పర్యావరణ రక్షణలో అందరి భాగస్వామ్యం ఉండాలి
నేడు జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం
(డిసెంబర్ 2వ తేదీ )
--డాక్టర్. వై. సంజీవ కుమార్,
ఫౌండర్ & ప్రెసిడెంట్,
స్కై ఫౌండేషన్.
9393613555,
9493613555.
సృష్టిలో జీవం మనుగడ తీసుకునే శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. ఆ శ్వాస పర్యావరణంపైనా ఆధారపడుతుంది. ఆ పర్యావరణం కాలుష్యం అయితే జీవం మనుగడ ప్రమాదంలో పడుతుంది, ఉనికే లేకుండా పోతుంది. అలాంటి కాలుష్యాన్ని నియంత్రించుకోవడానికి అవగాహనా కలిపించే విధంగా . ప్రతి సంవత్సరం డిసెంబర్ 2న జరుపుకునే జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం జరుపుకుంటారు.
పర్యావరణం కాలుష్యమైతే గాలి, నీరు, నేల ప్రమాదకరంగా మారుతుంది, జీవించే ప్రాణులు తీసుకునే శ్వాస, ఆహారం అన్ని హానికరంగా మారుతాయి. ముఖ్యంగా కాలుష్యం పెరగడానికి కారణాలు కర్మాగారాలు, వాహనాలు, చెత్త మరియు రసాయనాలు వంటి వివిధ వనరులు. కాలుష్యం పర్యావరణ వ్యవస్థల సహజ సమతుల్యతను దెబ్బతీస్తుంది,
రసాయనాలు, ప్లాస్టిక్లు లేదా వ్యర్థాలు వంటి హానికరమైన పదార్థాలు నదులు, సరస్సులు, మహాసముద్రాలు వంటి నీటి వనరులను కలుషితం చేసినప్పుడు నీటి కాలుష్యం సంభవిస్తుంది. కలుషితమైన నీరు జలచరాలను ప్రభావితం చేస్తుంది, పర్యావరణ వ్యవస్థలకు హాని కలిగిస్తుంది. త్రాగడానికి, ఇతర వినియోగాలకు, నీటిపారుదల కోసం దానిపై ఆధారపడే అందరికి తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది.
హానికరమైన రసాయనాలు, వ్యర్థాలు, ఇతర పదార్థాలు నేల సారాన్ని, నాణ్యతను క్షీణింపజేసినప్పుడు నేలలో కాలుష్యం చేరుతుంది, కలుషితమైన నేల మొక్కల పెరుగుదలను ప్రభావితం చేస్తుంది, వ్యవసాయ ఉత్పాదకతను తగ్గిస్తుంది, పండించే పంటలో నాణ్యత తగ్గుతుంది, నేలలో నివసించే జీవులకు హాని కలిగిస్తుంది.
ట్రాఫిక్, నిర్మాణం, పారిశ్రామిక యంత్రాలు, పెద్ద పెద్ద ధ్వనులతో వచ్చే సంగీతం, పెద్ద అర్థనాదాహాలతో నడిపే వాహనాలు కలిగించే హానికరమైన అధిక స్థాయి శబ్దాన్ని శబ్ద కాలుష్యంగా మారుతుంది. పర్యావరణాన్ని ప్రభావితం చేస్తుంది, మనుషులమీద, జంతువుల మీద తీవ్ర ఒత్తిడి ఏర్పడి వినికిడి లోపానికి దారితీస్తుంది. వాతావరణంలోకి హానికరమైన వాయువులు, కణాలు , కార్బన్డయాక్సిన్ కలిగిన పేలుడు పదార్థాలు, వివిధ రసాయనాలను విడుదల చేయడం వాయు కాలుష్యం కాలుష్యం ఏర్పడి శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
మనిషి ప్రాణానికి కారణం అవుతుంది. వాతావరణ మార్పును వేగవంతం చేయడంలో వాయు కాలుష్యం కీలక పాత్ర పోషిస్తుంది. మానవులలో ఆరోగ్య సమస్యలు, జంతువుల అకాల మరణాలు, మొక్కల పెరుగుదల, ఆహారంలో విటమిన్లు లోపించడం లాంటి సమస్యలకు దారితీస్తుంది.
