ప్రయాణికుల భధ్రతే లక్ష్యంగా వాహనాలు నడపాలి. - జిల్లా రవాణాశాఖధికారి శ్రీనివాస్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జనవరి 7(ప్రజా మంటలు ) :
ఓవర్ స్పీడ్, నిర్లక్ష్య డ్రైవింగ్ అనే మానవ తప్పిదాల వల్లనే రోడ్డు ప్రమాధాలు జరుగుతున్నాయని వీటిని అరికట్టాల్సిన బాధ్యత డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరిపై ఉందని జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు.
జాతీయ రోడ్డు భద్రత మాసొత్సవాలను జగిత్యాల ఆర్టీసీ, రవాణా శాఖ సంయుక్తంగా మంగళవారం జగిత్యాల కొత్త బస్టాండ్ లో డిపో మేనేజర్ సునీత ఆధ్వర్యంలో నిర్వహించగా డిటిఓ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరు కాగా , జగిత్యాల పట్టణ సీ ఐ వేణుగోపాల్, ఎంవిఐ లు రామారావు, అభిలాష్, ట్రాఫిక్ ఎస్సై మల్లేశం, కవిత రెడ్డి, ఆర్టీసీ, రవాణా శాఖ సిబ్బంది ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా డీటీఓ శ్రీనివాస్ మాట్లాడుతు....
- రోడ్డు ప్రమాధాలు ఉగ్రవాధం, భూకంపాల కంటే ప్రమాధమని చెబుతూ ఎక్కువగా వీటివల్లే మరణిస్తున్నారని అన్నారు.
- చిన్న నిర్లక్ష్యం మూలంగా ప్రమాదం జరిగితే కుటుంబం రోడ్డున పడుతుందని, కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని డ్రైవింగ్ చేయాలని చెబుతూ ప్రయానికుల బాధ్రతే లక్ష్యంగా వాహనాలు నడుపాలని ట్యాక్సీ, ఆటో, కార్లు, ఇతర పెద్ద వాహనాల డ్రైవర్లకు సూచించారు.
- దేశంలో ప్రమాధాలు 2 శాతం జరిగితే మృతులు ఎక్కువగా 11 శాతం ఉంటున్నారని, భద్రత నిజాజీవితంలో ముఖ్యమని పేర్కొన్నారు.
- మైనర్లు డ్రైవింగులో ప్రమాదం జరిగితే 199ఏ ప్రకారం మైనర్ తో పాటు వాహనం రిజిస్ట్రేషన్ దారునికి శిక్ష పడుతుందని శ్రీనివాస్ తెలిపారు.
- 25 నుండి 30 ఏళ్ల యువత దేశానికి చాలా ముఖ్యమని చెబుతూ యువత ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.స్పీడులో ఏమరుపాటు పనికి రాధని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేస్తే ప్రమాదలను నివారుంచవచ్చన్నారు.
- ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చుతుందని ఆర్టీసీ సంస్థకు మంచి పేరుందని దాన్ని కాపాడుకోవాలని సూచించారు.
జగిత్యాల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్. వేణుగోపాల్ మాట్లాడుతూ....
- నిర్లక్ష్యం, దూకుడుతోనే ప్రమాధాలు జరుగుతున్నాయని, తాగి డ్రైవింగ్ చేయారాదని సూచించారు.
- డ్రైవింగ్ లైసెన్స్, అర్సీ బుక్, ఇన్సూరెన్స్ కలిగి ఉంటే ప్రమాదం జరిగితే భీమా వర్తిస్తుందని చెబుతూ
- హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేస్తే ప్రమాధాలను అరికట్టావాచ్చన్నారు.
- భారత దేశంలో రోగాల ద్వారా కాకుండా రోడ్డు ప్రమాదలా వల్లనే ఎక్కువగా చనిపోతున్నారని సీఐ ఆందోళన వ్యక్తం చేశారు.
- జరిమానాలు కడుతున్నారు కానీ ట్రిపుల్ రైడ్, సెల్ ఫోన్ మాట్లాఫుతూ, లైసెన్స్ లేకుండా, రోడ్ సేఫ్టీ పాటించకుండా, మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారని వీటిని పోలీస్ శాఖ ఉపేక్షించదని సీఐ వేణుగోపాల్ స్పష్టం చేశారు.
ఆర్టీసీ డిపో మేనేజర్ సునీత మాట్లాడుతూ.....
- రోడ్డు ప్రమాధలు జరుగకుండా, కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని వాహనాలు నడుపాలన్నారు.
- మైనర్లకు వెహికిల్స్ ఇవ్వవద్దని పేరెంట్స్ కు ఆమె సూచించారు. హెల్మెట్, సిట్ బెల్ట్ ధరించి డ్రైవింగ్ చేయాలన్నారు.
