హిందువులపై దాడిని సహించం: బజరంగ్ దళ్

- " హిందూ శక్తి ప్రదర్శన" యాత్రలో లక్షలాదిగా పాల్గొనాలని పిలుపు - విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పండరీనాథ్..

On
హిందువులపై దాడిని సహించం: బజరంగ్ దళ్

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493)

 

హైదరాబాద్ మార్చి 28 (ప్రజా మంటలు) : 

"తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హిందువులపై దాడులు పెరిగిపోయాయని.. దాడులు, దౌర్జన్యాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోము" అని భజరంగ్ దళ్ హెచ్చరించింది.

రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యం కల్పిస్తూ..ముస్లిం సంతుష్టికరణకు పాల్పడుతున్నారని.. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని ఆందోళన వ్యక్తం చేసింది.

మతమార్పిడి, లవ్ జిహాద్, దేవాలయాల భూముల కబ్జా, గోహత్య వంటి అనేక హిందూ వ్యతిరేక కార్యక్రమాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది.

బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బజరంగ్ దళ్ విలేకరుల సమావేశం నిర్వహించింది.

విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పండరీనాథ్, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శ్రీ శివరాములు మాట్లాడారు.

అంతకుముందు హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే వీర హనుమాన్ విజయ యాత్ర వాల్ పోస్టర్, కరపత్రం ఆవిష్కరించారు.

ఏప్రిల్ 23న భాగ్యనగర్ లో భారీ ఎత్తున హనుమాన్ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. వీర హనుమాన్ విజయ యాత్ర ర్యాలీలో దాదాపు మూడు లక్షల మంది బజరంగ్దళ్ కార్యకర్తలు పాల్గొని హిందూ శక్తి ప్రదర్శన నిర్వహిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు నగరంలోని హిందువులంతా సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి హిందువు హనుమాన్ జయంతి మహోత్సవంలో పాల్గొనాలని ఆహ్వానించారు.

ఇటీవల కాలంలో భాగ్యనగర్ తో పాటు, రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో హిందువులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాడులను అడ్డుకొని తగిన రీతిలో జవాబు చెప్పేందుకు బజరంగ్ దళ్ సిద్ధంగా ఉందన్నారు. 

భాగ్యనగరం శివారు ప్రాంతంలోని చెంగిచెర్ల పిట్టల బస్తీలో గిరిజనులపై ముస్లిం మూకల దాడిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు.

ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధితులపైనే పోలీసులు దాడి చేసి అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం ప్రజాస్వామ్య వ్యవస్థలో చీకటి అధ్యయనం అన్నారు. అన్ని మతాలకు సమానమని చెప్పుకునే భాగ్యనగరం నడిబొట్టున చంటి బిడ్డను ఎత్తుకున్న యువకుడి పై జిహాదీ మూకలు దాడికి దిగడం అమానవీయ చర్య అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా ఇప్పటికీ పోలీసులు స్పందించకపోవడం చూస్తుంటే, తెలంగాణలో రాజాకార్ల రాజ్యం ప్రారంభమైందని రుజువు అవుతుందన్నారు. నగరం మొత్తం సీసీ కెమెరాలతో నింపేసి, చీమచిటుక్కుమన్నా నిందితులను, దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పే పోలీసులు.. చార్మినార్ దగ్గర జరిగిన ఘటన, చెంగిచెర్ల ఘటనల పై ఇంకా నిందితులపై కేసులు నమోదు చేయకపోవడం హిందూ వ్యతిరేక చర్యా అని బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని.. వాటికి తగిన రీతిలో జవాబు చెప్పేందుకు హిందూ సమాజం సిద్ధంగా ఉండాలని వారు సూచించారు. హిందువుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మించుకున్నామని..

ఇక నేడు రామరాజ్యం కోసం హిందూ సమాజం సంఘటితం కావలసిన అవసరం ఆసన్నమైందని పేర్కొన్నారు. సంఘటితమైతేనే హిందూ వ్యతిరేక శక్తులు తోక ముడుస్తాయని, లేదంటే వారి ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతాయని పేర్కొన్నారు.

బజరంగ్దళ్ చేపట్టే వీర హనుమాన్ విజయ యాత్రలో భారీ సంఖ్యలో పాల్గొని హిందూ శక్తిని ప్రదర్శిద్దామని వారు పిలుపునిచ్చారు.

సమావేశంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీశ్వర్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, భాగ్యనగర్ విభాగ్ కార్యదర్శి వీరేశలింగం , బజరంగ్దళ్ నాయకులు బిరాధర్ రాము, శ్రీకాంత్, రాహుల్ తోపాటు జిల్లా కన్వీనర్లు, కో కన్వీనర్లు, ఇతర బాధ్యులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

సాహితీవేత్త ,విద్యావేత్త ఎమ్ వి నరసింహారెడ్డి భౌతిక కాయానికి అంతిమ నివాళులు 

సాహితీవేత్త ,విద్యావేత్త ఎమ్ వి నరసింహారెడ్డి భౌతిక కాయానికి అంతిమ నివాళులు  జగిత్యాల జూన్ 10 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రం కు చెందిన ప్రముఖ సాహితీవేత్త విద్యావేత్త ఎంవీ నరసింహారెడ్డి సోమవారం సాయంత్రం మృతి చెందగా బుధవారం ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నరసింహారెడ్డి కుమారులు శ్రీనివాస్ రెడ్డి శ్రీధర్ రెడ్డిలు చితికి నిప్పు అంటించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతిమయాత్రలో బంధువులు అభిమానులు శిష్యులు కళాశాల...
Read More...
Local News 

రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కంటిదానం ,నేత్రదాన ప్రతిజ్ఞ అవగాహన

రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కంటిదానం ,నేత్రదాన ప్రతిజ్ఞ అవగాహన    జగిత్యాల : జూన్ 10(ప్రజా మంటలు) ప్రపంచ నేత్రదాన దినోత్సవం జూన్ 10, సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ - రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో ఎల్.వి. ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ, హైదరాబాద్ వారి సహకారంతో బుధవారం పెన్షనర్స్ భవన్ (కోర్ట్ ప్రక్కన) “కంటి దానం – నేత్రదాన ప్రతిజ్ఞ, అవగాహన కార్యక్రమం”...
Read More...
Local News 

స్వర్గీయ మంచాల రామేశం నేత్రాలను దానం చేసిన కుటుంబ సభ్యులు

స్వర్గీయ మంచాల రామేశం నేత్రాలను దానం చేసిన కుటుంబ సభ్యులు జగిత్యాల జూన్ 10(ప్రజా మంటలు)స్వర్గీయ మంచాల రామేశం నేత్రాలను సేకరించిన ఎల్ వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ టెక్నీషియన్ కు జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.సునీల్ కుమార్, ఎం సి హెచ్ సూపరింటెండెంట్ డా. కృష్ణమూర్తి, రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ సిరిసిల్లశ్రీనివాస్, రోటరీసభ్యులు టీవి సూర్యం ద్వారా అందజేస్తున్న రామేశం కుమారుడు మంచాల...
Read More...
Local News 

దేశంలో అత్యంత దీర్ఘకాలం ప్రధాని అవుతానని ఎప్పుడూ ఊహించలేదు: ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ

దేశంలో అత్యంత దీర్ఘకాలం ప్రధాని అవుతానని ఎప్పుడూ ఊహించలేదు: ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ, జూన్ 10 (ప్రజా మంటలు): దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఢిల్లీలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) నాయకుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశంలో అత్యంత కాలం ప్రధాని పదవిలో కొనసాగుతానని తాను ఎప్పుడూ ఊహించలేదని వ్యాఖ్యానించారు....
Read More...
State News 

నెహ్రూ 17 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించారు – చరిత్రను వక్రీకరించొద్దు: డాక్టర్. చిన్నారెడ్డి

నెహ్రూ 17 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించారు – చరిత్రను వక్రీకరించొద్దు: డాక్టర్. చిన్నారెడ్డి హైదరాబాద్, జూన్ 10 (ప్రజా మంటలు): జవహర్‌లాల్ నెహ్రూ కంటే ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కువ కాలం దేశాన్ని పాలించారని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారం చారిత్రక వాస్తవాలకు విరుద్ధమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి విమర్శించారు. చరిత్రను వక్రీకరించడం దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆయన పేర్కొన్నారు. ఒక...
Read More...
Local News 

