ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, సైనికులకు మనోధైర్యం కల్పించాలని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల మే 9 (ప్రజా మంటలు)
భారత దేశం తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ మరింతగా విజయవంతం కావాలని, దేశ రక్షణకై వీరోచితంగా పోరాడుతున్న భారత సైనికులకు మనోధైర్యం కలిగించాలని, వారికి దైవికంగా మంగళాశాసనములు అందించడానికి గాను జిల్లా కేంద్రంలోని టవర్ సమీపంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు శుక్రవారం నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమంలో అర్చకులతో పాటుగా ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ రాజమౌళి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, ఆలయ వ్యవస్థాపక సభ్యులు మంచాల రాంగోపాల్, గౌరిశెట్టి రాజు, బాశెట్టి లవకుమార్, గౌరిశెట్టి వెంకన్న, శ్రీరామమందిరం సభ్యులు రుద్రంగి గోపాల కృష్ణ, ఆలయ ఉద్యోగి రుద్రాంగి భాను తదితరులు పాల్గొన్నారు.
పూజా కార్యక్రమం అనంతరం గత నెల 22 న ముష్కరుల చేతుల్లో హతులైన పహాల్గమ్ మృతులకు సంతాపం ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతరెడ్డి తోపాటు మంత్రివర్గం, యువత సంఘీభావం పలుకుతూ, చేపట్టిన కార్యక్రమంకు తోడుగా దేవాదాయ శాఖ పక్షాన ఆపరేషన్ సింధూర్ మరింతగా విజయవంతం కావాలని, దేశ రక్షణకై వీరోచితంగా పోరాడుతున్న భారత సైనికులకు మనోధైర్యం కలిగించాలని, వారికి దైవికంగా మంగళాశాసనములు అందించడానికి గాను చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలందించాలని, దేశానికి వెన్నెముకగా నిలిచిన ప్రధాని నరేంద్రమోడీకి ప్రతి ఒక్కరూ సంఘీభావంగా నిలవాలని కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పద్మారావునగర్ లో సాయి సప్తాహం

ఉత్తమ డాక్టర్లకు మెడికల్ ఎక్సలెన్సీ అవార్డులు *రాజ్ భవన్ లో ప్రధానం చేసిన గవర్నర్

ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో - బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలి

అనాధ పిల్లలకు సాయం చేయడం ఆదర్శనీయం..

కల్వకుంట్ల కవిత తో జాగృతి వైస్ ప్రెసిడెంట్ మంచాల వరలక్ష్మీ భేటి

ధర్మపురి మండల కేంద్రంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్

చదువుతోపాటు సంస్కారం అందించాలి -గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్

జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక"*

జగిత్యాలలో ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ ఉచిత మెగా వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరణ

ధరూర్ క్యాంప్ ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.

బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు - ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు
