డిసెంబర్ 27...జనగణమన మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభలో పాడిన దినం
డిసెంబర్ 27...జనగణమన మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభలో పాడిన దినం
డిసెంబర్ 27...జనగణమన మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభలో పాడిన దినం
రామ కిష్టయ్య సంగన భట్ల...
9440595494
భారత జాతీయ గీతమైన జనగణమన 1911లోరవీంద్రనాధ్ ఠాగూర్ రచించిన, మొదటిసారి పాడిన గీతాన్ని 1911 డిసెంబర్ 27 న కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటి సారిగా పాడారు. జనగణ మన భారత జాతీయగీతం. నోబెల్ బహుమతి గ్రహీత, రవీంద్రనాథ్ టాగోర్ రాసిన బెంగాలీ గీతం లోని మొదటి భాగం ఇది. భారత జాతీయ గీతం సంస్కృత పద భూయిష్టమైన బెంగాలీ భాషలో ఉంది. 1912 జనవరి లో ఈ గీతాన్ని "తత్వ భోదిని" అనే పత్రిక "భారత విధాత" అనే పేరుతో ప్రచురించింది. 1950 జనవరి 24 న జాతీయగీతంగా రాజ్యాంగ సభ స్వీకరించింది. ఈ గీతానికి సంగీత బాణీ కూడా ముందుగా ఠాగూర్ సృష్టించారు. బాణీ కనుగుణంగా ఈ గీతాలాపన చేసేందుకు 52 సెకండ్లు పడుతుంది. అప్పుడ ప్పుడు మొదటి, చివరి పాదాలను మాత్రమే పాడే పద్ధతి కూడా ఉంది. దీనికి 20 సెకండ్లు పడుతుంది.
భారతదేశ జాతీయగీతం 'జనగణమన' గీతాన్ని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ నిజానికి 1911లోనే రాశారు. అదే ఏడాది డిసెంబర్ 27న కోల్కతాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావే శాలలో దానిని ఆలపించారు. ఆ తర్వాత కూడా జాతీయోద్యమం నేపథ్యంలో ఆ గీతాన్ని అనేక సార్లు, అనేక వేదికల మీద ఆలపించారు. అయితే ఇప్పుడు మనం వినే ట్యూన్లో కాకుండా, నిర్ధిష్టమైన స్వర కల్పన లేకుండా, ఎవరికి నచ్చిన రాగంలో వాళ్లు పాడుకునే వారు. జనగణ మనకు ఆ స్వరాన్ని కట్టింది ఒక ఐరిష్ జాతీయు రాలైతే... దానికి వేదికైంది చిత్తూరు జిల్లా మదనపల్లె అనే విషయం చాలా మందికి తెలియని తెలియదు. భారత స్వాతంత్రో ద్యమాన్ని బలపరిచిన డాక్టర్ అనీబిసెంట్ మదన పల్లెలో థియోసాఫికల్ కాలేజీని స్థాపిం చారు. ఐరిష్ జాతీయుడైన ప్రముఖ విద్యావేత్త జేమ్స్ హెన్రీ కజిన్స్ దాని ప్రిన్సిపాల్గా ఉండేవారు. లండన్ మ్యూజిక్ కాలేజిలో చదువుకున్న ఆయన భార్య మార్గరెట్ కజిన్స్ అక్కడ సంగీతాన్ని నేర్పించేవారు.
