డిసెంబర్ 27...జనగణమన  మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభలో  పాడిన దినం

On
డిసెంబర్ 27...జనగణమన  మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభలో  పాడిన దినం

డిసెంబర్ 27...జనగణమన  మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభలో  పాడిన దినం


డిసెంబర్ 27...జనగణమన  మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభలో  పాడిన దినం

 రామ కిష్టయ్య సంగన భట్ల...
     9440595494

భారత జాతీయ గీతమైన జనగణమన 1911లోరవీంద్రనాధ్ ఠాగూర్ రచించిన, మొదటిసారి పాడిన గీతాన్ని 1911 డిసెంబర్ 27 న కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటి సారిగా పాడారు. జనగణ మన భారత జాతీయగీతం. నోబెల్ బహుమతి గ్రహీత, రవీంద్రనాథ్ టాగోర్ రాసిన బెంగాలీ గీతం లోని మొదటి భాగం ఇది. భారత జాతీయ గీతం సంస్కృత పద భూయిష్టమైన బెంగాలీ భాషలో ఉంది. 1912 జనవరి లో ఈ గీతాన్ని "తత్వ భోదిని" అనే పత్రిక "భారత విధాత" అనే పేరుతో ప్రచురించింది. 1950 జనవరి 24 న జాతీయగీతంగా రాజ్యాంగ సభ స్వీకరించింది. ఈ గీతానికి సంగీత బాణీ కూడా ముందుగా ఠాగూర్ సృష్టించారు. బాణీ కనుగుణంగా ఈ గీతాలాపన చేసేందుకు 52 సెకండ్లు పడుతుంది. అప్పుడ ప్పుడు మొదటి, చివరి పాదాలను మాత్రమే పాడే పద్ధతి కూడా ఉంది. దీనికి 20 సెకండ్లు పడుతుంది.

భారతదేశ జాతీయగీతం 'జనగణమన' గీతాన్ని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ నిజానికి 1911లోనే రాశారు. అదే ఏడాది డిసెంబర్ 27న కోల్‌కతాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావే శాలలో  దానిని ఆలపించారు. ఆ తర్వాత కూడా జాతీయోద్యమం నేపథ్యంలో ఆ గీతాన్ని అనేక సార్లు, అనేక వేదికల మీద ఆలపించారు. అయితే ఇప్పుడు మనం వినే ట్యూన్‌లో కాకుండా, నిర్ధిష్టమైన స్వర కల్పన లేకుండా, ఎవరికి నచ్చిన రాగంలో వాళ్లు పాడుకునే వారు.  జనగణ మనకు ఆ స్వరాన్ని కట్టింది ఒక ఐరిష్ జాతీయు రాలైతే... దానికి వేదికైంది చిత్తూరు జిల్లా మదనపల్లె అనే విషయం చాలా మందికి తెలియని తెలియదు. భారత స్వాతంత్రో ద్యమాన్ని బలపరిచిన డాక్టర్ అనీబిసెంట్ మదన పల్లెలో థియోసాఫికల్ కాలేజీని స్థాపిం చారు. ఐరిష్ జాతీయుడైన ప్రముఖ విద్యావేత్త జేమ్స్ హెన్రీ కజిన్స్ దాని ప్రిన్సిపాల్‌గా ఉండేవారు. లండన్ మ్యూజిక్ కాలేజిలో చదువుకున్న ఆయన భార్య మార్గరెట్ కజిన్స్ అక్కడ సంగీతాన్ని నేర్పించేవారు. 

