మహిళలకు మోసం చేశామని స్వయంగా ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని కవిత విమర్శ

On
మహిళలకు మోసం చేశామని స్వయంగా ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని కవిత విమర్శ

మహిళలను మోసం చేశామని ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటు - 


*కాంగ్రెస్ మెనిఫెస్టో చిత్తుకాగితమని తేలిపోయింది*


*మహిళా వ్యతిరేక సీఎంగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలుస్తారు 

శాసన మండలి సాక్షిగా బయటపడ్డ కాంగ్రెస్ బండారం 

మిర్చికి 25 వేల మద్ధతు ధర ప్రకటించాలి: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ మార్చ్ 17:

 మహిళలకు మోసం చేశామని స్వయంగా ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. మహిళా వ్యతిరేక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని స్పష్టం చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో దురుసుగా మాట్లాడడమే కాకుండా ఈ రోజు స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర: మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయబోమని చెప్పకనే చెప్పారని ఆక్షేపించారు.

కాంగ్రెస్ పార్టీ తన మెనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కళ్యాణమస్తు పథకం పేరిట పెండ్లి సందర్భంగా ఆడపిల్లలకు రూ. లక్షతో పాటు తులం బంగారం ఎప్పుటి నుంచి ఇస్తారని, ఇప్పటి వరకు జరిగిన వివాహాలకు కూడా ఇస్తారా లేదా అని సోమవారం నాడు శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానమిస్తూ... ఆ పథకాన్ని అమలు చేసే ఆలోచన లేదని తెలిపారు. దాంతో ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

శాసన మండలి మీడియా పాయింట్ వద్ద విలేకరులతో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... కాంగ్రెస్ మెనిఫెస్టో చిత్తుకాగితమని తేలిపోయిందని, ప్రజలను, ముఖ్యంగా మహిళలను మోసం చేయడానికే ఇబ్బడి ముబ్బడిగా కాంగ్రెస్ పార్టీ హామీలిచ్చిందని విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఖురాన్, బైబిల్, భగవద్గీత తో సమానం అని పదే పదే అంటున్నారని, కానీ అవన్నీ అబద్దాలేనని శాసన మండలి సాక్షిగా బయటపడిందని తెలిపారు. కళ్యాణమస్తు పథకమే కాకుండా మహిళలకు నెలకు 2500 ఇస్తామన్న హామీ, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్న హామీలు అమలుపై అనుమానాలు నెలకొన్నాయని, ప్రభుత్వ వైఖరి గమనిస్తే మహిళలను చిన్నచూపు చూస్తున్నట్లు కనిపిస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలు తప్పకుండా బుద్దిచెబుతారని హెచ్చరించారు.IMG-20250317-WA0014

ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని, మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఏ మాతరం చిత్తశుద్ది లేదనడానికి ఈ ఉదంతమే నిదర్శనమని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ గారు ఆడబిడ్డలకు అండగా నిలబడ్డారని, తల్లిదండ్రులకు అండగా పాప పుట్టునప్పటి నుండి పెళ్లి అయ్యే వరకు కేసీఆర్ గారు వారికి వెన్నుదన్నుగా నిలిచారని గుర్తు చేశారు.

మరోవైపు, మిర్చి పంటకు రూ. 25 వేలు కనీస మద్ధతు ధర ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మిర్చి ధరలు పడిపోయి రైతులు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి నిరసనగా సహచర బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో కలిసి ఎమ్మెల్సీ కవిత శాసన మండలి  ఆవరణలో ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎండు మిర్చి దండలను మెడకు వేసుకొని ఎమ్మెల్సీలు విన్నూత రీతిలో నిరసన తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ...  మిర్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడం సరికాదని సూచించారు. నాఫెడ్, మార్క్ ఫెడ్ వంటి సంస్థ ద్వారా ప్రభుత్వమే మిర్చి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సుగంధ ద్రవ్యాల బోర్డు పరిధిలోకి మిర్చి పంటను కూడా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. అలాగే, పసుపు పంటకు కూడా రూ. 15 వేల మేర కనీస మద్ధతు ధరను కల్పించాలని డిమాండ్ చేశారు.

Tags

More News...

