మహిళలకు మోసం చేశామని స్వయంగా ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని కవిత విమర్శ

On
మహిళలకు మోసం చేశామని స్వయంగా ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని కవిత విమర్శ

మహిళలను మోసం చేశామని ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటు - 


*కాంగ్రెస్ మెనిఫెస్టో చిత్తుకాగితమని తేలిపోయింది*


*మహిళా వ్యతిరేక సీఎంగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలుస్తారు 

శాసన మండలి సాక్షిగా బయటపడ్డ కాంగ్రెస్ బండారం 

మిర్చికి 25 వేల మద్ధతు ధర ప్రకటించాలి: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ మార్చ్ 17:

 మహిళలకు మోసం చేశామని స్వయంగా ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. మహిళా వ్యతిరేక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని స్పష్టం చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో దురుసుగా మాట్లాడడమే కాకుండా ఈ రోజు స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర: మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయబోమని చెప్పకనే చెప్పారని ఆక్షేపించారు.

కాంగ్రెస్ పార్టీ తన మెనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కళ్యాణమస్తు పథకం పేరిట పెండ్లి సందర్భంగా ఆడపిల్లలకు రూ. లక్షతో పాటు తులం బంగారం ఎప్పుటి నుంచి ఇస్తారని, ఇప్పటి వరకు జరిగిన వివాహాలకు కూడా ఇస్తారా లేదా అని సోమవారం నాడు శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానమిస్తూ... ఆ పథకాన్ని అమలు చేసే ఆలోచన లేదని తెలిపారు. దాంతో ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

శాసన మండలి మీడియా పాయింట్ వద్ద విలేకరులతో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... కాంగ్రెస్ మెనిఫెస్టో చిత్తుకాగితమని తేలిపోయిందని, ప్రజలను, ముఖ్యంగా మహిళలను మోసం చేయడానికే ఇబ్బడి ముబ్బడిగా కాంగ్రెస్ పార్టీ హామీలిచ్చిందని విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఖురాన్, బైబిల్, భగవద్గీత తో సమానం అని పదే పదే అంటున్నారని, కానీ అవన్నీ అబద్దాలేనని శాసన మండలి సాక్షిగా బయటపడిందని తెలిపారు. కళ్యాణమస్తు పథకమే కాకుండా మహిళలకు నెలకు 2500 ఇస్తామన్న హామీ, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్న హామీలు అమలుపై అనుమానాలు నెలకొన్నాయని, ప్రభుత్వ వైఖరి గమనిస్తే మహిళలను చిన్నచూపు చూస్తున్నట్లు కనిపిస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలు తప్పకుండా బుద్దిచెబుతారని హెచ్చరించారు.IMG-20250317-WA0014

ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని, మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఏ మాతరం చిత్తశుద్ది లేదనడానికి ఈ ఉదంతమే నిదర్శనమని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ గారు ఆడబిడ్డలకు అండగా నిలబడ్డారని, తల్లిదండ్రులకు అండగా పాప పుట్టునప్పటి నుండి పెళ్లి అయ్యే వరకు కేసీఆర్ గారు వారికి వెన్నుదన్నుగా నిలిచారని గుర్తు చేశారు.

మరోవైపు, మిర్చి పంటకు రూ. 25 వేలు కనీస మద్ధతు ధర ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మిర్చి ధరలు పడిపోయి రైతులు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి నిరసనగా సహచర బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో కలిసి ఎమ్మెల్సీ కవిత శాసన మండలి  ఆవరణలో ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎండు మిర్చి దండలను మెడకు వేసుకొని ఎమ్మెల్సీలు విన్నూత రీతిలో నిరసన తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ...  మిర్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడం సరికాదని సూచించారు. నాఫెడ్, మార్క్ ఫెడ్ వంటి సంస్థ ద్వారా ప్రభుత్వమే మిర్చి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సుగంధ ద్రవ్యాల బోర్డు పరిధిలోకి మిర్చి పంటను కూడా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. అలాగే, పసుపు పంటకు కూడా రూ. 15 వేల మేర కనీస మద్ధతు ధరను కల్పించాలని డిమాండ్ చేశారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

