కేసీఆర్ చరిత్రను ఎవరూ చెరపలేరు: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
కేసీఆర్ ఉన్నంత కాలం రాష్ట్ర చరిత్ర నిలుస్తుంది – కొప్పుల
పెద్దపల్లి, నవంబర్ 29 (ప్రజా మంటలు):
పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రధాన అతిథిగా హాజరై, తెలంగాణ ఉద్యమ చరిత్ర, కేసీఆర్ పాత్ర, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ:"నవంబర్ 29 అంటే ఒక చరిత్ర. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు.""వలస పాలనలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యానికి జరిగిన 14 ఏళ్ల పోరాటమే తెలంగాణ ఉద్యమం.""దశాబ్దాల కలను సాకారం చేసిన పోరాటయోధుడు కేసీఆర్. తెలంగాణ వచ్చేదాకా నా ప్రాణం పోదు అని ధైర్యం చెప్పిన నాయకుడు ఆయనే." అని అన్నారు.
అలాగే 2009లో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను గుర్తుచేస్తూ...
- కరీంనగర్ నుండి సిద్ధిపేట సమీపంలోని రంగధాంపల్లిలో ఏర్పాటు చేసిన దీక్ష స్థలానికి వెళ్లే మార్గంలో పోలీసులు కేసీఆర్ను నిలిపివేశారని,
- కేసీఆర్ రోడ్డుపై కూర్చుని దీక్ష ప్రారంభించారని,
- అనంతరం బలవంతంగా ఖమ్మం జైలుకు తరలించారని,
- ఆరోగ్యం క్షీణించడంతో డిసెంబర్ 3న నిమ్స్కు తరలించారని చెప్పారు.
"తెలంగాణ వస్తే జైత్రయాత్ర, లేకుంటే నా శవయాత్ర," అన్న కేసీఆర్ మాటలు ఉద్యమాన్ని శిఖరాగ్రానికి చేర్చాయని కొప్పుల పేర్కొన్నారు.
డిసెంబర్ 7న అఖిలపక్షం తెలంగాణకు మద్దతు ఇవ్వడం,
డిసెంబర్ 8న కేసీఆర్ ఆరోగ్యంపై వైద్యుల హెచ్చరిక,
తర్వాత కేంద్రం తెలంగాణ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయం – ఇవన్నీ చరిత్రను మార్చిన కీలక క్షణాలని వివరించారు.
"2014 జూన్ 2 – అరవై ఏళ్ల కల సాకారం అయింది. ఆ చరిత్రకు కాపాడినవాడు కేసీఆర్," అని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
మహేష్ గౌడ్, రేవంత్పై కొప్పుల ఘాటు వ్యాఖ్యలు
- "పిసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నేడు అజ్ఞానిగా మాట్లాడుతున్నాడు. ఉద్యమ సమయంలో ఆయన ఎక్కడ ఉన్నాడు?"
- "ఆంధ్ర పాలకుల సంగలో చేరి ఉద్యమ నాయకులపై గన్ పెట్టింది రేవంత్ చరిత్ర," అని కొప్పుల విమర్శించారు.
కాంగ్రెస్ పాలనపై విమర్శలు
- “రేవంత్ ప్రభుత్వం తెలంగాణ తల్లి రూపాన్నే మార్చింది.”
- “బతుకమ్మ చీరలకు రాంరాం పెట్టి ఇందిరమ్మ చీరలను ముందుకు తెచ్చారు.”
- “6 గ్యారంటీలు, 420 హామీలను గాలికొదిలేశారు.”
దీక్షా దివస్ కార్యక్రమానికి ప్రముఖ నాయకులు హాజరయ్యారు:
మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి, పుట్ట మధుకర్,మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్,నాయకులు మూల విజయ రెడ్డి, దాసరి ఉష, గంట రాములు, కౌశిక్ హరి,పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఉప్పు రాజ్కుమార్,ఇతర బీఆర్ఎస్ కార్యకర్తలు & నాయకులు పాల్గొన్నారు.
ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేసుకుంటూ, అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించడం, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు సమర్పించడం, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు గా రెండవ సారి ఎన్నికైన మారం జగదీశ్వర్ ను సన్మానించిన జగిత్యాల టిఎన్జీఓ లు
కరీంనగర్ ఏప్రిల్ 1(ప్రజా మంటలు)ఇటీవల టిఎన్జీఓ కేంద్ర సంఘానికి జరిగిన ఎన్నికలలో రెండవ సారి రాష్ట్ర అధ్యక్షులు గా ఏకగ్రీవంగా ఎన్నికైన మారం జగదీశ్వర్ ని జగిత్యాల జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి మరియు జిల్లా కార్యదర్శి ఊకంటి అమరేందర్ రెడ్డి ల ఆధ్వర్యంలో జగిత్యాల టిఎన్జీఓ లు ఘనంగా సన్మానించారు.
కరీంనగర్... కొండగట్టు లో పందిళ్ళు కూలిపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం - కవిత
హైదరాబాద్, ఏప్రిల్ 01 (ప్రజా మంటలు):
కొండగట్టు అంజన్న ఆలయంలో చలువ పందిళ్లు కూలిపోవడంతో 15 మంది భక్తులు గాయపడిన ఘటన ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు తన ట్విట్టర్ లో విమర్శించారు.