1919లో దక్షిణ భారతదేశ పర్యటనలో ఉన్న రవీంద్రనాథ్ ఠాగూర్ ఒకరోజు బెంగళూరు చేరుకున్నారు. అక్కడ ఉన్నపుడే ఆయనకు మదనపల్లె వాతా వరణం, జేమ్స్ కజిన్స్ కవిత్వం అంటే చాలా ఇష్టమైన ఠాగూర్, కజిన్స్ అక్కడే ఉన్న విషయం తెలుసుకుని, ఆయన విశ్రాంతి కోసం మదనపల్లెలోని థియోసా ఫికల్ కాలేజీ చేరు కున్నారు. ఠాగూర్కు ప్రశాంత వాతావరణం కలిగిన థియో సాఫికల్ కాలేజీలో ప్రతి బుధవారం భోజనాల తర్వాత విద్యార్థులంతా కలిసి పాటలు పాడేవాళ్లు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఠాగూర్, ఒక కార్యక్రమంలో పాల్గొని, ఆ సందర్భంగా ఆయన స్వయంగా తన గొంతుకతో జనగణ మన ఆలపించారు. ఠాగూర్ కంఠస్వరం నుంచి వెలువడిన ఆ పాటకు విద్యార్థులంతా గొంతు కలిపారు. మార్గరేట్ కజిన్స్ కూడా ఆ సమయంలో అక్కడే ఉండి, పాటలోని దేశభక్తిని, జాతీయ భావాన్ని గమనించారు. కానీ అప్పటికి జనగణమనను ఎవరికి వారే తోచిన రీతిలో పాడుకునే వారు. ఎవరూ రాగయుక్తంగా పాడ లేదు. కనుక దానిని తానే స్వర బద్ధం చేయాలని నిర్ణయించు కున్నారు. తెల్లవారి ఆమె ఠాగూర్ ను కలిసి జనగణమనను స్వర బద్ధం చేయాలన్న తన కోరికను వెలి బుచ్చారు. దీనికి అంగీక రించిన ఠాగూర్, ఆమెకు ఆ పాట అర్థాన్ని వివరించారు. దానికి స్వరం ఎలా ఉంటే బాగుంటుందో సూచిం చారు. తర్వాత మార్గరేట్ కజిన్స్ తన విద్యార్థినుల సహాయంతో ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటూ దానికి. బాణీ సమకూర్చారు. తర్వాత ఠాగూర్కు తాను కట్టిన స్వరాన్ని వినిపించారు. కొన్ని చిన్న చిన్న సంగీత పరికరాలతో విద్యా ర్థులు రాగయుక్తంగా పాడిన జనగణమన గీతాన్ని విన్న ఠాగూర్ ఆమెను ఎంతగానో అభినందిం చారు. బెంగాల్లో పుట్టిన జనగణ మన గీతం మదనపల్లెలో స్వరాన్ని సమకూర్చు కున్నది. రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లెలో ఉన్న సమయంలోనే ఒక ఉదయాన థియోసాఫికల్ కాలేజీ ప్రాంగణం లోని చెట్టుకింద కూర్చుని జనగణమనను ఆంగ్లం లోనికి అనువదించారు కూడా.
ఆ తర్వాత దానిని తన అందమైన చేతిరాతతో రాయడమే కాకుండా, కింది భాగంలో దాని పేరు 'మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా' అని రాశారు. దాని కింద ఫిబ్రవరి 28, 1919 అని రాసి, సంతకం చేసి, మార్గరేట్ కజిన్స్కు బహుమానంగా ఇచ్చారు. మదనపల్లె కాలేజీ వదలివెళ్లే ముందు ఠాగూర్ దానిని 'దక్షిణ భారతదేశపు శాంతినికేతన్' అని కీర్తించారు.
నిజానికి జనగణమన దేశభక్తి గేయం. ‘జన గణ మన’ ఇక నుంచీ మన కొత్త గణతంత్ర రాజ్యానికి జాతీయ గీతమనీ, దీన్ని అంతా గౌరవించి ఆదరించాలనీ 1950 జనవరి 24న రాజ్యాంగ సభ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఓ ప్రకటన చేశారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో మహో న్నత పాత్ర పోషించిన ‘వందేమా తరం’ గీతాన్ని కూడా జన గణ మనతో సమానంగా గౌరవించి ఆదరించాలి’’ అని ఆ రోజున రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. భారతదేశ రాజ్యాంగం ఆర్టికల్ 51ఏలో ఈ గీతాన్ని గౌరవించా లంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసిన ప్రస్తావన కనిపిస్తుంది. ‘‘ప్రతి పౌరుడూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. జాతీయ పతాకం, జాతీయ గీతం వంటి రాజ్యాంగ ఆదర్శాలు, లక్ష్యాలు, సంస్థలను గౌరవించాలి’’ అని ఈ చట్టం పేర్కొంటున్నది. ప్రార్థనగా, కృతజ్ఞతగా పఠించే 52 సెకన్ల ఈ చిన్న గీతానికి ఉన్నంత గుర్తింపు , భారత దేశంలో, ప్రపంచంలో కూడా మరే గీతానికీ లేదు. మన జాతీయ గీతం దేశ సమైక్యతకు సరైన ప్రతీకగా నిలిచింది.
జాతీయ గీతం, జాతీయ పతాకం పట్ల గౌరవం, ప్రేమాభిమానాలు ప్రదర్శించడ మంటే మాతృభూమిని గౌరవించు కోవడమే అవుతుంది. ఇది ప్రతి ఒక్కరిలో దేశభక్తిని, జాతీయ భావాన్ని నింపడానికి ఉపకరిస్తుంది.
జనగణమన పాడినప్పుడు దాని అర్ధాన్ని కూడా ఒక్కసారి మననం చేసుకోవాలి. దాని నేపథ్యాన్ని, అర్థాన్ని, ప్రాధాన్యతను గుర్తించి, తర్వాత తరం వారికి చేర్చాల్సిన అవసరం అనివార్యంగా ఉంది.
ఠాగూర్ వ్రాసిన ఈ గీతం లో అయిదు చరణాలు ఉండగా కొన్ని రాజకీయ కారణాల వలన కేవలం ఒకే చరణాన్ని మాత్రమే జాతీయ గీతం లో చేర్చడం జరిగింది.
