మంజూరైన నవోదయ విద్యాలయాన్ని తరలించొద్దు  - ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్

On
మంజూరైన నవోదయ విద్యాలయాన్ని తరలించొద్దు  - ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్

మంజూరైన నవోదయ విద్యాలయాన్ని తరలించొద్దు 
- ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ 

(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి ఫిబ్రవరి 10:

 తాము కష్టపడి తెచ్చుకున్న కేంద్ర ప్రభుత్వ నవోదయ విద్యాలయాన్ని, అడ్డుకుని, తరలించి, తమ ప్రాంత విద్యార్థులకు అన్యాయం చేసే ప్రయత్నాలు మానుకోవాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ధర్మపురిలో తమ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయం ఆధారంగా జిల్లాలకు నవోదయ విద్యాలయాలను మంజూరు చేసే కార్యక్రమంలో భాగంగా...రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిపాదనలు కోరిన సందర్భంలో అప్పుడే నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ ద్వారా 24.7.2024 నాడు తమ విజ్ఞప్తి ప్రకారం జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలంలో 252 సర్వే నెంబర్ లో 30 ఎకరాల భూమి ఉంది నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. 22.8.24 నాడు రాష్ట్ర సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించడం జరిగిందన్నారు. 
కేంద్ర ప్రభుత్వం 18 నవోదయ స్కూల్ని మంజూరు చేయగా, ధర్మపురి మండల లోని నేరేళ్ల గ్రామంలో విద్యాలయ ఏర్పాటుకు మంజూరు ఇవ్వడం జరిగిందన్నారు.
కొత్త భవనం నిర్మాణం చేసేంత వరకు ధర్మపురిలోని ఎస్టీ హాస్టల్లో ను వాడుకోవాలని నిర్ణయించి, నవోదయ విద్యాలయ అధికారులు కూడా వచ్చి చూడటం జరిగిందని,త్వరలో తరగతులు ప్రారంభం చేయడం జరుగుతుందని వివరించారు. నవోదయ విద్యాలయాన్ని ధర్మపురి నియోజకవర్గానికి మంజూరు చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, పీఎం మోడీకి, సిఎం రేవంత్ రెడ్డికి, ఎంపీ అరవింద్ కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఇదిలా ఉండగా...
గత 10 రోజుల క్రితం ఎంపి అరవింద్  నవోదయ విద్యలయాన్ని, నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధి లోకి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేక రాశారన్నారు 
జిల్లాకు కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని,  మన ధర్మపురికి నవోదయ విద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని వివరించారు.
కేంద్ర ప్రభుత్వం మంజూరు ఇచ్చిన తర్వాత  దాన్ని తరలించాలని చూడటం ఎంత వరకు సమంజసం అని ఎంపీ అరవింద్ ను ప్రశ్నించారు.
తనకు భేషజాలు లేవని, దీనిపైన ప్రధాన మంత్రికి వినతి పత్రం సమర్పించి, సమయం దొరికితే తప్పకుండా వారిని కలుస్తానన్నారు. వెంటనే డిల్లీ వెళ్లి నేరుగా అరవింద్ ను, అదే విధంగా సంబంధిత నవోదయ శాఖ అధికారిని కలిసి వినతి పత్రాన్ని అంద చేస్తా మన్నారు.
 సానుకూలమైన స్పందన లేకపోతే వచ్చిన తర్వాత కార్యచరణ ప్రకటిస్తామాన్నారు. .నవోదయ విషయంలో ఎక్కడ వెనుకను తగ్గే ప్రసక్తే లేదని, అఖిల పక్ష నేతల సహకారం కోరతామన్నారు. 
పీసీసీ సభ్యులు సంగన భట్ల దినేష్, నాయకులు కుంట సుధాకర్, వేముల రాజేశ్, జక్కు రవీందర్, చిలుముల లక్ష్మణ్, చీపిరిశెట్టి రాజేశ్, సింహరాజు ప్రసాద్, రఫీయుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
Tags
Join WhatsApp

More News...

