వార్షిక తనిఖీల్లో భాగంగా కోరుట్ల పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
కోరుట్ల అక్టోబర్ 27 (ప్రజా మంటలు)
ప్రజలకు సత్వర న్యాయం, విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి
మహిళల భద్రతకు ప్రాధాన్యం — నేరాల నియంత్రణకు కఠిన చర్యలు
తనిఖీ సందర్భంగా ఎస్పీ స్టేషన్లోని వివిధ విభాగాలు, రికార్డులు, రిజిస్టర్లు, క్రైమ్ రికార్డులు, జనరల్ డైరీ, ఆర్మ్ రూమ్, స్టోర్స్, లాకప్ రూమ్లను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న కేసులను రివ్యూ చేసి, విచారణలో ఉన్న కేసుల పురోగతిపై సమీక్ష జరిపారు. స్టేషన్ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితులు, నేరాల స్థితిగతులపై సవివరంగా అడిగి తెలుసుకున్నారు.
ఎస్పీ మాట్లాడుతూ .. ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీస్ విధులు ఉండాలి. ప్రతి ఫిర్యాదుపై తక్షణం స్పందించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. గతంతో పోల్చుకుంటే నేరాల రేటు తగ్గుముఖం పట్టింది. ప్రజలు పోలీసులపై విశ్వాసం ఉంచి అసాంఘిక కార్యకలాపాలు గమనించిన వెంటనే సమాచారం అందించాలి అని సూచించారు.
అలాగే మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదక ద్రవ్యాల వ్యసన నిర్మూలన, యువతలో చట్టం పట్ల గౌరవం పెంపొందించేందుకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. కేసుల విచారణలో స్పీడ్ ఇన్వెస్టిగేషన్, సాక్ష్యాల సేకరణలో నిష్పక్షపాత దృక్పథం అవసరమని సూచించారు. పోలీస్ స్టేషన్ అధికారులు మరియు సిబ్బంది పనితీరు భేషుగ్గా ఉందని అభినందించారు.
ఈ సందర్భంగా రిసెప్షన్ వర్టికల్ నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లు ను పిటిషన్ మేనేజ్మెంట్లో ఎంట్రీ చేసిన డాటా ను తనిఖీ చేశారు. రిసెప్షన్ఈస్ట్ గా ప్రతి దరఖాస్తు పై తప్పనిసరిగా పిటిషన్ మేనేజ్మెంట్ లో జనరేట్ చేసినా రిసిప్ట్ ఇవ్వాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 5S విధానాన్ని పాటిస్తూ పరిశుభ్రంగా ఉండేటట్లు అదేవిధంగా ఫైల్స్, క్రమపద్ధతిలో నిర్దేశిత ప్రదేశాల్లో ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు.
అనంతరం సిబ్బంది తో మాట్లాడుతూ... పోలీస్ స్టేషన్ అంతా పరిశుభ్రంగా గా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. పోలీస్ శాఖ నూతన టెక్నాలజీ అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్న దాని గురించి అధికారులకు సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. సిబ్బంది కి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా ఉంటే తమ దృష్టి కి తీసుకొని రావాలి అని సూచించారు.
తనిఖీ అనంతరం ఎస్పీ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పచ్చదనం, పరిశుభ్రతపై ప్రతి పోలీస్ సిబ్బంది కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీ రాములు , డి సి ఆర్ బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కోరుట్ల, మెట్ పల్లి సి.ఐ సురేష్, అనిల్ కుమార్, ఎస్సై లు చిరంజీవి, రామచందర్, శ్రీధర్ రెడ్డి, నవీన్, కిరణ్ కుమార్, రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ లో ఎన్కౌంటర్లో మరణించిన షేక్ రియాజ్ కుటుంబ ఫిర్యాదు
హైదరాబాద్, అక్టోబర్ 27 (ప్రజా మంటలు):ఇటీవల పోలీస్ ఎన్కౌంటర్లో మరణించిన షేక్ రియాజ్ కుటుంబ సభ్యులు ఈరోజు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) ముందు హాజరై, ఫిర్యాదు సమర్పించారు. రియాజ్ తల్లి, భార్య, మరియు చిన్నపిల్లలు కలిసి కమిషన్ ఎదుట తమపై పోలీసుల వేధింపులు జరుగుతున్నాయని ఆరోపించారు.
కుటుంబ సభ్యుల ప్రకారం,... జిల్లాలోని మద్యం దుకాణాల లైసెన్స్ దారుల ఎంపిక డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల అక్టోబర్ 27(ప్రజా మంటలు)జిల్లా కలెక్టర్ సమక్షంలో జగిత్యాల విరూపాక్షి గార్డెన్ లో A4 దుకాణాల వైన్ షాపుల కోసం డ్రా నిర్వహణ.
A4 దుకాణాల మద్యం దుకాణాల కోసం లాట్ల డ్రాను సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ సమక్షంలో జగిత్యాల పట్టణంలోని విరూపాక్షి గార్డెన్ లో నిర్వహించారు.
