మహిళలకు మోసం చేశామని స్వయంగా ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని కవిత విమర్శ
మహిళలను మోసం చేశామని ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటు -
*కాంగ్రెస్ మెనిఫెస్టో చిత్తుకాగితమని తేలిపోయింది*
*మహిళా వ్యతిరేక సీఎంగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలుస్తారు
శాసన మండలి సాక్షిగా బయటపడ్డ కాంగ్రెస్ బండారం
మిర్చికి 25 వేల మద్ధతు ధర ప్రకటించాలి: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ మార్చ్ 17:
మహిళలకు మోసం చేశామని స్వయంగా ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. మహిళా వ్యతిరేక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని స్పష్టం చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో దురుసుగా మాట్లాడడమే కాకుండా ఈ రోజు స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర: మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయబోమని చెప్పకనే చెప్పారని ఆక్షేపించారు.
కాంగ్రెస్ పార్టీ తన మెనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కళ్యాణమస్తు పథకం పేరిట పెండ్లి సందర్భంగా ఆడపిల్లలకు రూ. లక్షతో పాటు తులం బంగారం ఎప్పుటి నుంచి ఇస్తారని, ఇప్పటి వరకు జరిగిన వివాహాలకు కూడా ఇస్తారా లేదా అని సోమవారం నాడు శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానమిస్తూ... ఆ పథకాన్ని అమలు చేసే ఆలోచన లేదని తెలిపారు. దాంతో ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
శాసన మండలి మీడియా పాయింట్ వద్ద విలేకరులతో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... కాంగ్రెస్ మెనిఫెస్టో చిత్తుకాగితమని తేలిపోయిందని, ప్రజలను, ముఖ్యంగా మహిళలను మోసం చేయడానికే ఇబ్బడి ముబ్బడిగా కాంగ్రెస్ పార్టీ హామీలిచ్చిందని విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఖురాన్, బైబిల్, భగవద్గీత తో సమానం అని పదే పదే అంటున్నారని, కానీ అవన్నీ అబద్దాలేనని శాసన మండలి సాక్షిగా బయటపడిందని తెలిపారు. కళ్యాణమస్తు పథకమే కాకుండా మహిళలకు నెలకు 2500 ఇస్తామన్న హామీ, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్న హామీలు అమలుపై అనుమానాలు నెలకొన్నాయని, ప్రభుత్వ వైఖరి గమనిస్తే మహిళలను చిన్నచూపు చూస్తున్నట్లు కనిపిస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలు తప్పకుండా బుద్దిచెబుతారని హెచ్చరించారు.
ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని, మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఏ మాతరం చిత్తశుద్ది లేదనడానికి ఈ ఉదంతమే నిదర్శనమని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ గారు ఆడబిడ్డలకు అండగా నిలబడ్డారని, తల్లిదండ్రులకు అండగా పాప పుట్టునప్పటి నుండి పెళ్లి అయ్యే వరకు కేసీఆర్ గారు వారికి వెన్నుదన్నుగా నిలిచారని గుర్తు చేశారు.
మరోవైపు, మిర్చి పంటకు రూ. 25 వేలు కనీస మద్ధతు ధర ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మిర్చి ధరలు పడిపోయి రైతులు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి నిరసనగా సహచర బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో కలిసి ఎమ్మెల్సీ కవిత శాసన మండలి ఆవరణలో ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎండు మిర్చి దండలను మెడకు వేసుకొని ఎమ్మెల్సీలు విన్నూత రీతిలో నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... మిర్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడం సరికాదని సూచించారు. నాఫెడ్, మార్క్ ఫెడ్ వంటి సంస్థ ద్వారా ప్రభుత్వమే మిర్చి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సుగంధ ద్రవ్యాల బోర్డు పరిధిలోకి మిర్చి పంటను కూడా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. అలాగే, పసుపు పంటకు కూడా రూ. 15 వేల మేర కనీస మద్ధతు ధరను కల్పించాలని డిమాండ్ చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కొండగట్టు లో పందిళ్ళు కూలిపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం - కవిత
హైదరాబాద్, ఏప్రిల్ 01 (ప్రజా మంటలు):
కొండగట్టు అంజన్న ఆలయంలో చలువ పందిళ్లు కూలిపోవడంతో 15 మంది భక్తులు గాయపడిన ఘటన ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు తన ట్విట్టర్ లో విమర్శించారు.
. హనుమాన్ చిన్న జయంతి వేడుకల సందర్భంగా నాసిరకంగా ఏర్పాటు చేసిన పందిళ్ల వల్లే ఈ... శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం ప్రధాన అర్చకుని పదవి విరమణ
జగిత్యాల మార్చి 31 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం ప్రధాన అర్చకులు మేడిపల్లి రాజన్న శాస్త్రి పదవి విరమణ మంగళవారం జరగగా ఆలయ ఆవరణలో రాజన్న శాస్త్రి పద్మ దంపతులను ఆలయ కమిటీ సభ్యులు, ఈవో సురేందర్ తదితరులు ఘనంగా సన్మానించి వీడ్కోలు తెలిపారు.
