ధర్మపురిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

On
ధర్మపురిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

ధర్మపురిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

 (రామ కిష్టయ్య సంగన భట్ల 9440595494)

 ప్రాచీన పుణ్య క్షేత్రమైన ధర్మపురి లోని శ్రీక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో, శుక్ర వారం వైకుంఠ (ముక్కోటి ఏకాదశి) వేడుకలు కన్నుల పండువగా, పైభవోపేతంగా జరిగాయి. ఉదయాత్ పూర్వం వేద మంత్రోచ్ఛారణల మధ్య, అర్చకులు పవిత్ర జలాలను కొనితెచ్చి లక్ష్మీ సమేత శ్రీ యోగానంద,శ్రీ ఉగ్ర నారసింహ, శ్రీ వేంకటేశ్వర స్వాముల మూల విరాట్టులను సాంప్రదాయ విధి విధాన రీతిలో, మహాక్షీరా భిషేకాది ప్రత్యేక పర్వదిన పూజలు నిర్వహించారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకృతులైన స్థానిక ఇలవేల్పులను దేవస్థాన ప్రాంగణంలో విద్యుద్దీపికలలో, వివిధ పుష్ప మాలికలతో, శోభాయమానంగా తీర్చి దిద్దిన రంగవల్లులతో, ఆకర్షణీయంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై అసీసుల గావించారు.

ధనుర్మాస ప్రత్యేకతలో సప్త హారతులు, షోడశోపచార పూజలు, వేద, శాస్త్ర పురాణ, సంగీత, నృత్య, వాద్యాది అవధారయాలతో ఆర్చనలు, భక్తుల గోత్ర నామాదులతో పూజలు నిర్వహించగా, భక్తజనులు భక్తి శ్రద్ధలతో కన్నులారా గాంచి తరిం చారు. అనంతరం జయ జయ ధ్వనాల మధ్య ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ సమక్షంలో, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసా చార్య వైకుంఠ (ఉత్తర) ద్వారానికి పూజ చేసి, నారికేళములను సమర్పించి, వైకుంఠ ద్వారం తెరవగా,  ద్వారం ద్వారా  ప్రవేశించిన భక్తులు పరమానంద భరితులై తనివి తీరా దర్శనం చేసుకున్నారు. 

 దేవస్థానం ఈ ఓ శ్రీనివాస్ పర్య వేక్షణలో, దేవస్థాన అర్చకుల బృందం ఆధ్వర్యంలో, సిబ్బంది సహకారంతో, బొజ్జా సంపత్ కుమార్, రాజ గోపాల్, పాలేపు ప్రవీణ్ శర్మ ,  క్షేత్ర పండితుల మార్గదర్శకత్వంలో ఘనంగా కార్య క్రమాలను నిర్వహించారు. 

రాష్ట్ర ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఆర్డీఓ మధుసూదన్, డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ సత్తమ్మ, వైస్ చైర్మన్ రామయ్య, మార్కెట్ చైర్ పర్సన్ లావణ్య, వైస్ చైర్మన్ నర్సింలు 
తదితరులు ప్రత్యేక పూజాదులలో పాల్గొన్నారు. అలాగే బచ్చు రాము గుప్తా సహకారంతో 
నూతర సంవత్సర క్యాలండర్ ను విప్ లక్ష్మణ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఇతర ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత తదితరులు దైవ దర్శనాలు చేసుకున్నారు.

