ధర్మపురిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
ధర్మపురిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
(రామ కిష్టయ్య సంగన భట్ల 9440595494)
ప్రాచీన పుణ్య క్షేత్రమైన ధర్మపురి లోని శ్రీక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో, శుక్ర వారం వైకుంఠ (ముక్కోటి ఏకాదశి) వేడుకలు కన్నుల పండువగా, పైభవోపేతంగా జరిగాయి. ఉదయాత్ పూర్వం వేద మంత్రోచ్ఛారణల మధ్య, అర్చకులు పవిత్ర జలాలను కొనితెచ్చి లక్ష్మీ సమేత శ్రీ యోగానంద,శ్రీ ఉగ్ర నారసింహ, శ్రీ వేంకటేశ్వర స్వాముల మూల విరాట్టులను సాంప్రదాయ విధి విధాన రీతిలో, మహాక్షీరా భిషేకాది ప్రత్యేక పర్వదిన పూజలు నిర్వహించారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకృతులైన స్థానిక ఇలవేల్పులను దేవస్థాన ప్రాంగణంలో విద్యుద్దీపికలలో, వివిధ పుష్ప మాలికలతో, శోభాయమానంగా తీర్చి దిద్దిన రంగవల్లులతో, ఆకర్షణీయంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై అసీసుల గావించారు.
ధనుర్మాస ప్రత్యేకతలో సప్త హారతులు, షోడశోపచార పూజలు, వేద, శాస్త్ర పురాణ, సంగీత, నృత్య, వాద్యాది అవధారయాలతో ఆర్చనలు, భక్తుల గోత్ర నామాదులతో పూజలు నిర్వహించగా, భక్తజనులు భక్తి శ్రద్ధలతో కన్నులారా గాంచి తరిం చారు. అనంతరం జయ జయ ధ్వనాల మధ్య ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ సమక్షంలో, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసా చార్య వైకుంఠ (ఉత్తర) ద్వారానికి పూజ చేసి, నారికేళములను సమర్పించి, వైకుంఠ ద్వారం తెరవగా, ద్వారం ద్వారా ప్రవేశించిన భక్తులు పరమానంద భరితులై తనివి తీరా దర్శనం చేసుకున్నారు.
దేవస్థానం ఈ ఓ శ్రీనివాస్ పర్య వేక్షణలో, దేవస్థాన అర్చకుల బృందం ఆధ్వర్యంలో, సిబ్బంది సహకారంతో, బొజ్జా సంపత్ కుమార్, రాజ గోపాల్, పాలేపు ప్రవీణ్ శర్మ , క్షేత్ర పండితుల మార్గదర్శకత్వంలో ఘనంగా కార్య క్రమాలను నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఆర్డీఓ మధుసూదన్, డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ సత్తమ్మ, వైస్ చైర్మన్ రామయ్య, మార్కెట్ చైర్ పర్సన్ లావణ్య, వైస్ చైర్మన్ నర్సింలు
తదితరులు ప్రత్యేక పూజాదులలో పాల్గొన్నారు. అలాగే బచ్చు రాము గుప్తా సహకారంతో
నూతర సంవత్సర క్యాలండర్ ను విప్ లక్ష్మణ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఇతర ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత తదితరులు దైవ దర్శనాలు చేసుకున్నారు.
భారీ ఏర్పాట్లు
వైకుంఠ ఏకాదశి మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక శ్రద్ధతో, శ్రమ కోర్చి ఈ ఏడు భారీ ఏర్పాట్లు గావించారు. ప్రధాన రహదారి నుండి దేవస్థానం లోపలి వరకూ క్యూలైన్లు ఏర్పరిచారు. దేవస్థాన ప్రాంగణంలో విద్యుద్దీమాలతో, రంగవల్లులతో, పెద్దఎత్తున పందిళ్ళను, ప్రత్యేక పుష్ప వేదికను ఏర్పాటు చేశారు. దేవస్థానం బయట రోడుపై వివిధ ఆకృతులలో రంగులద్దారు. స్వాములను ఆసీనుల గావించిన ప్రదేశాన శాశ్వత ఇనుప షెడ్లను అందంగా తీర్చి దిద్దారు. ధర్మపురి సిఐ రాం నర్సింహా రెడ్డి రూప కల్పన మేరకు డివిజన్ లోని పలువురు ఎస్ఐలు, ఎఎస్ఐలు/హెడ్ కానిస్టే బుల్స్, సివిల్ కానిస్టేబుల్స్, హోంగార్డులు, మహిళా హోంగార్డులు, డిస్ట్రిక్ట్ గార్డులు, ప్రైవేటు సెక్యూటిరీ గార్డులు దేవస్థానంలో కట్టుదిట్టమైన బందోబస్తుని ర్వహించారు. ఎస్.ఆర్.ఆర్. కేబుల్ నెట్ వర్క్ ద్వారా గావించిన ప్రత్యక్ష ప్రసారం స్థానికంగా వీక్షించారు. బాచంపెల్లి సంతోష్ కుమార్
వ్యాఖ్యానాలు ఆకట్టుకున్నాయి.