ఈ... తెలంగాణలో ఉద్యోగ నియామకాలపై జీవోలు అడ్డంకి –కల్వకుంట్ల కవిత ఆరోపణ
హైదరాబాద్ ఏప్రిల్ 01 (ప్రజా మంటలు):
రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియలో జీవోలు అడ్డంకిగా మారుతున్నాయని తెలంగాణ జాగృతి నేత కవిత విమర్శించారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వివిధ జీవోల ద్వారా అవరోధాలు సృష్టిస్తోందని ఆరోపించారు.డిగ్రీ లెక్చరర్ల నియామకాలకు సంబంధించిన జీవో నంబర్ 4 వల్ల అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందన్నారు.... ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి
కొండగట్టు మార్చి 31 (ప్రజా మంటలు) హనుమాన్ చిన్న జయంతికి 914 మంది సిబ్బందితో పటిష్ట భద్రత
సీసీ కెమెరాలు ద్వారా నిరంతర పర్యవేక్షణ
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
మల్యాల ఎక్స్ రోడ్ వద్దగల ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన బందోబస్తు పై పోలీసు అధికారులతో ఎస్పి సమీక్ష నిర్వహించారు.
ప్రసిద్ధ... “రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు” : కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఆగ్రహం
:హైదరాబాద్, మార్చ్ 31 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టేసిందని ఆమె ఆరోపించారు.కాగ్ (CAG) 2024-25 నివేదిక ఆధారంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆమె పేర్కొన్నారు. రోజువారీ ఖర్చుల నిర్వహణకే రిజర్వ్ బ్యాంక్... అకాల వర్షంతో పంట దెబ్బతిన్న వరి,మామిడి తోటలు పరిశీలించిన మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత
రాయికల్ మార్చి 31 (ప్రజా మంటలు)మండలం కిష్టంపేట గ్రామంలో నిన్న కురిసిన వర్షాలకు నష్టపోయిన మామిడి మరియు వరి పంట పొలాలను బి ఆర్ ఎస్ నాయకులు మరియు రైతులతో కలిసి పరిశీలించి నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పిన జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్
ఈ సందర్భంగా వారు... కృష్ణా జిల్లా చల్లపల్లె పోలీస్ స్టేషన్లో పేలుడు ఘటన - నలుగురికి గాయాలు
చల్లపల్లె, మార్చ్ 31 (ప్రజా మంటలు):
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా చల్లపల్లె పోలీస్ స్టేషన్లో జరిగిన పేలుడు ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకున్నట్లు సమాచారం.
పోలీస్ స్టేషన్ పరిధిలో అకస్మాత్తుగా పేలుడు శబ్దం వినిపించడంతో సిబ్బంది, సమీప ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఘటన స్థలాన్ని... మైనర్ లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్
జగిత్యాల మార్చి 30(ప్రజా మంటలు)పట్టణం లో ట్రాఫిక్ ఎస్ ఐ, టౌన్ ఎస్ ఐ ఆద్వర్యం లో సోమవారం ద్విచక్ర వాహనాలు నడుపుతున్న దాదాపు 50 మంది మైనర్ లను పట్టుకున్న ట్రాఫిక్ మరియు పట్టణ పోలీసులు... ట్రాఫిక్ పోలీసుస్టేషన్కు తరలించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇక పై మైనర్... డబల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు మాజీ కౌన్సిలర్ జయ శ్రీ వినతి
జగిత్యాల మార్చి 30 ( ప్రజా మంటలు)పట్టణానికి చెందిన ఇల్లు లేని నిరుపేదల కొరకు నూకపెల్లి వద్ద డబల్ బెడ్ రూమ్ ఇండ్లు 4520 కట్టడం జరిగింది. వాటిలో 520 ఇండ్ల నిర్మాణం వద్ద డ్రైనేజీ వాటర్ కొరకు సంపు ఏర్పాటు చేసి దాని నుండి మోటార్ల ద్వారా బయటకు పంపింగ్ చేసే విధానం... రవీంద్రభారతిలో ప్రజాప్రతినిధుల సాంస్కృతిక వేడుకలు –
హైదరాబాద్ మార్చ్ 30 (ప్రజా మంటలు);
శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్వహించిన ప్రజాప్రతినిధుల సాంస్కృతిక వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి A. Revanth Reddy జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
రవీంద్రభారతిలో జరిగిన ఈ వేడుకల్లో మండలి చైర్మన్ Gutta Sukender Reddy, ఉప ముఖ్యమంత్రి Mallu Bhatti Vikramarka... ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయా: క్షమాపణలు తెలిపిన కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, మార్చ్ 30 (ప్రజా మంటలు):
ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నిర్వహించిన ధర్నాకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయానని అంగీకరిస్తూ క్షమాపణలు తెలిపారు.ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల... విద్యార్థుల భవిష్యత్ దిశానిర్దేశంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం - ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల మార్చ్ 29 (ప్రజా మంటలు):
విద్యార్థుల భవిష్యత్ దిశానిర్దేశంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం అని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పేర్కొన్నారు.జగిత్యాల రూరల్ మండలంలోని అంతర్గం గ్రామంలో మండల పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందిన గడ్డం మహిపాల్ రెడ్డి గారి పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమం అంతర్గం... 