మహిళలకు మోసం చేశామని స్వయంగా ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని కవిత విమర్శ
మహిళలను మోసం చేశామని ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటు -
*కాంగ్రెస్ మెనిఫెస్టో చిత్తుకాగితమని తేలిపోయింది*
*మహిళా వ్యతిరేక సీఎంగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలుస్తారు
శాసన మండలి సాక్షిగా బయటపడ్డ కాంగ్రెస్ బండారం
మిర్చికి 25 వేల మద్ధతు ధర ప్రకటించాలి: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ మార్చ్ 17:
మహిళలకు మోసం చేశామని స్వయంగా ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. మహిళా వ్యతిరేక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని స్పష్టం చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో దురుసుగా మాట్లాడడమే కాకుండా ఈ రోజు స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర: మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయబోమని చెప్పకనే చెప్పారని ఆక్షేపించారు.
కాంగ్రెస్ పార్టీ తన మెనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కళ్యాణమస్తు పథకం పేరిట పెండ్లి సందర్భంగా ఆడపిల్లలకు రూ. లక్షతో పాటు తులం బంగారం ఎప్పుటి నుంచి ఇస్తారని, ఇప్పటి వరకు జరిగిన వివాహాలకు కూడా ఇస్తారా లేదా అని సోమవారం నాడు శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానమిస్తూ... ఆ పథకాన్ని అమలు చేసే ఆలోచన లేదని తెలిపారు. దాంతో ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
శాసన మండలి మీడియా పాయింట్ వద్ద విలేకరులతో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... కాంగ్రెస్ మెనిఫెస్టో చిత్తుకాగితమని తేలిపోయిందని, ప్రజలను, ముఖ్యంగా మహిళలను మోసం చేయడానికే ఇబ్బడి ముబ్బడిగా కాంగ్రెస్ పార్టీ హామీలిచ్చిందని విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఖురాన్, బైబిల్, భగవద్గీత తో సమానం అని పదే పదే అంటున్నారని, కానీ అవన్నీ అబద్దాలేనని శాసన మండలి సాక్షిగా బయటపడిందని తెలిపారు. కళ్యాణమస్తు పథకమే కాకుండా మహిళలకు నెలకు 2500 ఇస్తామన్న హామీ, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్న హామీలు అమలుపై అనుమానాలు నెలకొన్నాయని, ప్రభుత్వ వైఖరి గమనిస్తే మహిళలను చిన్నచూపు చూస్తున్నట్లు కనిపిస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలు తప్పకుండా బుద్దిచెబుతారని హెచ్చరించారు.
ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని, మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఏ మాతరం చిత్తశుద్ది లేదనడానికి ఈ ఉదంతమే నిదర్శనమని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ గారు ఆడబిడ్డలకు అండగా నిలబడ్డారని, తల్లిదండ్రులకు అండగా పాప పుట్టునప్పటి నుండి పెళ్లి అయ్యే వరకు కేసీఆర్ గారు వారికి వెన్నుదన్నుగా నిలిచారని గుర్తు చేశారు.
మరోవైపు, మిర్చి పంటకు రూ. 25 వేలు కనీస మద్ధతు ధర ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మిర్చి ధరలు పడిపోయి రైతులు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి నిరసనగా సహచర బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో కలిసి ఎమ్మెల్సీ కవిత శాసన మండలి ఆవరణలో ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎండు మిర్చి దండలను మెడకు వేసుకొని ఎమ్మెల్సీలు విన్నూత రీతిలో నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... మిర్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడం సరికాదని సూచించారు. నాఫెడ్, మార్క్ ఫెడ్ వంటి సంస్థ ద్వారా ప్రభుత్వమే మిర్చి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సుగంధ ద్రవ్యాల బోర్డు పరిధిలోకి మిర్చి పంటను కూడా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. అలాగే, పసుపు పంటకు కూడా రూ. 15 వేల మేర కనీస మద్ధతు ధరను కల్పించాలని డిమాండ్ చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇటిక్యాల గ్రామ అభివృద్ధికి కలిసికట్టుగా పని చేయాలి – జీవన్రెడ్డి
జగిత్యాల రూరల్, డిసెంబర్ 24 (ప్రజా మంటలు):
ఇందిరా భవన్లో ఇటిక్యాల గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మాజీ మంత్రి జీవన్రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
జీవన్రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల అనంతరం రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయడం ఇటిక్యాల... అంగరంగ వైభవంగా కలియుగ దైవం కల్యాణ వేడుకలు
