హిందువులపై దాడిని సహించం: బజరంగ్ దళ్

- " హిందూ శక్తి ప్రదర్శన" యాత్రలో లక్షలాదిగా పాల్గొనాలని పిలుపు - విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పండరీనాథ్..

On
హిందువులపై దాడిని సహించం: బజరంగ్ దళ్

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493)

 

హైదరాబాద్ మార్చి 28 (ప్రజా మంటలు) : 

"తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హిందువులపై దాడులు పెరిగిపోయాయని.. దాడులు, దౌర్జన్యాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోము" అని భజరంగ్ దళ్ హెచ్చరించింది.

రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యం కల్పిస్తూ..ముస్లిం సంతుష్టికరణకు పాల్పడుతున్నారని.. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని ఆందోళన వ్యక్తం చేసింది.

మతమార్పిడి, లవ్ జిహాద్, దేవాలయాల భూముల కబ్జా, గోహత్య వంటి అనేక హిందూ వ్యతిరేక కార్యక్రమాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది.

బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బజరంగ్ దళ్ విలేకరుల సమావేశం నిర్వహించింది.

విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పండరీనాథ్, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శ్రీ శివరాములు మాట్లాడారు.

అంతకుముందు హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే వీర హనుమాన్ విజయ యాత్ర వాల్ పోస్టర్, కరపత్రం ఆవిష్కరించారు.

ఏప్రిల్ 23న భాగ్యనగర్ లో భారీ ఎత్తున హనుమాన్ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. వీర హనుమాన్ విజయ యాత్ర ర్యాలీలో దాదాపు మూడు లక్షల మంది బజరంగ్దళ్ కార్యకర్తలు పాల్గొని హిందూ శక్తి ప్రదర్శన నిర్వహిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు నగరంలోని హిందువులంతా సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి హిందువు హనుమాన్ జయంతి మహోత్సవంలో పాల్గొనాలని ఆహ్వానించారు.

ఇటీవల కాలంలో భాగ్యనగర్ తో పాటు, రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో హిందువులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాడులను అడ్డుకొని తగిన రీతిలో జవాబు చెప్పేందుకు బజరంగ్ దళ్ సిద్ధంగా ఉందన్నారు. 

భాగ్యనగరం శివారు ప్రాంతంలోని చెంగిచెర్ల పిట్టల బస్తీలో గిరిజనులపై ముస్లిం మూకల దాడిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు.

ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధితులపైనే పోలీసులు దాడి చేసి అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం ప్రజాస్వామ్య వ్యవస్థలో చీకటి అధ్యయనం అన్నారు. అన్ని మతాలకు సమానమని చెప్పుకునే భాగ్యనగరం నడిబొట్టున చంటి బిడ్డను ఎత్తుకున్న యువకుడి పై జిహాదీ మూకలు దాడికి దిగడం అమానవీయ చర్య అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా ఇప్పటికీ పోలీసులు స్పందించకపోవడం చూస్తుంటే, తెలంగాణలో రాజాకార్ల రాజ్యం ప్రారంభమైందని రుజువు అవుతుందన్నారు. నగరం మొత్తం సీసీ కెమెరాలతో నింపేసి, చీమచిటుక్కుమన్నా నిందితులను, దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పే పోలీసులు.. చార్మినార్ దగ్గర జరిగిన ఘటన, చెంగిచెర్ల ఘటనల పై ఇంకా నిందితులపై కేసులు నమోదు చేయకపోవడం హిందూ వ్యతిరేక చర్యా అని బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని.. వాటికి తగిన రీతిలో జవాబు చెప్పేందుకు హిందూ సమాజం సిద్ధంగా ఉండాలని వారు సూచించారు. హిందువుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మించుకున్నామని..

ఇక నేడు రామరాజ్యం కోసం హిందూ సమాజం సంఘటితం కావలసిన అవసరం ఆసన్నమైందని పేర్కొన్నారు. సంఘటితమైతేనే హిందూ వ్యతిరేక శక్తులు తోక ముడుస్తాయని, లేదంటే వారి ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతాయని పేర్కొన్నారు.

బజరంగ్దళ్ చేపట్టే వీర హనుమాన్ విజయ యాత్రలో భారీ సంఖ్యలో పాల్గొని హిందూ శక్తిని ప్రదర్శిద్దామని వారు పిలుపునిచ్చారు.

సమావేశంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీశ్వర్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, భాగ్యనగర్ విభాగ్ కార్యదర్శి వీరేశలింగం , బజరంగ్దళ్ నాయకులు బిరాధర్ రాము, శ్రీకాంత్, రాహుల్ తోపాటు జిల్లా కన్వీనర్లు, కో కన్వీనర్లు, ఇతర బాధ్యులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

మానవాళికీ ప్రథమ శత్రువు ప్లాస్టిక్ భూతం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మానవాళికీ ప్రథమ శత్రువు ప్లాస్టిక్ భూతం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల సెప్టెంబర్ 18 (ప్రజా మంటలు)ప్రపంచికరణ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్లాస్టిక్ వినియోగం వేగంగా పెరుగుతుంది ఇది భూతం లాంటిదని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. వెదురు దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సందీప్ పాల్గొన్నారు.మేదరి వృత్తిపై ఆదారపడిన కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారు.నాగరిక ప్రపంచంలో అడవులు వేగంగా...
Read More...
Local News 

ఉత్తమ ఉపాధ్యాయుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉత్తమ ఉపాధ్యాయుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల సెప్టెంబర్ 18 (ప్రజా మంటలు)మండలం లోని కండ్లపల్లి మోడల్ స్కూల్లో పిజిటి జువాలజీ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న చిలుకూరి శివకృష్ణ తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి  అనుముల రేవంత్ రెడ్డి  చేతుల మీదుగా సెప్టెంబర్ 5వ  తేదీన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన సందర్భంగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ని...
Read More...
Local News 

