మంజూరైన నవోదయ విద్యాలయాన్ని తరలించొద్దు  - ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్

On
మంజూరైన నవోదయ విద్యాలయాన్ని తరలించొద్దు  - ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్

మంజూరైన నవోదయ విద్యాలయాన్ని తరలించొద్దు 
- ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ 

(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి ఫిబ్రవరి 10:

 తాము కష్టపడి తెచ్చుకున్న కేంద్ర ప్రభుత్వ నవోదయ విద్యాలయాన్ని, అడ్డుకుని, తరలించి, తమ ప్రాంత విద్యార్థులకు అన్యాయం చేసే ప్రయత్నాలు మానుకోవాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ధర్మపురిలో తమ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయం ఆధారంగా జిల్లాలకు నవోదయ విద్యాలయాలను మంజూరు చేసే కార్యక్రమంలో భాగంగా...రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిపాదనలు కోరిన సందర్భంలో అప్పుడే నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ ద్వారా 24.7.2024 నాడు తమ విజ్ఞప్తి ప్రకారం జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలంలో 252 సర్వే నెంబర్ లో 30 ఎకరాల భూమి ఉంది నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. 22.8.24 నాడు రాష్ట్ర సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించడం జరిగిందన్నారు. 
కేంద్ర ప్రభుత్వం 18 నవోదయ స్కూల్ని మంజూరు చేయగా, ధర్మపురి మండల లోని నేరేళ్ల గ్రామంలో విద్యాలయ ఏర్పాటుకు మంజూరు ఇవ్వడం జరిగిందన్నారు.
కొత్త భవనం నిర్మాణం చేసేంత వరకు ధర్మపురిలోని ఎస్టీ హాస్టల్లో ను వాడుకోవాలని నిర్ణయించి, నవోదయ విద్యాలయ అధికారులు కూడా వచ్చి చూడటం జరిగిందని,త్వరలో తరగతులు ప్రారంభం చేయడం జరుగుతుందని వివరించారు. నవోదయ విద్యాలయాన్ని ధర్మపురి నియోజకవర్గానికి మంజూరు చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, పీఎం మోడీకి, సిఎం రేవంత్ రెడ్డికి, ఎంపీ అరవింద్ కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఇదిలా ఉండగా...
గత 10 రోజుల క్రితం ఎంపి అరవింద్  నవోదయ విద్యలయాన్ని, నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధి లోకి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేక రాశారన్నారు 
జిల్లాకు కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని,  మన ధర్మపురికి నవోదయ విద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని వివరించారు.
కేంద్ర ప్రభుత్వం మంజూరు ఇచ్చిన తర్వాత  దాన్ని తరలించాలని చూడటం ఎంత వరకు సమంజసం అని ఎంపీ అరవింద్ ను ప్రశ్నించారు.
తనకు భేషజాలు లేవని, దీనిపైన ప్రధాన మంత్రికి వినతి పత్రం సమర్పించి, సమయం దొరికితే తప్పకుండా వారిని కలుస్తానన్నారు. వెంటనే డిల్లీ వెళ్లి నేరుగా అరవింద్ ను, అదే విధంగా సంబంధిత నవోదయ శాఖ అధికారిని కలిసి వినతి పత్రాన్ని అంద చేస్తా మన్నారు.
 సానుకూలమైన స్పందన లేకపోతే వచ్చిన తర్వాత కార్యచరణ ప్రకటిస్తామాన్నారు. .నవోదయ విషయంలో ఎక్కడ వెనుకను తగ్గే ప్రసక్తే లేదని, అఖిల పక్ష నేతల సహకారం కోరతామన్నారు. 
పీసీసీ సభ్యులు సంగన భట్ల దినేష్, నాయకులు కుంట సుధాకర్, వేముల రాజేశ్, జక్కు రవీందర్, చిలుముల లక్ష్మణ్, చీపిరిశెట్టి రాజేశ్, సింహరాజు ప్రసాద్, రఫీయుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
Tags
Join WhatsApp

More News...

State News 

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన

 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన  మిర్యాలగూడ, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ‘ప్రజాపాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో నీలగిరి జిల్లా మహిళా సమాఖ్యకు రూ.1138 కోట్ల...
Read More...
Local News  Spiritual  

జగిత్యాలలో 20 అడుగుల శ్రీవేంకటేశ్వర స్వామి 3డి సైకత శిల్ప ప్రదర్శన

జగిత్యాలలో 20 అడుగుల శ్రీవేంకటేశ్వర స్వామి 3డి సైకత శిల్ప ప్రదర్శన జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): శ్రీ వెంకటేశ్వర స్వామి సమితి ఆధ్వర్యంలో తెలంగాణలో తొలిసారిగా జగిత్యాల కరీంనగర్ రోడ్ సర్కస్ గ్రౌండ్లో 20 అడుగుల కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి 3డి సైకత శిల్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను శ్రీమాన్ నంబి వేణుగోపాల చార్య ప్రారంభించారు. ఈ 3డి సైకత శిల్ప...
Read More...
Local News 

మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చాం : జిల్లా BRS అధ్యక్షులు

మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చాం : జిల్లా BRS అధ్యక్షులు జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలోని జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలలో బీఆర్‌ఎస్ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసి బి-ఫారాలు అందజేశామని తెలిపారు. జనరల్ స్థానాల్లోనూ బీసీ...
Read More...
State News 

తెలంగాణ అధ్యయన కమిటీల సభ్యులతో కవిత

తెలంగాణ అధ్యయన కమిటీల సభ్యులతో కవిత హైదరాబాద్, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీలతో నేటి నుంచి వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి, సబ్బండ వర్గాల వికాసం, సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా 50 అధ్యయన కమిటీలను తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసింది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బ్లూ ప్రింట్ రూపొందించే...
Read More...
State News 