భారీ ఏర్పాట్లు 

వైకుంఠ ఏకాదశి మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక శ్రద్ధతో, శ్రమ కోర్చి ఈ ఏడు భారీ ఏర్పాట్లు గావించారు. ప్రధాన రహదారి నుండి దేవస్థానం లోపలి వరకూ క్యూలైన్లు ఏర్పరిచారు. దేవస్థాన ప్రాంగణంలో విద్యుద్దీమాలతో, రంగవల్లులతో, పెద్దఎత్తున పందిళ్ళను, ప్రత్యేక పుష్ప వేదికను ఏర్పాటు చేశారు. దేవస్థానం బయట రోడుపై వివిధ ఆకృతులలో రంగులద్దారు. స్వాములను ఆసీనుల గావించిన ప్రదేశాన శాశ్వత ఇనుప షెడ్లను అందంగా తీర్చి దిద్దారు. ధర్మపురి సిఐ రాం నర్సింహా రెడ్డి రూప కల్పన మేరకు డివిజన్ లోని పలువురు ఎస్ఐలు, ఎఎస్ఐలు/హెడ్ కానిస్టే బుల్స్, సివిల్ కానిస్టేబుల్స్, హోంగార్డులు, మహిళా హోంగార్డులు, డిస్ట్రిక్ట్ గార్డులు, ప్రైవేటు సెక్యూటిరీ గార్డులు దేవస్థానంలో కట్టుదిట్టమైన బందోబస్తుని ర్వహించారు. ఎస్.ఆర్.ఆర్. కేబుల్ నెట్ వర్క్ ద్వారా గావించిన ప్రత్యక్ష ప్రసారం స్థానికంగా వీక్షించారు. బాచంపెల్లి సంతోష్ కుమార్ 
వ్యాఖ్యానాలు ఆకట్టుకున్నాయి. 
గుండి జగదీశ్వర్, బృందం భక్తి సంగీత విభావరి అలరించింది. కోలాట బృందం నృత్యాలు, విన్యాసాలు, ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

 వైకుంఠ ద్వార దర్శనంలో జాప్యం 

వైకుంఠ ఏకాదశి సందర్భంగా, ఉత్సవాలలో ప్రధానమైన ఉత్తర ద్వార దర్శన కార్యక్రమ నిర్వహణ విషయంలో, పెరిగిన రద్దీ కారణంగా, దైవ సేవలు ద్వారం గుండా వేంచేపు చేయడంలో కాలా యాపన జరిగింది. వాస్తవానికి కారణాలేవైనా, ప్రత్యేక వేదిక వద్ద పూజలు 5గంటల తర్వాత ప్రారంభం చేశారు. IMG-20250110-WA0552
 ధనుర్మాస శుక్లపక్ష ఏకాదశి ప్రభాత సమయంలో, వైకుంఠంలో శ్రీమహావిష్ణువును దర్శించి తరించిన నేపథ్యంలో, ఇంద్రాది దేవతలు జరుపు కుంటున్న ఈ ఉత్సవ వేడుకలలో ప్రాతః కాలంలో బ్రాహ్మీముహూర్తంలో పూ జలొనర్చి, సూర్యోదయానికి ముందే వైకుంఠ (ఉత్తర) ద్వారం తెరవబడి, ఆ ద్వారం గుండా వేంచేసే స్వాముల దర్శనాలు చేసుకోవడం ప్రధానం మరియు క్షేత్రంలో అనుసరణీయమైన సాంప్రదాయం కాగా, భక్తుల రద్దీ అధికమై, దర్శనాలకై బారులు తీరిన సందర్భంలో, ఉదయాత్పూ ర్వమే ఉత్తర ద్వారం తెరిచినా, స్వాముల సేవల వేంచేపు చాలా ఆలస్యమై ఉదయం
 8.30గంటల వరకు దైవ సేవలు పట్టణంలోకి వెళ్ళడం నిర్వహించారు. స్వాముల ఉత్సవ మూర్తుల సేవలను పట్టణ వీధుల గుండా ఊరేగించి, ఇసుక స్థంభం వద్ద పూజలు నిర్వహించాక, దేవస్థానానికి తిరిగి వచ్చారు. 
ముక్కోటి వేదిక వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, వైకుంఠ ద్వారం నుండి భక్తుల దర్శనాలను కొనసాగించారు.

