డిసెంబర్ 27...జనగణమన  మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభలో  పాడిన దినం

On
డిసెంబర్ 27...జనగణమన  మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభలో  పాడిన దినం

డిసెంబర్ 27...జనగణమన  మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభలో  పాడిన దినం


డిసెంబర్ 27...జనగణమన  మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభలో  పాడిన దినం

 రామ కిష్టయ్య సంగన భట్ల...
     9440595494

భారత జాతీయ గీతమైన జనగణమన 1911లోరవీంద్రనాధ్ ఠాగూర్ రచించిన, మొదటిసారి పాడిన గీతాన్ని 1911 డిసెంబర్ 27 న కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటి సారిగా పాడారు. జనగణ మన భారత జాతీయగీతం. నోబెల్ బహుమతి గ్రహీత, రవీంద్రనాథ్ టాగోర్ రాసిన బెంగాలీ గీతం లోని మొదటి భాగం ఇది. భారత జాతీయ గీతం సంస్కృత పద భూయిష్టమైన బెంగాలీ భాషలో ఉంది. 1912 జనవరి లో ఈ గీతాన్ని "తత్వ భోదిని" అనే పత్రిక "భారత విధాత" అనే పేరుతో ప్రచురించింది. 1950 జనవరి 24 న జాతీయగీతంగా రాజ్యాంగ సభ స్వీకరించింది. ఈ గీతానికి సంగీత బాణీ కూడా ముందుగా ఠాగూర్ సృష్టించారు. బాణీ కనుగుణంగా ఈ గీతాలాపన చేసేందుకు 52 సెకండ్లు పడుతుంది. అప్పుడ ప్పుడు మొదటి, చివరి పాదాలను మాత్రమే పాడే పద్ధతి కూడా ఉంది. దీనికి 20 సెకండ్లు పడుతుంది.

భారతదేశ జాతీయగీతం 'జనగణమన' గీతాన్ని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ నిజానికి 1911లోనే రాశారు. అదే ఏడాది డిసెంబర్ 27న కోల్‌కతాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావే శాలలో  దానిని ఆలపించారు. ఆ తర్వాత కూడా జాతీయోద్యమం నేపథ్యంలో ఆ గీతాన్ని అనేక సార్లు, అనేక వేదికల మీద ఆలపించారు. అయితే ఇప్పుడు మనం వినే ట్యూన్‌లో కాకుండా, నిర్ధిష్టమైన స్వర కల్పన లేకుండా, ఎవరికి నచ్చిన రాగంలో వాళ్లు పాడుకునే వారు.  జనగణ మనకు ఆ స్వరాన్ని కట్టింది ఒక ఐరిష్ జాతీయు రాలైతే... దానికి వేదికైంది చిత్తూరు జిల్లా మదనపల్లె అనే విషయం చాలా మందికి తెలియని తెలియదు. భారత స్వాతంత్రో ద్యమాన్ని బలపరిచిన డాక్టర్ అనీబిసెంట్ మదన పల్లెలో థియోసాఫికల్ కాలేజీని స్థాపిం చారు. ఐరిష్ జాతీయుడైన ప్రముఖ విద్యావేత్త జేమ్స్ హెన్రీ కజిన్స్ దాని ప్రిన్సిపాల్‌గా ఉండేవారు. లండన్ మ్యూజిక్ కాలేజిలో చదువుకున్న ఆయన భార్య మార్గరెట్ కజిన్స్ అక్కడ సంగీతాన్ని నేర్పించేవారు. 

