డిసెంబర్ 27...జనగణమన మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభలో పాడిన దినం
డిసెంబర్ 27...జనగణమన మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభలో పాడిన దినం
డిసెంబర్ 27...జనగణమన మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభలో పాడిన దినం
రామ కిష్టయ్య సంగన భట్ల...
9440595494
భారత జాతీయ గీతమైన జనగణమన 1911లోరవీంద్రనాధ్ ఠాగూర్ రచించిన, మొదటిసారి పాడిన గీతాన్ని 1911 డిసెంబర్ 27 న కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటి సారిగా పాడారు. జనగణ మన భారత జాతీయగీతం. నోబెల్ బహుమతి గ్రహీత, రవీంద్రనాథ్ టాగోర్ రాసిన బెంగాలీ గీతం లోని మొదటి భాగం ఇది. భారత జాతీయ గీతం సంస్కృత పద భూయిష్టమైన బెంగాలీ భాషలో ఉంది. 1912 జనవరి లో ఈ గీతాన్ని "తత్వ భోదిని" అనే పత్రిక "భారత విధాత" అనే పేరుతో ప్రచురించింది. 1950 జనవరి 24 న జాతీయగీతంగా రాజ్యాంగ సభ స్వీకరించింది. ఈ గీతానికి సంగీత బాణీ కూడా ముందుగా ఠాగూర్ సృష్టించారు. బాణీ కనుగుణంగా ఈ గీతాలాపన చేసేందుకు 52 సెకండ్లు పడుతుంది. అప్పుడ ప్పుడు మొదటి, చివరి పాదాలను మాత్రమే పాడే పద్ధతి కూడా ఉంది. దీనికి 20 సెకండ్లు పడుతుంది.
భారతదేశ జాతీయగీతం 'జనగణమన' గీతాన్ని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ నిజానికి 1911లోనే రాశారు. అదే ఏడాది డిసెంబర్ 27న కోల్కతాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావే శాలలో దానిని ఆలపించారు. ఆ తర్వాత కూడా జాతీయోద్యమం నేపథ్యంలో ఆ గీతాన్ని అనేక సార్లు, అనేక వేదికల మీద ఆలపించారు. అయితే ఇప్పుడు మనం వినే ట్యూన్లో కాకుండా, నిర్ధిష్టమైన స్వర కల్పన లేకుండా, ఎవరికి నచ్చిన రాగంలో వాళ్లు పాడుకునే వారు. జనగణ మనకు ఆ స్వరాన్ని కట్టింది ఒక ఐరిష్ జాతీయు రాలైతే... దానికి వేదికైంది చిత్తూరు జిల్లా మదనపల్లె అనే విషయం చాలా మందికి తెలియని తెలియదు. భారత స్వాతంత్రో ద్యమాన్ని బలపరిచిన డాక్టర్ అనీబిసెంట్ మదన పల్లెలో థియోసాఫికల్ కాలేజీని స్థాపిం చారు. ఐరిష్ జాతీయుడైన ప్రముఖ విద్యావేత్త జేమ్స్ హెన్రీ కజిన్స్ దాని ప్రిన్సిపాల్గా ఉండేవారు. లండన్ మ్యూజిక్ కాలేజిలో చదువుకున్న ఆయన భార్య మార్గరెట్ కజిన్స్ అక్కడ సంగీతాన్ని నేర్పించేవారు.