1919లో దక్షిణ భారతదేశ పర్యటనలో ఉన్న రవీంద్రనాథ్ ఠాగూర్ ఒకరోజు బెంగళూరు చేరుకున్నారు. అక్కడ ఉన్నపుడే ఆయనకు మదనపల్లె వాతా వరణం, జేమ్స్ కజిన్స్ కవిత్వం అంటే చాలా ఇష్టమైన ఠాగూర్‌, కజిన్స్ అక్కడే ఉన్న విషయం తెలుసుకుని,  ఆయన విశ్రాంతి కోసం మదనపల్లెలోని థియోసా ఫికల్ కాలేజీ చేరు కున్నారు. ఠాగూర్‌కు ప్రశాంత వాతావరణం కలిగిన థియో సాఫికల్ కాలేజీలో ప్రతి బుధవారం భోజనాల తర్వాత విద్యార్థులంతా కలిసి పాటలు పాడేవాళ్లు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఠాగూర్, ఒక కార్యక్రమంలో  పాల్గొని, ఆ సందర్భంగా ఆయన స్వయంగా తన గొంతుకతో జనగణ మన ఆలపించారు. ఠాగూర్ కంఠస్వరం నుంచి వెలువడిన ఆ పాటకు విద్యార్థులంతా గొంతు కలిపారు. మార్గరేట్ కజిన్స్ కూడా ఆ సమయంలో అక్కడే ఉండి,  పాటలోని దేశభక్తిని, జాతీయ భావాన్ని గమనించారు. కానీ అప్పటికి జనగణమనను ఎవరికి వారే తోచిన రీతిలో పాడుకునే వారు. ఎవరూ రాగయుక్తంగా పాడ లేదు. కనుక దానిని తానే స్వర బద్ధం చేయాలని నిర్ణయించు కున్నారు. తెల్లవారి ఆమె ఠాగూర్‌ ను కలిసి జనగణమనను స్వర బద్ధం చేయాలన్న తన కోరికను వెలి బుచ్చారు. దీనికి అంగీక రించిన ఠాగూర్, ఆమెకు ఆ పాట అర్థాన్ని వివరించారు. దానికి స్వరం ఎలా ఉంటే బాగుంటుందో సూచిం చారు. తర్వాత మార్గరేట్ కజిన్స్ తన విద్యార్థినుల సహాయంతో ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటూ దానికి. బాణీ సమకూర్చారు.  తర్వాత ఠాగూర్‌కు తాను కట్టిన స్వరాన్ని వినిపించారు. కొన్ని చిన్న చిన్న సంగీత పరికరాలతో విద్యా ర్థులు రాగయుక్తంగా పాడిన జనగణమన గీతాన్ని విన్న ఠాగూర్ ఆమెను ఎంతగానో అభినందిం చారు. బెంగాల్‌లో పుట్టిన జనగణ మన గీతం మదనపల్లెలో స్వరాన్ని సమకూర్చు కున్నది. రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లెలో ఉన్న సమయంలోనే ఒక ఉదయాన థియోసాఫికల్ కాలేజీ ప్రాంగణం లోని చెట్టుకింద కూర్చుని జనగణమనను ఆంగ్లం లోనికి  అనువదించారు కూడా.

ఆ తర్వాత దానిని తన అందమైన చేతిరాతతో రాయడమే కాకుండా, కింది భాగంలో దాని పేరు 'మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా' అని రాశారు. దాని కింద ఫిబ్రవరి 28, 1919 అని రాసి, సంతకం చేసి, మార్గరేట్ కజిన్స్‌కు బహుమానంగా ఇచ్చారు. మదనపల్లె కాలేజీ వదలివెళ్లే ముందు ఠాగూర్ దానిని 'దక్షిణ భారతదేశపు శాంతినికేతన్' అని కీర్తించారు.

 నిజానికి జనగణమన దేశభక్తి గేయం. ‘జన గణ మన’ ఇక నుంచీ మన కొత్త గణతంత్ర రాజ్యానికి జాతీయ గీతమనీ, దీన్ని అంతా గౌరవించి ఆదరించాలనీ 1950 జనవరి 24న రాజ్యాంగ సభ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్‌ ఓ ప్రకటన చేశారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో మహో న్నత పాత్ర పోషించిన ‘వందేమా తరం’ గీతాన్ని కూడా జన గణ మనతో సమానంగా గౌరవించి ఆదరించాలి’’ అని ఆ రోజున రాజేంద్ర ప్రసాద్‌ పేర్కొన్నారు.  భారతదేశ  రాజ్యాంగం ఆర్టికల్‌ 51ఏలో ఈ గీతాన్ని గౌరవించా లంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసిన ప్రస్తావన కనిపిస్తుంది. ‘‘ప్రతి పౌరుడూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. జాతీయ పతాకం, జాతీయ గీతం వంటి రాజ్యాంగ ఆదర్శాలు, లక్ష్యాలు, సంస్థలను గౌరవించాలి’’ అని ఈ చట్టం పేర్కొంటున్నది. ప్రార్థనగా, కృతజ్ఞతగా పఠించే 52 సెకన్ల ఈ చిన్న గీతానికి ఉన్నంత గుర్తింపు , భారత దేశంలో,  ప్రపంచంలో కూడా మరే గీతానికీ లేదు. మన జాతీయ గీతం దేశ సమైక్యతకు సరైన ప్రతీకగా నిలిచింది.

