ధర్మపురిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

On
ధర్మపురిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

ధర్మపురిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

 (రామ కిష్టయ్య సంగన భట్ల 9440595494)

 ప్రాచీన పుణ్య క్షేత్రమైన ధర్మపురి లోని శ్రీక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో, శుక్ర వారం వైకుంఠ (ముక్కోటి ఏకాదశి) వేడుకలు కన్నుల పండువగా, పైభవోపేతంగా జరిగాయి. ఉదయాత్ పూర్వం వేద మంత్రోచ్ఛారణల మధ్య, అర్చకులు పవిత్ర జలాలను కొనితెచ్చి లక్ష్మీ సమేత శ్రీ యోగానంద,శ్రీ ఉగ్ర నారసింహ, శ్రీ వేంకటేశ్వర స్వాముల మూల విరాట్టులను సాంప్రదాయ విధి విధాన రీతిలో, మహాక్షీరా భిషేకాది ప్రత్యేక పర్వదిన పూజలు నిర్వహించారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకృతులైన స్థానిక ఇలవేల్పులను దేవస్థాన ప్రాంగణంలో విద్యుద్దీపికలలో, వివిధ పుష్ప మాలికలతో, శోభాయమానంగా తీర్చి దిద్దిన రంగవల్లులతో, ఆకర్షణీయంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై అసీసుల గావించారు.

ధనుర్మాస ప్రత్యేకతలో సప్త హారతులు, షోడశోపచార పూజలు, వేద, శాస్త్ర పురాణ, సంగీత, నృత్య, వాద్యాది అవధారయాలతో ఆర్చనలు, భక్తుల గోత్ర నామాదులతో పూజలు నిర్వహించగా, భక్తజనులు భక్తి శ్రద్ధలతో కన్నులారా గాంచి తరిం చారు. అనంతరం జయ జయ ధ్వనాల మధ్య ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ సమక్షంలో, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసా చార్య వైకుంఠ (ఉత్తర) ద్వారానికి పూజ చేసి, నారికేళములను సమర్పించి, వైకుంఠ ద్వారం తెరవగా,  ద్వారం ద్వారా  ప్రవేశించిన భక్తులు పరమానంద భరితులై తనివి తీరా దర్శనం చేసుకున్నారు. 

 దేవస్థానం ఈ ఓ శ్రీనివాస్ పర్య వేక్షణలో, దేవస్థాన అర్చకుల బృందం ఆధ్వర్యంలో, సిబ్బంది సహకారంతో, బొజ్జా సంపత్ కుమార్, రాజ గోపాల్, పాలేపు ప్రవీణ్ శర్మ ,  క్షేత్ర పండితుల మార్గదర్శకత్వంలో ఘనంగా కార్య క్రమాలను నిర్వహించారు. 

రాష్ట్ర ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఆర్డీఓ మధుసూదన్, డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ సత్తమ్మ, వైస్ చైర్మన్ రామయ్య, మార్కెట్ చైర్ పర్సన్ లావణ్య, వైస్ చైర్మన్ నర్సింలు 
తదితరులు ప్రత్యేక పూజాదులలో పాల్గొన్నారు. అలాగే బచ్చు రాము గుప్తా సహకారంతో 
నూతర సంవత్సర క్యాలండర్ ను విప్ లక్ష్మణ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఇతర ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత తదితరులు దైవ దర్శనాలు చేసుకున్నారు.