రైతు బజార్ లోనే కూరగాయల విక్రయాలు జరపాలి. టౌన్ సిఐ కరుణాకర్ 

రైతు బజార్ లోనే కూరగాయల విక్రయాలు జరపాలి.  టౌన్ సిఐ కరుణాకర్     జగిత్యాల జూలై 27 (ప్రజా మంటలు) కూరగాయలు విక్రయించే రైతులు రైతు బజార్ లోపలే తమ కూరగాయలను విక్రయించాలని టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. రైతు బజార్ ఎదుట రహదారికి రెండు వైపులా కూరగాయలు విక్రయించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రజల ఫిర్యాదు మేరకు  జిల్లా ఎస్పీ ఆదేశాలతో సోమవారం టౌన్ సిఐ కరుణాకర్ ట్రాఫిక్...
Read More...
National 

బోర్నపల్లి–జగన్నాథ్‌పూర్ బ్రిడ్జిపై రాజకీయ దుమారం.. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కౌంటర్

బోర్నపల్లి–జగన్నాథ్‌పూర్ బ్రిడ్జిపై రాజకీయ దుమారం.. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కౌంటర్ జగిత్యాల, జూలై 27 (ప్రజా మంటలు): బోర్నపల్లి–జగన్నాథ్‌పూర్ బ్రిడ్జి నిర్మాణం అంశంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. జగిత్యాల మోతే రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలపై వివరణ ఇచ్చారు. మంత్రి లక్ష్మణ్ కుమార్‌ను హైదరాబాద్‌లో...
Read More...
Local News  State News 

ఎల్ నినో తో ఆందోళనలో ఉన్న రైతులను ఎరువుల బ్లాక్ మార్కెట్‌తో మరింత దోచుకుంటున్న ప్రభుత్వం. - దావ వసంత సురేష్.

ఎల్ నినో తో ఆందోళనలో ఉన్న రైతులను ఎరువుల బ్లాక్ మార్కెట్‌తో మరింత దోచుకుంటున్న ప్రభుత్వం. - దావ వసంత సురేష్. సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/ 9348422113.  జగిత్యాల 27 జూలై (ప్రజా మంటలు) :  జిల్లాలోని రైతులు యూరియా డిఏపి మరియు ఇతర ఎరువులు అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న సందర్భంగా ఈరోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు బిఆర్ఎస్ నాయకులు మరియు రైతులతో కలిసి వినతి పత్రం ఇచ్చిన జగిత్యాల...
Read More...
State News 

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్‌.. వెంటనే తొలగించాలని సీఎస్‌కు ఆదేశం

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్‌.. వెంటనే తొలగించాలని సీఎస్‌కు ఆదేశం   కోర్టు ధిక్కార కేసులో కీలక పరిణామం.. ప్రభుత్వానికి ఇప్పుడు రెండు మార్గాలేనా? హైదరాబాద్, జూలై 27: హైదరాబాద్‌లో చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ పేరుతో ఏర్పాటైన హైడ్రా (HYDRAA) మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకుంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించాలని...
Read More...
Local News 

సుసంపన్నమైన వర్షాల కోసమే శ్రీమత్ విరాట పర్వ సప్తాహం 

సుసంపన్నమైన వర్షాల కోసమే శ్రీమత్ విరాట పర్వ సప్తాహం  జగిత్యాల జులై 26 (ప్రజా మంటలు)   సనాతనంగా  సుసంపర్ణమైన వర్షాల కోసమే మహాభారత అంతర్గత శ్రీమత్ విరాట పర్వసప్తాహం నిర్వహించబడేదని నంబి వేణుగోపాల ఆచార్య తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గీత భవన్ లో శ్రీమాన్ నంబి వేణుగోపాల ఆచార్య చే శ్రీమత్ విరాటపర్వసప్తాహం ప్రారంభమైంది. ఆగస్టు ఒకటవ తేదీ శనివారం వరకు ఈ కార్యక్రమం...
Read More...
National  Local News  Opinion  State News 

ఒకే ఒక్క మొగాడు మొనగాడు ఎమ్మెల్యే పాయల్ శంకర్.. 