. హనుమాన్ చిన్న జయంతి వేడుకల సందర్భంగా నాసిరకంగా ఏర్పాటు చేసిన పందిళ్ల వల్లే ఈ... శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం ప్రధాన అర్చకుని పదవి విరమణ
జగిత్యాల మార్చి 31 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం ప్రధాన అర్చకులు మేడిపల్లి రాజన్న శాస్త్రి పదవి విరమణ మంగళవారం జరగగా ఆలయ ఆవరణలో రాజన్న శాస్త్రి పద్మ దంపతులను ఆలయ కమిటీ సభ్యులు, ఈవో సురేందర్ తదితరులు ఘనంగా సన్మానించి వీడ్కోలు తెలిపారు.
ఈ... తెలంగాణలో ఉద్యోగ నియామకాలపై జీవోలు అడ్డంకి –కల్వకుంట్ల కవిత ఆరోపణ
హైదరాబాద్ ఏప్రిల్ 01 (ప్రజా మంటలు):
రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియలో జీవోలు అడ్డంకిగా మారుతున్నాయని తెలంగాణ జాగృతి నేత కవిత విమర్శించారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వివిధ జీవోల ద్వారా అవరోధాలు సృష్టిస్తోందని ఆరోపించారు.డిగ్రీ లెక్చరర్ల నియామకాలకు సంబంధించిన జీవో నంబర్ 4 వల్ల అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందన్నారు.... ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి
కొండగట్టు మార్చి 31 (ప్రజా మంటలు) హనుమాన్ చిన్న జయంతికి 914 మంది సిబ్బందితో పటిష్ట భద్రత
సీసీ కెమెరాలు ద్వారా నిరంతర పర్యవేక్షణ
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
మల్యాల ఎక్స్ రోడ్ వద్దగల ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన బందోబస్తు పై పోలీసు అధికారులతో ఎస్పి సమీక్ష నిర్వహించారు.
ప్రసిద్ధ... “రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు” : కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఆగ్రహం
:హైదరాబాద్, మార్చ్ 31 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టేసిందని ఆమె ఆరోపించారు.కాగ్ (CAG) 2024-25 నివేదిక ఆధారంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆమె పేర్కొన్నారు. రోజువారీ ఖర్చుల నిర్వహణకే రిజర్వ్ బ్యాంక్... అకాల వర్షంతో పంట దెబ్బతిన్న వరి,మామిడి తోటలు పరిశీలించిన మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత
రాయికల్ మార్చి 31 (ప్రజా మంటలు)మండలం కిష్టంపేట గ్రామంలో నిన్న కురిసిన వర్షాలకు నష్టపోయిన మామిడి మరియు వరి పంట పొలాలను బి ఆర్ ఎస్ నాయకులు మరియు రైతులతో కలిసి పరిశీలించి నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పిన జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్
ఈ సందర్భంగా వారు... కృష్ణా జిల్లా చల్లపల్లె పోలీస్ స్టేషన్లో పేలుడు ఘటన - నలుగురికి గాయాలు
చల్లపల్లె, మార్చ్ 31 (ప్రజా మంటలు):
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా చల్లపల్లె పోలీస్ స్టేషన్లో జరిగిన పేలుడు ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకున్నట్లు సమాచారం.
పోలీస్ స్టేషన్ పరిధిలో అకస్మాత్తుగా పేలుడు శబ్దం వినిపించడంతో సిబ్బంది, సమీప ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఘటన స్థలాన్ని... మైనర్ లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్
జగిత్యాల మార్చి 30(ప్రజా మంటలు)పట్టణం లో ట్రాఫిక్ ఎస్ ఐ, టౌన్ ఎస్ ఐ ఆద్వర్యం లో సోమవారం ద్విచక్ర వాహనాలు నడుపుతున్న దాదాపు 50 మంది మైనర్ లను పట్టుకున్న ట్రాఫిక్ మరియు పట్టణ పోలీసులు... ట్రాఫిక్ పోలీసుస్టేషన్కు తరలించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇక పై మైనర్... డబల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు మాజీ కౌన్సిలర్ జయ శ్రీ వినతి
జగిత్యాల మార్చి 30 ( ప్రజా మంటలు)పట్టణానికి చెందిన ఇల్లు లేని నిరుపేదల కొరకు నూకపెల్లి వద్ద డబల్ బెడ్ రూమ్ ఇండ్లు 4520 కట్టడం జరిగింది. వాటిలో 520 ఇండ్ల నిర్మాణం వద్ద డ్రైనేజీ వాటర్ కొరకు సంపు ఏర్పాటు చేసి దాని నుండి మోటార్ల ద్వారా బయటకు పంపింగ్ చేసే విధానం... రవీంద్రభారతిలో ప్రజాప్రతినిధుల సాంస్కృతిక వేడుకలు –
హైదరాబాద్ మార్చ్ 30 (ప్రజా మంటలు);
శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్వహించిన ప్రజాప్రతినిధుల సాంస్కృతిక వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి A. Revanth Reddy జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
రవీంద్రభారతిలో జరిగిన ఈ వేడుకల్లో మండలి చైర్మన్ Gutta Sukender Reddy, ఉప ముఖ్యమంత్రి Mallu Bhatti Vikramarka... ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయా: క్షమాపణలు తెలిపిన కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, మార్చ్ 30 (ప్రజా మంటలు):
ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నిర్వహించిన ధర్నాకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయానని అంగీకరిస్తూ క్షమాపణలు తెలిపారు.ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల... 