ధర్మపురిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

On
ధర్మపురిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

ధర్మపురిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

 (రామ కిష్టయ్య సంగన భట్ల 9440595494)

 ప్రాచీన పుణ్య క్షేత్రమైన ధర్మపురి లోని శ్రీక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో, శుక్ర వారం వైకుంఠ (ముక్కోటి ఏకాదశి) వేడుకలు కన్నుల పండువగా, పైభవోపేతంగా జరిగాయి. ఉదయాత్ పూర్వం వేద మంత్రోచ్ఛారణల మధ్య, అర్చకులు పవిత్ర జలాలను కొనితెచ్చి లక్ష్మీ సమేత శ్రీ యోగానంద,శ్రీ ఉగ్ర నారసింహ, శ్రీ వేంకటేశ్వర స్వాముల మూల విరాట్టులను సాంప్రదాయ విధి విధాన రీతిలో, మహాక్షీరా భిషేకాది ప్రత్యేక పర్వదిన పూజలు నిర్వహించారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకృతులైన స్థానిక ఇలవేల్పులను దేవస్థాన ప్రాంగణంలో విద్యుద్దీపికలలో, వివిధ పుష్ప మాలికలతో, శోభాయమానంగా తీర్చి దిద్దిన రంగవల్లులతో, ఆకర్షణీయంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై అసీసుల గావించారు.

ధనుర్మాస ప్రత్యేకతలో సప్త హారతులు, షోడశోపచార పూజలు, వేద, శాస్త్ర పురాణ, సంగీత, నృత్య, వాద్యాది అవధారయాలతో ఆర్చనలు, భక్తుల గోత్ర నామాదులతో పూజలు నిర్వహించగా, భక్తజనులు భక్తి శ్రద్ధలతో కన్నులారా గాంచి తరిం చారు. అనంతరం జయ జయ ధ్వనాల మధ్య ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ సమక్షంలో, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసా చార్య వైకుంఠ (ఉత్తర) ద్వారానికి పూజ చేసి, నారికేళములను సమర్పించి, వైకుంఠ ద్వారం తెరవగా,  ద్వారం ద్వారా  ప్రవేశించిన భక్తులు పరమానంద భరితులై తనివి తీరా దర్శనం చేసుకున్నారు. 

 దేవస్థానం ఈ ఓ శ్రీనివాస్ పర్య వేక్షణలో, దేవస్థాన అర్చకుల బృందం ఆధ్వర్యంలో, సిబ్బంది సహకారంతో, బొజ్జా సంపత్ కుమార్, రాజ గోపాల్, పాలేపు ప్రవీణ్ శర్మ ,  క్షేత్ర పండితుల మార్గదర్శకత్వంలో ఘనంగా కార్య క్రమాలను నిర్వహించారు. 

రాష్ట్ర ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఆర్డీఓ మధుసూదన్, డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ సత్తమ్మ, వైస్ చైర్మన్ రామయ్య, మార్కెట్ చైర్ పర్సన్ లావణ్య, వైస్ చైర్మన్ నర్సింలు 
తదితరులు ప్రత్యేక పూజాదులలో పాల్గొన్నారు. అలాగే బచ్చు రాము గుప్తా సహకారంతో 
నూతర సంవత్సర క్యాలండర్ ను విప్ లక్ష్మణ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఇతర ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత తదితరులు దైవ దర్శనాలు చేసుకున్నారు.