1919లో దక్షిణ భారతదేశ పర్యటనలో ఉన్న రవీంద్రనాథ్ ఠాగూర్ ఒకరోజు బెంగళూరు చేరుకున్నారు. అక్కడ ఉన్నపుడే ఆయనకు మదనపల్లె వాతా వరణం, జేమ్స్ కజిన్స్ కవిత్వం అంటే చాలా ఇష్టమైన ఠాగూర్‌, కజిన్స్ అక్కడే ఉన్న విషయం తెలుసుకుని,  ఆయన విశ్రాంతి కోసం మదనపల్లెలోని థియోసా ఫికల్ కాలేజీ చేరు కున్నారు. ఠాగూర్‌కు ప్రశాంత వాతావరణం కలిగిన థియో సాఫికల్ కాలేజీలో ప్రతి బుధవారం భోజనాల తర్వాత విద్యార్థులంతా కలిసి పాటలు పాడేవాళ్లు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఠాగూర్, ఒక కార్యక్రమంలో  పాల్గొని, ఆ సందర్భంగా ఆయన స్వయంగా తన గొంతుకతో జనగణ మన ఆలపించారు. ఠాగూర్ కంఠస్వరం నుంచి వెలువడిన ఆ పాటకు విద్యార్థులంతా గొంతు కలిపారు. మార్గరేట్ కజిన్స్ కూడా ఆ సమయంలో అక్కడే ఉండి,  పాటలోని దేశభక్తిని, జాతీయ భావాన్ని గమనించారు. కానీ అప్పటికి జనగణమనను ఎవరికి వారే తోచిన రీతిలో పాడుకునే వారు. ఎవరూ రాగయుక్తంగా పాడ లేదు. కనుక దానిని తానే స్వర బద్ధం చేయాలని నిర్ణయించు కున్నారు. తెల్లవారి ఆమె ఠాగూర్‌ ను కలిసి జనగణమనను స్వర బద్ధం చేయాలన్న తన కోరికను వెలి బుచ్చారు. దీనికి అంగీక రించిన ఠాగూర్, ఆమెకు ఆ పాట అర్థాన్ని వివరించారు. దానికి స్వరం ఎలా ఉంటే బాగుంటుందో సూచిం చారు. తర్వాత మార్గరేట్ కజిన్స్ తన విద్యార్థినుల సహాయంతో ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటూ దానికి. బాణీ సమకూర్చారు.  తర్వాత ఠాగూర్‌కు తాను కట్టిన స్వరాన్ని వినిపించారు. కొన్ని చిన్న చిన్న సంగీత పరికరాలతో విద్యా ర్థులు రాగయుక్తంగా పాడిన జనగణమన గీతాన్ని విన్న ఠాగూర్ ఆమెను ఎంతగానో అభినందిం చారు. బెంగాల్‌లో పుట్టిన జనగణ మన గీతం మదనపల్లెలో స్వరాన్ని సమకూర్చు కున్నది. రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లెలో ఉన్న సమయంలోనే ఒక ఉదయాన థియోసాఫికల్ కాలేజీ ప్రాంగణం లోని చెట్టుకింద కూర్చుని జనగణమనను ఆంగ్లం లోనికి  అనువదించారు కూడా.

ఆ తర్వాత దానిని తన అందమైన చేతిరాతతో రాయడమే కాకుండా, కింది భాగంలో దాని పేరు 'మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా' అని రాశారు. దాని కింద ఫిబ్రవరి 28, 1919 అని రాసి, సంతకం చేసి, మార్గరేట్ కజిన్స్‌కు బహుమానంగా ఇచ్చారు. మదనపల్లె కాలేజీ వదలివెళ్లే ముందు ఠాగూర్ దానిని 'దక్షిణ భారతదేశపు శాంతినికేతన్' అని కీర్తించారు.

 నిజానికి జనగణమన దేశభక్తి గేయం. ‘జన గణ మన’ ఇక నుంచీ మన కొత్త గణతంత్ర రాజ్యానికి జాతీయ గీతమనీ, దీన్ని అంతా గౌరవించి ఆదరించాలనీ 1950 జనవరి 24న రాజ్యాంగ సభ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్‌ ఓ ప్రకటన చేశారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో మహో న్నత పాత్ర పోషించిన ‘వందేమా తరం’ గీతాన్ని కూడా జన గణ మనతో సమానంగా గౌరవించి ఆదరించాలి’’ అని ఆ రోజున రాజేంద్ర ప్రసాద్‌ పేర్కొన్నారు.  భారతదేశ  రాజ్యాంగం ఆర్టికల్‌ 51ఏలో ఈ గీతాన్ని గౌరవించా లంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసిన ప్రస్తావన కనిపిస్తుంది. ‘‘ప్రతి పౌరుడూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. జాతీయ పతాకం, జాతీయ గీతం వంటి రాజ్యాంగ ఆదర్శాలు, లక్ష్యాలు, సంస్థలను గౌరవించాలి’’ అని ఈ చట్టం పేర్కొంటున్నది. ప్రార్థనగా, కృతజ్ఞతగా పఠించే 52 సెకన్ల ఈ చిన్న గీతానికి ఉన్నంత గుర్తింపు , భారత దేశంలో,  ప్రపంచంలో కూడా మరే గీతానికీ లేదు. మన జాతీయ గీతం దేశ సమైక్యతకు సరైన ప్రతీకగా నిలిచింది.