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

నూకపల్లి డబుల్ బెడ్రూం పథకం రాజకీయ–ఆర్థిక ఏటీఎంగా మారింది: జీవన్ రెడ్డి

నూకపల్లి డబుల్ బెడ్రూం పథకం రాజకీయ–ఆర్థిక ఏటీఎంగా మారింది: జీవన్ రెడ్డి నూకపల్లి డబుల్ బెడ్రూం పథకం రాజకీయంగా, ఆర్థికంగా ఏటీఎంగా మారిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. లబ్ధిదారుల ఓటు చోరీ కుట్రపై చర్యలు చేపట్టాలని డిమాండ్.
Read More...
Local News  State News 

జర్నలిస్టుల ఐక్యతపై డబ్ల్యూజేఐ దృష్టి –కరీంనగర్ జిల్లా కొత్త కార్యవర్గం ఎన్నిక

 జర్నలిస్టుల ఐక్యతపై డబ్ల్యూజేఐ దృష్టి –కరీంనగర్ జిల్లా  కొత్త కార్యవర్గం ఎన్నిక కరీంనగర్, నవంబర్ 16 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల ఐక్యతను బలోపేతం చేయడమే సంస్థ ప్రధాన లక్ష్యమని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (WJI) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కరీంనగర్ సప్తగిరి కాలనీలోని ఎస్‌ఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్లో డబ్ల్యూజేఐ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన...
Read More...
National  Sports  International  

2026 హార్లీ-డేవిడ్సన్ స్పోర్ట్‌స్టర్ 883 జనవరిలో లాంచ్ – కొత్త ఫీచర్లతో అదిరిపోయే క్రూజర్

2026 హార్లీ-డేవిడ్సన్ స్పోర్ట్‌స్టర్ 883 జనవరిలో లాంచ్ – కొత్త ఫీచర్లతో అదిరిపోయే క్రూజర్ న్యూయార్క్ నవంబర్ 16: ప్రపంచవ్యాప్తంగా బైక్ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2026 Harley-Davidson Sportster 883 చివరకు జనవరి 2026లో అధికారికంగా లాంచ్ కానుంది. స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, రైడింగ్ కంఫర్ట్—మొత్తంగా హార్లీ బ్రాండ్‌కి తగ్గట్టే ఈ మోడల్ అందరినీ ఆకట్టుకోనుంది. హార్లీ-డేవిడ్సన్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే మోడళ్లలో స్పోర్ట్‌స్టర్ 883 ఒకటి. తాజా...
Read More...

కొత్త ప్రభుత్వం రెండేళ్లలో విద్యా రంగం పట్ల స్పష్టమైన చర్యలు తీసుకోలేదు:: కల్వకుంట్ల కవిత

కొత్త ప్రభుత్వం రెండేళ్లలో విద్యా రంగం పట్ల స్పష్టమైన చర్యలు తీసుకోలేదు:: కల్వకుంట్ల కవిత   టీజేటీఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం“తెలంగాణ రాష్ట్రం – విద్యావ్యవస్థ” అంశంపై నిపుణుల చర్చ, కవిత వ్యాఖ్యలు హైదరాబాద్, నవంబర్ 16 (ప్రజా మంటలు); తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో “తెలంగాణ రాష్ట్రం – విద్యావ్యవస్థ” పై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యావేత్తలు, సామాజికవేత్తలు, మేధావులు, విద్యార్థులు పాల్గొని పలు...
Read More...

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో ఘనంగా జయంతి ఉత్సవాలు ప్రారంభం

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో ఘనంగా జయంతి ఉత్సవాలు ప్రారంభం    జగిత్యాల నవంబర్ 16 (ప్రజా మంటలు)శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయముజగిత్యాల లో ఘనంగా ప్రారంభమైన శ్రీ ధన్వంతరి జయంతోత్సవము మరియు శ్రీ ధనలక్ష్మి సమేత శ్రీ ధన్వంతరి స్వామి కళ్యాణ మహోత్సవము మొదటి రోజునవంబర్ 16 ఆదివారం (భానువాసరే కార్తీక  మాసం  శుక్ల పక్షం ద్వాదశి   ఉ.గం. 5.15 ని.ల...
Read More...

సన్మార్గంలో నడిపించే శక్తి.. సంగీత, సాహిత్యాల సొంతం  తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్

సన్మార్గంలో నడిపించే శక్తి.. సంగీత, సాహిత్యాల సొంతం  తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ జగిత్యాల నవంబర్ 16 (ప్రజా మంటలు)సమాజాన్ని సన్మార్గంలో నడిపించే శక్తి సంగీతం సాహిత్యాల సొంతమని జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పుల్లూరి నారాయణ దాసు ఆశ్రమం ఆవరణలో సంగీత సాహిత్య సామాజిక సేవా సంస్థ  కలం స్నేహం అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో...
Read More...

స్పెషల్ లోక్–అదాలత్‌లో 1861 కేసుల్లో రాజీ :జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

స్పెషల్ లోక్–అదాలత్‌లో 1861 కేసుల్లో రాజీ :జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  జగిత్యాల నవంబర్ 16 (ప్రజా మంటలు)స్పెషల్ లోక్–అదాలత్‌ ద్వారా సైబర్ మోసాల్లో కోల్పోయిన రూ.20 లక్షల మొత్తం బాధితులకు రీఫండ్   ఈనెల 15 వరకు స్పెషల్ లోక్-అదాలత్ లో భాగంగా, జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన, రాజీ పడటానికి అవకాశం ఉన్నటువంటి మరియు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న జిల్లాలో...
Read More...

యూపీలో రాతి క్వారీ కూలిన ఘటన ఒకరి మృతి, మరికొందరు శిథిలాల కింది

యూపీలో రాతి క్వారీ కూలిన ఘటన ఒకరి మృతి, మరికొందరు  శిథిలాల కింది సోన్‌భద్రా (ఉత్తరప్రదేశ్), నవంబర్ 16: ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రా జిల్లా బిల్లీ–మార్కుండి ప్రాంతంలోని కృష్ణ మైనింగ్ వర్క్స్ స్టోన్ క్వారీలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. క్వారీ గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న పలువురు కార్మికులు శిథిలాల క్రింద చిక్కుకున్నారు. ఇప్పటివరకు ఒక కార్మికుడి మృతదేహాన్ని బయటకు తీసినట్లు అధికారులు నిర్ధారించారు. ఘటన ఎలా జరిగింది? సాక్షులు...
Read More...

బీజేపీకి షాక్: మాజీ మంత్రి ఆర్.కే సింగ్ రాజీనామా – పార్టీ వెంటనే సస్పెండ్

బీజేపీకి షాక్: మాజీ మంత్రి ఆర్.కే సింగ్ రాజీనామా – పార్టీ వెంటనే సస్పెండ్ న్యూ ఢిల్లీ నవంబర్ 16 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి): మాజీ మంత్రి ఆర్.కే సింగ్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన పార్టీ కార్యకలాపాలలోనూ, నిర్ణయాలలోనూ తాను విభేదిస్తున్నానని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి అధికారికంగా సమర్పించారు. రాజీనామా ప్రకటించిన కొద్ది గంటల్లోనే బీజేపీ...
Read More...

బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి NDA భారీ ఏర్పాట్లు — నవంబర్ 19 లేదా 20న కార్యక్రమం

బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి NDA భారీ ఏర్పాట్లు — నవంబర్ 19 లేదా 20న కార్యక్రమం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA 202 సీట్లు గెలుచుకున్న తర్వాత, నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వేడుకను నవంబర్ 19 లేదా 20న ఘనంగా నిర్వహించేందుకు NDA సన్నాహాలు చేస్తోంది. ప్రధానమంత్రి మోదీ హాజరుకానున్నారు.
Read More...
Local News  State News 

హఫీజ్‌పేట్‌లో రుమాల్ హోటల్‌లో సిలిండర్ పేలి అగ్నిప్రమాదం

 హఫీజ్‌పేట్‌లో రుమాల్ హోటల్‌లో సిలిండర్ పేలి అగ్నిప్రమాదం హైదరాబాద్ హఫీజ్‌పేట్‌లోని రుమాల్ హోటల్‌లో గ్యాస్ సిలిండర్ పేలడంతో అగ్నిప్రమాదం. కిచెన్‌లో మంటలు చెలరేగినా యాజమాన్యం అప్రమత్తతతో ప్రాణనష్టం తప్పింది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు.
Read More...