డిసెంబర్ 27...జనగణమన  మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభలో  పాడిన దినం

On
డిసెంబర్ 27...జనగణమన  మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభలో  పాడిన దినం

డిసెంబర్ 27...జనగణమన  మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభలో  పాడిన దినం


డిసెంబర్ 27...జనగణమన  మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభలో  పాడిన దినం

 రామ కిష్టయ్య సంగన భట్ల...
     9440595494

భారత జాతీయ గీతమైన జనగణమన 1911లోరవీంద్రనాధ్ ఠాగూర్ రచించిన, మొదటిసారి పాడిన గీతాన్ని 1911 డిసెంబర్ 27 న కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటి సారిగా పాడారు. జనగణ మన భారత జాతీయగీతం. నోబెల్ బహుమతి గ్రహీత, రవీంద్రనాథ్ టాగోర్ రాసిన బెంగాలీ గీతం లోని మొదటి భాగం ఇది. భారత జాతీయ గీతం సంస్కృత పద భూయిష్టమైన బెంగాలీ భాషలో ఉంది. 1912 జనవరి లో ఈ గీతాన్ని "తత్వ భోదిని" అనే పత్రిక "భారత విధాత" అనే పేరుతో ప్రచురించింది. 1950 జనవరి 24 న జాతీయగీతంగా రాజ్యాంగ సభ స్వీకరించింది. ఈ గీతానికి సంగీత బాణీ కూడా ముందుగా ఠాగూర్ సృష్టించారు. బాణీ కనుగుణంగా ఈ గీతాలాపన చేసేందుకు 52 సెకండ్లు పడుతుంది. అప్పుడ ప్పుడు మొదటి, చివరి పాదాలను మాత్రమే పాడే పద్ధతి కూడా ఉంది. దీనికి 20 సెకండ్లు పడుతుంది.

భారతదేశ జాతీయగీతం 'జనగణమన' గీతాన్ని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ నిజానికి 1911లోనే రాశారు. అదే ఏడాది డిసెంబర్ 27న కోల్‌కతాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావే శాలలో  దానిని ఆలపించారు. ఆ తర్వాత కూడా జాతీయోద్యమం నేపథ్యంలో ఆ గీతాన్ని అనేక సార్లు, అనేక వేదికల మీద ఆలపించారు. అయితే ఇప్పుడు మనం వినే ట్యూన్‌లో కాకుండా, నిర్ధిష్టమైన స్వర కల్పన లేకుండా, ఎవరికి నచ్చిన రాగంలో వాళ్లు పాడుకునే వారు.  జనగణ మనకు ఆ స్వరాన్ని కట్టింది ఒక ఐరిష్ జాతీయు రాలైతే... దానికి వేదికైంది చిత్తూరు జిల్లా మదనపల్లె అనే విషయం చాలా మందికి తెలియని తెలియదు. భారత స్వాతంత్రో ద్యమాన్ని బలపరిచిన డాక్టర్ అనీబిసెంట్ మదన పల్లెలో థియోసాఫికల్ కాలేజీని స్థాపిం చారు. ఐరిష్ జాతీయుడైన ప్రముఖ విద్యావేత్త జేమ్స్ హెన్రీ కజిన్స్ దాని ప్రిన్సిపాల్‌గా ఉండేవారు. లండన్ మ్యూజిక్ కాలేజిలో చదువుకున్న ఆయన భార్య మార్గరెట్ కజిన్స్ అక్కడ సంగీతాన్ని నేర్పించేవారు. 