జాతీయ గీతం, జాతీయ పతాకం పట్ల గౌరవం, ప్రేమాభిమానాలు ప్రదర్శించడ మంటే మాతృభూమిని గౌరవించు కోవడమే అవుతుంది. ఇది ప్రతి ఒక్కరిలో దేశభక్తిని, జాతీయ భావాన్ని నింపడానికి ఉపకరిస్తుంది. 

జనగణమన పాడినప్పుడు దాని అర్ధాన్ని కూడా ఒక్కసారి మననం చేసుకోవాలి. దాని నేపథ్యాన్ని, అర్థాన్ని, ప్రాధాన్యతను గుర్తించి,  తర్వాత తరం వారికి చేర్చాల్సిన అవసరం అనివార్యంగా ఉంది.

ఠాగూర్ వ్రాసిన ఈ గీతం లో అయిదు చరణాలు ఉండగా కొన్ని రాజకీయ కారణాల వలన కేవలం ఒకే చరణాన్ని మాత్రమే జాతీయ గీతం లో చేర్చడం జరిగింది. 


పూర్తి గీతం ఇలా ఉంది...
జనగణమన అధినాయక జయ హే! భారత భాగ్య విధాతా
       పంజాబ్, సింధు, గుజరాత, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగా
       వింధ్య హిమాచల యమునా గంగా, ఉచ్ఛల జలధి తరంగా
       తవ శుభనామే జాగే, తవ శుభ ఆశిష మాగే, గాహే తవ జయ గాథా, జనగణ మంగళదాయక జయ హే! భారత భాగ్య విధాతా
       జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!

2వ చరణం...  అహరహ తవ ఆహ్‍బాన్ ప్రచారిత, శుని తవ ఉదార వాని(ణి),  హిందు, బౌద్ధ్, శిఖ్, జైన్, పారశిక్, ముసల్మాన్, క్రిస్తాని,పూరబ్ పశ్చిమ ఆశే, తవ సింఘాసన పాశే, 
       ప్రేమ్ హార్ హొయె గాథా
       జనగణ ఐక్య విధాయక జయ హే! భారత భాగ్య విధాతా
       జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!

3వ చరణం...  పతన అభ్యుద్దయ్ బన్ధుర్ పంథా, యుగ్ యుగ్ ధావిత యాత్రి, హే చిరొ సారొథి, తవ రథ్ చక్రే, ముఖరిత పథ్ దిన్ రాత్రి
       దారుణ విప్లవ మాఝే, తవ శంఖధ్వని బాజే
       సంకట దుఃఖ త్రాతా
       జనగణ పథ్ పరిచాయక జయ హే! భారత భాగ్య విధాతా
       జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!

4వ చరణం...  ఘోర తిమిర్ ఘన నిబీడ నిశీథే, పీడిత మూర్చిత దేశే
       జాగృత ఛిల తవ అవిచల మంగళ, నత నయనే అనిమేషే
       దుస్స్వప్నే ఆటంకే, రక్షా కరిలే అంకే,  స్నేహమయి తుమి మాథా
       జనగణ దుఃఖ త్రయకా జయ హే! భారత భాగ్య విధాతా
       జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!
జయ హే!

5వచరణం... రాత్రి ప్రభాతిలా ఉదిల రవిఛావి, పూర్వ ఉదయగిరి భాలే, గాహే విహంగమ్ పుణ్య సమిరన్, నవ జీవన రస్ ఢాలే
       తవ కరుణారుణ రాగే, నిద్రిత భారత జాగే, 
       తవ చరణె నత మాథా
       జయ జయ జయ హే! జయ రాజెశ్వర్, భారత భాగ్య విధాతా
       జయహే! జయహే! జయహే! జయ జయ జయ జయహే!

Tags
Join WhatsApp

More News...

