ప్రయాణికుల భధ్రతే లక్ష్యంగా వాహనాలు నడపాలి. - జిల్లా రవాణాశాఖధికారి శ్రీనివాస్.

On
ప్రయాణికుల భధ్రతే లక్ష్యంగా వాహనాలు నడపాలి. - జిల్లా రవాణాశాఖధికారి శ్రీనివాస్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల జనవరి 7(ప్రజా మంటలు ) : 

ఓవర్ స్పీడ్, నిర్లక్ష్య డ్రైవింగ్ అనే మానవ తప్పిదాల వల్లనే రోడ్డు ప్రమాధాలు జరుగుతున్నాయని వీటిని అరికట్టాల్సిన బాధ్యత డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరిపై ఉందని జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు.

జాతీయ రోడ్డు భద్రత మాసొత్సవాలను జగిత్యాల ఆర్టీసీ, రవాణా శాఖ సంయుక్తంగా మంగళవారం జగిత్యాల కొత్త బస్టాండ్ లో డిపో మేనేజర్ సునీత ఆధ్వర్యంలో నిర్వహించగా డిటిఓ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరు కాగా , జగిత్యాల పట్టణ సీ ఐ వేణుగోపాల్, ఎంవిఐ లు రామారావు, అభిలాష్, ట్రాఫిక్ ఎస్సై మల్లేశం, కవిత రెడ్డి, ఆర్టీసీ, రవాణా శాఖ సిబ్బంది ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా డీటీఓ శ్రీనివాస్ మాట్లాడుతు....

  • రోడ్డు ప్రమాధాలు ఉగ్రవాధం, భూకంపాల కంటే ప్రమాధమని చెబుతూ ఎక్కువగా వీటివల్లే మరణిస్తున్నారని అన్నారు.
  • చిన్న నిర్లక్ష్యం మూలంగా ప్రమాదం జరిగితే కుటుంబం రోడ్డున పడుతుందని, కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని డ్రైవింగ్ చేయాలని చెబుతూ ప్రయానికుల బాధ్రతే లక్ష్యంగా వాహనాలు నడుపాలని ట్యాక్సీ, ఆటో, కార్లు, ఇతర పెద్ద వాహనాల డ్రైవర్లకు సూచించారు.
  • దేశంలో ప్రమాధాలు 2 శాతం జరిగితే మృతులు ఎక్కువగా 11 శాతం ఉంటున్నారని, భద్రత నిజాజీవితంలో ముఖ్యమని పేర్కొన్నారు.
  • మైనర్లు డ్రైవింగులో ప్రమాదం జరిగితే 199ఏ ప్రకారం మైనర్ తో పాటు వాహనం రిజిస్ట్రేషన్ దారునికి శిక్ష పడుతుందని శ్రీనివాస్ తెలిపారు.
  • 25 నుండి 30 ఏళ్ల యువత దేశానికి చాలా ముఖ్యమని చెబుతూ యువత ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.స్పీడులో ఏమరుపాటు పనికి రాధని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేస్తే ప్రమాదలను నివారుంచవచ్చన్నారు.
  • ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చుతుందని ఆర్టీసీ సంస్థకు మంచి పేరుందని దాన్ని కాపాడుకోవాలని సూచించారు. 

జగిత్యాల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్. వేణుగోపాల్ మాట్లాడుతూ.... 

  • నిర్లక్ష్యం, దూకుడుతోనే ప్రమాధాలు జరుగుతున్నాయని, తాగి డ్రైవింగ్ చేయారాదని సూచించారు.
  • డ్రైవింగ్ లైసెన్స్, అర్సీ బుక్, ఇన్సూరెన్స్ కలిగి ఉంటే ప్రమాదం జరిగితే భీమా వర్తిస్తుందని చెబుతూ
  • హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేస్తే ప్రమాధాలను అరికట్టావాచ్చన్నారు.
  • భారత దేశంలో రోగాల ద్వారా కాకుండా రోడ్డు ప్రమాదలా వల్లనే ఎక్కువగా చనిపోతున్నారని సీఐ ఆందోళన వ్యక్తం చేశారు.
  • జరిమానాలు కడుతున్నారు కానీ ట్రిపుల్ రైడ్, సెల్ ఫోన్ మాట్లాఫుతూ, లైసెన్స్ లేకుండా, రోడ్ సేఫ్టీ పాటించకుండా, మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారని వీటిని పోలీస్ శాఖ ఉపేక్షించదని సీఐ వేణుగోపాల్ స్పష్టం చేశారు.