1919లో దక్షిణ భారతదేశ పర్యటనలో ఉన్న రవీంద్రనాథ్ ఠాగూర్ ఒకరోజు బెంగళూరు చేరుకున్నారు. అక్కడ ఉన్నపుడే ఆయనకు మదనపల్లె వాతా వరణం, జేమ్స్ కజిన్స్ కవిత్వం అంటే చాలా ఇష్టమైన ఠాగూర్, కజిన్స్ అక్కడే ఉన్న విషయం తెలుసుకుని, ఆయన విశ్రాంతి కోసం మదనపల్లెలోని థియోసా ఫికల్ కాలేజీ చేరు కున్నారు. ఠాగూర్కు ప్రశాంత వాతావరణం కలిగిన థియో సాఫికల్ కాలేజీలో ప్రతి బుధవారం భోజనాల తర్వాత విద్యార్థులంతా కలిసి పాటలు పాడేవాళ్లు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఠాగూర్, ఒక కార్యక్రమంలో పాల్గొని, ఆ సందర్భంగా ఆయన స్వయంగా తన గొంతుకతో జనగణ మన ఆలపించారు. ఠాగూర్ కంఠస్వరం నుంచి వెలువడిన ఆ పాటకు విద్యార్థులంతా గొంతు కలిపారు. మార్గరేట్ కజిన్స్ కూడా ఆ సమయంలో అక్కడే ఉండి, పాటలోని దేశభక్తిని, జాతీయ భావాన్ని గమనించారు. కానీ అప్పటికి జనగణమనను ఎవరికి వారే తోచిన రీతిలో పాడుకునే వారు. ఎవరూ రాగయుక్తంగా పాడ లేదు. కనుక దానిని తానే స్వర బద్ధం చేయాలని నిర్ణయించు కున్నారు. తెల్లవారి ఆమె ఠాగూర్ ను కలిసి జనగణమనను స్వర బద్ధం చేయాలన్న తన కోరికను వెలి బుచ్చారు. దీనికి అంగీక రించిన ఠాగూర్, ఆమెకు ఆ పాట అర్థాన్ని వివరించారు. దానికి స్వరం ఎలా ఉంటే బాగుంటుందో సూచిం చారు. తర్వాత మార్గరేట్ కజిన్స్ తన విద్యార్థినుల సహాయంతో ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటూ దానికి. బాణీ సమకూర్చారు. తర్వాత ఠాగూర్కు తాను కట్టిన స్వరాన్ని వినిపించారు. కొన్ని చిన్న చిన్న సంగీత పరికరాలతో విద్యా ర్థులు రాగయుక్తంగా పాడిన జనగణమన గీతాన్ని విన్న ఠాగూర్ ఆమెను ఎంతగానో అభినందిం చారు. బెంగాల్లో పుట్టిన జనగణ మన గీతం మదనపల్లెలో స్వరాన్ని సమకూర్చు కున్నది. రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లెలో ఉన్న సమయంలోనే ఒక ఉదయాన థియోసాఫికల్ కాలేజీ ప్రాంగణం లోని చెట్టుకింద కూర్చుని జనగణమనను ఆంగ్లం లోనికి అనువదించారు కూడా.
ఆ తర్వాత దానిని తన అందమైన చేతిరాతతో రాయడమే కాకుండా, కింది భాగంలో దాని పేరు 'మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా' అని రాశారు. దాని కింద ఫిబ్రవరి 28, 1919 అని రాసి, సంతకం చేసి, మార్గరేట్ కజిన్స్కు బహుమానంగా ఇచ్చారు. మదనపల్లె కాలేజీ వదలివెళ్లే ముందు ఠాగూర్ దానిని 'దక్షిణ భారతదేశపు శాంతినికేతన్' అని కీర్తించారు.
నిజానికి జనగణమన దేశభక్తి గేయం. ‘జన గణ మన’ ఇక నుంచీ మన కొత్త గణతంత్ర రాజ్యానికి జాతీయ గీతమనీ, దీన్ని అంతా గౌరవించి ఆదరించాలనీ 1950 జనవరి 24న రాజ్యాంగ సభ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఓ ప్రకటన చేశారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో మహో న్నత పాత్ర పోషించిన ‘వందేమా తరం’ గీతాన్ని కూడా జన గణ మనతో సమానంగా గౌరవించి ఆదరించాలి’’ అని ఆ రోజున రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. భారతదేశ రాజ్యాంగం ఆర్టికల్ 51ఏలో ఈ గీతాన్ని గౌరవించా లంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసిన ప్రస్తావన కనిపిస్తుంది. ‘‘ప్రతి పౌరుడూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. జాతీయ పతాకం, జాతీయ గీతం వంటి రాజ్యాంగ ఆదర్శాలు, లక్ష్యాలు, సంస్థలను గౌరవించాలి’’ అని ఈ చట్టం పేర్కొంటున్నది. ప్రార్థనగా, కృతజ్ఞతగా పఠించే 52 సెకన్ల ఈ చిన్న గీతానికి ఉన్నంత గుర్తింపు , భారత దేశంలో, ప్రపంచంలో కూడా మరే గీతానికీ లేదు. మన జాతీయ గీతం దేశ సమైక్యతకు సరైన ప్రతీకగా నిలిచింది.
జాతీయ గీతం, జాతీయ పతాకం పట్ల గౌరవం, ప్రేమాభిమానాలు ప్రదర్శించడ మంటే మాతృభూమిని గౌరవించు కోవడమే అవుతుంది. ఇది ప్రతి ఒక్కరిలో దేశభక్తిని, జాతీయ భావాన్ని నింపడానికి ఉపకరిస్తుంది.
జనగణమన పాడినప్పుడు దాని అర్ధాన్ని కూడా ఒక్కసారి మననం చేసుకోవాలి. దాని నేపథ్యాన్ని, అర్థాన్ని, ప్రాధాన్యతను గుర్తించి, తర్వాత తరం వారికి చేర్చాల్సిన అవసరం అనివార్యంగా ఉంది.
