంటలు):
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారని చిగురుమామిడి మాజీ జడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గృహలక్ష్మి, గృహ జ్యోతి వంటి పథకాల ద్వారా లక్షలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని... ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 3.83 కోట్ల నిధుల విడుదల
ఇబ్రహీంపట్నం జనవరి 18( ప్రజా మంటలు దగ్గుల అశోక్)
నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్ ఆదేశాల మేరకు రోడ్డు నిర్మాణం పనుల పరశీలన మండల బీజేపీ అధ్యక్షులు బాయి లింగారెడ్డి ఇబ్రహీంపట్నం నుండి ఫకీర్ కొండాపూర్ వరకు ప్రధాన మంత్రి గ్రామీణ సడక్యో జన కింద విడుదల ఐనా 3.83 కోట్ల నిధులు మంజూరయ్యాయి.
ఈ... జగిత్యాల అభివృద్ధే నా లక్ష్యం – అసత్య ఆరోపణలకు ప్రజలే సమాధానం చెబుతారు: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
విమర్శించే ముందు గతాన్ని గుర్తుంచుకోవాలి
ఉద్దేశపూర్వక ఆరోపణలు, హింసా రాజకీయాలు వద్దు
జగిత్యాలకు అత్యధిక నిధులు – అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారు
(సిరిసిల్ల రాజేందర్ శర్మ)
జగిత్యాల, జనవరి 18 (ప్రజా మంటలు):
జగిత్యాల మోతే పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడారు. జగిత్యాల అభివృద్ధి కోసం... జగిత్యాల బ్రాహ్మణ సేవా సంఘం ఆత్మీయ సమ్మేళనం _తుంగూరు సర్పంచ్ కు సన్మానం
జగిత్యాల జనవరి 18 జగిత్యాల అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆత్మీయ సమ్మేళనం విద్యానగర్లోని ఎడ్ల అంగడి సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో తంగూరి గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన అర్షకోట రాజగోపాల్రావుకు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించారు.
ఈ సందర్భంగా... స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ...
సికింద్రాబాద్, జనవరి 18( ప్రజామంటలు):
హైదరాబాద్ నగరంలో ఫుట్పాత్లపై జీవనం సాగిస్తున్న అబాగ్యులు, నిరాశ్రయులు, సంచారజాతులను గుర్తించి స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజంలోని అత్యంత పేద వర్గాల జీవన పరిస్థితులకు కొంతైనా ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్... అన్నపూర్ణ సేవా సమితి వారి అన్న ప్రసాదం ప్రారంభించిన ఎమ్మెల్సీ ఎల్ రమణ
జగిత్యాల జనవరి 18 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం విద్యా నగర్ ఎడ్లంగడి సమీపంలో ని, శ్రీ సీతా రామాంజనేయ దేవాలయం లో, అన్నపూర్ణ సేవాసమితి, వారు అన్న ప్రసాద వితరణ ఈ ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎల్ రమణ హాజరై అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ కమిటీ... తప్పిపోయిన యువకుడు ఆత్మహత్య – బట్టపల్లి శివారులో మృతదేహం లభ్యం
గొల్లపల్లి, జనవరి 18 (ప్రజా మంటలు):
ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన మంద నరేష్ (35) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం భార్యతో కిరాణా షాపుకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన నరేష్ తిరిగి ఇంటికి రాలేదు.
కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత వెతికినా... డ్రంక్ అండ్ డ్రైవ్ నివారణ పై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు
జగిత్యాల జనవరి 18 ( ప్రజా మంటలు)జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో *“Arrive Alive”* రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు (6వ రోజు) *“Drunk and Drive – Zero Tolerance Day”* పై అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా... ఖమ్మం ఏదులాపురంలో రూ.362 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
రూ.362 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో దాదాపు రూ.362 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మున్నేరు నుంచి పాలేరు లింక్ కెనాల్, ఏదులాపురంలోని జేఎన్టీయూ కళాశాలకు శంకుస్థాపన చేశారు.
ఆసుపత్రి, మార్కెట్ యార్డు, నర్సింగ్ కాలేజీ
కూసుమంచిలో ... 