ఆర్టీసీ డిపో మేనేజర్ సునీత మాట్లాడుతూ.....

  • రోడ్డు ప్రమాధలు జరుగకుండా, కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని వాహనాలు నడుపాలన్నారు.
  • మైనర్లకు వెహికిల్స్ ఇవ్వవద్దని పేరెంట్స్ కు ఆమె సూచించారు. హెల్మెట్, సిట్ బెల్ట్ ధరించి డ్రైవింగ్ చేయాలన్నారు.

డిపో మేనేజర్ సునీత కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఘనంగా సన్మానించారు.

Tags
Join WhatsApp

More News...

National  State News 

సుప్రీం కోర్టు తీర్పు: గవర్నర్–ముఖ్యమంత్రి అధికారాలపై దేశవ్యాప్త చర్చ

సుప్రీం కోర్టు తీర్పు: గవర్నర్–ముఖ్యమంత్రి అధికారాలపై దేశవ్యాప్త చర్చ సుప్రీం కోర్టు గవర్నర్–ముఖ్యమంత్రి అధికార తీర్పు | Article 200, 201, 145(3) పూర్తి విశ్లేషణ (అవగాహన కొరకు మాత్రమే) (సిహెచ్ వి ప్రభాకర్ రావు) తమిళనాడు ముఖ్యమంత్రి–గవర్నర్ మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ తీర్పు వెనుక ఉన్న ప్రధాన రాజ్యాంగ...
Read More...
Local News 

చెరువుల మరమ్మత్తులకు నిధులు ఇవ్వండి : MLA సంజయ్

చెరువుల మరమ్మత్తులకు నిధులు ఇవ్వండి : MLA సంజయ్ హైదరాబాద్‌ నవంబర్ 21 (ప్రజా మంటలు):జగిత్యాల అభివృద్ధి పనులపై కీలక నిర్ణయాలు త్వరలో వెల్లువడనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని ఆయన కార్యాలయంలో కలిసి, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ వినతిపత్రం సమర్పించారు.   చెరువుల మరమ్మత్తులకు నిధుల అభ్యర్థన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపిన వివరాల...
Read More...
Local News  State News 

చిరు ఉద్యోగుల పెద్ద మనసు....ప్రతి నెల వేతనం నుంచి కొంత భాగం సేవ పనులకు..

చిరు ఉద్యోగుల పెద్ద మనసు....ప్రతి నెల వేతనం నుంచి కొంత భాగం సేవ పనులకు.. సికింద్రాబాద్, నవంబర్ 21 (ప్రజామంటలు) : ఆర్‌ఎన్‌ఆర్‌ ఇన్‌ఫ్రా సంస్థ ఉద్యోగులు కృష్ణజ్యోతి, కీర్తిల ఆధ్వర్యంలో గాంధీ ఆస్పత్రి ఎంసీహెచ్‌ విభాగంలో చికిత్స పొందుతున్న బాలింతలు, గర్భిణీలకు శుక్రవారం పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ వాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామాజిక సేవలో భాగంగా ఉద్యోగులు తమ వేతనంలో కొంతభాగాన్ని ప్రతి...
Read More...
Local News 

శిశు సంరక్షణపై మరింత అవగాహన పెంచుకోవాలి.. గాంధీలో న్యూ బోర్న్ బేబీ వారోత్సవాలు..

శిశు సంరక్షణపై మరింత అవగాహన పెంచుకోవాలి.. గాంధీలో న్యూ బోర్న్ బేబీ వారోత్సవాలు.. సికింద్రాబాద్, నవంబర్ 21 (ప్రజామంటలు) : నవ జాత శిశు సంరక్షణపై తల్లులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వైద్యనిపుణులు అభిప్రాయపడ్డారు. గాంధీ మదర్‌ అండ్‌ చైల్డ్ కేర్‌ ఆస్పత్రి (ఎంసీహెచ్) లో గైనకాలజీ, పిడియాట్రిక్‌ విభాగాల సంయుక్త నేతృత్వంలో న్యూబోర్న్‌ బేబీ వారోత్సవాలను పురష్కరించుకుని శుక్రవారం పలు అవేర్నెస్ కార్యక్రమాలు...
Read More...
Local News  Spiritual  

దేవాలయానికి ఎలక్ట్రానిక్ గుడి గంట బహుకరణ

దేవాలయానికి ఎలక్ట్రానిక్ గుడి గంట బహుకరణ ఇబ్రహీంపట్నం నవంబర్ 21 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):  ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వర్ష కొండ గ్రామంలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి శ్రీ పిస్క శ్రీనివాస్-లత దంపతులు ఎలక్ట్రానిక్ గుడి గంటను బహుకరించారు. ఈ గంట ప్రతి గంట, ప్రతి గంటకు టైం చెప్పడంతో పాటు, ఒక భగవద్గీత శ్లోకం  మరియు భక్తి గీతం...
Read More...