Local News 

చౌలామద్దిలో ఓటు హక్కు వినియోగించిన తుల ఉమ, డా. తుల రాజేందర్

చౌలామద్దిలో ఓటు హక్కు వినియోగించిన తుల ఉమ, డా. తుల రాజేందర్ చౌలామద్ది డిసెంబర్ 15 (ప్రజా మంటలు): ఈరోజు జరిగిన 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చౌలామద్ది గ్రామంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తుల ఉమ, తుల గంగవ్వ స్మారక ట్రస్ట్ చైర్మన్ డా. తుల రాజేందర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని...
Read More...
State News 

గాంధీ మెడికల్ కాలేజీ మాజీ హెచ్ఓడి డా.రత్నకుమారి కన్నుమూత 

గాంధీ మెడికల్ కాలేజీ మాజీ హెచ్ఓడి డా.రత్నకుమారి కన్నుమూత  సికింద్రాబాద్, డిసెంబర్ 15 (ప్రజామంటలు): సికింద్రాబాద్ గాంధీ మెడికల్‌ కాలేజీ బయోకెమిస్ట్రీ విభాగం మాజీ హెచ్‌ఓడీ డా. జి. రత్నకుమారి సోమవారం కన్నుమూశారు. గాంధీ మెడికల్‌ కాలేజీ పూర్వ విద్యార్థినిగా, అదే కళాశాలలో సేవలందించి పదవీ విరమణ పొందారు. నిబద్ధత గల అధ్యాపకురాలిగా పేరు పొందారు ఆమె గతంలో ఇచ్చిన డిక్లరేషన్ మేరకు ఆమె డెడ్...
Read More...

తుంగూర్ సర్పంచ్ గా గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, పాలకవర్గంను సన్మానించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ 

తుంగూర్ సర్పంచ్ గా గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, పాలకవర్గంను సన్మానించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్  జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)తుంగూర్ సర్పంచ్ గా గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, ఉపసర్పంచ్ మరియు పాలకవర్గంను జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ శాలువా కప్పి సన్మానం చేసి అభినందించారు.  జగిత్యాల నియోజకవర్గంలోని సుమారు 70 గ్రామాల్లో తనపై  ఎంతో నమ్మకముంచి, ప్రజల అభిమానంతో గెలుపొందిన సర్పంచ్ లకు అభినందనలు తెలియజేసి సన్మానించారు....
Read More...

ఎమ్మెల్యే సంజయ్ బలపరిచిన సర్పంచులు ఉపసర్పంచ్ లు వార్డు సభ్యులను అభినందించి సత్కరించిన ఎమ్మెల్యే

ఎమ్మెల్యే సంజయ్ బలపరిచిన సర్పంచులు ఉపసర్పంచ్ లు వార్డు సభ్యులను అభినందించి సత్కరించిన ఎమ్మెల్యే జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)జగిత్యాల పట్టణ పొన్నాల గార్డెన్స్ లో జగిత్యాల నియోజకవర్గం లో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ బలపరిచిన 70 మంది సర్పంచులు మరియు ఉప సర్పంచ్ లు వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందగా 65 మంది గ్రామ పంచాయతీ సర్పంచ్ ,ఉప సర్పంచ్ పాలకవర్గ సభ్యులను...
Read More...
Local News 

రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే...గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం..- మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ 

రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే...గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం..- మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్  గొల్లపల్లి డిసెంబర్ 15 (ప్రజా మంటలు :అంకం భూమయ్య) గొల్లపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ  ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఆవుల జమున సత్యం (ఉంగరం గుర్తు) ఓటు వేసి గెలిపించాలని కోరారు.సత్యం వెనుక బిఆర్ఎస్ పార్టీ, కొప్పుల ఈశ్వర్, కెటిఆర్,...
Read More...
Local News  State News 

సామాజిక తెలంగాణయే నా ధ్యేయం.. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: X "ఆస్క్ కవిత"లో కల్వకుంట్ల కవిత

సామాజిక తెలంగాణయే నా ధ్యేయం.. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: X హైదరాబాద్, డిసెంబర్ 15 (ప్రజా మంటలు): సామాజిక తెలంగాణ సాధననే తన ప్రధాన లక్ష్యంగా తీసుకున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో జాగృతి పోటీలో ఉంటుందని వెల్లడించారు. సోమవారం ట్విట్టర్ (ఎక్స్) వేదికగా నిర్వహించిన #AskKavitha కార్యక్రమంలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. ఈ ఇంటరాక్షన్...
Read More...
State News 

వావ్...దంపతులిద్దరూ గెలిచారు... ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి..

