బిసి కుల గణన అసెంబ్లీ చర్చలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా - అడ్లూరి
బిసి కుల గణన అసెంబ్లీ చర్చలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా
- ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి ఫిబ్రవరి 08: ఎస్సి వర్గీకరణ, బిసి కుల గణన అసెంబ్లీ చర్చలో తాను ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నానని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి నియోజక వర్గ కేంద్రంలో శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలుపుతూ మండల కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో నిర్వహించిన పాలాభిషేక కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
అనంతరం మీడియా ప్రతినిధులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఎస్సీ ల ముపై ఏళ్ల ఆకాంక్ష వర్గీకరణ అసెంబ్లిలో ఆమోదించిన ప్రకటించిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం దళిత వర్గానికి చెందిన వాడిగా చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయలేదని, తన నాయకుడు కోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే అసెంబ్లీలో ఆమోదించారన్నారు.ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఉండాలని కమిటీని నియమించి కమిటీ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని సేకరించి కులగణన చేయడం జరిగిందన్నారు
మాజీ జస్టిస్ ఏకసభ్య సభ్య కమిటీ చైర్మన్ గా షబీబ్ ముక్తాల్ ను నియమించి వారి నివేదిక ద్వారా అసెంబ్లీలో చర్చించడం జరిగిందని గుర్తు చేశారు.
ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కానీ బీసీ కుల గలన చేయలేదని, అది తమ ప్రభుత్వమే చేసిందని, ఎస్సీ వర్గీకరణ బిసి కుల గణన అసెంబ్లీ చర్చలో తాను ఉండడం తన అదృష్టంగా భావిస్తున్న ఈ సందర్భంగా ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటా అన్నారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం మందకృష్ణ మాదిగ ఉద్యమాన్ని అణిచివేసిందని, అంతేకాకుండా మందకృష్ణ మాదిగను జైలు కూడా పంపించిన సందర్భం ఉందన్నారు. నియోజక వర్గ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
.
More News...
<%- node_title %>
<%- node_title %>
పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం

శ్రీ అభయాంజనేయ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట - పాల్గొన్న -మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్

జస్టిస్ ఫర్ బీసీస్" బంద్ — నిజంగా న్యాయమా, లేక కొత్త రాజకీయ యజ్ఞమా?
.jpg)
బీసీ బంద్ ను విజయవంతం చేద్దాం.-టీ భీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హరి అశోక్ కుమార్.

బీసీల బందుకు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు

హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో వైద్య విద్యార్థి శ్రీకాంత్ అనుమానస్పద మృతి

కరీఫ్ వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రణాళికలు సిద్ధం చేయాలి _రైస్ మిల్లర్ల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

పెండింగ్ ఓటర్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

హర్యానా కేడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ కు నివాళులు అర్పించిన మాజీ కౌన్సిలర్ భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసిఎస్ రాజు "

పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం_ఏఐసిసి పరిశీలకుడు డాక్టర్ నరేష్ కుమార్, టిపిసిసి ఆర్గనైజర్ అబ్జర్వర్ జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి

వాల్మీకి ఆవాసంలో జిల్లాస్థాయి గోవిజ్ఞాన పరీక్షలు

పెన్షనర్ల బకాయిలు చెల్లింపునకు రాజీలేని పోరాటం.-టీ పెన్షనర్ల రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్