ఐ–బొమ్మ పైరసీ వెబ్‌సైట్ లో సంచలన ప్రకటన

ఐ–బొమ్మ  పైరసీ వెబ్‌సైట్ లో సంచలన ప్రకటన హైదరాబాద్, నవంబర్ 17 (ప్రజా మంటలు): ఇన్నాళ్లు పోలీసులను చాలెంజ్ చేసిన ibomma సంచలన ప్రకటనను తన వెబ్సైట్ లో పోస్ట్ చేసింది. ఐ–బొమ్మ తన ప్రకటనలో, “ఈ మధ్యలో మీరు మా గురించి విన్నే ఉంటారు… మొదటి నుంచీ మా విశ్వసనీయ అభిమానులుగా ఉన్నారు… కానీ ఇప్పుడు మా సేవలను నిలిపివేస్తున్నాం. దేశవ్యాప్తంగా మా...
Read More...
Local News  State News 

ఖమ్మం జాగృతి జనంబాటలో సమస్యలపై కవిత విమర్శలు, పరిశీలనలు

ఖమ్మం జాగృతి జనంబాటలో సమస్యలపై కవిత విమర్శలు, పరిశీలనలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జాగృతి జనంబాటలో భాగంగా కవిత పర్యటన. మోడల్ స్కూల్ సమస్యలు, సీతారామ ఎత్తిపోతల పథకం ఆలస్యం, సింగరేణి కార్మికుల ఇబ్బందులు, వైరా మార్కెట్ సమస్యలు, ప్రజా సమస్యలపై కీలక వ్యాఖ్యలు. సమగ్ర కథనం
Read More...
Local News 

15 దుకాణాలకు ఓపెన్ వేలం వేసి కేటాయించండి. - ప్రజావాణికి వినతి పత్రం సమర్పణ

15 దుకాణాలకు ఓపెన్ వేలం వేసి కేటాయించండి. - ప్రజావాణికి వినతి పత్రం సమర్పణ సికింద్రాబాద్, నవంబర్ 17 (ప్రజామంటలు) : బన్సీలాల్ పేట డివిజన్ లోని న్యూ బోయిగూడ, ఐడీహెచ్ కాలనీల పరిధిలోని 15 జీహెచ్ఎమ్ సీ షాపింగ్ కాంప్లెక్స్ లల్లోని మొత్తం 15 దుకాణాలకు కొత్తం ఓపెన్ వేలం వేసి, అర్హులకు కేటాయించాలని సికింద్రాబాద్‌ జీహెచ్‌ఎంసీ నార్త్‌ జోన్‌ అధికారులకు కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు ఐత చిరంజీవి సోమవారం...
Read More...
National  State News 

దార్జిలింగ్ గోర్ఖా సమస్యపై మమతా బెనర్జీ లేఖ – ఇంటర్‌లాక్యూటర్ నియామకం రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి

దార్జిలింగ్ గోర్ఖా సమస్యపై మమతా బెనర్జీ లేఖ – ఇంటర్‌లాక్యూటర్ నియామకం రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి హైదరాబాద్, నవంబర్ 17 (ప్రజా మంటలు):పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. దార్జిలింగ్ కొండ ప్రాంతంలోని గోర్ఖా సమస్యలపై చర్చలు నిర్వహించేందుకు కేంద్రం నియమించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నియామకాన్ని రద్దు చేయాలంటూ ఆమె పునరుద్ఘాటించారు. గోర్ఖాల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించాలనే...
Read More...
Local News 

తల్లిదండ్రులను  వేదిస్తున్న కొడుకులు -ఎస్పీ, ఆర్డీవో లకు ఫిర్యాదులు.  

తల్లిదండ్రులను  వేదిస్తున్న కొడుకులు -ఎస్పీ, ఆర్డీవో లకు ఫిర్యాదులు.   జగిత్యాల నవంబర్ 17 (ప్రజా మంటలు): కడుపున పుట్టిన పిల్లలే వృద్దాప్యంలో ఉన్న తల్లి దండ్రులను వేధింపులకు గురిచేస్తూ, చంపుత మని     బెదిరిస్తూ, చివరకు ఇంట్లోంచి గెంటి వేస్తున్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామానికి చెందిన గుగ్గిళ్ల నర్సవ్వ( 80)    అనే వృద్దురాలిని ఆమె నడిపి  కొడుకు, కోడలు తన స్వంత ఇంటి లోనుంచి...
Read More...
National  Sports  State News 

డెఫ్లింపిక్స్‌లో స్వర్ణం సాధించిన ధనుష్ శ్రీకాంత్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

డెఫ్లింపిక్స్‌లో స్వర్ణం సాధించిన ధనుష్ శ్రీకాంత్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు జపాన్ డెఫ్లింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకం, ప్రపంచ రికార్డు సాధించిన హైదరాబాద్ షూటర్ ధనుష్ శ్రీకాంత్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు. యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన ధనుష్‌కు ప్రభుత్వ అండ.
Read More...