తల్లిదండ్రులను విస్మరిస్తే శిక్షార్హులే జగిత్యాల జిల్లా కలెక్టర్  బి. సత్యప్రసాద్

తల్లిదండ్రులను విస్మరిస్తే శిక్షార్హులే  జగిత్యాల జిల్లా కలెక్టర్  బి. సత్యప్రసాద్ జగిత్యాల సెప్టెంబర్ 18 (ప్రజా మంటలు)గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో దివ్యాంగుల మరియు వయోవృద్ధుల జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులను విస్మరించే కొడుకులకు, కోడళ్ళకు, వారసులకు సీనియర్ సిటిజన్స్ కమిటీ ప్రతినిధులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ వారిలో చైతన్యం కల్పించాలన్నారు....
Read More...
Local News  State News  Crime 

భువనేశ్వర్‌–ముంబయి గంజాయి అక్రమ రవాణా రాకెట్‌ ఆటకట్టు

భువనేశ్వర్‌–ముంబయి గంజాయి అక్రమ రవాణా రాకెట్‌ ఆటకట్టు 8 కోట్ల విలువైన 16 టన్నుల గంజాయి స్వాధీనం  కింద్రాబాద్, సెప్టెంబర్18 (ప్రజామంటలు): , సికింద్రాబాద్‌ రైల్వే పోలీసు(జీఆర్పీ) రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్) సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 16.166 కిలోల పొడి గంజాయి (విలువ రూ.8,08,300/-)ను స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఈకేసులో వడాలా ఈస్ట్‌, అంటాప్‌హిల్‌, ముంబయి, మహారాష్ట్ర...
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రిలో మెగా పీడియాట్రిక్‌ క్యాంపు

గాంధీ ఆసుపత్రిలో మెగా పీడియాట్రిక్‌ క్యాంపు సికింద్రాబాద్,సెప్టెంబర్ 18 (ప్రజా మంటలు): భారత ప్రభుత్వ ఫ్యామిలీ ప్లానింగ్‌ అదనపు కమిషనర్‌ డాక్టర్‌ ఇందు గ్రేవాల్‌ గురువారం సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా పీడియాట్రిక్‌ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా పీడియాట్రిక్‌ ఆరోగ్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నిర్వహించిన ఈ శిబిరంలో చిన్నారులకు ఉచిత వైద్య...
Read More...
Local News 

ఇబ్రహీంపట్నం మండలం లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

ఇబ్రహీంపట్నం మండలం లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలి పనులు సకాలంలో పూర్తిచేసి బిల్లులు పొందాలి : జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్   ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 18 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ గ్రామంలో గురువారం రోజున ఇందిరమ్మ ఇండ్లు, అంగన్వాడీ కేంద్రం, ప్రైమరీ స్కూల్ వంటగది నిర్మాణం...
Read More...
Local News 

ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు -  స్పందించిన ముల్కనూర్ పోలీస్

ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు -  స్పందించిన ముల్కనూర్ పోలీస్ జెసిబి సహాయంతో చెట్ల పొదలను తొలగింపు
Read More...
Local News 

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష  ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం  ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్ ధర్మపురి సెప్టెంబర్ 17(ప్రజా మంటలు) ధర్మపురిలో పలు ప్రాంతాలను పరిశీలించిన దేవదాయ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ 2027 జూలై లో రానున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని దేవదాయ కమిషనర్ శైలజ రామయ్యార్ అధికారులను ఆదేశించారు.  ఈ సందర్బంగా ధర్మపురి పట్టణానికి విచ్చేసిన దేవదాయ కమిషనర్...
Read More...
Local News  State News 

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి (రామ కిష్టయ్య సంగన భట్ల - 9440595494) ధర్మపురి సెప్టెంబర్ 15: 2027లో జులై 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలను కుంభ మేళా తరహాలో నిర్వహించాలని, అందుకు, వ్యవధి ఉన్నందున శాశ్వతమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్...
Read More...
Local News 

మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా 

మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా  (రామ కిష్టయ్య సంగన భట్ల సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్...9440595494) సౌమ్య బొజ్జా ‘మిసెస్ చికాగో యూనివర్స్ 2026’ కిరీటాన్ని సొంతం చేసుకుని తెలుగు ప్రజలకు గర్వకారణమయ్యారు. అమెరికా న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్ వేదికగా సెప్టెంబర్ 12, 2025న నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అందాల పోటీలో ఆమె విజయం సాధించడం విశేషం. చికాగోలో...
Read More...
Local News  State News 

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్ న్యూఢిల్లీ సెప్టెంబర్ 17: చాలా రాష్ట్రాల్లోని సగం కంటే ఎక్కువ మంది ఓటర్లు SIRలో ఎటువంటి పత్రాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చునని EC అధికారులు తెలిపారు.చాలా రాష్ట్రాలు 2002 మరియు 2004 మధ్య ఓటర్ల జాబితా యొక్క చివరి స్పెషల్ ఇంటెన్సివ్ సవరణను కలిగి ఉన్నాయని వారు తెలిపారు.ఆ సంవత్సరం తదుపరి SIR కోసం...
Read More...
Local News 

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ  జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్   జగిత్యాల సెప్టెంబర్ 17 (ప్రజా మంటలు) జిల్లా సమీకృత భవన సముదాయం లో శిల్పకళ, వాస్తు శిల్పి విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్బంగా బిసి కమిషన్ చైర్మన్  జి. నిరంజన్,జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  అనంతరం...
Read More...