“విద్యార్థులే.. స్వీపర్లు!” అనే వార్తా కథనంపై హక్కుల కమీషన్ కేసు

“విద్యార్థులే.. స్వీపర్లు!” అనే వార్తా కథనంపై హక్కుల కమీషన్ కేసు హైదరాబాద్, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సభ్యులు (న్యాయ విభాగం) సివడి ప్రవీణ గారు, నమస్తే తెలంగాణ దినపత్రికలో 04.02.2026న ప్రచురితమైన “విద్యార్థులే.. స్వీపర్లు!” అనే వార్తా కథనాన్ని ఆధారంగా తీసుకొని స్వయంచాలక (సూవో-మోటు) విచారణ చేపట్టారు. హైదరాబాద్‌లోని అనేక ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో స్వీపర్లు అందుబాటులో లేకపోవడంతో, 1వ...
Read More...

జగిత్యాల మున్సిపాలిటీ పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు

జగిత్యాల మున్సిపాలిటీ పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు జగిత్యాల ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): బిఆర్ఎస్ - బీజేపీ | కాంగ్రెస్ మూడు ప్రధాన పార్టీల నుండి పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు, వార్డుల వారిగా.. వార్డు రిజర్వేషన్ BRS BJP కాంగ్రెస్ 1 BC(G) నిమిషకవి వంశీకృష్ణ పుప్పాల రాజేష్ అనిల్ కుమార్ కూసరి  2 UR(W) వొడ్డినేని సంధ్య కుమారి కాశెట్టి...
Read More...

ఐల్నేని ఆసుపత్రి వారి సౌజన్యముతో క్యాన్సర్ పై అవగాహన సదస్సు 

ఐల్నేని ఆసుపత్రి వారి సౌజన్యముతో క్యాన్సర్ పై అవగాహన సదస్సు  జగిత్యాల ఫిబ్రవరి 4 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని వాల్మీకి ఆవాసం గీతావిద్యాలయం గ్రౌండ్ లో బుధవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకొని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. క్యాన్సర్ వలన అనారోగ్యము మరణాలు తగ్గించడమే అవగాహన యొక్క ముఖ్య లక్ష్యం అని వైద్యులు పేర్కొన్నారు. డా వంశీ చేతన ప్రముఖ ఆంకాలజిస్ట్, డా వినీల ,డా...
Read More...
State News 

క్యాన్సర్ మరణశాసనం కాదు –మెగాస్టార్ చిరంజీవి

క్యాన్సర్ మరణశాసనం కాదు –మెగాస్టార్ చిరంజీవి (పి కోటేశ్వర్) సికింద్రాబాద్, పిబ్రవరి 04 ( ప్రజామంటలు) :    క్యాన్సర్ అనేది దేవుడు ఇచ్చిన శాపం కాదని, ముందస్తుగా గుర్తిస్తే ఈ వ్యాధిని కూడా జయించి సాధారణ జీవితం గడపవచ్చని పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ...
Read More...
Crime  State News 

రూ.15 లక్షల లంచంతో తీసుకొంటూ పట్టుబడ్డ జీహెచ్ఎంసీ ఎస్‌ఈ

రూ.15 లక్షల లంచంతో తీసుకొంటూ పట్టుబడ్డ జీహెచ్ఎంసీ ఎస్‌ఈ హైదరాబాద్, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): హైదరాబాద్ కూకట్పల్లి జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సూపరింటెండింగ్ ఇంజనీర్ చిన్నారెడ్డి కాంట్రాక్టర్ నుంచి రూ.15 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. పెండింగ్‌లో ఉన్న బిల్లుల క్లియరెన్స్ కోసం లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి....
Read More...

కేఎల్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా: దివాళా కంపెనీకి వేల కోట్ల పనులు ఎలా? కెటిఆర్ ప్రశ్న

కేఎల్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా: దివాళా కంపెనీకి వేల కోట్ల పనులు ఎలా? కెటిఆర్ ప్రశ్న హైదరాబాద్ ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): దివాళా తీసినట్లు ప్రకటించిన కే ఎస్ ఎల్ ఆర్ ఇన్ఫ్రాటెక్ కాని 6వేల కోట్ల పనులను ఇచ్చిందని, ఇది cm రేవంత్ రెడ్డి బినామీ సంస్థ అని, బిఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు కేటీఆర్ పత్రిక సమావేశంలో ఆరోపించారు. ఈ ప్రశ్న నేను కాదు, సుప్రీంకోర్టు గత జనవరి 23...
Read More...
Local News  State News 

జగిత్యాల రాజకీయాల్లో మాటల యుద్ధం:జీవన్ Vs సంజయ్

జగిత్యాల రాజకీయాల్లో మాటల యుద్ధం:జీవన్ Vs సంజయ్ జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): జగిత్యాల రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌పై బీఆర్‌ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌ను అసెంబ్లీ స్పీకర్ కొట్టివేయడంతో, ఆయన “అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా” అని స్పష్టం చేశారు. తాను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని, పార్టీ మారలేదని అఫిడవిట్, పార్టీ ఫండ్ చెల్లింపుల...
Read More...

స్పీకర్ క్లిన్ చిట్: జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ బీఆర్‌ఎస్‌లోనే

స్పీకర్ క్లిన్ చిట్: జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ బీఆర్‌ఎస్‌లోనే జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌పై బీఆర్‌ఎస్ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌ను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. ఎమ్మెల్యే పార్టీ మారినట్లు నిరూపించే ఆధారాలు లేవని స్పష్టంగా పేర్కొన్నారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌తో సమన్వయం – డా. సంజయ్ స్పష్టం ఈ తీర్పుపై...
Read More...