1919లో దక్షిణ భారతదేశ పర్యటనలో ఉన్న రవీంద్రనాథ్ ఠాగూర్ ఒకరోజు బెంగళూరు చేరుకున్నారు. అక్కడ ఉన్నపుడే ఆయనకు మదనపల్లె వాతా వరణం, జేమ్స్ కజిన్స్ కవిత్వం అంటే చాలా ఇష్టమైన ఠాగూర్‌, కజిన్స్ అక్కడే ఉన్న విషయం తెలుసుకుని,  ఆయన విశ్రాంతి కోసం మదనపల్లెలోని థియోసా ఫికల్ కాలేజీ చేరు కున్నారు. ఠాగూర్‌కు ప్రశాంత వాతావరణం కలిగిన థియో సాఫికల్ కాలేజీలో ప్రతి బుధవారం భోజనాల తర్వాత విద్యార్థులంతా కలిసి పాటలు పాడేవాళ్లు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఠాగూర్, ఒక కార్యక్రమంలో  పాల్గొని, ఆ సందర్భంగా ఆయన స్వయంగా తన గొంతుకతో జనగణ మన ఆలపించారు. ఠాగూర్ కంఠస్వరం నుంచి వెలువడిన ఆ పాటకు విద్యార్థులంతా గొంతు కలిపారు. మార్గరేట్ కజిన్స్ కూడా ఆ సమయంలో అక్కడే ఉండి,  పాటలోని దేశభక్తిని, జాతీయ భావాన్ని గమనించారు. కానీ అప్పటికి జనగణమనను ఎవరికి వారే తోచిన రీతిలో పాడుకునే వారు. ఎవరూ రాగయుక్తంగా పాడ లేదు. కనుక దానిని తానే స్వర బద్ధం చేయాలని నిర్ణయించు కున్నారు. తెల్లవారి ఆమె ఠాగూర్‌ ను కలిసి జనగణమనను స్వర బద్ధం చేయాలన్న తన కోరికను వెలి బుచ్చారు. దీనికి అంగీక రించిన ఠాగూర్, ఆమెకు ఆ పాట అర్థాన్ని వివరించారు. దానికి స్వరం ఎలా ఉంటే బాగుంటుందో సూచిం చారు. తర్వాత మార్గరేట్ కజిన్స్ తన విద్యార్థినుల సహాయంతో ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటూ దానికి. బాణీ సమకూర్చారు.  తర్వాత ఠాగూర్‌కు తాను కట్టిన స్వరాన్ని వినిపించారు. కొన్ని చిన్న చిన్న సంగీత పరికరాలతో విద్యా ర్థులు రాగయుక్తంగా పాడిన జనగణమన గీతాన్ని విన్న ఠాగూర్ ఆమెను ఎంతగానో అభినందిం చారు. బెంగాల్‌లో పుట్టిన జనగణ మన గీతం మదనపల్లెలో స్వరాన్ని సమకూర్చు కున్నది. రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లెలో ఉన్న సమయంలోనే ఒక ఉదయాన థియోసాఫికల్ కాలేజీ ప్రాంగణం లోని చెట్టుకింద కూర్చుని జనగణమనను ఆంగ్లం లోనికి  అనువదించారు కూడా.

ఆ తర్వాత దానిని తన అందమైన చేతిరాతతో రాయడమే కాకుండా, కింది భాగంలో దాని పేరు 'మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా' అని రాశారు. దాని కింద ఫిబ్రవరి 28, 1919 అని రాసి, సంతకం చేసి, మార్గరేట్ కజిన్స్‌కు బహుమానంగా ఇచ్చారు. మదనపల్లె కాలేజీ వదలివెళ్లే ముందు ఠాగూర్ దానిని 'దక్షిణ భారతదేశపు శాంతినికేతన్' అని కీర్తించారు.