భారీ ఏర్పాట్లు 

వైకుంఠ ఏకాదశి మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక శ్రద్ధతో, శ్రమ కోర్చి ఈ ఏడు భారీ ఏర్పాట్లు గావించారు. ప్రధాన రహదారి నుండి దేవస్థానం లోపలి వరకూ క్యూలైన్లు ఏర్పరిచారు. దేవస్థాన ప్రాంగణంలో విద్యుద్దీమాలతో, రంగవల్లులతో, పెద్దఎత్తున పందిళ్ళను, ప్రత్యేక పుష్ప వేదికను ఏర్పాటు చేశారు. దేవస్థానం బయట రోడుపై వివిధ ఆకృతులలో రంగులద్దారు. స్వాములను ఆసీనుల గావించిన ప్రదేశాన శాశ్వత ఇనుప షెడ్లను అందంగా తీర్చి దిద్దారు. ధర్మపురి సిఐ రాం నర్సింహా రెడ్డి రూప కల్పన మేరకు డివిజన్ లోని పలువురు ఎస్ఐలు, ఎఎస్ఐలు/హెడ్ కానిస్టే బుల్స్, సివిల్ కానిస్టేబుల్స్, హోంగార్డులు, మహిళా హోంగార్డులు, డిస్ట్రిక్ట్ గార్డులు, ప్రైవేటు సెక్యూటిరీ గార్డులు దేవస్థానంలో కట్టుదిట్టమైన బందోబస్తుని ర్వహించారు. ఎస్.ఆర్.ఆర్. కేబుల్ నెట్ వర్క్ ద్వారా గావించిన ప్రత్యక్ష ప్రసారం స్థానికంగా వీక్షించారు. బాచంపెల్లి సంతోష్ కుమార్ 
వ్యాఖ్యానాలు ఆకట్టుకున్నాయి. 
గుండి జగదీశ్వర్, బృందం భక్తి సంగీత విభావరి అలరించింది. కోలాట బృందం నృత్యాలు, విన్యాసాలు, ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

 వైకుంఠ ద్వార దర్శనంలో జాప్యం 

వైకుంఠ ఏకాదశి సందర్భంగా, ఉత్సవాలలో ప్రధానమైన ఉత్తర ద్వార దర్శన కార్యక్రమ నిర్వహణ విషయంలో, పెరిగిన రద్దీ కారణంగా, దైవ సేవలు ద్వారం గుండా వేంచేపు చేయడంలో కాలా యాపన జరిగింది. వాస్తవానికి కారణాలేవైనా, ప్రత్యేక వేదిక వద్ద పూజలు 5గంటల తర్వాత ప్రారంభం చేశారు. IMG-20250110-WA0552
 ధనుర్మాస శుక్లపక్ష ఏకాదశి ప్రభాత సమయంలో, వైకుంఠంలో శ్రీమహావిష్ణువును దర్శించి తరించిన నేపథ్యంలో, ఇంద్రాది దేవతలు జరుపు కుంటున్న ఈ ఉత్సవ వేడుకలలో ప్రాతః కాలంలో బ్రాహ్మీముహూర్తంలో పూ జలొనర్చి, సూర్యోదయానికి ముందే వైకుంఠ (ఉత్తర) ద్వారం తెరవబడి, ఆ ద్వారం గుండా వేంచేసే స్వాముల దర్శనాలు చేసుకోవడం ప్రధానం మరియు క్షేత్రంలో అనుసరణీయమైన సాంప్రదాయం కాగా, భక్తుల రద్దీ అధికమై, దర్శనాలకై బారులు తీరిన సందర్భంలో, ఉదయాత్పూ ర్వమే ఉత్తర ద్వారం తెరిచినా, స్వాముల సేవల వేంచేపు చాలా ఆలస్యమై ఉదయం
 8.30గంటల వరకు దైవ సేవలు పట్టణంలోకి వెళ్ళడం నిర్వహించారు. స్వాముల ఉత్సవ మూర్తుల సేవలను పట్టణ వీధుల గుండా ఊరేగించి, ఇసుక స్థంభం వద్ద పూజలు నిర్వహించాక, దేవస్థానానికి తిరిగి వచ్చారు. 
ముక్కోటి వేదిక వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, వైకుంఠ ద్వారం నుండి భక్తుల దర్శనాలను కొనసాగించారు.

Tags

More News...