జగిత్యాల డిసెంబర్ 23 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో గల శ్రీ శ్రీనివాసాంజనేయ భవాని శంకర దేవాలయంలో శ్రవణ నక్షత్రం పురస్కరించుకొని స్వామివారి కళ్యాణ వేడుకలు మంగళవారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను ఉంచి కళ్యాణాన్ని కొనసాగించారు భక్తులు... బీర్పూర్ మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు ఏకగ్రీవం_అధ్యక్షులుగా తుంగూరు సర్పంచ్ రాజగోపాల్ రావు
*
బీర్పూర్ డిసెంబర్ 23 (ప్రజా మంటలు)మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు గా తుంగూర్ గ్రామ సర్పంచ్ అర్షకోట రాజగోపాల్ రావు ని ఏకగ్రీవంగా ఏనుకున్న బీర్పూర్ మండల సర్పంచులు,
ప్రధాన కార్యదర్శి గా ఎల్లమట్ల హరీష్ (బీర్పూర్ సర్పంచ్ ), ఉపాధ్యక్షులు 1 గా బోడ సాగర్ (రంగసాగర్ సర్పంచ్ ),... జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సమర్థ పనితీరు – నేరాలు 5.05 శాతం తగ్గింపు* జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
*జగిత్యాల డిసెంబర్ 23 (ప్రజా మంటలు)పండుగలు, ఎన్నికలు, జాతరలు ప్రశాంతంగా – అవాంఛనీయ సంఘటన లేకుండా ముగిసిన ఏడాది*
*మహిళలు, చిన్నారుల భద్రతే ప్రథమ లక్ష్యం,– డ్రగ్స్ పై జీరో టాలరెన్స్ విధానం అమలు*
*‘సురక్షిత ప్రయాణం’తో రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు చర్యలు
జిల్లాలో గత సంవత్సర కాలంలో జిల్లా పోలీస్ శాఖ... యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి ఎమ్మెల్యేనే కారణం కాదా..? – మాజీ మంత్రి జీవన్ రెడ్డి సూటి ప్రశ్న
జగిత్యాల, డిసెంబర్ 23 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని యావర్ రోడ్డు 100 ఫీట్ల విస్తరణ జాప్యానికి స్థానిక ఎమ్మెల్యేనే ప్రధాన కారణమని మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాల ఇందిరా భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
మున్సిపల్ తీర్మానాన్ని తుంగలో... పోలీస్ విధులు సమర్థంగా నిర్వహించాలంటే శారీరకృఢత్వం మానసిక ఆరోగ్య ము అత్యంత అవసరం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 23 (ప్రజా మంటలు)
పోలీస్ విధులు సమర్థంగా నిర్వహించాలంటే శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం అత్యంత అవసరమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆధునిక వ్యాయామశాల (జిమ్)ను మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…. పోలీస్ సిబ్బంది రోజువారీ... పుష్కర ఘాట్లను పర్యవేక్షించిన దేవాదాయ శాఖ
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 23( ప్రజా మంటలు దగ్గుల అశోక్)
ఇబ్రహీంపట్నం మండలంలోని అన్ని పుష్కర ఘాట్ల అభివృద్ధి కొరకు కావలసిన పనులను పర్యవేక్షించిన గౌరవ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, జగిత్యాల మరియు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ హైదరాబాద్ వారి కార్యాలయ అధికారులు మరియు ఇబ్రహీంపట్నం తాసిల్దార్, ఎంపీడీవో ఇతర మండల అధికారులు.... మహబూబ్నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్పై ACB సోదాలు
మహబూబ్నగర్, డిసెంబర్ 23 (ప్రజా మంటలు):
మహబూబ్నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (Dy Commissioner) రవాణా శాఖాధికారి కిషన్ నాయక్ పై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు భారీ ఎత్తున సోదాలు నిర్వహించారు. అధికార ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసి ఈ దాడులు చేపట్టినట్లు... కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టేవరకు స్వామి మాల విరమణ చేయను : డా. సాయికుమార్
కోరుట్ల, డిసెంబర్ 23 (ప్రజా మంటలు):
కోరుట్ల నియోజకవర్గ రాజకీయాల్లో డాక్టర్ సాయికుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ సాయికుమార్ నేడు కొత్తపేట శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంచలన ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో జువ్వాడి నర్సింగరావు గారు “డాక్టర్ సాయికుమార్... ఏపీలో పలు జిల్లాల్లో ఏసీబీ మెరుపు సోదాలు – సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు
అమరావతి డిసెంబర్ 23(ప్రజా మంటలు):
ఆంధ్రప్రదేశ్లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టి పలు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలను, ఉద్యోగుల నివాసాలను తనిఖీ చేశారు.
విజయనగరం జిల్లా భోగాపురం సబ్రిజిస్ట్రార్ రామకృష్ణతో పాటు ఆయన సహ ఉద్యోగులు, మరో ప్రైవేట్... కోచిలో రోడ్డుపై ప్రాణాలు నిలిపిన డాక్టర్ ధైర్యం – సినిమా సన్నివేశాన్ని తలపించిన నిజజీవిత రక్షణ
కోచి, కేరళ డిసెంబర్ 23 (ప్రత్యేక కథనం):
కోచిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం అనంతరం ప్రాణాపాయ స్థితిలో రోడ్డుపై పడి ఉన్న వ్యక్తికి ఓ డాక్టర్ చేసిన అత్యవసర చికిత్స అక్షరాలా ప్రాణాలను నిలిపింది. శ్వాస తీసుకోలేక తంటాలు పడుతూ, మరణం అంచున ఉన్న ఆ వ్యక్తికి డాక్టర్ రోడ్డుపైనే తక్షణ శస్త్రచికిత్స చేసి... 