ప్రతి ఒక్కరు కాలుష్య నియంత్రణ గురించి ఆవాహన పెంచుకోవాలి, ఇతరులకు అవహగాన కలిపించాల్సిన బాధ్యత ఉంది. కాలుష్యం గురించి అవగాహన పెంచడం. వివిధ రకాల కాలుష్యాలు - గాలి, నీరు, నేల మరియు శబ్దం మరియు ఆరోగ్యం, పర్యావరణ వ్యవస్థలు, వాతావరణంపై వాటి హానికరమైన ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం. భోపాల్ గ్యాస్ విషాద బాధితులను గౌరవించడం 1984లో జరిగిన విషాదకరమైన భోపాల్ గ్యాస్ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి, బాధితులైన వారిని స్మరించుకోవడానికి, పరిశ్రమలలో కఠినమైన భద్రతా చర్యల అవసరాన్ని నిర్దిష్టంగా చెప్పాలి.
పరిశుభ్రమైన పద్ధతులను ప్రోత్సహించడం పరిశ్రమలు, వ్యాపారాలు , వ్యక్తులు వ్యర్థాలను తగ్గించడం, పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించడం వంటి పర్యావరణ అనుకూల పద్ధతులను ఉపయోగించేలా ప్రోత్సహించడం. పర్యావరణ విధానాలకు మద్దతు ఇవ్వడం కాలుష్యాన్ని తగ్గించడం, సహజ వనరులను రక్షించడం లక్ష్యంగా చట్టాలకు, నిబంధనలకు మద్దతు ఇవ్వాలి. సమాజ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి,
చెట్ల పెంపకం కార్యక్రమాలు, శుభ్రపరిచే ప్రచారాలు, రీసైక్లింగ్ కార్యక్రమాలు వంటి పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలలో సమాజాలను చురుకుగా పాల్గొనేలా ప్రేరేపించేలా చర్యలు తీసుకోవాలి. మానవాళికి, సమస్త జీవకోటికి నష్టం కలిగించే వాటి పట్ల ప్రభుత్వ చట్టాలు కఠినంగా రూపొందించాలి, అమలుపరచాలి. చిన్నప్పటినుంచే విద్యార్థులకు కాలుష్యం, పర్యావరణం గురించి బోధించాలి, ప్రతి ఒక్కరికి అవగాహనా కలిపించాలి. -------
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా స్వామివారి కల్యాణ వేడుకలు
జగిత్యాలఏప్రిల్ 12(ప్రజా మంటలు) శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం లో ఆదివారం శ్రవణా నక్షత్రం పురస్కరించుకొని పద్మావతి అలివేలు మంగ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను ప్రత్యేక వేదికపై ఉంచి కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు... విలేకరి ముసుగులో వసూళ్లు.. కత్తితో బెదిరించి ₹42వేలు దోపిడి – వేములవాడలో నకిలీ జర్నలిస్టు అరెస్ట్
వేములవాడ, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):
విలేకరుల ముసుగులో కొందరు నకిలీ జర్నలిస్టులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వేములవాడ పట్టణంలో జరిగిన ఒక సంఘటనలో నకిలీ జర్నలిస్టుగా నటించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
వేములవాడ టౌన్ సీఐ బి. వీర ప్రసాద్ తెలిపిన... ఇంటర్ ఫలితాల్లో మెరిసిన ఆణిముత్యం – గుంటుకుల సహస్ర
గొల్లపల్లి, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో గొల్లపల్లి మండలానికి చెందిన లోత్తునూర్ గ్రామ విద్యార్థిని గుంటుకుల సహస్ర తన ప్రతిభను చాటుకుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి జగిత్యాల పట్టణంలో ప్రథమ స్థానం దక్కించుకుంది.ప్రస్తుతం... వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కృషి –కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
సమాజంలో వెనకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. తెలంగాణ తోటి, మెహతార్ కమ్యూనిటీ సంఘం 12వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం బొల్లారం కొత్త బస్తీలోని కమ్యూనిటీ హాల్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా... మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ ఫోరం అధ్యక్షునిగా డాక్టర్ రమేష్
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