మహిళల భద్రతపై ప్రభుత్వం విఫలమైంది: కవిత

మహిళల భద్రతపై ప్రభుత్వం విఫలమైంది: కవిత హైదరాబాద్, జూన్ 10 (ప్రజా మంటలు): రాష్ట్రంలో మహిళలు, బాలికలపై పెరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన దారుణ ఘటన, మల్కాజిగిరిలో మహిళ హత్య రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. ఖమ్మం ఘటనలో నిందితుడికి కఠిన శిక్ష విధించాలని,...
Read More...
State News 

వడ్ల కొనుగోళ్లలో రూ.107 కోట్ల అవినీతి: మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్

వడ్ల కొనుగోళ్లలో రూ.107 కోట్ల అవినీతి: మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ జగిత్యాల, జూన్ 10 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కొప్పుల ఈశ్వర ఆరోపించారు. ఈ అంశంపై జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిర్వహించిన విలేకరుల సమావేశానికి ప్రతిస్పందిస్తూ ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ తరచూ “రాజీనామా చేస్తా”...
Read More...
State News 

మురళీధర్ దేశ్ పాండే మృతి పట్ల ప్రగాఢ సంతాపం

మురళీధర్ దేశ్ పాండే మృతి పట్ల ప్రగాఢ సంతాపం హైదరాబాద్, జూన్ 10 (ప్రజా మంటలు): తెలంగాణ ఉద్యమకారుడు, సోషలిస్టు నాయకుడు, తెలంగాణ జానపద సకల కళాకారుల పరిరక్షణ జేఏసీ చైర్మన్ శ్రీ మురళీధర్ దేశ్ పాండే  మరణం అత్యంత బాధాకరం.తెలంగాణ ఉద్యమ సమయంలో కళాకారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వారి హక్కులు, గుర్తింపు, సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనది. తెలంగాణ...
Read More...
Local News 

ఎం.వి నరసింహారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

ఎం.వి నరసింహారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జగిత్యాల జూన్ 9(ప్రజా మంటలు)జగిత్యాల ఎస్ కె ఎల్ ఎన్ ఆర్ బిఈడి కళాశాల కరెస్పాండెంట్, రచయిత ఎం.వి నరసింహారెడ్డి  మరణించగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట రోటరీ క్లబ్ సభ్యులు మంచాల...
Read More...
Local News 

అటుకుల్లో బొద్దింక.. 

అటుకుల్లో బొద్దింక..  కొత్తకొండ వైన్స్ సిట్టింగ్ రూమ్‌లో ఘోరం.. 
Read More...
State News 

సాహితీవేత్త ఎం.వి. నరసింహారెడ్డి కన్నుమూత

సాహితీవేత్త ఎం.వి. నరసింహారెడ్డి కన్నుమూత జగిత్యాల, జూన్ 08 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, రచయిత, విద్యావేత్త, ఎస్‌కేఎల్‌ఎన్ రావు బీఈడీ కళాశాల కరెస్పాండెంట్ ఎం.వి. నరసింహారెడ్డి సోమవారం రాత్రి, తన నివాసంలో కన్నుమూశారు. ఆయన మృతి సాహితీ, విద్యా రంగాలకు తీరని లోటుగా భావిస్తున్నారు.ఎం.వి. నరసింహారెడ్డి తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించారు. నాలుగు వేదాలను...
Read More...
Local News 

వరి కొయ్యలు కాల్చి పలువురి ప్రమాదానికి కారణమైన వారిపై ప్రజావాణిలో ఫిర్యాదు 

వరి కొయ్యలు కాల్చి పలువురి ప్రమాదానికి కారణమైన వారిపై ప్రజావాణిలో ఫిర్యాదు  జగిత్యాల జూన్ 8 (ప్రజా మంటలు) జగిత్యాల  రూరల్ మండలం తక్కలపల్లి గ్రామ శివారులో తుమ్మచెట్టు కు నిప్పంటుకొని అదే మార్గంలో వస్తున్న బైరి వేణు ,కడారి భరత్ లు గాయాలపాలు అయినారు. ఇట్టి విషయంపై జిల్లా కేంద్రం విజయపురి కాలనీకి చెందిన సంబుమహేష్( 29) తండ్రి మల్లయ్య సోమవారం  తుమ్మచెట్టు కాలడానికి కారకులైన మిట్టపల్లి...
Read More...