ధర్మపురిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

On
ధర్మపురిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

ధర్మపురిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

 (రామ కిష్టయ్య సంగన భట్ల 9440595494)

 ప్రాచీన పుణ్య క్షేత్రమైన ధర్మపురి లోని శ్రీక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో, శుక్ర వారం వైకుంఠ (ముక్కోటి ఏకాదశి) వేడుకలు కన్నుల పండువగా, పైభవోపేతంగా జరిగాయి. ఉదయాత్ పూర్వం వేద మంత్రోచ్ఛారణల మధ్య, అర్చకులు పవిత్ర జలాలను కొనితెచ్చి లక్ష్మీ సమేత శ్రీ యోగానంద,శ్రీ ఉగ్ర నారసింహ, శ్రీ వేంకటేశ్వర స్వాముల మూల విరాట్టులను సాంప్రదాయ విధి విధాన రీతిలో, మహాక్షీరా భిషేకాది ప్రత్యేక పర్వదిన పూజలు నిర్వహించారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకృతులైన స్థానిక ఇలవేల్పులను దేవస్థాన ప్రాంగణంలో విద్యుద్దీపికలలో, వివిధ పుష్ప మాలికలతో, శోభాయమానంగా తీర్చి దిద్దిన రంగవల్లులతో, ఆకర్షణీయంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై అసీసుల గావించారు.

ధనుర్మాస ప్రత్యేకతలో సప్త హారతులు, షోడశోపచార పూజలు, వేద, శాస్త్ర పురాణ, సంగీత, నృత్య, వాద్యాది అవధారయాలతో ఆర్చనలు, భక్తుల గోత్ర నామాదులతో పూజలు నిర్వహించగా, భక్తజనులు భక్తి శ్రద్ధలతో కన్నులారా గాంచి తరిం చారు. అనంతరం జయ జయ ధ్వనాల మధ్య ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ సమక్షంలో, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసా చార్య వైకుంఠ (ఉత్తర) ద్వారానికి పూజ చేసి, నారికేళములను సమర్పించి, వైకుంఠ ద్వారం తెరవగా,  ద్వారం ద్వారా  ప్రవేశించిన భక్తులు పరమానంద భరితులై తనివి తీరా దర్శనం చేసుకున్నారు. 

 దేవస్థానం ఈ ఓ శ్రీనివాస్ పర్య వేక్షణలో, దేవస్థాన అర్చకుల బృందం ఆధ్వర్యంలో, సిబ్బంది సహకారంతో, బొజ్జా సంపత్ కుమార్, రాజ గోపాల్, పాలేపు ప్రవీణ్ శర్మ ,  క్షేత్ర పండితుల మార్గదర్శకత్వంలో ఘనంగా కార్య క్రమాలను నిర్వహించారు. 

రాష్ట్ర ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఆర్డీఓ మధుసూదన్, డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ సత్తమ్మ, వైస్ చైర్మన్ రామయ్య, మార్కెట్ చైర్ పర్సన్ లావణ్య, వైస్ చైర్మన్ నర్సింలు 
తదితరులు ప్రత్యేక పూజాదులలో పాల్గొన్నారు. అలాగే బచ్చు రాము గుప్తా సహకారంతో 
నూతర సంవత్సర క్యాలండర్ ను విప్ లక్ష్మణ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఇతర ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత తదితరులు దైవ దర్శనాలు చేసుకున్నారు.

భారీ ఏర్పాట్లు 

వైకుంఠ ఏకాదశి మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక శ్రద్ధతో, శ్రమ కోర్చి ఈ ఏడు భారీ ఏర్పాట్లు గావించారు. ప్రధాన రహదారి నుండి దేవస్థానం లోపలి వరకూ క్యూలైన్లు ఏర్పరిచారు. దేవస్థాన ప్రాంగణంలో విద్యుద్దీమాలతో, రంగవల్లులతో, పెద్దఎత్తున పందిళ్ళను, ప్రత్యేక పుష్ప వేదికను ఏర్పాటు చేశారు. దేవస్థానం బయట రోడుపై వివిధ ఆకృతులలో రంగులద్దారు. స్వాములను ఆసీనుల గావించిన ప్రదేశాన శాశ్వత ఇనుప షెడ్లను అందంగా తీర్చి దిద్దారు. ధర్మపురి సిఐ రాం నర్సింహా రెడ్డి రూప కల్పన మేరకు డివిజన్ లోని పలువురు ఎస్ఐలు, ఎఎస్ఐలు/హెడ్ కానిస్టే బుల్స్, సివిల్ కానిస్టేబుల్స్, హోంగార్డులు, మహిళా హోంగార్డులు, డిస్ట్రిక్ట్ గార్డులు, ప్రైవేటు సెక్యూటిరీ గార్డులు దేవస్థానంలో కట్టుదిట్టమైన బందోబస్తుని ర్వహించారు. ఎస్.ఆర్.ఆర్. కేబుల్ నెట్ వర్క్ ద్వారా గావించిన ప్రత్యక్ష ప్రసారం స్థానికంగా వీక్షించారు. బాచంపెల్లి సంతోష్ కుమార్ 
వ్యాఖ్యానాలు ఆకట్టుకున్నాయి. 
గుండి జగదీశ్వర్, బృందం భక్తి సంగీత విభావరి అలరించింది. కోలాట బృందం నృత్యాలు, విన్యాసాలు, ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

