గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్
సమాచారం ఇచ్చిన కాలుని వాసులకు కృతజ్ఞతలు తెలిపిన సి ఐ నిరంజన్ రెడ్డి.
మెట్టుపల్లి మార్చ్ 15(ప్రజా మంటలు దగ్గుల అశోక్):
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని శాంతినగర్ కాలనీలోని ఒక ఇంటిలో కొంతమంది వ్యక్తులు గంజాయి త్రాగుతున్నారని కాలనీవాసులు చూసి మధ్యాహ్నం సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్ ఐ కిరణ్ సిబ్బందితో శాంతినగర్ లోని ఒక ఇంటిలో నలుగురు బీహార్ రాష్ట్రానికి చెందిన రూపేష్ కుమార్,సునీల్ కుమార్, సంతోష్ కుమార్,చోటు కుమార్ లను పట్టుకొని విచారించమని అన్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ... గత కొన్ని నెలల క్రితం మెట్ పల్లి పట్టణానికి బీహార్ నుండి నలుగురు వ్యక్తులు వచ్చి హమాలి పని చేసుకుంటూ శాంతినగర్ లో నివాసముంటూ, ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో బీహార్ రాష్ట్రం నుండి గంజాయిని తీసుకొని వచ్చి వాళ్లు సేవించడమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలైన మెట్ పల్లి, మల్లాపూర్ పరిసర ప్రాంతాలలో చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి 500 రూపాయలకు ఒక ప్యాకెట్ చొప్పున అమ్ముతున్నారని అన్నారు.
నిందితుల యజమానికి చెందిన అశోక్ లేలాండ్ వాహనంలో తిరుగుతూ, నిందితులు అమ్ముతున్నారని అన్నారు. మధ్యాహ్న సమయంలో కాలనీవాసులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లి నిందుతులను పట్టుకొని 450 గ్రాముల గంజాయి, నాలుగు సెల్ ఫోన్లు, అశోక్ లేలాండ్ వాహనాన్ని సీజ్ చేసి రిమాండ్ కు తరలించామని సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. సమాచారం ఇచ్చిన కాలనీవాసులకు పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

పెద్దపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

మేడిపల్లి భీమారం , మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

పద్మశాలి కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మెహందీ ఉత్సవం

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