 నిజానికి జనగణమన దేశభక్తి గేయం. ‘జన గణ మన’ ఇక నుంచీ మన కొత్త గణతంత్ర రాజ్యానికి జాతీయ గీతమనీ, దీన్ని అంతా గౌరవించి ఆదరించాలనీ 1950 జనవరి 24న రాజ్యాంగ సభ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్‌ ఓ ప్రకటన చేశారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో మహో న్నత పాత్ర పోషించిన ‘వందేమా తరం’ గీతాన్ని కూడా జన గణ మనతో సమానంగా గౌరవించి ఆదరించాలి’’ అని ఆ రోజున రాజేంద్ర ప్రసాద్‌ పేర్కొన్నారు.  భారతదేశ  రాజ్యాంగం ఆర్టికల్‌ 51ఏలో ఈ గీతాన్ని గౌరవించా లంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసిన ప్రస్తావన కనిపిస్తుంది. ‘‘ప్రతి పౌరుడూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. జాతీయ పతాకం, జాతీయ గీతం వంటి రాజ్యాంగ ఆదర్శాలు, లక్ష్యాలు, సంస్థలను గౌరవించాలి’’ అని ఈ చట్టం పేర్కొంటున్నది. ప్రార్థనగా, కృతజ్ఞతగా పఠించే 52 సెకన్ల ఈ చిన్న గీతానికి ఉన్నంత గుర్తింపు , భారత దేశంలో,  ప్రపంచంలో కూడా మరే గీతానికీ లేదు. మన జాతీయ గీతం దేశ సమైక్యతకు సరైన ప్రతీకగా నిలిచింది.

జాతీయ గీతం, జాతీయ పతాకం పట్ల గౌరవం, ప్రేమాభిమానాలు ప్రదర్శించడ మంటే మాతృభూమిని గౌరవించు కోవడమే అవుతుంది. ఇది ప్రతి ఒక్కరిలో దేశభక్తిని, జాతీయ భావాన్ని నింపడానికి ఉపకరిస్తుంది. 

జనగణమన పాడినప్పుడు దాని అర్ధాన్ని కూడా ఒక్కసారి మననం చేసుకోవాలి. దాని నేపథ్యాన్ని, అర్థాన్ని, ప్రాధాన్యతను గుర్తించి,  తర్వాత తరం వారికి చేర్చాల్సిన అవసరం అనివార్యంగా ఉంది.

ఠాగూర్ వ్రాసిన ఈ గీతం లో అయిదు చరణాలు ఉండగా కొన్ని రాజకీయ కారణాల వలన కేవలం ఒకే చరణాన్ని మాత్రమే జాతీయ గీతం లో చేర్చడం జరిగింది. 


పూర్తి గీతం ఇలా ఉంది...
జనగణమన అధినాయక జయ హే! భారత భాగ్య విధాతా
       పంజాబ్, సింధు, గుజరాత, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగా
       వింధ్య హిమాచల యమునా గంగా, ఉచ్ఛల జలధి తరంగా
       తవ శుభనామే జాగే, తవ శుభ ఆశిష మాగే, గాహే తవ జయ గాథా, జనగణ మంగళదాయక జయ హే! భారత భాగ్య విధాతా
       జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!

2వ చరణం...  అహరహ తవ ఆహ్‍బాన్ ప్రచారిత, శుని తవ ఉదార వాని(ణి),  హిందు, బౌద్ధ్, శిఖ్, జైన్, పారశిక్, ముసల్మాన్, క్రిస్తాని,పూరబ్ పశ్చిమ ఆశే, తవ సింఘాసన పాశే, 
       ప్రేమ్ హార్ హొయె గాథా
       జనగణ ఐక్య విధాయక జయ హే! భారత భాగ్య విధాతా
       జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!

3వ చరణం...  పతన అభ్యుద్దయ్ బన్ధుర్ పంథా, యుగ్ యుగ్ ధావిత యాత్రి, హే చిరొ సారొథి, తవ రథ్ చక్రే, ముఖరిత పథ్ దిన్ రాత్రి
       దారుణ విప్లవ మాఝే, తవ శంఖధ్వని బాజే
       సంకట దుఃఖ త్రాతా
       జనగణ పథ్ పరిచాయక జయ హే! భారత భాగ్య విధాతా
       జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!

4వ చరణం...  ఘోర తిమిర్ ఘన నిబీడ నిశీథే, పీడిత మూర్చిత దేశే
       జాగృత ఛిల తవ అవిచల మంగళ, నత నయనే అనిమేషే
       దుస్స్వప్నే ఆటంకే, రక్షా కరిలే అంకే,  స్నేహమయి తుమి మాథా
       జనగణ దుఃఖ త్రయకా జయ హే! భారత భాగ్య విధాతా
       జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!
జయ హే!