వావ్...దంపతులిద్దరూ గెలిచారు... ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి.. సికింద్రాబాద్,  డిసెంబర్ 15 (ప్రజా మంటలు):  పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేట గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోచమ్మల ప్రవీణ్(8వ వార్డు) మంజుల (10వ వార్డు) దంపతులు ఇద్దరు వేర్వేరు వార్డుల్లో పోటీ చేశారు. చిత్రం ఏమిటంటే ఇద్దరికి 98-98 ఓట్లు చొప్పున  వచ్చాయి.   కాగా ప్రవీణ్ రామన్నపేట---...
Read More...
Local News 

పాషం భాస్కర్ మృతిపై జి. రాజేశం గౌడ్ సంతాపం

పాషం భాస్కర్ మృతిపై జి. రాజేశం గౌడ్ సంతాపం ఇబ్రహీంపట్నం డిసెంబర్ 15 (ప్రజా మంటలు): ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన మాజీ సర్పంచ్‌, మండల అధ్యక్షుడిగా సేవలందించిన పాషం భాస్కర్ గారు అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆయన అకాల మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటుగా మారింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి జి. రాజేశం గౌడ్  తన భార్య  శ్యామలాదేవితో కలిసి పాషం...
Read More...
State News 

కవితమ్మపై తప్పుడు ప్రచారం ఆపాలి.. నిరాధార ఆరోపణలకు తీవ్ర పరిణామాలు: తెలంగాణ జాగృతి నేతలు

కవితమ్మపై తప్పుడు ప్రచారం ఆపాలి.. నిరాధార ఆరోపణలకు తీవ్ర పరిణామాలు: తెలంగాణ జాగృతి నేతలు హైదరాబాద్ డిసెంబర్ 15. (ప్రజా మంటలు):తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మపై పథకం ప్రకారం తప్పుడు ప్రచారం జరుగుతోందని జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, సీనియర్ నేత సయ్యద్ ఇస్మాయిల్ ఆరోపించారు. సోమవారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు. వి. ప్రకాష్ అనే వ్యక్తి...
Read More...

మోతే గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులను అభినందించి సత్కరించిన డా .భోగ శ్రావణి ప్రవీణ్

మోతే గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులను అభినందించి సత్కరించిన డా .భోగ శ్రావణి ప్రవీణ్ జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)మోతే గ్రామపంచాయతీ ఎన్నికల్లో వార్డ్ మెంబర్లుగా గెలుపొందిన పల్లెకొండ రాజేశ్వరి-ప్రశాంత్ , ధనపనేని నరేష్  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి ని మర్యాదపూర్వకంగా కలువగా వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల అర్బన్ మండల అధ్యక్షులు రాంరెడ్డి, సునీల్,ప్రశాంత్ మరియు...
Read More...

పొలాస గ్రామపంచాయతీ నూతన ఉపసర్పంచ్ ,వార్డ్ సభ్యులను సత్కరించిన డా భోగ శ్రావణి

పొలాస గ్రామపంచాయతీ నూతన ఉపసర్పంచ్ ,వార్డ్ సభ్యులను సత్కరించిన డా భోగ శ్రావణి    జగిత్యాల రూరల్ డిసెంబర్ 15(ప్రజా మంటలు)  మండలం పొలాస గ్రామం నూతన ఉపసర్పంచ్ మరియు వార్డు మెంబర్స్ గెలుపొందగా ఈరోజు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి ని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలువగా గెలుపొందిన ఉప సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిల్కూరి...
Read More...
National  State News  International  

భారత మార్కెట్‌లో బ్రిటిష్ ఎయిర్వేస్ విస్తరణ – ఢిల్లీకి మూడో డైలీ ఫ్లైట్

భారత మార్కెట్‌లో బ్రిటిష్ ఎయిర్వేస్ విస్తరణ – ఢిల్లీకి మూడో డైలీ ఫ్లైట్ న్యూఢిల్లీ డిసెంబర్ 14:భారతదేశంలో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు బ్రిటిష్ ఎయిర్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్–యూకే మధ్య పెరుగుతున్న ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫ్లైట్ ఫ్రీక్వెన్సీలు పెంచడంతో పాటు సేవలను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. 2026 నుంచి (అనుమతులకు లోబడి) లండన్ హీత్రో – న్యూఢిల్లీ మార్గంలో మూడో డైలీ...
Read More...