జాతీయ గీతం, జాతీయ పతాకం పట్ల గౌరవం, ప్రేమాభిమానాలు ప్రదర్శించడ మంటే మాతృభూమిని గౌరవించు కోవడమే అవుతుంది. ఇది ప్రతి ఒక్కరిలో దేశభక్తిని, జాతీయ భావాన్ని నింపడానికి ఉపకరిస్తుంది. 

జనగణమన పాడినప్పుడు దాని అర్ధాన్ని కూడా ఒక్కసారి మననం చేసుకోవాలి. దాని నేపథ్యాన్ని, అర్థాన్ని, ప్రాధాన్యతను గుర్తించి,  తర్వాత తరం వారికి చేర్చాల్సిన అవసరం అనివార్యంగా ఉంది.

ఠాగూర్ వ్రాసిన ఈ గీతం లో అయిదు చరణాలు ఉండగా కొన్ని రాజకీయ కారణాల వలన కేవలం ఒకే చరణాన్ని మాత్రమే జాతీయ గీతం లో చేర్చడం జరిగింది. 


పూర్తి గీతం ఇలా ఉంది...
జనగణమన అధినాయక జయ హే! భారత భాగ్య విధాతా
       పంజాబ్, సింధు, గుజరాత, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగా
       వింధ్య హిమాచల యమునా గంగా, ఉచ్ఛల జలధి తరంగా
       తవ శుభనామే జాగే, తవ శుభ ఆశిష మాగే, గాహే తవ జయ గాథా, జనగణ మంగళదాయక జయ హే! భారత భాగ్య విధాతా
       జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!

2వ చరణం...  అహరహ తవ ఆహ్‍బాన్ ప్రచారిత, శుని తవ ఉదార వాని(ణి),  హిందు, బౌద్ధ్, శిఖ్, జైన్, పారశిక్, ముసల్మాన్, క్రిస్తాని,పూరబ్ పశ్చిమ ఆశే, తవ సింఘాసన పాశే, 
       ప్రేమ్ హార్ హొయె గాథా
       జనగణ ఐక్య విధాయక జయ హే! భారత భాగ్య విధాతా
       జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!

3వ చరణం...  పతన అభ్యుద్దయ్ బన్ధుర్ పంథా, యుగ్ యుగ్ ధావిత యాత్రి, హే చిరొ సారొథి, తవ రథ్ చక్రే, ముఖరిత పథ్ దిన్ రాత్రి
       దారుణ విప్లవ మాఝే, తవ శంఖధ్వని బాజే
       సంకట దుఃఖ త్రాతా
       జనగణ పథ్ పరిచాయక జయ హే! భారత భాగ్య విధాతా
       జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!

4వ చరణం...  ఘోర తిమిర్ ఘన నిబీడ నిశీథే, పీడిత మూర్చిత దేశే
       జాగృత ఛిల తవ అవిచల మంగళ, నత నయనే అనిమేషే
       దుస్స్వప్నే ఆటంకే, రక్షా కరిలే అంకే,  స్నేహమయి తుమి మాథా
       జనగణ దుఃఖ త్రయకా జయ హే! భారత భాగ్య విధాతా
       జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!
జయ హే!

5వచరణం... రాత్రి ప్రభాతిలా ఉదిల రవిఛావి, పూర్వ ఉదయగిరి భాలే, గాహే విహంగమ్ పుణ్య సమిరన్, నవ జీవన రస్ ఢాలే
       తవ కరుణారుణ రాగే, నిద్రిత భారత జాగే, 
       తవ చరణె నత మాథా
       జయ జయ జయ హే! జయ రాజెశ్వర్, భారత భాగ్య విధాతా
       జయహే! జయహే! జయహే! జయ జయ జయ జయహే!