ఒకే ఒక్క మొగాడు మొనగాడు ఎమ్మెల్యే పాయల్ శంకర్..  సెల్యూట్ టు ది లీడర్...   నేడు ఎమ్మెల్యే పాయల్ శంకర్ విలువ ఇంతా అంతా కాదు అక్షరాల 2278.14 కోట్లు. అభినవ అపర భగీరథుడు అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్. అదిలాబాద్ జిల్లాకు బాహుబలి లాంటి మెగా నిధుల కేటాయింపు...  రాష్ట్రంలో అదిలాబాదు జిల్లా ఓటర్లే అత్యధిక ప్రభావవంతమైన వారు, తెలివి కలవారు ఒకటి పాయల్...
Read More...
Local News 

కార్గిల్ దివస్ సందర్భంగా వీర జవాన్లకు ఘన నివాళులు అర్పించిన గుంతకల్ బిజెపి నాయకులు

కార్గిల్ దివస్ సందర్భంగా వీర జవాన్లకు ఘన నివాళులు అర్పించిన గుంతకల్ బిజెపి నాయకులు గుంతకల్ జూలై 26 ( ప్రజా మంటలు)  భారతీయ జనతా పార్టీ పాత గుంతకల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కార్గిల్ దివస్ సందర్భంగా వీర జవాన్లు అందరికీ నివాళులర్పించిన గుంతకల్ బిజెపి నాయకులు ఈ కార్యక్రమంలో బిజెపి ఓల్డ్ టౌన్ పట్టణ అధ్యక్షుడు వడ్డే రమేష్, బిజెపి సీనియర్ నాయకురాలు మరియు ఎఫ్సీఐ స్టేట్ డైరెక్టర్...
Read More...
Local News 

గీతా విద్యాలయం పూర్వ విద్యార్థుల సంకల్పం.  మిత్ర ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం. 

గీతా విద్యాలయం పూర్వ విద్యార్థుల సంకల్పం.   మిత్ర ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం.     జగిత్యాల, జులై 26(ప్రజా మంటలు) సిరిసిల్ల రాజేంద్ర శర్మ (9348422113) చేయి చేయి కలుపుదాం సేవ చేయ కదులుదాం... ప్రజల కొరకే మనమంతా ప్రతి నిమిషం బ్రతుకుదాం.. అంటూ శ్రీ సరస్వతీ విద్యాపీఠం అనుబంధ గీత విద్యాలయం పూర్వ విద్యార్థులు "మిత్ర ఫౌండేషన్" పేరుతో సేవా సంస్థకు శ్రీకారం చుట్టారు. జగిత్యాల గీత విద్యాలయంలో విద్యనభ్యసించిన...
Read More...
National  Local News  State News 

విషజ్వరాల నివారణకు పారిశుద్ధ్యమే ప్రధాన ఆయుధం – దావ వసంత సురేష్.

విషజ్వరాల నివారణకు పారిశుద్ధ్యమే ప్రధాన ఆయుధం – దావ వసంత సురేష్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల 26 జూలై (ప్రజా మంటలు) :  జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు నిన్న విష జ్వరంతో మరణించగా ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్....
Read More...
Local News 

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని సందర్శించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్  బక్కి వెంకటయ్య 

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని సందర్శించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్  బక్కి వెంకటయ్య  కొండగట్టు జులై 25( ప్రజా మంటలు)   కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్  , శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు చైర్మన్ కి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, వేద పండితుల వేదాశీర్వచనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రంతో సత్కరించారు...
Read More...
National  Local News  State News 

ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా విద్యార్థుల ఐక్య పోరాటానికి దక్కిన గొప్ప విజయం - దావ వసంత సురేష్.

ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా విద్యార్థుల ఐక్య పోరాటానికి దక్కిన గొప్ప విజయం - దావ వసంత సురేష్. సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113.  జగిత్యాల 25 జూలై (ప్రజా మంటలు) :  కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా పై స్పందించిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన వారిపై దేశవ్యాప్తంగా విద్యార్థులు,...
Read More...
National  Local News 

విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం: తెలంగాణ రక్షణ సేన

విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం: తెలంగాణ రక్షణ సేన హైదరాబాద్, జూలై 22 (ప్రజా మంటలు): దేశవ్యాప్తంగా NEET ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. కందుల మధు, బొడ్డుపల్లి లింగం, అశోక్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీ ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి ఆర్ట్స్...
Read More...