Local News 

ఉద్యమకారులకు న్యాయం చేయని కేసీఆర్ ప్రభుత్వం

ఉద్యమకారులకు న్యాయం చేయని కేసీఆర్ ప్రభుత్వం సికింద్రాబాద్  జూలై 03 (ప్రజా మంటలు):  ఉద్యమకారులతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యమకారులను విస్మరించారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 300 మంది ఉద్యమకారులకు న్యాయం చేసి కెసిఆర్ చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఎలాంటి స్వార్థం లేకుండా ఉద్యమాలు చేసిన నిస్వార్థపరులైన మొదటి ఉద్యమ నాయకులను, కార్యకర్తలను ఎప్పుడూ మరచి పోవద్దని, వారిని...
Read More...
Local News 

ప్లాస్టిక్ బ్యాగ్ లు వద్దు..క్లాత్ బ్యాగులు ముద్దు

ప్లాస్టిక్ బ్యాగ్ లు వద్దు..క్లాత్ బ్యాగులు ముద్దు సికింద్రాబాద్ జూలై 04 (ప్రజామంటలు): తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ప్రపంచ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే ను గురువారం నిర్వహించారు, సికింద్రాబాద్ లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు మట్ట రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరం పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా తీసుకొని ప్లాస్టిక్ బ్యాగులను వాడకుండా కేవలం క్లాత్ బ్యాగులను వాడాలని కోరారు.ప్లాస్టిక్...
Read More...
Local News 

మెటుపల్లి లో దొడ్డి కొమురయ్య 79 వ వర్ధంతి

 మెటుపల్లి లో దొడ్డి కొమురయ్య 79 వ వర్ధంతి మెటుపల్లి జూలై 04 (ప్రజా మంటలు): తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డికొమురయ్య 79 వ వర్ధంతి సందర్భంగా మెట్పల్లి పట్నం లో, ఆయన విగ్రహం వద్ద పెద్ద సంఖ్యలో జనం పాల్గొని నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మాజీ కౌన్సిలర్, కుర్మ సంఘం అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలు గడిచినా ట్యాంక్ బండ్...
Read More...
Local News 

6 లక్షల మంది భక్తులు బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు  - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ

6 లక్షల మంది భక్తులు బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు  - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ సికింద్రాబాద్ జూలై 03 (ప్రజామంటలు): బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఎదురుకోలు, కళ్యాణ మహోత్సవం, రథోత్సవం, బోనాల జాతర ఘనంగా నిర్వహించడం జరిగిందని సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ తెలిపారు. మూడు రోజుల ఉత్సవాలకు దాదాపు 6 లక్షలకు పైగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి సేవలో...
Read More...
Opinion 

బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి పట్టాభిరామ్

బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి పట్టాభిరామ్ వ్యక్తిత్వ వికాసానికి వెలుగునివ్విన బి.వి. పట్టాభిరామ్ మృతి    (రామ కిష్టయ్య సంగన భట్ల, సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్టు, కాలమిస్టు ...9440595494) ప్రముఖ ఇంద్రజాలికుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు బి వి పట్టాభిరామ్ మంగళ వారం గుండె పోటుతో మృతి చెందడంతో ఒక గొప్ప అపూర్వ అపురూప కళాకారుడిని తెలుగు కళామతల్లి కోల్పోయింది. బి.వి. పట్టాభిరామ్ (భావరాజు...
Read More...
Local News 

ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే 2025 వేడుకలు

ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే 2025 వేడుకలు సికింద్రాబాద్, జూలై 03 (ప్రజామంటలు) :   సికింద్రాబాద్ క్రిస్టియన్ ప్రెస్ క్లబ్ లో గురువారం  యేసుక్రీస్తు ప్రభువుతో జీవించిన శిష్యులు సెయింట్ తోమా హతసాక్షిగ చనిపోయిన రోజును పురస్కరించుకొని ఇండియన్ క్రిస్టియన్ భక్తి  దినోత్సవంగా జరుపుకున్నారు. సికింద్రాబాద్ లో  క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో సెయింట్ థామస్  చేసిన సువార్త పరిచర్యను కొనసాగించాలని  తీర్మానించారు. హిందూమతోన్మాద
Read More...
Local News  State News 