డిపో మేనేజర్ సునీత కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఘనంగా సన్మానించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
జగిత్యాల జిల్లా ప్రతినిధి, ( ప్రజా మంటలు) సెప్టెంబర్ 19:
గణేశ్ నిమజ్జనo శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సజావుగా జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. శనివారం జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తో కలిసి గణేష్ నిమజ్జన ప్రాంతాలైన జగిత్యాలలో... వర్ష కొండలో గణపతి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు,
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామంలో పెద్ద చెరువు వద్ద గణపతి నిమజ్జన ఏర్పాట్లను తహసిల్దార్ వరప్రసాద్,ఎస్ఐ నవీన్ పరిశీలించినరు,
గంగమ్మ గుడి కట్టపైన నుండి చిన్న గణపతులు నిమజ్జనం, గంగపుత్ర సంఘ భవనం వద్ద నుండి పెద్ద గణపతులు నిమగ్నం చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నట్లు... మహాత్మ జ్యోతిరావ్ ఫూలే స్కూల్ ని ఆకష్మిక తనిఖీ చేసిన సీనియర్ సివిల్ జడ్జి.-ఆర్. అజయ్ కుమార్
మెట్టుపల్లి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
మెట్ పల్లి మండల లీగల్ సర్వీసెస్ ఛైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి ఆర్. అజయ్ కుమార్, శనివారం పట్టణంలోని మహాత్మ జ్యోతిరావ్ పూలే బాలుర హాస్టల్, బీర్పూర్ ఎట్ మెట్ పల్లిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో ఉన్న కిచెన్, బాత్రూం,... చేనేత కార్మికులందరికీ ‘చేయూత’ పెన్షన్ వర్తింపజేయాలి : ఎల్ రమణ
హైదరాబాద్ సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న అర్హులైన ప్రతి కార్మికుడికి ‘చేయూత’ పెన్షన్ పథకం వర్తించేలా అర్హత ప్రమాణాలను విస్తరించాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
ప్రస్తుతం జియో ట్యాగింగ్ ద్వారా గుర్తింపు... రేవంత్రెడ్డికి సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదు: మాజీ మంత్రి జీవన్రెడ్డి
పాలన చేతగాక.. రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్
హైకోర్టు తీర్పు పార్టీ ఫిరాయింపుల విషయంలో ప్రభుత్వానికి గుణపాఠం
జగిత్యాల, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి ఆరోపించారు. రైతుల సమస్యలు, ఆరు గ్యారంటీల అమలు వంటి... కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అమన్ జిత్ సింగ్
కరీంనగర్, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
కరీంనగర్ పట్టణంలోని సిక్కు వాడకు చెందిన కాంగ్రెస్ నాయకుడు అమన్ జిత్ సింగ్ను జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. చొప్పదండి ఎమ్మెల్యే, DCC అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం రేకుర్తి క్యాంపు కార్యాలయంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్... రేపే కొడంగల్ గడ్డపై కల్వకుంట్ల కవిత పాంచజన్య శంఖారావం
కొడంగల్–కోస్గి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు)::
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కోస్గి కాలేజీ గ్రౌండ్లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నారు. సభకు పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. 120 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో సభా వేదికను ఏర్పాటు చేయగా, సుమారు... మున్సిపల్ లో గణనాథునుకి ఉత్తర పూజలు
జగిత్యాల, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
వినాయక నవరాత్రుల సందర్భంగా జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణనాథునికి మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, కమిషనర్ సత్య ప్రణవ్, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్తర పూజలు చేసి అన్నదానం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర చేపట్టారు.... సింహాచలం జగన్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు
ఎండపెల్లి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఎండపెల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన కుటుంబ సభ్యులను జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత... రాయికల్లో లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే సంజయ్
రాయికల్, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
రాయికల్ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.30 లక్షల వ్యయంతో నాలుగు డీటీఆర్లు ఏర్పాటు చేసినట్లు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. గృహజ్యోతి పథకం... రాయికల్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ
రాయికల్, సెప్టెంబర్ 18 (ప్రజా మంటలు):
రాయికల్ పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీరనాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆవిష్కరించారు.
ఈ విగ్రహాన్ని వేముల ప్రభాకర్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా... శ్రీ గౌరీ ప్రియ నగర వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ మండపం వద్ద కొనసాగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు
కీసర సెప్టెంబర్ 17 ( ప్రజా మంటలు)కుందన్ పల్లి లోని శ్రీ గౌరీ ప్రియ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ మండపం వద్ద నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతినిత్యం కొనసాగుతున్నాయి.
దీనిలో భాగంగా గణేష్ హోమము మాతలచే సామూహిక కుంకుమార్చనలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు... 