భారీ ఏర్పాట్లు 

వైకుంఠ ఏకాదశి మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక శ్రద్ధతో, శ్రమ కోర్చి ఈ ఏడు భారీ ఏర్పాట్లు గావించారు. ప్రధాన రహదారి నుండి దేవస్థానం లోపలి వరకూ క్యూలైన్లు ఏర్పరిచారు. దేవస్థాన ప్రాంగణంలో విద్యుద్దీమాలతో, రంగవల్లులతో, పెద్దఎత్తున పందిళ్ళను, ప్రత్యేక పుష్ప వేదికను ఏర్పాటు చేశారు. దేవస్థానం బయట రోడుపై వివిధ ఆకృతులలో రంగులద్దారు. స్వాములను ఆసీనుల గావించిన ప్రదేశాన శాశ్వత ఇనుప షెడ్లను అందంగా తీర్చి దిద్దారు. ధర్మపురి సిఐ రాం నర్సింహా రెడ్డి రూప కల్పన మేరకు డివిజన్ లోని పలువురు ఎస్ఐలు, ఎఎస్ఐలు/హెడ్ కానిస్టే బుల్స్, సివిల్ కానిస్టేబుల్స్, హోంగార్డులు, మహిళా హోంగార్డులు, డిస్ట్రిక్ట్ గార్డులు, ప్రైవేటు సెక్యూటిరీ గార్డులు దేవస్థానంలో కట్టుదిట్టమైన బందోబస్తుని ర్వహించారు. ఎస్.ఆర్.ఆర్. కేబుల్ నెట్ వర్క్ ద్వారా గావించిన ప్రత్యక్ష ప్రసారం స్థానికంగా వీక్షించారు. బాచంపెల్లి సంతోష్ కుమార్ 
వ్యాఖ్యానాలు ఆకట్టుకున్నాయి. 
గుండి జగదీశ్వర్, బృందం భక్తి సంగీత విభావరి అలరించింది. కోలాట బృందం నృత్యాలు, విన్యాసాలు, ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

 వైకుంఠ ద్వార దర్శనంలో జాప్యం 

వైకుంఠ ఏకాదశి సందర్భంగా, ఉత్సవాలలో ప్రధానమైన ఉత్తర ద్వార దర్శన కార్యక్రమ నిర్వహణ విషయంలో, పెరిగిన రద్దీ కారణంగా, దైవ సేవలు ద్వారం గుండా వేంచేపు చేయడంలో కాలా యాపన జరిగింది. వాస్తవానికి కారణాలేవైనా, ప్రత్యేక వేదిక వద్ద పూజలు 5గంటల తర్వాత ప్రారంభం చేశారు. IMG-20250110-WA0552
 ధనుర్మాస శుక్లపక్ష ఏకాదశి ప్రభాత సమయంలో, వైకుంఠంలో శ్రీమహావిష్ణువును దర్శించి తరించిన నేపథ్యంలో, ఇంద్రాది దేవతలు జరుపు కుంటున్న ఈ ఉత్సవ వేడుకలలో ప్రాతః కాలంలో బ్రాహ్మీముహూర్తంలో పూ జలొనర్చి, సూర్యోదయానికి ముందే వైకుంఠ (ఉత్తర) ద్వారం తెరవబడి, ఆ ద్వారం గుండా వేంచేసే స్వాముల దర్శనాలు చేసుకోవడం ప్రధానం మరియు క్షేత్రంలో అనుసరణీయమైన సాంప్రదాయం కాగా, భక్తుల రద్దీ అధికమై, దర్శనాలకై బారులు తీరిన సందర్భంలో, ఉదయాత్పూ ర్వమే ఉత్తర ద్వారం తెరిచినా, స్వాముల సేవల వేంచేపు చాలా ఆలస్యమై ఉదయం
 8.30గంటల వరకు దైవ సేవలు పట్టణంలోకి వెళ్ళడం నిర్వహించారు. స్వాముల ఉత్సవ మూర్తుల సేవలను పట్టణ వీధుల గుండా ఊరేగించి, ఇసుక స్థంభం వద్ద పూజలు నిర్వహించాక, దేవస్థానానికి తిరిగి వచ్చారు. 
ముక్కోటి వేదిక వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, వైకుంఠ ద్వారం నుండి భక్తుల దర్శనాలను కొనసాగించారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల అక్టోబర్ 14 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలవగా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా...
Read More...
Local News 

జిల్లా పరిధిలోని యువతకు, ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ,షార్ట్ ఫిలిమ్ పోటీలకు ఆహ్వానం:జిల్లా ఎస్పి అశోక్ కుమార్ 