Tags
Join WhatsApp

More News...

National  State News 

లిక్కర్ కేసు తీర్పు: నిర్దోషిగా కవిత: తెలంగాణ రాజకీయాలలో మలుపు?

లిక్కర్ కేసు తీర్పు: నిర్దోషిగా కవిత: తెలంగాణ రాజకీయాలలో మలుపు? ప్రత్యేక కథనం ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు కోర్టు నిర్దోషిగా తీర్పు రావడం తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఈ కేసు మొదటి నుంచీ కేంద్రంలోని Bharatiya Janata Party రాజకీయ కక్షసాధింపే అంటూ ఆమె ఆరోపించారు. దేశవ్యాప్తంగా ప్రత్యర్థి పార్టీలపై సీబీఐ, ఈడీ దర్యాప్తుల నేపథ్యంలో “ఇది వ్యూహాత్మక ఒత్తిడి రాజకీయమా?”...
Read More...
National  State News 

రుణభారం తగ్గిందా? కాళేశ్వరం విషయంలో అసలు నిజం ఏమిటి?

రుణభారం తగ్గిందా? కాళేశ్వరం విషయంలో అసలు నిజం ఏమిటి? : హైదరాబాద్ ఫిబ్రవరి 27 (ప్రజా మంటలు): తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో “రుణభారం తగ్గింది” అని చెబుతోంది. వడ్డీ రేటు తగ్గించామని, ఇన్‌స్టాల్మెంట్లు (EMI) తక్కువయ్యాయని చెప్పడం ప్రజలకు కొంత ఊరట కలిగించే విషయం. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే — నిజంగా రుణం తగ్గిందా? లేక కేవలం చెల్లింపు విధానం మారిందా?...
Read More...
State News 

మెట్‌పల్లిలో అదనపు కోర్టు కోసం హైకోర్టును కలిసిన బార్ అసోసియేషన్ నాయకులు

మెట్‌పల్లిలో అదనపు కోర్టు కోసం హైకోర్టును కలిసిన బార్ అసోసియేషన్ నాయకులు మెటుపల్లి, ఫిబ్రవరి 27 (ప్రజా మంటలు): మెట్‌పల్లిలో పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అదనపు కోర్టు మంజూరు చేయాలని కోరుతూ మెట్‌పల్లి బార్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం హైకోర్టు న్యాయమూర్తి యారా రేణుక మరియు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్. గోవర్ధన్ రెడ్డి లను కలిశారు.ప్రస్తుతం మెట్‌పల్లి కోర్టులో కేసులు అధికంగా పెండింగ్‌లో ఉన్నాయని,...
Read More...
Local News 

బడిపిల్లల కథలకు ఆహ్వానం జిల్లా విద్యాశాఖాధికారి కె. రాము

బడిపిల్లల కథలకు ఆహ్వానం జిల్లా విద్యాశాఖాధికారి కె. రాము జగిత్యాల ఫిబ్రవరి 27 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు కథా రచనలను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె. రాము ఒక ప్రకటనలో తెలిపారు.శుక్రవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ (టీఎన్‌జీవో) స్కూల్ ఎడ్యుకేషన్ జగిత్యాల జిల్లా...
Read More...
Local News 

సీఎం కప్ కిక్ బాక్సింగ్ లో మెడల్ సాధించిన క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్

సీఎం కప్ కిక్ బాక్సింగ్ లో మెడల్ సాధించిన క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ జగిత్యాల ఫిబ్రవరి 27 ( ప్రజా మంటలు)రాష్ట్ర స్తాయి సీఎం కప్ లో కిక్ బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారులను జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ అభినందించారు సెకండ్ ఎడిషన్ సీఎం కప్ రాష్ట్రస్థాయి ఛాంపియన్షిప్ కిక్ బాక్సింగ్ విభాగంలో హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో పాల్గొని   ఏ  హర్షిత్...
Read More...
Local News 

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు చేరేందుకు నిరంతరం శ్రమించాలి జిల్లా కలెక్టర్

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు చేరేందుకు నిరంతరం శ్రమించాలి జిల్లా కలెక్టర్ జగిత్యాల ఫిబ్రవరి 27 (ప్రజా మంటలు)పిఎం పోషణ్ తనిఖీ లో భాగంగా కెజిబివి పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ 'పిఎం పోషణ్' తనిఖీ లో భాగంగా శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ జగిత్యాల పట్టణంలోని కస్తూర్బా గాంధీ (బాలికల) విద్యాలయం (కేజీబీవీ) ను ఆకస్మికంగా సందర్శించారు....
Read More...
State News 

తెలంగాణ విద్యా కమిషన్ నివేదికపై TRTF ఆగ్రహం – ఉపాధ్యాయ హక్కులకు గొడ్డలి పెట్టినట్టేనా?

