ఆన్లైన్ క్రెడిట్ కార్డ్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల సెప్టెంబర్ 26 (ప్రజా మంటలు)
ఈ మధ్య కాలంలో ఆన్లైన్ క్రెడిట్ కార్డ్ మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయి.గుర్తు తెలియని నంబర్ల నుండి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు లేదా లింకులను నమ్మి ఎవ్వరూ తమ క్రెడిట్ కార్డ్ వివరాలు, ఓటీపీలు, పిన్ నంబర్లు చెప్పకూడదని ఎస్పీ సూచించారు.
RBL, ఆక్సిస్, హదఫక్ తదితర ఆన్లైన్ క్రెడిట్ కార్డ్ మోసాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే పెద్ద మొత్తంలో ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని, బ్యాంకులు ఎప్పుడూ ఫోన్ లేదా సందేశం ద్వారా వ్యక్తిగత వివరాలు అడగవు. అలాంటి కాల్స్ వస్తే వెంటనే కాల్ను డిస్కనెక్ట్ చేసి, 1930 హెల్ప్లైన్ నంబర్కి సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు.
అంతేకాకుండా, అధికారిక యాప్లు, వెబ్సైట్ల ద్వారానే బ్యాంకింగ్ లావాదేవీలు చేయాలి అని అనుమానాస్పద లింకులు, ఫేక్ యాప్లకు దూరంగా ఉండాలని సూచించారు.
*సైబర్ మోసగాళ్లు ఉపయోగిస్తున్న పద్ధతులు*
1 • బ్యాంకు ఉద్యోగులమని చెప్పి ఫోన్ చేసి OTP, PIN, CVV అడగడం.
2 • క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామని, లోన్ మంజూరు చేస్తామని చెప్పి వ్యక్తిగత వివరాలు అడగడం.
3 • SMS లేదా ఇమెయిల్ లో నకిలీ లింకులు పంపించి, వాటిలో క్లిక్ చేయగానే కార్డు వివరాలు దొంగిలించడం.
4 • ఈ-కామర్స్ వెబ్సైట్లు, నకిలీ యాప్లు ద్వారా డబ్బులు బదిలీ చేయించడం.
క్రెడిట్ కార్డు మోసాలను నివారించడానికి జాగ్రత్తలు
*కార్డు వివరాలను గోప్యంగా ఉంచండి:* బ్యాంక్ ఉద్యోగులమని చెప్పి ఎవరైనా ఫోన్ చేసినా, ఈ-మెయిల్ పంపినా మీ క్రెడిట్ కార్డు నంబరు, సీవీవీ, పిన్ లేదా ఓటీపీ వంటి వివరాలను ఎప్పుడూ చెప్పవద్దు.
*లింకులను క్లిక్ చేయవద్దు:* ఎస్సెమ్మెస్, వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకండి.
*లావాదేవీల నోటిఫికేషన్లు:* మీ కార్డుతో జరిగే ప్రతి లావాదేవీకి నోటిఫికేషన్లు వచ్చేలా చూసుకోండి. అనుమానాస్పద లావాదేవీ కనిపిస్తే వెంటనే బ్యాంకుకు తెలియజేయండి.
*అప్రమత్తంగా ఉండండి:* ఆన్లైన్లో క్రెడిట్ కార్డుల కోసం అన్వేషించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. నకిలీ వెబ్సైట్లు లేదా ఆఫర్ల పట్ల జాగ్రత్త వహించాలి.
*మోసానికి గురైతే ఏం చేయాలి:* మోసపోయినట్లు తెలిసిన వెంటనే బ్యాంకుకు ఫోన్ చేసి మీ క్రెడిట్ కార్డును బ్లాక్ చేయించండి.1930 నంబర్ కి కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ www.cybercrime.gov.in లో ఆన్లైన్లో ఫిర్యాదు చేయండి.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో మహా సంప్రోక్షణ
వారం రోజుల పాటు ప్రత్యేక ఆధ్వాత్మిక కార్యక్రమాలు
సికింద్రాబాద్, అక్టోబర్ 24 (ప్రజామంటలు) :
సీతాఫల్ మండి డివిజన్ శ్రీనివాసనగర్ లో శ్రీగిరి పద్మావతి గోదా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో జీర్ణోద్దరణ పూర్వక మహాకుంభాభిషేకం మహా సంప్రోక్షణ కార్యక్రమ ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈసందర్బంగా ఆలయంలో శ్రీవిష్ణు సహస్ర నామ పారాయణం, ఉత్వవానుజ్ఞ,... పదో తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలి చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల అక్టోబర్ 24(ప్రజా మంటలు) జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ మండల విద్యాధికారులు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు సూచించారు.
కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ జిల్లా, అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థల ) బి. రాజ
పదో... రైతుల పట్ల ప్రభుత్వం కు చిత్తశుద్ధి లేదు అరుగాలం పండించిన పంట దళారుల పాలు అయ్యే పరిస్థితి._ జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్
జగిత్యాల రూరల్ అక్టోబర్ 24 (ప్రజా మంటలు) మండలం మోరపల్లి గ్రామంలో పర్యటించిన తొలి జెడ్పి ఛైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్
వసంత మాట్లాడుతూ
పేదల అభివృద్ధిని, సంక్షేమం కాంక్షించాల్సిన ముఖ్యమంత్రి కి ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల కనీసం సోయి లేకపోవడం విచారకరం అన్నారు.
రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం
సగటున... సతారా జిల్లా ఫల్టన్లో యువ డాక్టర్ ఆత్మహత్య — ఇద్దరు పోలీసులపై అత్యాచార ఆరోపణలు
“భద్రత ఇచ్చే పోలీసులే అత్యాచారం చేస్తే ప్రజలు ఎవరిని నమ్మాలి?”ముంబై, అక్టోబర్ 24:మహారాష్ట్రలోని సతారా జిల్లా ఫల్టన్ పట్టణంలో 28 ఏళ్ల మహిళా వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె తన చేతిపై రాసిన ఆత్మహత్యా గమనికలో ఇద్దరు పోలీసు అధికారులపై లైంగిక వేధింపులు, మానసిక హింస ఆరోపణలు చేశారు.డాక్టర్ చేతిలో... అమెరికా ట్రేడ్ డీల్పై తొందరేమీ లేదు: పీయూష్ గోయల్ స్పష్టం
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 24:
భారత్ ఎలాంటి ట్రేడ్ డీల్ (వ్యాపార ఒప్పందం) విషయంలోనూ తొందరపాటు లేదా ఒత్తిడికి లోనవ్వదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు
జర్మనీ రాజధాని బెర్లిన్లో జరిగిన “బెర్లిన్ గ్లోబల్ డైలాగ్” సదస్సులో మాట్లాడిన ఆయన, “భారతదేశం ఏ దేశం ఒత్తిడికీ తలవంచదు. మేము డెడ్లైన్ కింద... జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు
హైదరాబాద్ అక్టోబర్ 24 (ప్రజా మంటలు):
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. నవంబర్ 11న పోలింగ్ జరిగే ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు పోటీపడుతున్నట్టు రిటర్నింగ్ అధికారి సాయిరాం ప్రకటించారు. మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 81 మంది అభ్యర్థులు అర్హత పొందారు. వారిలో... బస్సు మిస్సయి...బతికిపోయిన నేవీ ఆఫీసర్..
అద్దాల పగల కొట్టుకొని బయట పడ్డ హిందూపూర్ కు చెందిన వేణుగోపాల్ రెడ్డీ
సికింద్రాబాద్, అక్టోబర్ 24 (ప్రజా మంటలు) :
కర్నూల్ లో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో సికింద్రాబాద్ కు చెందిన నేవీ లెఫ్టినెంట్ కమాండర్ అదృష్టవశాత్తుగా తప్పించుకోగలిగారు. వివరాలు ఇవి..సికింద్రాబాద్ చిలకలగూడ బడే మసీదు ప్రాంతానికి చెందిన సోమయ్య కుమారుడు... బంగారం, వెండి ధరలు కుప్పకూలాయి — వారంలోనే భారీ పతనం!
వారంలో ₹9500 తగ్గుదల
హైదరాబాద్, అక్టోబర్ 24:దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు వరుసగా భారీగా పడిపోయాయి. ఒకే రోజు వ్యవధిలో బంగారం రూ.1,836 తగ్గగా, వెండి ధర రూ.4,417 తగ్గింది. దీంతో పెట్టుబడిదారులు కొంతవరకు ఆందోళనకు గురవుతున్నారు.
ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) తాజా గణాంకాల ప్రకారం, 24 అక్టోబర్... తక్కలపల్లి, గుల్లపేట గ్రామాల్లో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్ అక్టోబర్ 24 (ప్రజా మంటలు) మండలం తక్కల పల్లి గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 12 లక్షల 60 వేలతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి, గుల్లపేట గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 22 లక్షల 20 వేలతో సీసీ రోడ్లు డ్రైనేజీ అభివృద్ధి పనులకు భూమి
ఈ... పట్టణ అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేస్తా_ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల అక్టోబర్ 24 (ప్రజా మంటలు) *సామ సత్యనారాయణ* పట్టణ అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేస్తా అన్నారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ చింతకుంట మినీ ట్యాంక్ బండ్ వద్ద 15th ఫైనాన్స్ నిధులలు 40 లక్షలతో సెంట్రల్ లైటింగ్ మరమ్మత్తులు వెహికల్ మౌంటెడ్ స్కై లిఫ్ట్ లాడార్ ను శుక్రవారం ప్రారంభించి,అనంతరం
చింతకుంట... రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికైన జగిత్యాల ఎస్ఎం అకాడమీ విద్యార్థులు
జగిత్యాల అక్టోబర్ 24 ( ప్రజా మంటలు)స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) వారి ఆధ్వర్యంలో కరీంనగర్లో నిర్వహించిన టేబుల్ టెన్నిస్ రాష్ట్రస్థాయి పోటీలలో జగిత్యాలకు చెందిన గోపు మణిదీప్ రెడ్డి బిడిగే అభిరామ్ మరియు మోక్షప్రద అండర్ 17 విభాగంలో అత్యంత ప్రతిభ కనబరచి నవంబర్ నెలలో ఖమ్మంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.... శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం
జగిత్యాల అక్టోబర్ 24 (ప్రజా మంటలు) శుక్రవారం.రోజున ఉదయం. శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవాసమితి, ఆధ్వర్యంలో. సొంత నివాసం లేని నిరుపేద కుటుంబంలో ఎవరైనా మరణిస్తే. దహన సంస్కాలకు.,. ఆర్థిక సహాయం తో పాటు. నిత్యవసర కిరాణం సరుకులు, అందించడం, కొరకు, మన జగిత్యాల జిల్లాలో ఒక స్వచ్ఛంద సేవా .
ఇట్టి... 