పూర్తి గీతం ఇలా ఉంది...
జనగణమన అధినాయక జయ హే! భారత భాగ్య విధాతా
పంజాబ్, సింధు, గుజరాత, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగా
వింధ్య హిమాచల యమునా గంగా, ఉచ్ఛల జలధి తరంగా
తవ శుభనామే జాగే, తవ శుభ ఆశిష మాగే, గాహే తవ జయ గాథా, జనగణ మంగళదాయక జయ హే! భారత భాగ్య విధాతా
జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!
2వ చరణం... అహరహ తవ ఆహ్బాన్ ప్రచారిత, శుని తవ ఉదార వాని(ణి), హిందు, బౌద్ధ్, శిఖ్, జైన్, పారశిక్, ముసల్మాన్, క్రిస్తాని,పూరబ్ పశ్చిమ ఆశే, తవ సింఘాసన పాశే,
ప్రేమ్ హార్ హొయె గాథా
జనగణ ఐక్య విధాయక జయ హే! భారత భాగ్య విధాతా
జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!
3వ చరణం... పతన అభ్యుద్దయ్ బన్ధుర్ పంథా, యుగ్ యుగ్ ధావిత యాత్రి, హే చిరొ సారొథి, తవ రథ్ చక్రే, ముఖరిత పథ్ దిన్ రాత్రి
దారుణ విప్లవ మాఝే, తవ శంఖధ్వని బాజే
సంకట దుఃఖ త్రాతా
జనగణ పథ్ పరిచాయక జయ హే! భారత భాగ్య విధాతా
జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!
4వ చరణం... ఘోర తిమిర్ ఘన నిబీడ నిశీథే, పీడిత మూర్చిత దేశే
జాగృత ఛిల తవ అవిచల మంగళ, నత నయనే అనిమేషే
దుస్స్వప్నే ఆటంకే, రక్షా కరిలే అంకే, స్నేహమయి తుమి మాథా
జనగణ దుఃఖ త్రయకా జయ హే! భారత భాగ్య విధాతా
జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!
జయ హే!
5వచరణం... రాత్రి ప్రభాతిలా ఉదిల రవిఛావి, పూర్వ ఉదయగిరి భాలే, గాహే విహంగమ్ పుణ్య సమిరన్, నవ జీవన రస్ ఢాలే
తవ కరుణారుణ రాగే, నిద్రిత భారత జాగే,
తవ చరణె నత మాథా
జయ జయ జయ హే! జయ రాజెశ్వర్, భారత భాగ్య విధాతా
జయహే! జయహే! జయహే! జయ జయ జయ జయహే!
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాలలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి,
జగిత్యాల, జనవరి 18 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
జగిత్యాలకు చెందిన నవనీత్, సాయి తేజ, ధరూర్కు చెందిన సృజన్ అనే ముగ్గురు యువకులు సంక్రాంతి సెలవుల సందర్భంగా జగిత్యాలకు వచ్చారు.... యుఎఈ అధ్యక్షుడి ఆకస్మిక భారత పర్యటన – వెనుక కారణాలు ఏమిటి?
న్యూఢిల్లీ, జనవరి 17:
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ ఆకస్మికంగా భారతదేశాన్ని సందర్శించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు, సౌదీ, పాకిస్తాన్, టర్కీ ల మధ్య సైనిక, రక్షణ ఒప్పందాల నేపధ్యంలో ఈ పర్యటన వెనుక గల్ఫ్ దేశాలలో నెలకొన్న రాజకీయ... పొత్తులపై బహిరంగ వ్యాఖ్యలు వద్దు : తమిళనాడు కాంగ్రెస్ నాయకులకు రాహుల్ గాంధీ సూచన
న్యూఢిల్లీ, జనవరి 17 (ప్రజా మంటలు):
తమిళనాడు కాంగ్రెస్ నాయకులు కూటములు, సీట్ల పంపకం వంటి అంశాలపై బహిరంగంగా మాట్లాడవద్దని పార్టీ అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని తమిళనాడు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సెల్వప్పెరుంధగై వెల్లడించారు. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పూర్తిగా అనుసరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
తమిళనాడులో అసెంబ్లీ... రాష్ర్టంలో కొత్త రాజకీయ కూటమి
వివరాలు వెల్లడించిన గాలి వినోద్ కుమార్, కపిలవాయి దిలీప్ కుమార్
సికింద్రాబాద్, జనవరి 17 (ప్రజా మంటలు):
రాష్ర్టంలో కొత్తగా రాజకీయ కూటమి ఏర్పాటు అయింది. తెలంగాణ ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) లో నమోదైన తొమ్మిది రాజకీయ పార్టీలు కలసి కొత్తగా తెలంగాణ రాజకీయ కూటమిగా ఏర్పడ్డాయి. తెలంగాణ రాజకీయ కూటమి కి సంబందించిన వివరాలను కూటమి... అమెరికా కు వ్యతిరేకంగా డెన్మార్క్ ప్రజల నిరసన ప్రదర్శనలు
కోపెన్హేగెన్, జనవరి 17 :
