మంజూరైన నవోదయ విద్యాలయాన్ని తరలించొద్దు  - ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్

On
మంజూరైన నవోదయ విద్యాలయాన్ని తరలించొద్దు  - ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్

మంజూరైన నవోదయ విద్యాలయాన్ని తరలించొద్దు 
- ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ 

(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి ఫిబ్రవరి 10:

 తాము కష్టపడి తెచ్చుకున్న కేంద్ర ప్రభుత్వ నవోదయ విద్యాలయాన్ని, అడ్డుకుని, తరలించి, తమ ప్రాంత విద్యార్థులకు అన్యాయం చేసే ప్రయత్నాలు మానుకోవాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ధర్మపురిలో తమ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయం ఆధారంగా జిల్లాలకు నవోదయ విద్యాలయాలను మంజూరు చేసే కార్యక్రమంలో భాగంగా...రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిపాదనలు కోరిన సందర్భంలో అప్పుడే నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ ద్వారా 24.7.2024 నాడు తమ విజ్ఞప్తి ప్రకారం జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలంలో 252 సర్వే నెంబర్ లో 30 ఎకరాల భూమి ఉంది నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. 22.8.24 నాడు రాష్ట్ర సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించడం జరిగిందన్నారు. 
కేంద్ర ప్రభుత్వం 18 నవోదయ స్కూల్ని మంజూరు చేయగా, ధర్మపురి మండల లోని నేరేళ్ల గ్రామంలో విద్యాలయ ఏర్పాటుకు మంజూరు ఇవ్వడం జరిగిందన్నారు.
కొత్త భవనం నిర్మాణం చేసేంత వరకు ధర్మపురిలోని ఎస్టీ హాస్టల్లో ను వాడుకోవాలని నిర్ణయించి, నవోదయ విద్యాలయ అధికారులు కూడా వచ్చి చూడటం జరిగిందని,త్వరలో తరగతులు ప్రారంభం చేయడం జరుగుతుందని వివరించారు. నవోదయ విద్యాలయాన్ని ధర్మపురి నియోజకవర్గానికి మంజూరు చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, పీఎం మోడీకి, సిఎం రేవంత్ రెడ్డికి, ఎంపీ అరవింద్ కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఇదిలా ఉండగా...
గత 10 రోజుల క్రితం ఎంపి అరవింద్  నవోదయ విద్యలయాన్ని, నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధి లోకి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేక రాశారన్నారు 
జిల్లాకు కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని,  మన ధర్మపురికి నవోదయ విద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని వివరించారు.
కేంద్ర ప్రభుత్వం మంజూరు ఇచ్చిన తర్వాత  దాన్ని తరలించాలని చూడటం ఎంత వరకు సమంజసం అని ఎంపీ అరవింద్ ను ప్రశ్నించారు.
తనకు భేషజాలు లేవని, దీనిపైన ప్రధాన మంత్రికి వినతి పత్రం సమర్పించి, సమయం దొరికితే తప్పకుండా వారిని కలుస్తానన్నారు. వెంటనే డిల్లీ వెళ్లి నేరుగా అరవింద్ ను, అదే విధంగా సంబంధిత నవోదయ శాఖ అధికారిని కలిసి వినతి పత్రాన్ని అంద చేస్తా మన్నారు.
 సానుకూలమైన స్పందన లేకపోతే వచ్చిన తర్వాత కార్యచరణ ప్రకటిస్తామాన్నారు. .నవోదయ విషయంలో ఎక్కడ వెనుకను తగ్గే ప్రసక్తే లేదని, అఖిల పక్ష నేతల సహకారం కోరతామన్నారు. 
పీసీసీ సభ్యులు సంగన భట్ల దినేష్, నాయకులు కుంట సుధాకర్, వేముల రాజేశ్, జక్కు రవీందర్, చిలుముల లక్ష్మణ్, చీపిరిశెట్టి రాజేశ్, సింహరాజు ప్రసాద్, రఫీయుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
Tags
Join WhatsApp

More News...

Local News 

అధికారిక–వృత్తి సంఘం (GOPA) స్వర్ణోత్సవ వేడుకలు

అధికారిక–వృత్తి సంఘం (GOPA) స్వర్ణోత్సవ వేడుకలు హైదరాబాద్, డిసెంబర్ 26 (ప్రజా మంటలు): గౌడ్ అధికారిక మరియు వృత్తి సంఘం (GOPA) 50వ వార్షికోత్సవ వేడుకలు కాచిగూడ, హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ స్వర్ణోత్సవ కార్యక్రమానికి ప్రముఖులు హాజరై సంఘానికి అభినందనలు తెలిపారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి జి. రాజేశం గౌడ్, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నెర్రెల్ల...
Read More...
Local News 

జగిత్యాల జిల్లా: కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఆటో బోల్తా – నలుగురికి గాయాలు

జగిత్యాల జిల్లా: కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఆటో బోల్తా – నలుగురికి గాయాలు జగిత్యాల (రూరల్) డిసెంబర్ 26 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డుపై శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. గోదావరిఖని నుంచి అంజన్న స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న భక్తుల ఆటో అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న సైడ్‌వాల్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు భక్తులు గాయపడ్డారు. ప్రమాద...
Read More...
Today's Cartoon 

Today's Cartoon

Today's Cartoon
Read More...
Local News 

ధర్మపురి అభివృద్ధే లక్ష్యం, మూడుేళ్లలో హామీలు నెరవేర్చకపోతే రాజీనామా చేస్తా -  కరీంనగర్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ధర్మపురి అభివృద్ధే లక్ష్యం, మూడుేళ్లలో హామీలు నెరవేర్చకపోతే రాజీనామా చేస్తా -  కరీంనగర్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కరీంనగర్ డిసెంబర్ 26, (ప్రజా మంటలు): కరీంనగర్ ఆర్ అండ్ బి అతిథిగృహంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన నియోజకవర్గం పూర్తిగా రైతులపై ఆధారపడిన...
Read More...