గుండి జగదీశ్వర్, బృందం భక్తి సంగీత విభావరి అలరించింది. కోలాట బృందం నృత్యాలు, విన్యాసాలు, ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
వైకుంఠ ద్వార దర్శనంలో జాప్యం
వైకుంఠ ఏకాదశి సందర్భంగా, ఉత్సవాలలో ప్రధానమైన ఉత్తర ద్వార దర్శన కార్యక్రమ నిర్వహణ విషయంలో, పెరిగిన రద్దీ కారణంగా, దైవ సేవలు ద్వారం గుండా వేంచేపు చేయడంలో కాలా యాపన జరిగింది. వాస్తవానికి కారణాలేవైనా, ప్రత్యేక వేదిక వద్ద పూజలు 5గంటల తర్వాత ప్రారంభం చేశారు. 
ధనుర్మాస శుక్లపక్ష ఏకాదశి ప్రభాత సమయంలో, వైకుంఠంలో శ్రీమహావిష్ణువును దర్శించి తరించిన నేపథ్యంలో, ఇంద్రాది దేవతలు జరుపు కుంటున్న ఈ ఉత్సవ వేడుకలలో ప్రాతః కాలంలో బ్రాహ్మీముహూర్తంలో పూ జలొనర్చి, సూర్యోదయానికి ముందే వైకుంఠ (ఉత్తర) ద్వారం తెరవబడి, ఆ ద్వారం గుండా వేంచేసే స్వాముల దర్శనాలు చేసుకోవడం ప్రధానం మరియు క్షేత్రంలో అనుసరణీయమైన సాంప్రదాయం కాగా, భక్తుల రద్దీ అధికమై, దర్శనాలకై బారులు తీరిన సందర్భంలో, ఉదయాత్పూ ర్వమే ఉత్తర ద్వారం తెరిచినా, స్వాముల సేవల వేంచేపు చాలా ఆలస్యమై ఉదయం
8.30గంటల వరకు దైవ సేవలు పట్టణంలోకి వెళ్ళడం నిర్వహించారు. స్వాముల ఉత్సవ మూర్తుల సేవలను పట్టణ వీధుల గుండా ఊరేగించి, ఇసుక స్థంభం వద్ద పూజలు నిర్వహించాక, దేవస్థానానికి తిరిగి వచ్చారు.
ముక్కోటి వేదిక వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, వైకుంఠ ద్వారం నుండి భక్తుల దర్శనాలను కొనసాగించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన
మిర్యాలగూడ, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ‘ప్రజాపాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
కార్యక్రమంలో నీలగిరి జిల్లా మహిళా సమాఖ్యకు రూ.1138 కోట్ల... జగిత్యాలలో 20 అడుగుల శ్రీవేంకటేశ్వర స్వామి 3డి సైకత శిల్ప ప్రదర్శన
జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
శ్రీ వెంకటేశ్వర స్వామి సమితి ఆధ్వర్యంలో తెలంగాణలో తొలిసారిగా జగిత్యాల కరీంనగర్ రోడ్ సర్కస్ గ్రౌండ్లో 20 అడుగుల కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి 3డి సైకత శిల్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను శ్రీమాన్ నంబి వేణుగోపాల చార్య ప్రారంభించారు.
ఈ 3డి సైకత శిల్ప... మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చాం : జిల్లా BRS అధ్యక్షులు
జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలోని జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసి బి-ఫారాలు అందజేశామని తెలిపారు. జనరల్ స్థానాల్లోనూ బీసీ... తెలంగాణ అధ్యయన కమిటీల సభ్యులతో కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీలతో నేటి నుంచి వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి, సబ్బండ వర్గాల వికాసం, సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా 50 అధ్యయన కమిటీలను తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసింది.