5వచరణం... రాత్రి ప్రభాతిలా ఉదిల రవిఛావి, పూర్వ ఉదయగిరి భాలే, గాహే విహంగమ్ పుణ్య సమిరన్, నవ జీవన రస్ ఢాలే
       తవ కరుణారుణ రాగే, నిద్రిత భారత జాగే, 
       తవ చరణె నత మాథా
       జయ జయ జయ హే! జయ రాజెశ్వర్, భారత భాగ్య విధాతా
       జయహే! జయహే! జయహే! జయ జయ జయ జయహే!

Tags
Join WhatsApp

More News...

జగిత్యాల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ వేడుకలు 

జగిత్యాల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ వేడుకలు  జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం అంగరంగ వైభవంగా శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ వేడుకలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక వేదికను అలంకరింపజేసి ఉత్సవ మూర్తులను వేదికపై ఉంచి కళ్యాణాన్ని...
Read More...

ఎన్ టివి జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ జగిత్యాలలో నిరసన

ఎన్ టివి జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ జగిత్యాలలో నిరసన జగిత్యాల  జనవరి 14 (ప్రజా మంటలు) ఎన్ టివి ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేష్‌, రిపోర్టర్లు చారి, సుధీర్‌లను అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ జగిత్యాల పట్టణంలో  టి యు డబ్ల్యూ జే (ఐ జె యు) ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ చౌరస్తా వద్ద నిర్వహించిన ఈ...
Read More...
Local News  Crime 

గంజాయి పట్టివేత యువత పై కేసు నమోదు

గంజాయి పట్టివేత యువత పై కేసు నమోదు గొల్లపల్లి జనవరి 14  (ప్రజా మంటలు )   గొల్లపల్లి మండలం లోనీ చందోలి గ్రామ శివారులో యువకుడు గంజాయితో వెళుతున్నాడని పక్క సమాచారం మేరకు చందోలి శివారులో పోలీసులు వాహనాల తనిఖీలో భాగంగా  యువకుడిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా అతడి వద్ద 89 గ్రాముల గంజాయి లభించగా వివరాల్లోకెళ్తే వెల్గటూర్ మండలo
Read More...
Local News 

ఆకట్టుకున్న సందేశాత్మక ముగ్గు

ఆకట్టుకున్న సందేశాత్మక ముగ్గు జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మంగళవారం జగిత్యాలలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో జగిత్యాల‌కు చెందిన యూట్యూబ్ స్టార్ దేశవేని మమత వేసిన సందేశాత్మక ముగ్గు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. “రైతు లేనిదే రాజ్యం లేదు… జవాన్ లేకపోతే దేశానికి రక్షణ లేదు” అనే నినాదంతో, పలు రకాల అందమైన రంగులను...
Read More...

హైదరాబాద్‌లో జర్నలిస్టుల అరెస్టులు

హైదరాబాద్‌లో జర్నలిస్టుల అరెస్టులు హైదరాబాద్ జనవరి 14 (ప్రజా మంటలు): హైదరాబాద్‌లో జర్నలిస్టుల వరుస అరెస్టుల వ్యవహారంపై మాజీ మంత్రి హరీశ్ రావు డీజీపీతో ఫోన్‌లో మాట్లాడారు. పండుగ పూట అర్ధరాత్రి జర్నలిస్టుల ఇళ్లకు వెళ్లి తలుపులు పగలగొట్టి అరెస్టులు చేయడం అవసరమా? అని ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వకుండా, చట్టపరమైన ప్రొసీజర్ అనుసరించకుండా జర్నలిస్టులను అరెస్టు చేయడం సరికాదని హరీశ్...
Read More...
Local News  State News 

జగిత్యాల ప్రభుత్వ నర్సింగ్ హాస్టల్‌లో కలకలం

జగిత్యాల ప్రభుత్వ నర్సింగ్ హాస్టల్‌లో కలకలం జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ హాస్టల్‌లో విద్యార్థినుల మొబైల్ ఫోన్లు లాక్కొని, సంక్రాంతి పండుగకు ఇంటికి పంపించకుండా గదుల్లో నిర్బంధించారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. హాస్టల్‌లో సెలవులపై ముందస్తు ప్రకటన లేకుండా విద్యార్థినుల వ్యక్తిగత కమ్యూనికేషన్‌ను ఆపివేయడం,...
Read More...

జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో వైభవంగా ముగ్గుల పోటీలు _ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్

జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో వైభవంగా ముగ్గుల పోటీలు _ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్      జగిత్యాల జనవరి 13 ( ప్రజా మంటలు)జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్  బి.సత్యప్రసాద్, అధ్యక్షతన మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏర్పాటుచేసిన మహిళా ఉద్యోగులకు ముగ్గుల పోటీల కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు హాజరైనారు. జగిత్యాల జిల్లా లోని...
Read More...

జగిత్యాల ,రాయికల్ మున్సిపాలిటీ పై బీజేపీ జెండా ఎగరవేయడమే మా లక్ష్యం  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా బోగ శ్రావణి ప్రవీణ్

జగిత్యాల ,రాయికల్ మున్సిపాలిటీ పై బీజేపీ జెండా ఎగరవేయడమే మా లక్ష్యం  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా బోగ శ్రావణి ప్రవీణ్    జగిత్యాల జనవరి 13 (ప్రజా మంటలు)నియోజక వర్గంలోని జగిత్యాల, రాయికల్ రెండు మున్సిపాలిటీల్లో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బిజెపి పార్టీ పని చేస్తుందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి ప్రవీణ్ అన్నారు జగిత్యాల నియోజకవర్గం కార్యాలయము కమలా నిలయంలో మీడియా సమావేశంలో బిజెపి పార్టీ శ్రేణులతో కలిసి ఆమె...
Read More...
Local News  State News 

తలసాని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పీఎస్ లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

తలసాని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పీఎస్ లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు సికింద్రాబాద్,  జనవరి 13 ( ప్రజామంటలు ):  బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బన్సీలాల్‌పేట్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు.తలసాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్న కాంగ్రెస్ నేతలు, వాటిని...
Read More...
Local News 

సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి పురస్కారాలు

సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి పురస్కారాలు జగిత్యాల జనవరి 13 (ప్రజా మంటలు): తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో   వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన సీనియర్ సిటీజెన్లకు  సంక్రాంతి పురస్కారాలను , ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. మంగళవారం జిల్లా సీనియర్ సిటీజేన్స్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో...
Read More...
Local News 

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే

   మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే హైదరాబాద్, జనవరి 13 (ప్రజా మంటలు): ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జగిత్యాల నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం, మినీ స్టేడియం మంజూరైనప్పటికీ...
Read More...
National  Opinion  Spiritual  

సంక్రాంతి – ముగ్గులు ::సంప్రదాయం, శాస్త్రం, స్త్రీశక్తి

సంక్రాంతి – ముగ్గులు ::సంప్రదాయం, శాస్త్రం, స్త్రీశక్తి ముగ్గులు ఏ ప్రదేశాన్నైనా సౌందర్యవంతంగా మార్చడమే కాక, ఆ ఇంటిని లక్ష్మీ నివాసంగా మలిచే పవిత్ర చిహ్నాలు. రంగురంగుల డిజైన్లు మాత్రమే కాదు, ప్రతి ముగ్గు వెనుక దాగి ఉన్న శాస్త్రీయత, ఆధ్యాత్మిక భావన, సామాజిక ఉద్దేశం చాలా లోతైనవి. రోజూ మనం చూసే ఒక సాధారణ ముగ్గుకే ప్రత్యేక అర్థం ఉంది. ఆ అర్థం,...
Read More...