 వైకుంఠ ద్వార దర్శనంలో జాప్యం 

వైకుంఠ ఏకాదశి సందర్భంగా, ఉత్సవాలలో ప్రధానమైన ఉత్తర ద్వార దర్శన కార్యక్రమ నిర్వహణ విషయంలో, పెరిగిన రద్దీ కారణంగా, దైవ సేవలు ద్వారం గుండా వేంచేపు చేయడంలో కాలా యాపన జరిగింది. వాస్తవానికి కారణాలేవైనా, ప్రత్యేక వేదిక వద్ద పూజలు 5గంటల తర్వాత ప్రారంభం చేశారు. IMG-20250110-WA0552
 ధనుర్మాస శుక్లపక్ష ఏకాదశి ప్రభాత సమయంలో, వైకుంఠంలో శ్రీమహావిష్ణువును దర్శించి తరించిన నేపథ్యంలో, ఇంద్రాది దేవతలు జరుపు కుంటున్న ఈ ఉత్సవ వేడుకలలో ప్రాతః కాలంలో బ్రాహ్మీముహూర్తంలో పూ జలొనర్చి, సూర్యోదయానికి ముందే వైకుంఠ (ఉత్తర) ద్వారం తెరవబడి, ఆ ద్వారం గుండా వేంచేసే స్వాముల దర్శనాలు చేసుకోవడం ప్రధానం మరియు క్షేత్రంలో అనుసరణీయమైన సాంప్రదాయం కాగా, భక్తుల రద్దీ అధికమై, దర్శనాలకై బారులు తీరిన సందర్భంలో, ఉదయాత్పూ ర్వమే ఉత్తర ద్వారం తెరిచినా, స్వాముల సేవల వేంచేపు చాలా ఆలస్యమై ఉదయం
 8.30గంటల వరకు దైవ సేవలు పట్టణంలోకి వెళ్ళడం నిర్వహించారు. స్వాముల ఉత్సవ మూర్తుల సేవలను పట్టణ వీధుల గుండా ఊరేగించి, ఇసుక స్థంభం వద్ద పూజలు నిర్వహించాక, దేవస్థానానికి తిరిగి వచ్చారు. 
ముక్కోటి వేదిక వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, వైకుంఠ ద్వారం నుండి భక్తుల దర్శనాలను కొనసాగించారు.

Tags
Join WhatsApp

More News...

State News 

జర్నలిస్టుల సంక్షేమం కోసం లెక్కలేనన్ని పోరాటాలు – టీయూడబ్ల్యూజే అధ్యక్షులు విరాహత్ అలీ

జర్నలిస్టుల సంక్షేమం కోసం లెక్కలేనన్ని పోరాటాలు – టీయూడబ్ల్యూజే అధ్యక్షులు విరాహత్ అలీ హైదరాబాద్, నవంబర్ 19 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడింది ఏ ఒక్క సంఘమో అయితే, అది టీయూడబ్ల్యూజే (తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం) అని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే. విరాహత్ అలీ స్పష్టం చేశారు. బషీర్‌బాగ్‌లోని యూనియన్ కార్యాలయంలో బుధవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు...
Read More...
Local News 

జగిత్యాల పాత్రికేయుడు శఫీని ఆస్పత్రిలో పరామర్శిన మంత్రి అడ్లూరి

జగిత్యాల పాత్రికేయుడు శఫీని ఆస్పత్రిలో పరామర్శిన మంత్రి అడ్లూరి హైదరాబాద్, నవంబర్ 19 (ప్రజా మంటలు):జగిత్యాల పాత్రికేయుడు షఫీ అనారోగ్యంతో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రెనోవా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలుసుకున్న రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,  బుధవారం ఆస్పత్రిలో ఆయనను పరామర్శించారు. షఫీ ఆరోగ్య పరిస్థితిని మంత్రి ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుని, వెంటనే విధినిర్వహణలో ఉన్న వైద్యులతో మాట్లాడారు. ఆయనకు ...
Read More...
Local News  State News 

మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి - చీరల పంపిణీ

మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి - చీరల పంపిణీ హైదరాబాద్ నవంబర్ 19 (ప్రజా మంటలు):తె లంగాణలో కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని వేగంగా, లోపాలు లేకుండా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. “మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి” కార్యక్రమం కింద ఈ పథకంపై సీఎం సచివాలయం నుంచి...
Read More...
Local News 

ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా సాయి శ్రీనివాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు

ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా సాయి శ్రీనివాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు మెట్టుపల్లి నవంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా.మెట్టుపల్లి  లోని సాయి శ్రీనివాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు అందించడం జరిగింది మరియు రోగులకు  పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జ్...
Read More...
Local News 

డ్రగ్స్.సైబర్ నేరాలపై అవగాహన సదస్సు.

