రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
రైతుల సంక్షేమం కోసం రూ. 55,256 కోట్లు వ్యయం చేసిన ప్రభుత్వం.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే రైతులకు మేలు
పదేళ్ల కాలంలో రైతులకు బీ.ఆర్.ఎస్. చేసిందేమీ లేదు
- రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి
హైదరాబాద్ ఫిబ్రవరి 11:
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తోందని, రైతుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సర కాలంలోనే రైతుల సంక్షేమం కోసం రూ. 55,256 వేల కోట్లు వ్యయం చేసిందని చిన్నారెడ్డి తెలిపారు. రైతు భరోసా ద్వారా సుమారు రూ. 40 వేల కోట్లు రైతుల ఖాతాలో నేరుగా జమ చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని చిన్నారెడ్డి అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి పంట కాలంలో 25 లక్షల 36 వేల మంది రైతులకు రూ. 20,617 వేల కోట్లు రుణ మాఫీ చేసిందని చిన్నారెడ్డి తెలిపారు.
రైతులకు మంచి చేయాలనే తపనతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం తపిస్తోందని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతోందని చిన్నారెడ్డి పేర్కొన్నారు.
పదేళ్లపాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని, రైతుల కోసం చేసింది ఏమీ లేదని చిన్నారెడ్డి ఆరోపించారు.
అధికారం కోల్పోయిన తర్వాత బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలుతున్నారని చిన్నారెడ్డి అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)