తక్కలపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులను సత్కరించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి

తక్కలపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులను సత్కరించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి    జగిత్యాల డిసెంబర్ 26(ప్రజా మంటలు)రూరల్ మండల్ తక్కళ్లపెళ్లి గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ కచ్చు ముని రాజు , వార్డ్ సభ్యులు నరపాక రాజేష్ ,నాయకులు వడ్లూరి హరీష్, విజయం సాధించిన సందర్భంగా శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణిప్రవీణ్ ని స్వగృహంలో మర్యాదపూర్వక కలువగా వారిని శాలువతో...
Read More...

విద్యావేత్త, పారిశ్రామికవేత్త,సామాజికవేత్త కాసుగంటి సుధాకర్ రావు(80) మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ 

విద్యావేత్త, పారిశ్రామికవేత్త,సామాజికవేత్త కాసుగంటి సుధాకర్ రావు(80) మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్        జగిత్యాల డిసెంబర్ 26 (ప్రజా మంటలు) భారతీయ నాగరిక విద్యా సమితి అధ్యక్షులు కాసుగంటి సుధాకర్ రావు(80) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ, గురువారం రాత్రి హైదరాబాదులోని ఆయన  మృతి చెందారు. విద్యావేత్తగా, సామాజిక వేత్తగానే కాకుండా, పారిశ్రామికవేత్తగా జగిత్యాల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పేరొందారు. జిల్లా కేంద్రంలో శ్రీ సరస్వతి శిశు...
Read More...

విద్యా–సామాజిక రంగానికి తీరని లోటు: కాసుగంటి సుధాకర్ రావు మృతిపై పలువురి సంతాపం

విద్యా–సామాజిక రంగానికి తీరని లోటు: కాసుగంటి సుధాకర్ రావు మృతిపై పలువురి సంతాపం జగిత్యాల డిసెంబర్ 26 (ప్రజా మంటలు): విద్యా, పారిశ్రామిక, సామాజిక రంగాలకు విశేష సేవలందించిన ప్రముఖ విద్యావేత్త కాసుగంటి సుధాకర్ రావు మృతి జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన అకాల మరణం పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విద్యావేత్తగా, సామాజిక సేవకుడిగా, పారిశ్రామికవేత్తగా విశేష...
Read More...
National  State News 

ఈరోజు ఉదయం గుజరాత్‌లో భూకంపం

 ఈరోజు ఉదయం గుజరాత్‌లో భూకంపం అహ్మదాబాద్ డిసెంబర్ 26: గుజరాత్ రాష్ట్రంలో శుక్రవారం ఉదయం సుమారు 6:10 గంటల సమయంలో భూకంపం సంభవించింది. కచ్ జిల్లాకు సమీప ప్రాంతమే భూకంప కేంద్రంగా గుర్తించారు. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత సుమారు 3.8 నుంచి 4.2గా నమోదైంది. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ భూకంపం...
Read More...
Local News  State News 

విద్యా–పారిశ్రామిక రంగాలకు వెలుగు నింపిన మహనీయుడు కాసుగంటి సుధాకర్‌రావు అస్తమయం

విద్యా–పారిశ్రామిక రంగాలకు వెలుగు నింపిన మహనీయుడు కాసుగంటి సుధాకర్‌రావు అస్తమయం జగిత్యాల, డిసెంబర్ 26 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లాకు గర్వకారణంగా నిలిచిన ప్రముఖ విద్యావేత్త, పారిశ్రామిక వేత్త, సామాజిక సేవా ధురీణుడు కాసుగంటి సుధాకర్‌రావు(80)  అకాల మరణం జిల్లావ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. తన జీవితమంతా సమాజ హితానికే అంకితం చేసిన ఈ మహనీయుడు గురువారం (డిసెంబర్ 25) రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన మాజీ...
Read More...
Local News  Crime  State News 

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు నంద్యాల డిసెంబర్ 26: ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల–బత్తలూరు మధ్య శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి...
Read More...

ధర్మపురి అక్కపెల్లి రాజారాజేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ..

ధర్మపురి అక్కపెల్లి రాజారాజేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ.. . ధర్మపురి డిసెంబర్ 25(ప్రజా మంటలు) శివారులోని కమలాపూర్ రోడ్డుకు గల అక్కపెల్లి రాజారాజేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం అర్థరాత్రి సమయంలో దొంగతనం జరిగింది. దేవస్థానంలో స్వామివారికి అలంకరించిన 2 కిలోల వెండి పాన పట్ట (లింగం చుట్టూ బిగించబడినది) మరియు అమ్మవారికి అలంకరించిన 8 గ్రాముల వెండి ముఖ కవచము కలిపి మొత్తం 2...
Read More...

దేశ సేవకు జీవితాన్ని అంకితం చేసిన జాతీయవాది వాజపేయి -బిజెపి పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

దేశ సేవకు జీవితాన్ని అంకితం చేసిన జాతీయవాది వాజపేయి  -బిజెపి పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్    జగిత్యాల డిసెంబర్ 25 (ప్రజా మంటలు) భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి శతజయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేసిన బిజెపి పట్టణ శాఖ నాయకులు ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ సుపరిపాలనకు స్ఫూర్తి అటల్ బిహారీ వాజపేయి..భారత దేశంలో నీతికి నిజాయితీకి నైతిక...
Read More...