తెలంగాణ విద్యా కమిషన్ నివేదికపై TRTF ఆగ్రహం – ఉపాధ్యాయ హక్కులకు గొడ్డలి పెట్టినట్టేనా? హైదరాబాద్ ఫిబ్రవరి 27 (ప్రజా మంటలు): తెలంగాణ విద్యా కమిషన్ సమర్పించిన “తెలంగాణ విద్యా విధానం 2026” నివేదికపై తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సమాఖ్య (TRTF) తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఆకునూరి మురళి కమిటీ ఇచ్చిన ఈ నివేదిక ప్రభుత్వ విద్యా వ్యవస్థ పునాదులను దెబ్బతీసేలా ఉందని సంఘం రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్,...
Read More...
Local News 

ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు క్లీన్ చీట్

ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు క్లీన్ చీట్ న్యూఢిల్లీ ఫిబ్రవరి 27: (ప్రజా మంటలు ప్రత్యేక కథనం)ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో కవితపై సీబీఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను రద్దు చేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు వెలువరించింది.ఈ మేరకు సీబీఐ ప్రత్యేక...
Read More...
National 

న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చే కుట్ర: NCERT క్లాస్–8 పాఠ్యపుస్తకంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చే కుట్ర: NCERT క్లాస్–8 పాఠ్యపుస్తకంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: క్లాస్–8 సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థను అవినీతిగ్రస్త సంస్థగా చిత్రీకరించడం వెనుక “లోతైన, పద్ధతిగల కుట్ర” ఉందని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.స్వయంచాలకంగా (సుయో మోటు) కేసును విచారించిన ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం,ఈ పాఠ్యాంశాలు చిన్న వయసు విద్యార్థుల “అమాయక మనసుల్లో”...
Read More...

నాగర్ కర్నూలు జిల్లా లో పసికందు మృతికి కారణమైన వారిపై చర్యలకు డిమాండ్

నాగర్ కర్నూలు జిల్లా లో పసికందు మృతికి కారణమైన వారిపై చర్యలకు డిమాండ్ జగిత్యాల ఫిబ్రవరి 26 (ప్రజా మంటలు)నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామము మల్లన్న  జాతరలో రెండు నెలల పసికందు మౌనికను కాలుతో తన్ని ఆ చిన్నారి మరణానికి కారణమైన అగ్రకుల అహంకారాన్ని ప్రదర్శించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ బిసి ఎస్సి ఎస్టి ఐక్య సంఘాల ఆధ్వర్యంలో ఆ చిన్నారి ఆత్మకు శాంతి...
Read More...
Local News 

పకడ్బందీగా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ

పకడ్బందీగా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ జగిత్యాల ఫిబ్రవరి 26 ( ప్రజా మంటలు)మేడిపెల్లి, కోరుట్ల, మెట్ పెల్లి మరియు ఇబ్రహీంపట్నం మండలాల్లోని  పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా గురువారం మేడిపెల్లి  కోరుట్ల, మెట్ పెల్లి మరియు ఇబ్రహీంపట్నం లో పరీక్ష కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్...
Read More...
Local News 

ఇంటర్మీడియట్ పరీక్షలు – భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ అధికారులు

ఇంటర్మీడియట్ పరీక్షలు – భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ అధికారులు   జగిత్యాల ఫిబ్రవరి 26 ( ప్రజా మంటలు)జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని పరీక్షల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేసినటట్లు జిల్లా ఎస్పి అశోక్ కుమార్  తెలిపారు. పరీక్షలు పారదర్శకంగా, ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రతీ పరీక్షా...
Read More...