జిల్లా పరిధిలోని యువతకు, ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ,షార్ట్ ఫిలిమ్ పోటీలకు ఆహ్వానం:జిల్లా ఎస్పి అశోక్ కుమార్  జగిత్యాల అక్టోబర్ 14(ప్రజా మంటలు)శాంతి భద్రతల మరియు సమాజ రక్షణలో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా పెట్టి, పోరాడి వీరమరణం పొందిన అమర పోలీసుల జ్ఞాపకార్థం అక్టోబర్ 21 నాడు జరుగు “ పోలీస్ ఫ్లాగ్ డే ” సందర్భంగా పోలీస్ రిలేటెడ్ అంశం మీద ఫోటో గ్రఫీ, షార్ట్ ఫిలిం తీయడానికి జిల్లాలో...
Read More...
Local News 

కవి, ఉద్యమకారుడు ఆకుల గంగాధర్ మృతి

కవి, ఉద్యమకారుడు ఆకుల గంగాధర్ మృతి    జగిత్యాల అక్టోబర్ 14 (ప్రజా మంటలు): కవి, ఉద్యమకారుడు, బీట్ బజార్ వాస్తవ్యులు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలో లో పని చేస్తున్న ఆకుల గంగాధర్ ఆదివారం (13,అక్టోబర్) రోజున ఉదయం మరణించారు.   ఆకుల గంగాధర్ మంచి కవి. ఆయను బీఎస్ రాములు,ప్రోత్సహిస్తూ 1993 లో ఆయన కవితలతో "దళిత భారతి" అనే కవితా సంపుటిని విశాల...
Read More...
Local News  Spiritual   State News 

రొట్టె బాలకిష్టయ్య సేవలు చిరస్మరణీయాలు

రొట్టె బాలకిష్టయ్య సేవలు చిరస్మరణీయాలు (రామ కిష్టయ్య సంగన భట్లసీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్) విశ్రాంత విద్యాధికారి రొట్టె బాలకిష్టయ్య చేసిన విద్యారంగ సేవలు చిరస్మరణీయాలని తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘము నేతలు అన్నారు. సోమవారం తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘము ధర్మపురి మండల శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశములో అధ్యక్షులు కొరిడే శంకర్ గారి అధ్యక్షతన, కార్యదర్శి...
Read More...
National  Comment  State News 

మావోయిస్టు ఉద్యమంలో కొత్త మలుపు - మల్లోజుల లొంగుబాటు?

మావోయిస్టు ఉద్యమంలో కొత్త మలుపు - మల్లోజుల లొంగుబాటు? మల్లోజుల వేణుగోపాల్ రావు – ఉద్యమ, జీవిత విశేషాలు ఇది వ్యక్తి మార్పు మాత్రమే కాదు, ఒక యుగం మార్పు సూచన. మల్లోజుల వేణుగోపాల్ రావు – జీవితంలోని ప్రధాన ఘట్టాలు మల్లోజుల వేణుగోపాల్ రావు (అలియాస్ సోను/అభయ్) తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట ప్రాంతానికి చెందినవారు. ఆయన విద్యార్థి దశ నుంచే వామపక్ష ఉద్యమాలపై ఆకర్షితుడై,...
Read More...
National  Crime  State News 

లొంగిపోయిన మల్లోజుల - మసక బారిన ఉద్యమ సంస్థ

లొంగిపోయిన మల్లోజుల - మసక బారిన ఉద్యమ సంస్థ ముంబాయి అక్టోబర్ 14: మహారాష్ట్ర గడ్చిరోలి లో  మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు లొంగిపోవడం మావోయిస్ట్ సంస్థకు కోలుకోలేనిదెబ్బగా భావించాలి.గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మావోయిస్టుల నిర్మూలన కార్యక్రమంతో , ఎటు తోచని స్థితిలో మావోయిస్టులలో అంతర్మథనం మొదలయింది. ఎంతో మంది కేంధ్ర కమిటీ సభ్యులు ఆయుధాలు విడిచి లొంగిపోతున్నారు. ఈ...
Read More...
Local News 