ఠాగూర్ వ్రాసిన ఈ గీతం లో అయిదు చరణాలు ఉండగా కొన్ని రాజకీయ కారణాల వలన కేవలం ఒకే చరణాన్ని మాత్రమే జాతీయ గీతం లో చేర్చడం జరిగింది.
పూర్తి గీతం ఇలా ఉంది...
జనగణమన అధినాయక జయ హే! భారత భాగ్య విధాతా
పంజాబ్, సింధు, గుజరాత, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగా
వింధ్య హిమాచల యమునా గంగా, ఉచ్ఛల జలధి తరంగా
తవ శుభనామే జాగే, తవ శుభ ఆశిష మాగే, గాహే తవ జయ గాథా, జనగణ మంగళదాయక జయ హే! భారత భాగ్య విధాతా
జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!
2వ చరణం... అహరహ తవ ఆహ్బాన్ ప్రచారిత, శుని తవ ఉదార వాని(ణి), హిందు, బౌద్ధ్, శిఖ్, జైన్, పారశిక్, ముసల్మాన్, క్రిస్తాని,పూరబ్ పశ్చిమ ఆశే, తవ సింఘాసన పాశే,
ప్రేమ్ హార్ హొయె గాథా
జనగణ ఐక్య విధాయక జయ హే! భారత భాగ్య విధాతా
జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!
3వ చరణం... పతన అభ్యుద్దయ్ బన్ధుర్ పంథా, యుగ్ యుగ్ ధావిత యాత్రి, హే చిరొ సారొథి, తవ రథ్ చక్రే, ముఖరిత పథ్ దిన్ రాత్రి
దారుణ విప్లవ మాఝే, తవ శంఖధ్వని బాజే
సంకట దుఃఖ త్రాతా
జనగణ పథ్ పరిచాయక జయ హే! భారత భాగ్య విధాతా
జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!
4వ చరణం... ఘోర తిమిర్ ఘన నిబీడ నిశీథే, పీడిత మూర్చిత దేశే
జాగృత ఛిల తవ అవిచల మంగళ, నత నయనే అనిమేషే
దుస్స్వప్నే ఆటంకే, రక్షా కరిలే అంకే, స్నేహమయి తుమి మాథా
జనగణ దుఃఖ త్రయకా జయ హే! భారత భాగ్య విధాతా
జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!
జయ హే!
5వచరణం... రాత్రి ప్రభాతిలా ఉదిల రవిఛావి, పూర్వ ఉదయగిరి భాలే, గాహే విహంగమ్ పుణ్య సమిరన్, నవ జీవన రస్ ఢాలే
తవ కరుణారుణ రాగే, నిద్రిత భారత జాగే,
తవ చరణె నత మాథా
జయ జయ జయ హే! జయ రాజెశ్వర్, భారత భాగ్య విధాతా
జయహే! జయహే! జయహే! జయ జయ జయ జయహే!
More News...
<%- node_title %>
<%- node_title %>
తొలి మహిళా ఒగ్గుకథ కళాకారిణి జమ్మ మల్లారి మృతి
తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు విగ్రహం
ఒగ్గు వనితకు వినమ్ర శ్రద్ధాంజలి
మహిళాస్వరంతో మల్లన్న మేల్కొలుపు —పురుషాధిక్య రంగంలో ధైర్యంగా సవారి చేసిన మల్లారి ఇక లేరు.
కళా ప్రపంచంలో ఆడవేషం కట్టిన పురుషులు అనేకమంది లబ్ధప్రతిష్ఠులుగా నిలిచారు. కానీ పురుష ఆహార్యాన్ని ధరించి, ఒక జానపద కళారూపాన్ని జీవితాంతం భుజాన మోసిన స్త్రీమూర్తుల కథలు... నేటి నుండి శ్రీ శైలం లో మల్లికార్జునుని బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు): కేంద్ర
శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో నేటి నుండి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉదయం ధ్వజారోహణతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టగా, వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ వివిధ వాహన సేవలు,... విజయ్ అసెంబ్లీ ఎంట్రీ: చెన్నై నుంచే బరిలోకి దిగితే డీఎంకే–ఏఐఏడీఎంకేకు ఎంత ముప్పు?
చెన్నై ఫిబ్రవరి 08 (ప్రజా మంటల - ప్రత్యేక ప్రతినిధి)::
తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ కేవలం కొత్త పార్టీ నేతగానే కాదు, ఇప్పుడు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను కదిలించే ఫ్యాక్టర్గా మారుతున్నారు. తమిళగా వెట్రి కజగం (TVK) పార్టీ ద్వారా అసెంబ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న విజయ్, ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న... రష్యా–అమెరికా మధ్య $12 ట్రిలియన్ ఆర్థిక ఒప్పందాలు?