బన్సీలాల్ పేట లో వెలుగు చూసిన బోనాల చెక్కుల గోల్ మాల్

బన్సీలాల్ పేట లో వెలుగు చూసిన బోనాల చెక్కుల గోల్ మాల్   - లేని ఓ టెంపుల్ కు 8 ఏండ్ల నుంచి చెక్కులు  - మరికొన్ని టెంపుల్లో ఒక్కో దానికి రెండేసి చెక్కులు  - విచారణ ప్రారంభించిన ఎండోమెంట్ అధికారులు  - ఉన్నతాధికారులకు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు.. సికింద్రాబాద్ జూలై 03 (ప్రజామంటలు) : ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం ఇచ్చే చెక్కులు గత...
Read More...
Local News 

డెంగ్యూ పాజిటివ్ కేసు..అప్రమత్తమైన అధికారులు

డెంగ్యూ పాజిటివ్ కేసు..అప్రమత్తమైన అధికారులు సికింద్రాబాద్, జూలై 03 (ప్రజామంటలు): బన్సీలాల్ పేట డివిజన్ లో ఓ డెంగ్యూ పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం డివిజన్ లోని కీస్ బ్లాక్ జైనగర్ ప్రాంతంలోని ఓ వ్యక్తికి డెంగ్యూ పాజిటివ్ రావడంతో జీహెచ్ఎమ్సీ డిప్యూటీ కమిషనర్ డాకునాయక్ ఆధ్వర్యంలో అధికారుల బృందం కాలనీని సందర్శించారు. ఎంటమాలజీ సిబ్బంది కాలనీలో...
Read More...

రేపటి నుంచి వారం పాటు శ్రీసాయి సప్తాహ ఉత్సవాలు

రేపటి నుంచి వారం పాటు శ్రీసాయి సప్తాహ ఉత్సవాలు సికింద్రాబాద్, జూలై 03 (ప్రజామంటలు):   పద్మారావునగర్ డా.సాయి కుమార్ వ్యాధి నివారణ ఆశ్రమ్ లో రేపటి నుంచి ఈనెల 4 నుంచి 10 వ తేదీ వరకు వారం రోజుల పాటు శ్రీసాయి సప్తాహము ఉత్సవాలను నిర్వహించనున్నారు.ఈమేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి రోజు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. శ్రీసాయి
Read More...
Local News 

ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయి చదువుకి  శ్రీ సత్యసాయి సేవా సమితి ఆర్థిక చేయూత 

ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయి చదువుకి  శ్రీ సత్యసాయి సేవా సమితి ఆర్థిక చేయూత    జగిత్యాల జూలై 3(ప్రజా మంటలు    ) స్థానిక జగిత్యాల సాయినగర్ కి చెందిన శ్రీమతి మామిడాల చంద్రకళ  చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఇద్దరు ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివిపిస్తూ వచ్చింది , కానీ ఇప్పుడు తన ఆరోగ్యం క్షీణించడంతో ఉద్యోగం చేసే పరిస్థితి లేకపోవడంతో ఇంజనీరింగ్ చదువుతున్న తన కూతురు వెన్నెల కాలేజ్ ఫీ...
Read More...
Local News 

రాయికల్ మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన  జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ 

రాయికల్ మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన  జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్  రాయికల్ జులై 3( ప్రజా మంటలు)   రాయికల్ మండల కేంద్రంలో  సామాజిక  ఆరోగ్య కేంద్రం ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఓ. పి. సేవలు, ఐపీ సేవలు రికార్డ్స్ ల్యాబ్ రికార్డ్స్ ఐపీ రికార్డ్స్ మెడికల్ ఫార్మసి జిల్లాకలెక్టర్ పరిశీలించారు.   ఆసుపత్రిలో వైద్య సేవలను గురించి నేరుగా పేషంట్లని వివరాలు అడిగివైద్య...
Read More...
Local News 

సేవా భారతి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు. 

సేవా భారతి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు.        జగిత్యాల జూలై 3 (ప్రజా మంటలు ) వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో గురువారం గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆషాడ మాసం సందర్భంగా స్త్రీలు గోరింటాకును ధరించడం ఆనవాయితీగా వస్తుంది. ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న మహిళలు, సేవికాసమితి సేవా భారతి కార్యకర్తలు...
Read More...