గాంధీ మెడికల్ కాలేజీలో ఫెస్ట్–2025 ప్రారంభం

గాంధీ మెడికల్ కాలేజీలో ఫెస్ట్–2025 ప్రారంభం ఫ్యాకల్టీ, పీజీల మద్య టీ20 క్రికెట్ మ్యాచ్ సికింద్రాబాద్, అక్టోబర్ 13 (ప్రజామంటలు) : సికింద్రాబాద్‌గాంధీ మెడికల్‌కాలేజీ ఫెస్ట్‌సోమవారం మెడికల్ స్టూడెట్స్ సందడి మద్య  ప్రారంభమైంది. వైద్యసేవలతో బిజీగా ఉండే వైద్యవిద్యార్థులు, అధ్యాపకులకు ఆటవిడుపు దొరకడంతో కాలేజీ ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. ఫెస్ట్ లో భాగంగా ఫ్యాకల్టీ, పీజీల జట్ల మధ్య టీ20 క్రికెట్‌మ్యాచ్‌హోరాహోరిగా...
Read More...
Local News 

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి  వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల అక్టోబర్ 13( ప్రజా మంటలు)               ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  అదనపు కలెక్టర్, ఆర్డీఓలతో తో కలిసి స్వీకరించారు.   ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్...
Read More...
Local News 

జగిత్యాల పట్టణ ధరూర్ క్యాంప్ కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించిన  జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ 

జగిత్యాల పట్టణ ధరూర్ క్యాంప్ కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించిన  జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్     జగిత్యాల అక్టోబర్ 13(ప్రజా మంటలు)పట్టణ ధరూర్ క్యాంప్  కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) స్థానిక శాసన సభ్యులు డా.సంజయ్ కుమార్  సందర్శించారు. పాఠశాల బోధన తరగతులు, భోజన వసతులు, స్టోర్ రూమ్ ,వంట గది శుభ్రత, విద్యార్థినుల ఆరోగ్య వివరాల పట్టిక ,హాజరు పట్టికను తదితర అంశాలను పరిశీలించి,విద్యార్థులతో కలిసి భోజనం చేశారు....
Read More...
Local News 

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్, 

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,    జగిత్యాల   అక్టోబర్ 13( ప్రజా మంటలు)బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా సోమవారం       జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 10 మంది అర్జీదారులతో ఎస్పీ   స్వయంగా కలసి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత...
Read More...
Local News  Crime 

అక్రమంగా పటాకులు నిల్వ – ₹45 లక్షల సొత్తు స్వాధీనం

అక్రమంగా పటాకులు నిల్వ – ₹45 లక్షల సొత్తు స్వాధీనం నిందితుడిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్, తిరుమలగిరి పోలీసులు సికింద్రాబాద్, అక్టోబర్ 13 (ప్రజామంటలు) : టాస్క్ ఫోర్స్‌నార్త్ జోన్‌పోలీసులు, తిరుమలగిరి పోలీసులతో కలిసి భారీగా పటాకులు నిల్వ ఉంచిన గోదాంపై దాడి చేశారు. ఈ దాడిలో సుమారు రూ.45 లక్షల విలువైన వివిధ రకాల పేలుడు పటాకులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల...
Read More...
Local News 

నిరుపేద కుటుంబానికి ₹ 11 వేల ఆర్థిక సాయం అందజేత

నిరుపేద కుటుంబానికి ₹ 11 వేల ఆర్థిక సాయం అందజేత జగిత్యాల అక్టోబర్ 13 (ప్రజా మంటలు): పట్టణంలోని దత్తు గిర్ని వద్ద నివసించే మన నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన మచ్చ గంగారాం (హోటల్) గత ఐదు దశాబ్దాలుగా టిఫిన్ సెంటర్ (అటుకులు & మిర్చి) నిర్వహిస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగించారు. అయితే ఇటీవల అనారోగ్యంతో బాధపడి, ఎనిమిది రోజుల క్రితం ఆయన...
Read More...