ఉక్రెయిన్ను పక్కన పెట్టి డీల్ చేస్తున్నారని జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు
అబుదాబిలో విఫలమైన శాంతి చర్చలు
అబుదాబి ఫిబ్రవరి 08:
అబుదాబిలో ఇటీవల నిర్వహించిన ఉక్రెయిన్–రష్యా యుద్ధం ముగింపుకు సంబంధించిన చర్చలు ఎలాంటి స్పష్టమైన ఫలితం లేకుండానే ముగిశాయి. ఈ చర్చలు విఫలమైన కొద్ది రోజులకే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొదిమిర్ జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు.... తాత, నానమ్మ లను గెంటేసిన మనుమడు
.
జగిత్యాల ఫిబ్రవరి 7(ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన రాయి భీమయ్య (85),రాయి గంగరాజు( 80)అనే వృద్ధ తాత, నానమ్మ లను మనుమడు శివ కుమార్ కొట్టి ఇంట్లోంచి గెంటి వేయగా జిల్లా కేంద్రం లోని సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ను ఆశ్రయించారు. ... శ్రీ శ్రీనివాసఆంజనేయ భవాని శంకర ఆలయంలో ఘనంగా పూర్ణాహుతి
జగిత్యాల ఫిబ్రవరి 7 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కూరగాయల మార్కెట్ లోని శ్రీ శ్రీనివాసాం జనేయ, భవాని, శంకర దేవాలయం లో వార్షికోత్సవాల్లో భాగంగా మూడవరోజు పూర్ణాహుతి స్థాపిత దేవత ప్రధాన కలశ ఉద్వాసన మహా అన్నదాన ప్రసాద వితరణ, సాయంత్రం పురవీధులలో స్వామివార్ల శోభాయాత్ర ఘనంగా జరిగింది.
ఈనాటి కార్యక్రమంలో ఆలయ ఫౌండర్,... పట్టణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డా బోగ శ్రావణి
జగిత్యాల ఫిబ్రవరి 7 (ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల మున్సిపల్ 36వ వార్డ్ అభ్యర్థి పుల్ల సుమలత-హరీష్ ,21వ జగ్గుల శిరీష కి మద్దతుగా స్థానిక అన్నపూర్ణ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్లో పాల్గొని పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి... రాయికల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది: తాటిపర్తి జీవన్ రెడ్డి
రాయికల్, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):
రాయికల్ పట్టణ కేంద్రంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, జగిత్యాల–రాయికల్ ప్రాంతాల్లో అనూహ్యమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయని, పదేళ్ల పాటు కాంగ్రెస్ జెండాను విడువకుండా కష్టకాలంలో పోరాడిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో... కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలంటే కారు గుర్తుకే ఓటు: కొప్పుల ఈశ్వర్
రామగుండం, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):
రామగుండం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో 48, 9, 39, 11, 43, 42, 13, 55, 57 డివిజన్లలో నిర్వహించిన ప్రచారంలో బీఆర్ఎస్ ఇంచార్జి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని విస్తృత ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా... రాయికల్ పట్టణంపై గులాబీ జెండా ఎగురవేస్తాం: దావ వసంత సురేష్
రాయికల్, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):
రాయికల్ పట్టణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 1, 5, 10, 11, 12 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం... సారంగాపూర్ ఫారెస్టులో ఫోక్ సాంగ్ షూటింగ్ సందడి
జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని అటవీ ప్రాంతం శనివారం రోజంతా ఫోక్ పాట చిత్రీకరణతో కళకళలాడింది. స్థానిక ప్రజల జీవనశైలిని, గ్రామీణ భావోద్వేగాలను ప్రతిబింబించే ‘కడదాకా తోడుంటనే’ అనే ఫోక్ సాంగ్ షూటింగ్ భారీ ఆసక్తి నడుమ సాగింది.
ఈ పాటను బొమ్మరిల్లు ఫోక్స్ యూట్యూబ్ ఛానల్... దళిత విద్యార్థినులకు పురుగుల అన్నం! ఆస్పత్రిలో 40 మంది విద్యార్థినులు
మంచిర్యాల ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. వసతి గృహంలో భోజనం చేసిన సుమారు 40 మంది దళిత విద్యార్థినులు ఫుడ్ పాయిజనింగ్కు గురయ్యారు. ఒక్కసారిగా విద్యార్థినులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పులతో తీవ్ర అస్వస్థతకు లోనవ్వడంతో హాస్టల్లో కలకలం రేగింది.... 