సౌదీ అరేబియా బస్సు ప్రమాదం: 45 మంది రాష్ట్రవాసులు: ,: తెలంగాణ కేబినెట్ 5 లక్షల పరిహారం

సౌదీ అరేబియా బస్సు ప్రమాదం: 45 మంది రాష్ట్రవాసులు: ,: తెలంగాణ కేబినెట్ 5 లక్షల పరిహారం హైదరాబాద్, నవంబర్ 17 (ప్రజా మంటలు):సౌదీ అరేబియాలో మక్కా నుంచి మదీనాకు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణకు చెందిన యాత్రికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ సానుభూతి ప్రకటించింది. ఈ దుర్ఘటనపై జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేసి, బాధిత కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల...
Read More...

డిసెంబర్ మొదటివారంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్

డిసెంబర్ మొదటివారంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ హైదరాబాద్, నవంబర్ 17 (ప్రజా మంటలు): తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు వేగం పెరిగింది. ఈరోజు సమావేశమైన రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలను తీసుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలను ముందుగానే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా రిజర్వేషన్లపై హైకోర్టు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని, 50 శాతం మించకుండా రిజర్వేషన్లు అమలు...
Read More...
Local News  Crime  State News 

రాజేశ్ ను పోలీసులు చిత్రహింసలు  చేసి, చంపారు.?

రాజేశ్ ను పోలీసులు చిత్రహింసలు  చేసి, చంపారు.? విచారణ చేయకుండానే రిమాండ్ చేశారని ఆరోపణ   గాంధీ ఆసుపత్రి వద్ద ఫ్యామిలీమెంబర్స్, ధర్మ స్టూడెంట్స్ నేతల ఆందోళన
Read More...
Local News 

టూరిజం మేనేజ్‌మెంట్‌లో డా. దినేష్ కుమార్ గట్టుకు పిహెచ్.డి

టూరిజం మేనేజ్‌మెంట్‌లో డా. దినేష్ కుమార్ గట్టుకు పిహెచ్.డి హైదరాబాద్‌, నవంబర్‌ 17 (ప్రజా మంటలు): చైతన్య (డీమ్డ్ టు బి యూనివర్సిటీ) డా. దినేష్ కుమార్ గట్టుకు టూరిజం మేనేజ్‌మెంట్‌లో పిహెచ్.డి డాక్టోరల్ డిగ్రీని ప్రకటించింది. ఆయన పరిశోధన ‘తెలంగాణలోని అమ్యూజ్‌మెంట్ పార్కులపై పర్యాటకుల అవగాహన, వైఖరి మరియు సంతృప్తి’పై ఆధారితం. ఈ పరిశోధన ప్రొఫెసర్ జి. విజయ్ పర్యవేక్షణలో పూర్తయింది. యూనివర్సిటీ అధికారులు...
Read More...

రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల చొరవ- రహదారి పక్కన దట్టంగా పెరిగిన పొదల తొలగింపు

రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల చొరవ- రహదారి పక్కన దట్టంగా పెరిగిన పొదల తొలగింపు మేడిపల్లి నవంబర్ 17 ( ప్రజా మంటలు)జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణనే ప్రధాన లక్ష్యంగా జిల్లా ఎస్పి  అశోక్ కుమార్, ఆదేశాల మేరకు మేడిపల్లి ఎస్‌ఐ శ్రీధర్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. రంగా పూర్ – భీమరం రహదారిపై ఫ్లడ్ కాలువ సమీపంలోని మూలమలుపు(కర్వ్ పాయింట్‌)లో దట్టంగా పెరిగిన పొదలు, మొక్కలు కారణంగా...
Read More...

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి  వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల నవంబర్ 17 (ప్రజా మంటలు)ప్రజావాణి ఫిర్యాదుల సంఖ్య : 24                                    ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  అదనపు కలెక్టర్ లు మరియు ఆర్డీఓల...
Read More...