డ్రా నిర్వహణ సందర్బంగా ఎలాంటి... ఆదిలాబాద్లో సైబర్ మోసం కేసు — వలపు వలతో ఎనిమిది లక్షలు స్వాహా
ఆదిలాబాద్, అక్టోబర్ 27 (ప్రజా మంటలు):
వలపు పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఘరానా సైబర్ ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళా గొంతుతో మాట్లాడి, ప్రేమ పేరుతో బాధితులను బురిడీ కొట్టిస్తున్న ముగ్గురు నిందితులను సూర్యాపేట జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1.5 లక్షల నగదు, మూడు... ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య — కామారెడ్డి విషాదం
కామారెడ్డి అక్టోబర్ 27 (ప్రజా మంటలు):
కామారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఏఆర్ కానిస్టేబుల్ రేకులపల్లి జీవన్ రెడ్డి (37) వ్యక్తిగత కారణాలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సోమవారం ఉదయం “డ్యూటీకి వెళ్తున్నా” అని ఇంటి నుండి బయలుదేరిన జీవన్ రెడ్డి, అడ్లూర్ శివారులోని రాధాస్వామి సత్సంగ్ సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని... స్కాలర్ షిప్ లు ప్రభుత్వ బిక్ష కాదు - విద్యార్థుల హక్కు : ఏబీవీపి
సికింద్రాబాద్, అక్టోబర్ 27 (ప్రజామంటలు) :
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) సికింద్రాబాద్ జిల్లా మారేడుపల్లి శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మారేడ్ పల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ గేట్ ముందు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎబివిపి... బంగారం రేట్లు రోజులోనే రూ.2,340కి పడిపోయాయి — హైదరాబాద్లో కూడా తగ్గుదల
హైదరాబాద్ అక్టోబర్ 27: బంగారం ధరల్లో అకస్మాత్తుగా పెద్ద పతనం నమోదైంది. ఈరోజు (అక్టోబర్ 27) ఉదయం గ్రాముకు రూ.1,050 తగ్గిన రేటు, సాయంత్రానికి మరో రూ.1,290 పడిపోవడంతో మొత్తం రూ.2,340 తగ్గింది.హైదరాబాద్, విజయవాడ మొదలైన ప్రాంతాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ 1,23,280 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ. 2150... సీఎం సహాయనిది చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల అక్టోబర్ 27 (ప్రజా మంటలు)సారంగాపూర్ మండలానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 2 లక్షల 46వేల రూపాయల విలువగల చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాల నియోజకవర్గానికి 14... ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి అర్జీదారుల సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్ లత
జగిత్యాల అక్టోబర్ 27 (ప్రజా మంటలు)
ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్ లత అదేశించారు.
సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను ఆర్డీఓలతో తో కలిసి అదనపు కలెక్టర్ బి.ఎస్ లత స్వీకరించారు.
ఈ సందర్భంగా... చిలకలగూడ, ఓయూ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపు
సికింద్రాబాద్, అక్టోబర్ 27 (ప్రజామంటలు):
పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్బంగా సోమవారం చిలకలగూడ,ఓయూ డివిజన్ల పోలీస్ అధికారుల అధ్వర్యంలో రక్తదాన శిభిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. అడిక్ మెట్ నాన్ టీచింగ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన బ్లడ్ డోనెషన్ క్యాంపులో 300 మందికి పైగా యువకులు, పోలీసు సిబ్బంది రక్తదానం చేశారు. గాంధీ... గాంధీనగర్ పోలీసుల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్
సికింద్రాబాద్, అక్టోబర్ 27 (ప్రజా మంటలు):
ఆపదలో ఉండే వారికి సంజీవని లాగా పనిచేసే బ్లడ్ ను యువకులు స్వచ్ఛందంగా వచ్చి డొనేట్ చేయడం అభినందనీయమని సెంట్రల్ జోన్ డిసిపి శిల్పవల్లి అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సిటీ సెంట్రల్ జోన్ పరిధిలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం మెగా
దాదాపు... శ్రీగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో ప్రత్యేక పూజలు
సికింద్రాబాద్, అక్టోబర్ 27 (ప్రజా మంటలు):
సీతాఫల్ మండి డివిజన్ శ్రీనివాస్ నగర్ శ్రీగిరి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం లో "జీర్ణోద్ధరణపూర్వక మహా సంప్రోక్షణ, అష్టబందన మహా కుంభభిషేకం లో భాగంగా మూడవ రోజు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం యాగశాల ద్వారతోరణ ధ్వజ కుంభఆరాధన , ప్రాతరారాధన, అర్చన,--... వార్షిక తనిఖీల్లో భాగంగా కోరుట్ల పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
కోరుట్ల అక్టోబర్ 27 (ప్రజా మంటలు)ప్రజలకు సత్వర న్యాయం, విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి
మహిళల భద్రతకు ప్రాధాన్యం — నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తనిఖీ సందర్భంగా ఎస్పీ స్టేషన్లోని వివిధ విభాగాలు, రికార్డులు, రిజిస్టర్లు, క్రైమ్ రికార్డులు, జనరల్ డైరీ, ఆర్మ్ రూమ్, స్టోర్స్, లాకప్ రూమ్లను పరిశీలించారు.... 