Local News 

ధర్మపురి క్షేత్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి  ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ 

ధర్మపురి క్షేత్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి  ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్  ధర్మపురి క్షేత్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి  ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్  ధర్మపురి జనవరి 20:   దక్షిణ కాశీగా, హరిహర క్షేత్రంగా, గోదావరి తీరాన వెలసి, మున్సిపాలిటీ, మండల, నియోజక వర్గ కేంద్రంగా, నిత్య భక్త జన సందడితో అలరారే ధర్మపురి క్షేత్రం సమగ్రాభివృద్ధికి కృషి సల్పగనని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరిలక్ష్మణ్ కుమార్...
Read More...
Local News 

కాంగ్రెస్​ నేతలు కంటి పరీక్షలు  చేయించుకోవాలి  * బీఆర్​ఎస్​ హాయంలో చేసిన పనులు కనిపించడం లేదా..?

కాంగ్రెస్​ నేతలు కంటి పరీక్షలు  చేయించుకోవాలి  * బీఆర్​ఎస్​ హాయంలో చేసిన పనులు కనిపించడం లేదా..? కాంగ్రెస్​ నేతలు కంటి పరీక్షలు  చేయించుకోవాలి  * బీఆర్​ఎస్​ హాయంలో చేసిన పనులు కనిపించడం లేదా..? సికింద్రాబాద్, జనవరి 20 (ప్రజామంటలు): బీఆర్​ఎస్​ ప్రభుత్వం చేసిన అభివృద్ది పనులు కాంగ్రెస్​ నాయకులకు కనింపించకపోతే, కంటి పరీక్షలు చేయించుకోవాలని బన్సీలాల్​ పేట డివిజన్​ బీఆర్​ఎస్​ ప్రెసిడెంట్​ ఎల్​.వెంకటేశన్​ రాజు పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...మాజీ మంత్రి,...
Read More...
Local News 

ప్రతి బ్యాంక్ ఏటీఎం వద్ద తప్పనిసరిగా  సెక్యూరిటీ గార్డు, సిసి కెమెరాలు, అలారం సిస్టం ఏర్పాటు చేయాలి

ప్రతి బ్యాంక్ ఏటీఎం వద్ద తప్పనిసరిగా  సెక్యూరిటీ గార్డు, సిసి కెమెరాలు, అలారం సిస్టం ఏర్పాటు చేయాలి ఎస్పీ అశోక్   జగిత్యాల జనవరి 20(  ప్రజా మంటలు  )జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా  వ్యాప్తంగా  ఉన్న  వివిధ బ్యాంకుల్లో పని చేస్తున్న బ్యాంకు అధికారులతో  బ్యాంకుల, ఏటీఎంల  వద్ద భద్రతా ప్రమాణాలు, సిసి కెమెరాల ఏర్పాటు, ఆర్థిక నేరాలు, గతంలో   జరిగిన బ్యాంకు మరియు ఏటీఎం సంబందించిన నేరాల గురించి, భవిష్యత్తు లో...
Read More...
Local News 

మాదిగల మహా ప్రదర్శనకు బీసీలుగా మద్దతిద్దాం బీసీ నేత దరువు అంజన్న

మాదిగల మహా ప్రదర్శనకు బీసీలుగా మద్దతిద్దాం  బీసీ నేత దరువు అంజన్న   జగిత్యాల జనవరి 20(ప్రజా మంటలు   )      ఫిబ్రవరి ఏడవ తారీఖున హైదరాబాద్ మహానగరంలో మందకృష్ణ మాదిగ జరపతల పెట్టిన లక్ష డప్పులు వేల గొంతుల మహాప్రదర్శనకు బీసీలుగా తరలిరావాలని బీసీ కవులు కళాకారులు మేధావుల ఐక్యవేదిక కన్వీనర్  దరువు అంజన్న పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం లో   ఉద్యమకారులు,కవి మోహన్ బైరాగి మాట్లాడుతూ ,...
Read More...
Local News 

పోలీస్ శాఖను మరింత ప్రజలకు చేరువ చేయడానికే గ్రీవెన్స్ డే 

పోలీస్ శాఖను మరింత ప్రజలకు చేరువ చేయడానికే గ్రీవెన్స్ డే    జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   జగిత్యాల జనవరి 20 (ప్రజా మంటలు )  ప్రజల సౌకర్యార్థం ప్రజలకు మరింత చేరువ కావడానికి  నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా   జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన  13 మంది అర్జీదారులతో నేరుగా  మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో
Read More...
Local News 