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బ్లూ ప్రింట్ రూపొందించే... “విద్యార్థులే.. స్వీపర్లు!” అనే వార్తా కథనంపై హక్కుల కమీషన్ కేసు
హైదరాబాద్, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సభ్యులు (న్యాయ విభాగం) సివడి ప్రవీణ గారు, నమస్తే తెలంగాణ దినపత్రికలో 04.02.2026న ప్రచురితమైన “విద్యార్థులే.. స్వీపర్లు!” అనే వార్తా కథనాన్ని ఆధారంగా తీసుకొని స్వయంచాలక (సూవో-మోటు) విచారణ చేపట్టారు.
హైదరాబాద్లోని అనేక ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో స్వీపర్లు అందుబాటులో లేకపోవడంతో, 1వ... జగిత్యాల మున్సిపాలిటీ పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు
జగిత్యాల ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
బిఆర్ఎస్ - బీజేపీ | కాంగ్రెస్ మూడు ప్రధాన పార్టీల నుండి పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు, వార్డుల వారిగా..
వార్డు
రిజర్వేషన్
BRS
BJP
కాంగ్రెస్
1
BC(G)
నిమిషకవి వంశీకృష్ణ
పుప్పాల రాజేష్
అనిల్ కుమార్ కూసరి
2
UR(W)
వొడ్డినేని సంధ్య కుమారి
కాశెట్టి... ఐల్నేని ఆసుపత్రి వారి సౌజన్యముతో క్యాన్సర్ పై అవగాహన సదస్సు
జగిత్యాల ఫిబ్రవరి 4 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని వాల్మీకి ఆవాసం గీతావిద్యాలయం గ్రౌండ్ లో బుధవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకొని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. క్యాన్సర్ వలన అనారోగ్యము మరణాలు తగ్గించడమే అవగాహన యొక్క ముఖ్య లక్ష్యం అని వైద్యులు పేర్కొన్నారు. డా వంశీ చేతన ప్రముఖ ఆంకాలజిస్ట్, డా వినీల ,డా... క్యాన్సర్ మరణశాసనం కాదు –మెగాస్టార్ చిరంజీవి
(పి కోటేశ్వర్)
సికింద్రాబాద్, పిబ్రవరి 04 ( ప్రజామంటలు) :
క్యాన్సర్ అనేది దేవుడు ఇచ్చిన శాపం కాదని, ముందస్తుగా గుర్తిస్తే ఈ వ్యాధిని కూడా జయించి సాధారణ జీవితం గడపవచ్చని పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవ కార్యక్రమంలో ఆయన
ఈ... రూ.15 లక్షల లంచంతో తీసుకొంటూ పట్టుబడ్డ జీహెచ్ఎంసీ ఎస్ఈ
హైదరాబాద్, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
హైదరాబాద్ కూకట్పల్లి జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సూపరింటెండింగ్ ఇంజనీర్ చిన్నారెడ్డి కాంట్రాక్టర్ నుంచి రూ.15 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
పెండింగ్లో ఉన్న బిల్లుల క్లియరెన్స్ కోసం లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి.... కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా: దివాళా కంపెనీకి వేల కోట్ల పనులు ఎలా? కెటిఆర్ ప్రశ్న
హైదరాబాద్ ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
దివాళా తీసినట్లు ప్రకటించిన కే ఎస్ ఎల్ ఆర్ ఇన్ఫ్రాటెక్ కాని 6వేల కోట్ల పనులను ఇచ్చిందని, ఇది cm రేవంత్ రెడ్డి బినామీ సంస్థ అని, బిఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు కేటీఆర్ పత్రిక సమావేశంలో ఆరోపించారు. ఈ ప్రశ్న నేను కాదు, సుప్రీంకోర్టు గత జనవరి 23... జగిత్యాల రాజకీయాల్లో మాటల యుద్ధం:జీవన్ Vs సంజయ్
జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
జగిత్యాల రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్పై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్ను అసెంబ్లీ స్పీకర్ కొట్టివేయడంతో, ఆయన “అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా” అని స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని, పార్టీ మారలేదని అఫిడవిట్, పార్టీ ఫండ్ చెల్లింపుల... స్పీకర్ క్లిన్ చిట్: జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ బీఆర్ఎస్లోనే
జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్పై బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్ను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. ఎమ్మెల్యే పార్టీ మారినట్లు నిరూపించే ఆధారాలు లేవని స్పష్టంగా పేర్కొన్నారు.
అభివృద్ధి కోసమే కాంగ్రెస్తో సమన్వయం – డా. సంజయ్ స్పష్టం
ఈ తీర్పుపై... 