టీఎన్జీవో మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ ఫోరం హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా సికింద్రాబాద్ గాంధీఆస్పత్రి ఫిజియోథెరపీ విభాగ వైద్యుడు డాక్టర్ పల్లాటి రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఎన్జీవో యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు విక్రమ్, శ్రీనివాస్, కోశాధికారి బాలరాజుల నేతృత్వంలో సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో నూతన... స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో 298వ అన్నదానం
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
హైదరాబాద్ నగరంలో ఆకలితో అలమటిస్తున్న అనాథలు, నిరాశ్రయుల కోసం స్కై ఫౌండేషన్ ఆదివారం 298వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫౌండేషన్ సభ్యులు వాహనంలో వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ, ఫుట్పాత్లపై నివసించే నిరుపేదలను గుర్తించి వారికి ఆహారాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వై. సంజీవ... ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మార్కుల ప్రభంజనం
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):
ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రస్థాయి మార్కులు సాధించి తమ ప్రతిభను మరోసారి చాటారు.
ద్వితీయ సంవత్సరం ఫలితాలు:MPC: ఎం. లవిష – 979/1000BiPC: కె. నవీన – 971/1000CEC: కె. రతిక – 935/1000... బాలీవుడ్ గానకోకిల ఆశా భోస్లే కన్నుమూత – 92 ఏళ్ల వయసులో సంగీత యుగానికి ముగింపు
ప్రఖ్యాత బాలీవుడ్ గాయని Asha Bhosle (92) కన్నుమూశారు. గుండెపోటుతో ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆమె మరణంతో భారతీయ సినీ సంగీతంలో ఒక మహా యుగానికి ముగింపు పలికినట్టైంది.
ఎనిమిది దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రయాణంలో 12,000కు పైగా పాటలు పాడి కోట్లాది అభిమానుల... భార్యను కాపురానికి పంపలేదని అత్తను కరెంట్ షాక్తో హత్యాయత్నం నిందితుడు అరెస్ట్ – రిమాండ్కు తరలింపు
గొల్లపల్లి, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):
భార్యను తిరిగి కాపురానికి పంపలేదనే కోపంతో అత్తను కరెంట్ షాక్తో చంపేందుకు ప్రయత్నించిన ఘటన వెంగటూరు మండలంలో చోటుచేసుకుంది.వెల్గటూర్ మండలం జగదేవపేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి (48) తన భార్య పద్మతో గత కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. భర్త హింసను భరించలేక పద్మ తన పిల్లలతో... ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు సామాజిక అసమానతనలు తొలగించడమే పూలే ఆశయం
జగిత్యాల ఏప్రిల్ 11 (ప్రజా మంటలు)మహాత్మ జ్యోతిబా పూలే ఆశయాలను, ఆలోచనలను ఆచరించాలి - రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మహాత్మ జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకల్లో రాష్ట్ర... మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు
జగిత్యాల ఏప్రిల్ 11 ( ప్రజా మంటలు) పూలమాలవేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం నాయకులు.
మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలు భారత సమాజంలో సమానత్వం, న్యాయం, విద్య, సామాజిక సంస్కరణల మీద ఆధారపడి ఉన్నాయి. ఆయన ఆలోచనలు చాలా ముందుచూపుతో కూడినవిఅన్నారు.
ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాం రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల ఏప్రిల్ 11 ( ప్రజా మంటలు) ప్రజల మధ్యలో ఉంటాం.. మరో మారు అధికారంలోకి వస్తాం.. జీవన్ రెడ్డి పై మంత్రి మరో మారు ఫైర్..
రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ... 