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్ లత

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి  అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్ లత ధర్మపురి నవంబర్ 21(ప్రజా మంటలు) కొనుగోలు కేంద్రాలకి వచ్చిన ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్. లత అన్నారు.  శుక్రవారం ధర్మపురి  మండలం రాజారాం , దమ్మన్నపేట్ మరియు దుబ్బల గూడెం   గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) మాట్లాడుతూ...
Read More...
National  State News 

రాష్ట్రపతికి రేవంత్ రెడ్డి స్వాగతం

రాష్ట్రపతికి రేవంత్ రెడ్డి స్వాగతం హైదరాబాద్‌, నవంబర్ 21 (ప్రజా మంటలు): భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్   జిష్ణు దేవ్ వర్మ తో కలిసి ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి    రాష్ట్రపతి ని ఆహ్వానించారు. రాష్ట్రపతి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న భారతీయ కళా మహోత్సవం – రెండవ...
Read More...
Local News 

క్రీడల వల్ల నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి  : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ 

క్రీడల వల్ల నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి  : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్  మెట్టుపల్లి నవంబర్ 21(ప్రజా మంటలు దగ్గుల అశోక్):   మెట్టుపల్లి పట్టణ పరిధిలోని వెల్లుల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి ఖోఖో  పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జిల్లా విద్యాధికారి రాము గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...
Read More...
Local News 

కౌన్సిలింగ్ తో  వృద్ధుల కేసులు పరిష్కారం..    

కౌన్సిలింగ్ తో  వృద్ధుల కేసులు పరిష్కారం..     జగిత్యాల నవంబర్ 21 (ప్రజా మంటలు): తల్లిదండ్రులను నిరాదరిస్తున్న  కొడుకులు, కోడళ్ళకు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ కౌన్సిలింగ్ నిర్వహించారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని సీనియర్ సిటిజెన్స్ కార్యాలయం కౌన్సిలింగ్ కేంద్రానికి జిల్లా లోని జగిత్యాల పట్టణం, బీర్పూర్, మల్యాల, పెగడపల్లి, గొల్ల పల్లి...
Read More...

దుబాయ్ ఎయిర్ షో లో కూలిన తేజస్ ఫైటర్

దుబాయ్ ఎయిర్ షో లో కూలిన తేజస్ ఫైటర్ దుబాయ్‌, నవంబర్ 21 (ప్రజా మంటలు): దుబాయ్‌ ఎయిర్‌ షోలో భారత్‌కు చెందిన తేజస్‌ యుద్ధ విమానం కూలిపోయిన ఘటన కలకలం రేపింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, బెంగళూరు హెచ్‌.ఏ‌.ఎల్‌ (HAL) సంస్థలో తయారైన ఈ లైట్​ కాంబాట్​ ఎయిర్‌క్రాఫ్ట్‌ మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో ఆకస్మికంగా కుప్పకూలింది. విమానం కూలిన వెంటనే అక్కడ భారీగా ...
Read More...

కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కట్టిన ముడుపు విడిపించిన ఎంపీ వంశీ

 కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కట్టిన ముడుపు విడిపించిన ఎంపీ వంశీ గొల్లపల్లి, నవంబర్ 21 (ప్రజా మంటలు): పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ రాఘవపట్నంలోని హనుమాన్ దేవాలయాన్ని దర్శించి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని గతంలో కట్టుకున్న ముడుపును ఈరోజు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి పురోహితుల ఆశీర్వాదం తీసుకున్నారు. గ్రామ ప్రజలతో మాట్లాడిన ఆయన దేవాలయ అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి సహాయం...
Read More...

ఈనెల 25 న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్?

ఈనెల 25 న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్? హైదరాబాద్‌, నవంబర్‌ 21 (ప్రజా మంటలు): తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. బీసీ డెడికేటెడ్ కమిషన్​ సమర్పించనున్న నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీరాజ్ చట్టం–2018 సవరణల ప్రకారం, గత ఎన్నికలలో...
Read More...