విరోధ భావాలతో వేలాది ప్రజలు డెన్మార్క్ రాజధాని కోపెన్హేగెన్లో రోడ్డులకు దిగారు, ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ల్యాండ్ను స్వాధీనంగా పొందాలని పునఃప్రచారం చేస్తున్నారని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ ఆర్టిక్ ద్వీపం స్వయంప్రభుత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఆదేశం దేనికి సరిపోయేది కాదని నిరూపించాలని అక్కడి ప్రజలు తీవ్రంగా... గత ప్రభుత్వం పాలమూరును పట్టించుకోలేదు – డీకే అరుణ
జడ్చర్ల, జనవరి 17 (ప్రజా మంటలు):
గత ప్రభుత్వం పాలమూరు అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రజలను మోసం చేసిందని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో రూ.200 కోట్లతో నిర్మించనున్న రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (IIIT) భూమిపూజ కార్యక్రమంలో ఆమె... జగిత్యాల, రాయికల్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం దిశా నిర్దేశం చేసిన మాజీ మంత్రి కొప్పుల
జగిత్యాల జనవరి 17 (ప్రజా మంటలు)
జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు అధ్యక్షతన జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీల ఎన్నికల సన్నాహకపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ , కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ , ఎమ్మెల్సీ ఎల్ రమణ , జగిత్యాల జిల్లా బీఆర్ఎస్... లక్ష్యం ఉన్నతంగా ఉండాలి – చదువే జీవితాన్ని మార్చుతుంది – సీఎం రేవంత్ రెడ్డి
జడ్చర్ల, జనవరి 17 (ప్రజా మంటలు):
లక్ష్యం ఉన్నతంగా పెట్టుకుని కష్టపడితేనే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విద్యార్థినీ విద్యార్థులకు సూచించారు. చదువుతోనే సమాజంలో గౌరవం లభిస్తుందని తెలిపారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో రూ.200 కోట్లతో నిర్మించనున్న రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (IIIT) భూమిపూజ... అవినీతి కవలలుగా ప్రజల కష్టాన్ని దోచుకున్న బీజేపీ–బీఆర్ఎస్ – డిసిసి అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కరీంనగర్, జనవరి 17 (ప్రజా మంటలు):
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల పాలనలో కరీంనగర్ నగరంలో అభివృద్ధి జరగలేదని, అవినీతే రాజ్యమేలిందని డిసిసి అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. ఈ రెండు పార్టీలు అవినీతి కవలలుగా మారి ప్రజల కష్టార్జితాన్ని దోచుకున్నాయని విమర్శించారు.
నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో కరీంనగర్ అసెంబ్లీ... మెటుపల్లి మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు
మెటుపల్లి, జనవరి 17 (ప్రజా మంటలు):
మెటుపల్లి మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులకు సంబంధించి ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వర్గాల వారీగా వార్డుల విభజన ఈ విధంగా ఉంది.
జనరల్ (ఓపెన్) వార్డులు
వార్డు నంబర్లు
01, 03, 17, 21, 23
మొత్తం : 5 వార్డులు
జనరల్ – మహిళ వార్డులు
వార్డు... తెలంగాణ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు: వర్గాలవారిగా రిజర్వేషన్ల వివరాలు
హైదరాబాద్ జనవరి 17 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో చైర్మన్ పదవులుBC, SC, మహిళ (Women), జనరల్ (Unreserved) — వర్గాల వారీగా విడివిడిగా జాబితాలు )
BC (బీసీ) కేటగిరీ – మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్లు
🔹 BC మహిళ
మున్సిపాలిటీ
ఎల్లందు
జగిత్యాల
కామారెడ్డి
బాన్సువాడ... జగిత్యాల బిసి మహిళా, కోరుట్ల, ధర్మపురి జనరల్ మహిళ, రాయికల్, మెటుపల్లి జనరల్ చైర్మన్ సీట్లు
హైదరాబాద్ జనవరి 17 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికల కోసం వర్గాల వారీ రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ST, SC, BC, అన్రిజర్వ్డ్ (జనరల్ + మహిళ) కేటగిరీల్లో మున్సిపాలిటీలను కేటాయించింది.
జగిత్యాల బిసి మహిళకు, కోరుట్ల, ధర్మపురి జనరల్ మహిళకు, రాయికల్, మెటుపల్లి జనరల్... 