పిల్లల భద్రతే  మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ 

పిల్లల భద్రతే  మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  జగిత్యాల జనవరి 20(ప్రజా మంటలు   )పిల్లల భద్రతే మాకు ముఖ్యం రోడ్డు ప్రమాద నివారణ లో అందరూ భాగస్వాములు కావాలి స్కూల్ వాహనాలకు ఎలాంటి చిన్న ప్రమాదం జరిగిన సంబంధిత డ్రైవరు, యాజమాన్యం పై  కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్పీ  అశోక్ అన్నారు. విద్యాసంస్థల ప్రతి వాహనానికి తప్పనిసరిగా రోడ్  ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారి...
Read More...
Local News 

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలి

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ జగిత్యాల జనవరి 20( ప్రజా మంటలు ) అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. జిల్లాలో 14 వార్డులో 60 లక్షలతో, 15 వ వార్డులో 20...
Read More...
National  International  

ఈరోజు రాత్రి 10.30కి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం 

ఈరోజు రాత్రి 10.30కి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం  ఈరోజు రాత్రి 10.30కి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం  వాషింగ్టన్ జనవరి 20: ఆమెరికా సంయుక్త రాష్ట్రాల 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది; 'అమెరికా ఎదుర్కొంటున్న ప్రతి సంక్షోభాన్ని పరిష్కరిస్తాను' అని ఆయన విజయ ర్యాలీలో అన్నారు.చలి ఉష్ణోగ్రతల కారణంగా, ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రధాన హాల్ లోపల జరుగుతుంది....
Read More...
National  International   State News 

తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో లో సంక్రాంతి ఘన వేడుకలు 

తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో లో సంక్రాంతి ఘన వేడుకలు  తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో లో సంక్రాంతి ఘన వేడుకలు  హైదరాబాద్ జనవరి 20: తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ‘తీన్మార్ సంక్రాంతి’గా మైఖేల్ పవర్ సెకండరీ స్కూల్, ఎటోబికో లో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలను కమిటీ కార్యదర్శి  శంకర్ భరద్వాజ పోపూరి  ప్రారంభించగా, గుప్తేశ్వరి వాసుపిల్లి, శ్రీమతి పద్మజ వరదా,...
Read More...
National  Filmi News  State News 

తెలుగు నటుడు విలన్ విజయ్ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ మృతి

తెలుగు నటుడు విలన్ విజయ్ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ మృతి తెలుగు నటుడు విలన్ విజయ్ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ మృతి చెన్నై జనవరి 20: టాలీవుడ్ ప్రముఖ నటుడు, విలన్ విజయ్ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ l చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. ఒక వారం క్రితం, విజయ్ రంగరాజు హైదరాబాద్‌లో ఒక సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడ్డారు. ఆ...
Read More...
National  Filmi News  State News 

సైఫ్ అలీ ఖాన్ కేసులో న్యాయవాదుల మధ్య కోర్టులో naatakeeya వాగ్వివాదం 

సైఫ్ అలీ ఖాన్ కేసులో న్యాయవాదుల మధ్య కోర్టులో naatakeeya వాగ్వివాదం  సైఫ్ అలీ ఖాన్ కేసులో న్యాయవాదుల మధ్య కోర్టులో నాటకీయ వాగ్వివాదం  నిందితుడు భారతీయుడే - కుట్ర కోణం ఏమి లేదు - డిఫెన్స్ లయర్ ముంబై జనవరి 20: సైఫ్ అలీ ఖాన్ కత్తిపోటు: నిందితుడు షరీఫుల్ తరపున వాదించడానికి న్యాయవాదులు ఘర్షణ పడుతుండగా ముంబై కోర్టులో నాటకీయత నెలకొంది. బాలీవుడ్ నటుడు సైఫ్...
Read More...