ఉగ్రవాద దాడిని నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ శాఖ కొవ్వొత్తుల ర్యాలీ దిష్టిబొమ్మ దహనం
గొల్లపల్లి ఎప్రిల్ 25 (ప్రజా మంటలు):
జమ్ము కాశ్మీర్ లోని పహల్గాం దగ్గర పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని నిరసిస్తూ గొల్లపల్లి మండలం కేంద్రం లో శుక్రవారము రాత్రి బస్టాండ్ నుండి ర్యాలీగా బయలుదేరి, గ్రామపంచాయతీ వద్ద దిష్టిబొమ్మను దహనం చేశారు విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామ యువకులు కొవ్వొత్తుల ర్యాలీ అనంతరం దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో సుమారు 26 మంది చనిపోయారని, 20 మందికి పైగా క్షతగాత్రులు అయ్యారని ఉగ్రవాదులు జరిపిన ఈ హేయమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని అదేవిధంగా ఈ చర్యకు ప్రతి చర్యగా దేశం మొత్తం ఐక్యంగా వారికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. అలాగే మన దేశంలో ఉంటూ మన ఉప్పు తింటూ పరాయి దేశానికి వంతపాడే కొందరు నీచులను కేంద్ర ప్రభుత్వం మన దేశం నుంచి తరిమికొట్టాలని డిమాండ్ చేశారు.
మతాల మధ్య చిచ్చు పెడుతూ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసే ఇలాంటి చర్యల పట్ల దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ ఐకమత్యంతో ఎదుర్కోవాలని అన్నారు. ఉగ్రదాడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇలాంటి సంఘటనలు పునారవృతం కాకుండా మన దేశ శక్తిని ప్రపంచానికి తెలిసేలా చేయాలని అన్నారు. అనంతరం ఉగ్రదాడిలో అసువులు బాసిన వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని జిల్లా అధ్యక్షులు వేముల సంతోష్ విశ్వహిందూ పరిషత్ బజరంగ్ శాఖ కుంబర్ కార్ అరుణ్, అంకం సతీష్, కోల వెంకటేష్, ఎనగందుల రమేష్, నల్ల సతీష్ రెడ్డి, నిరంజన్ ,యువకులు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్
.jpg)
కన్నులపండువగా మహాకాళి అమ్మవారి ఘటము ఊరేగింపు

పాశమైలారం ప్రమాద ఘటనపై ఎన్హెచ్ఆర్సీ లో పిటీషన్

ఆపదలో ఉన్న వారిని కాపాడే గొప్ప వృత్తి - గాంధీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్..

పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్

చుట్టాల బస్తీ యూపీహెచ్సీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్

శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత

ఈ ఏడాది ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం హపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారు...!

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమా
