ధర్మపురిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
ధర్మపురిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
(రామ కిష్టయ్య సంగన భట్ల 9440595494)
ప్రాచీన పుణ్య క్షేత్రమైన ధర్మపురి లోని శ్రీక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో, శుక్ర వారం వైకుంఠ (ముక్కోటి ఏకాదశి) వేడుకలు కన్నుల పండువగా, పైభవోపేతంగా జరిగాయి. ఉదయాత్ పూర్వం వేద మంత్రోచ్ఛారణల మధ్య, అర్చకులు పవిత్ర జలాలను కొనితెచ్చి లక్ష్మీ సమేత శ్రీ యోగానంద,శ్రీ ఉగ్ర నారసింహ, శ్రీ వేంకటేశ్వర స్వాముల మూల విరాట్టులను సాంప్రదాయ విధి విధాన రీతిలో, మహాక్షీరా భిషేకాది ప్రత్యేక పర్వదిన పూజలు నిర్వహించారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకృతులైన స్థానిక ఇలవేల్పులను దేవస్థాన ప్రాంగణంలో విద్యుద్దీపికలలో, వివిధ పుష్ప మాలికలతో, శోభాయమానంగా తీర్చి దిద్దిన రంగవల్లులతో, ఆకర్షణీయంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై అసీసుల గావించారు.
ధనుర్మాస ప్రత్యేకతలో సప్త హారతులు, షోడశోపచార పూజలు, వేద, శాస్త్ర పురాణ, సంగీత, నృత్య, వాద్యాది అవధారయాలతో ఆర్చనలు, భక్తుల గోత్ర నామాదులతో పూజలు నిర్వహించగా, భక్తజనులు భక్తి శ్రద్ధలతో కన్నులారా గాంచి తరిం చారు. అనంతరం జయ జయ ధ్వనాల మధ్య ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ సమక్షంలో, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసా చార్య వైకుంఠ (ఉత్తర) ద్వారానికి పూజ చేసి, నారికేళములను సమర్పించి, వైకుంఠ ద్వారం తెరవగా, ద్వారం ద్వారా ప్రవేశించిన భక్తులు పరమానంద భరితులై తనివి తీరా దర్శనం చేసుకున్నారు.
దేవస్థానం ఈ ఓ శ్రీనివాస్ పర్య వేక్షణలో, దేవస్థాన అర్చకుల బృందం ఆధ్వర్యంలో, సిబ్బంది సహకారంతో, బొజ్జా సంపత్ కుమార్, రాజ గోపాల్, పాలేపు ప్రవీణ్ శర్మ , క్షేత్ర పండితుల మార్గదర్శకత్వంలో ఘనంగా కార్య క్రమాలను నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఆర్డీఓ మధుసూదన్, డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ సత్తమ్మ, వైస్ చైర్మన్ రామయ్య, మార్కెట్ చైర్ పర్సన్ లావణ్య, వైస్ చైర్మన్ నర్సింలు
తదితరులు ప్రత్యేక పూజాదులలో పాల్గొన్నారు. అలాగే బచ్చు రాము గుప్తా సహకారంతో
నూతర సంవత్సర క్యాలండర్ ను విప్ లక్ష్మణ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఇతర ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత తదితరులు దైవ దర్శనాలు చేసుకున్నారు.
భారీ ఏర్పాట్లు
వైకుంఠ ఏకాదశి మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక శ్రద్ధతో, శ్రమ కోర్చి ఈ ఏడు భారీ ఏర్పాట్లు గావించారు. ప్రధాన రహదారి నుండి దేవస్థానం లోపలి వరకూ క్యూలైన్లు ఏర్పరిచారు. దేవస్థాన ప్రాంగణంలో విద్యుద్దీమాలతో, రంగవల్లులతో, పెద్దఎత్తున పందిళ్ళను, ప్రత్యేక పుష్ప వేదికను ఏర్పాటు చేశారు. దేవస్థానం బయట రోడుపై వివిధ ఆకృతులలో రంగులద్దారు. స్వాములను ఆసీనుల గావించిన ప్రదేశాన శాశ్వత ఇనుప షెడ్లను అందంగా తీర్చి దిద్దారు. ధర్మపురి సిఐ రాం నర్సింహా రెడ్డి రూప కల్పన మేరకు డివిజన్ లోని పలువురు ఎస్ఐలు, ఎఎస్ఐలు/హెడ్ కానిస్టే బుల్స్, సివిల్ కానిస్టేబుల్స్, హోంగార్డులు, మహిళా హోంగార్డులు, డిస్ట్రిక్ట్ గార్డులు, ప్రైవేటు సెక్యూటిరీ గార్డులు దేవస్థానంలో కట్టుదిట్టమైన బందోబస్తుని ర్వహించారు. ఎస్.ఆర్.ఆర్. కేబుల్ నెట్ వర్క్ ద్వారా గావించిన ప్రత్యక్ష ప్రసారం స్థానికంగా వీక్షించారు. బాచంపెల్లి సంతోష్ కుమార్
వ్యాఖ్యానాలు ఆకట్టుకున్నాయి.
గుండి జగదీశ్వర్, బృందం భక్తి సంగీత విభావరి అలరించింది. కోలాట బృందం నృత్యాలు, విన్యాసాలు, ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
వైకుంఠ ద్వార దర్శనంలో జాప్యం
వైకుంఠ ఏకాదశి సందర్భంగా, ఉత్సవాలలో ప్రధానమైన ఉత్తర ద్వార దర్శన కార్యక్రమ నిర్వహణ విషయంలో, పెరిగిన రద్దీ కారణంగా, దైవ సేవలు ద్వారం గుండా వేంచేపు చేయడంలో కాలా యాపన జరిగింది. వాస్తవానికి కారణాలేవైనా, ప్రత్యేక వేదిక వద్ద పూజలు 5గంటల తర్వాత ప్రారంభం చేశారు. 
ధనుర్మాస శుక్లపక్ష ఏకాదశి ప్రభాత సమయంలో, వైకుంఠంలో శ్రీమహావిష్ణువును దర్శించి తరించిన నేపథ్యంలో, ఇంద్రాది దేవతలు జరుపు కుంటున్న ఈ ఉత్సవ వేడుకలలో ప్రాతః కాలంలో బ్రాహ్మీముహూర్తంలో పూ జలొనర్చి, సూర్యోదయానికి ముందే వైకుంఠ (ఉత్తర) ద్వారం తెరవబడి, ఆ ద్వారం గుండా వేంచేసే స్వాముల దర్శనాలు చేసుకోవడం ప్రధానం మరియు క్షేత్రంలో అనుసరణీయమైన సాంప్రదాయం కాగా, భక్తుల రద్దీ అధికమై, దర్శనాలకై బారులు తీరిన సందర్భంలో, ఉదయాత్పూ ర్వమే ఉత్తర ద్వారం తెరిచినా, స్వాముల సేవల వేంచేపు చాలా ఆలస్యమై ఉదయం
8.30గంటల వరకు దైవ సేవలు పట్టణంలోకి వెళ్ళడం నిర్వహించారు. స్వాముల ఉత్సవ మూర్తుల సేవలను పట్టణ వీధుల గుండా ఊరేగించి, ఇసుక స్థంభం వద్ద పూజలు నిర్వహించాక, దేవస్థానానికి తిరిగి వచ్చారు.
ముక్కోటి వేదిక వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, వైకుంఠ ద్వారం నుండి భక్తుల దర్శనాలను కొనసాగించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం కార్యక్రమం
జగిత్యాల ఏప్రిల్ 16 ( ప్రజా మంటలు) ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20 వరకు వారం రోజులపాటు అగ్నిమాపక అమరవీరుల స్మారక వారోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రం ఆవరణలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సైదులు ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ
ఈ... కెసిఆర్ బహిరంగ సభ వేదిక నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జగిత్యాల ఏప్రిల్ 16 ( ప్రజా మంటలు
ఈ నెల 20 తేదీన కెసిఆర్ బహిరంగ సభలో సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని మిని స్టేడియం లో నిర్వహించనున్న బహిరంగ సభకు స్టేజి నిర్మాణ పనులను జగిత్యాల జిల్లా ఇంఛార్జి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి , ధర్మపురి ఇంచార్జ్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు... ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను పకడ్బందీగా అమలుచేయాలి _జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
మేడిపల్లి ఏప్రిల్ 16 ( ప్రజా మంటలు)అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలి
జిల్లాలో నిర్వహించనున్న ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక మండల స్థాయి సమావేశాలను అత్యంత పకడ్బందీగా, ప్రజా పాలన ప్రతిబింబించేలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశాలు చారిత్రాత్మకంగా... జగిత్యాల జిల్లాలోని ప్రతిభ కనబర్చిన మైనారిటీ గురుకులం విద్యార్థులకు సన్మానం
జగిత్యాల ఏప్రిల్ 16 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లాలోని తెలంగాణ మైనారిటి రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటి మైనారిటీ గురుకులం విద్యార్థులను అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడీస్) శ్రీ. బి.రాజ గౌడ్ ఇంటర్ ఫలితాలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించారు.
కుమారి. నేల్లెంకుల నందిత అనే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని (ఏం.పి.సి.) వార్షిక పరీక్షల ఫలితాల్లో 470... సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల ప్రధాన బాధ్యత
జగిత్యాల ఏప్రిల్ 16 (ప్రజా మంటలు)"అరైవ్ అలైవ్ " కార్యక్రమంలో భాగంగా వాహన డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు
జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “ అరైవ్ అలైవ్" కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఆదేశాల... మహిళ బిల్లుకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయటం పెద్ద కుట్ర* - కల్వకుంట్ల కవిత
- మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డీలిమిటేషన్ బిల్లును కాల్చే ప్రయత్నం
హైదరాబాద్, ఏప్రిల్ 16 (ప్రజా మంటలు):
మహిళల రిజర్వేషన్ల బిల్లుకు డీలిమిటేషన్ అంశాన్ని అనుసంధానం చేయడం పెద్ద కుట్ర అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డీలిమిటేషన్ బిల్లును అమలు చేయాలని కేంద్ర... బి.ఆర్.ఎస్ బహిరంగ సభ విజయవంతం చేయండి
జగిత్యాల ఏప్రిల్ 15 ( ప్రజా మంటలు)జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈనెల 20వ తేదీన కేసీఆర్ బహిరంగ సభ గురించి సన్నాహక సమావేశంలో పాల్గొన్న జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎమ్మెల్సీ ఎల్ రమణ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ... పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ వ్యతిరేకంగా రైతుల ఆందోళన.. వికారాబాద్లో కవిత అరెస్ట్
వికారాబాద్, ఏప్రిల్ 15 (ప్రజా మంటలు):
పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ వికారాబాద్లో రైతులు, తెలంగాణ జాగృతి, ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎండలో కూర్చొని ధర్నా నిర్వహించారు.ఈ ఆందోళనలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత,... జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తా జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంఘనభట్ల దినేష్
జగిత్యాల ఏప్రిల్ 14 (ప్రజా మంటలు) జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని నూతనంగా నియామకమైన జిల్లా గ్రంథాలయ అధ్యక్షుడు సంఘనభట్ల దినేష్ అన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరం ఆవరణ టిటిడి దేవస్థాన ధ్యానమండలిలో సంగనభట్ల దినేష్ కు తుంగూరు గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన అర్షకోట రాజగోపాల్... మెట్పల్లిలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు – నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సంజయ్
మెట్పల్లి, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు):
బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మెట్పల్లిలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కె. సంజయ్, న్యాయవాది తుల రాజేందర్ కుమార్, తులగంగవ్వ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. సమాజంలో సమానత్వం, న్యాయం కోసం... అజ్మీర్ దర్గాకు కవిత చాదర్ పంపిన కవిత.. కొత్త రాజకీయ సంకేతాలా?
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజస్థాన్లోని అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ పంపించారు. రాజకీయంగా కొత్త పార్టీ ఆవిర్భావం దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ చర్యకు ప్రాధాన్యం ఏర్పడింది.మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన కవిత, ఆ చాదర్ను... రేవంత్ రెడ్డి యాంటీ అంబేడ్కర్: కవిత సంచలన వ్యాఖ్యలు – తెలంగాణ అంబేడ్కర్ భిక్షే
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు):
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబేడ్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. అంబేడ్కర్కు వ్యతిరేకిగా ఈ దేశంలో ఎవరైనా ఉంటే అది రేవంత్ రెడ్డే అని ఆమె ఆరోపించారు.ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్... 