డ్రగ్స్.సైబర్ నేరాలపై అవగాహన సదస్సు. ఇబ్రహీంపట్నం నవంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): జగిత్యాల జిల్లా గౌరవ ఎస్పీ  అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు బుధవారం రోజున ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ నందు విద్యార్థులకు సైబర్,డ్రగ్స్, ట్రాఫిక్ మరియు ఉమెన్ ట్రాఫికింగ్ లాంటి పలు అంశాల పైన అవగాహన సదస్సు ను ఇబ్రహీంపట్నం  ఎస్...
Read More...
Local News 

వేములకుర్తి పాఠశాల కు పురిపైడ్,నిటి ట్యాంక్ అందచేత

వేములకుర్తి పాఠశాల కు పురిపైడ్,నిటి ట్యాంక్ అందచేత ఇబ్రహీంపట్నం నవంబర్ 19( ప్రజా మంటలు దగ్గుల అశోక్): జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలం లోని వేములకుర్తి గ్రామంలో ప్రాథమిక పాఠశాల (బండమిది బడి) విధ్యర్డుల కు తాగునీరు అందిచాలని బుదవారం 2005- 06 పదవతరగతి పుర్వవిధ్యరుల అధ్వర్యంలో పురిపైడ్,మరియు గంగపుత్ర యుత్ అధ్వర్యంలో నిటి ట్యాంక్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగమణి కీ ఎర్పాటు...
Read More...

రాంగోపాల్‌పేట్‌ లో ఇందిరాగాంధీ విగ్రహావిష్కరణ

రాంగోపాల్‌పేట్‌ లో ఇందిరాగాంధీ విగ్రహావిష్కరణ సికింద్రాబాద్, నవంబర్ 19  (ప్రజామంటలు ): దేశానికి సేవలందించిన దివంగత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ చేసిన మేలును దేశ ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ అన్నారు. రాంగోపాల్‌పేట్ డివిజన్ అధ్యక్షుడు దుండిగల్ల మల్లికార్జున్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ అంబేడ్కర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ నూతన విగ్రహాన్ని బుధవారం ఆమె జయంతి...
Read More...
National  International   Crime 

అమెరికాలో 2017 నాటి శశికళ–అనీష్ హత్య కేసులో అసలు నిందితుడికి చేరుకున్న విచారణ

అమెరికాలో 2017 నాటి శశికళ–అనీష్ హత్య కేసులో అసలు నిందితుడికి చేరుకున్న విచారణ హైదరాబాద్ నవంబర్ 19: అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శశికళ నర్రా (Sasikala Narra) మరియు ఆమె ఏడేళ్ల కుమారుడు అనీష్ సాయి నర్రా 2017లో జరిగిన దారుణ హత్య కేసు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ సంచలనంగా మారింది. న్యూజెర్సీలో జరిగిన ఈ ద్విప్రమాణ హత్యలో నిజమైన నిందితుడిని అధికారులు గుర్తించినట్టు తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. ఎలా...
Read More...

మహిళా అభ్యున్నతీకి కాంగ్రెస్ పార్టీ కృషి.  జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి.

మహిళా అభ్యున్నతీకి కాంగ్రెస్ పార్టీ కృషి.   జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి.  జగిత్యాల నవంబర్ 19 (ప్రజా మంటలు):రాష్ట్రంలోని మహిళ సోదరిమణుల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్రం లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి అన్నారు. ఇందిరా గాంధీ జన్మదినం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక భగినీ నివేదిత ఆశ్రమంలో ఆల్...
Read More...

జగిత్యాలలో ASMITA కిక్‌బాక్సింగ్ లీగ్ రాష్ట్ర స్థాయి పోటీలు

జగిత్యాలలో ASMITA కిక్‌బాక్సింగ్ లీగ్ రాష్ట్ర స్థాయి పోటీలు జగిత్యాల, నవంబర్ 19 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని విరూపాక్షి గార్డెన్స్ లో ఖేలో ఇండియా కార్యక్రమం భాగంగా నిర్వహిస్తున్న ASMITA కిక్ బాక్సింగ్ లీగ్ 2025–26 రాష్ట్ర స్థాయి కిక్‌బాక్సింగ్ పోటీలను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి లీగ్ పోస్టర్ ఆవిష్కరణ ఈ సందర్భంగా ఎమ్మెల్యే డిసెంబర్...
Read More...
Local News 

ఎమ్మెల్యేను  కలిసిన కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఛైర్మన్

 ఎమ్మెల్యేను  కలిసిన కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఛైర్మన్ జగిత్యాల, నవంబర్ 19 (ప్రజా మంటలు):జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన కరీంనగర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ కే. రాజశేఖర్, డైరెక్టర్ సాయి కృష్ణ మర్యాద పూర్వక భేటీ చేశారు. ఇటీవల ఎన్నికైన అర్బన్ బ్యాంక్ నూతన కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు...
Read More...

ఇందిరా గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలి: మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ఇందిరా గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలి: మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల, నవంబర్ 19 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇందిరా భవన్‌ నుండి పాత బస్టాండ్‌ వరకు ర్యాలీ కార్యక్రమంలో భాగంగా...
Read More...