ప్రయాణికుల భధ్రతే లక్ష్యంగా వాహనాలు నడపాలి. - జిల్లా రవాణాశాఖధికారి శ్రీనివాస్.

On
ప్రయాణికుల భధ్రతే లక్ష్యంగా వాహనాలు నడపాలి. - జిల్లా రవాణాశాఖధికారి శ్రీనివాస్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల జనవరి 7(ప్రజా మంటలు ) : 

ఓవర్ స్పీడ్, నిర్లక్ష్య డ్రైవింగ్ అనే మానవ తప్పిదాల వల్లనే రోడ్డు ప్రమాధాలు జరుగుతున్నాయని వీటిని అరికట్టాల్సిన బాధ్యత డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరిపై ఉందని జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు.

జాతీయ రోడ్డు భద్రత మాసొత్సవాలను జగిత్యాల ఆర్టీసీ, రవాణా శాఖ సంయుక్తంగా మంగళవారం జగిత్యాల కొత్త బస్టాండ్ లో డిపో మేనేజర్ సునీత ఆధ్వర్యంలో నిర్వహించగా డిటిఓ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరు కాగా , జగిత్యాల పట్టణ సీ ఐ వేణుగోపాల్, ఎంవిఐ లు రామారావు, అభిలాష్, ట్రాఫిక్ ఎస్సై మల్లేశం, కవిత రెడ్డి, ఆర్టీసీ, రవాణా శాఖ సిబ్బంది ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా డీటీఓ శ్రీనివాస్ మాట్లాడుతు....

  • రోడ్డు ప్రమాధాలు ఉగ్రవాధం, భూకంపాల కంటే ప్రమాధమని చెబుతూ ఎక్కువగా వీటివల్లే మరణిస్తున్నారని అన్నారు.
  • చిన్న నిర్లక్ష్యం మూలంగా ప్రమాదం జరిగితే కుటుంబం రోడ్డున పడుతుందని, కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని డ్రైవింగ్ చేయాలని చెబుతూ ప్రయానికుల బాధ్రతే లక్ష్యంగా వాహనాలు నడుపాలని ట్యాక్సీ, ఆటో, కార్లు, ఇతర పెద్ద వాహనాల డ్రైవర్లకు సూచించారు.
  • దేశంలో ప్రమాధాలు 2 శాతం జరిగితే మృతులు ఎక్కువగా 11 శాతం ఉంటున్నారని, భద్రత నిజాజీవితంలో ముఖ్యమని పేర్కొన్నారు.
  • మైనర్లు డ్రైవింగులో ప్రమాదం జరిగితే 199ఏ ప్రకారం మైనర్ తో పాటు వాహనం రిజిస్ట్రేషన్ దారునికి శిక్ష పడుతుందని శ్రీనివాస్ తెలిపారు.
  • 25 నుండి 30 ఏళ్ల యువత దేశానికి చాలా ముఖ్యమని చెబుతూ యువత ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.స్పీడులో ఏమరుపాటు పనికి రాధని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేస్తే ప్రమాదలను నివారుంచవచ్చన్నారు.
  • ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చుతుందని ఆర్టీసీ సంస్థకు మంచి పేరుందని దాన్ని కాపాడుకోవాలని సూచించారు. 

జగిత్యాల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్. వేణుగోపాల్ మాట్లాడుతూ.... 

  • నిర్లక్ష్యం, దూకుడుతోనే ప్రమాధాలు జరుగుతున్నాయని, తాగి డ్రైవింగ్ చేయారాదని సూచించారు.
  • డ్రైవింగ్ లైసెన్స్, అర్సీ బుక్, ఇన్సూరెన్స్ కలిగి ఉంటే ప్రమాదం జరిగితే భీమా వర్తిస్తుందని చెబుతూ
  • హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేస్తే ప్రమాధాలను అరికట్టావాచ్చన్నారు.
  • భారత దేశంలో రోగాల ద్వారా కాకుండా రోడ్డు ప్రమాదలా వల్లనే ఎక్కువగా చనిపోతున్నారని సీఐ ఆందోళన వ్యక్తం చేశారు.
  • జరిమానాలు కడుతున్నారు కానీ ట్రిపుల్ రైడ్, సెల్ ఫోన్ మాట్లాఫుతూ, లైసెన్స్ లేకుండా, రోడ్ సేఫ్టీ పాటించకుండా, మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారని వీటిని పోలీస్ శాఖ ఉపేక్షించదని సీఐ వేణుగోపాల్ స్పష్టం చేశారు.

ఆర్టీసీ డిపో మేనేజర్ సునీత మాట్లాడుతూ.....

  • రోడ్డు ప్రమాధలు జరుగకుండా, కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని వాహనాలు నడుపాలన్నారు.
  • మైనర్లకు వెహికిల్స్ ఇవ్వవద్దని పేరెంట్స్ కు ఆమె సూచించారు. హెల్మెట్, సిట్ బెల్ట్ ధరించి డ్రైవింగ్ చేయాలన్నారు.

డిపో మేనేజర్ సునీత కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఘనంగా సన్మానించారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

వరి కొయ్యలు కాల్చి పలువురి ప్రమాదానికి కారణమైన వారిపై ప్రజావాణిలో ఫిర్యాదు 

వరి కొయ్యలు కాల్చి పలువురి ప్రమాదానికి కారణమైన వారిపై ప్రజావాణిలో ఫిర్యాదు  జగిత్యాల జూన్ 8 (ప్రజా మంటలు) జగిత్యాల  రూరల్ మండలం తక్కలపల్లి గ్రామ శివారులో తుమ్మచెట్టు కు నిప్పంటుకొని అదే మార్గంలో వస్తున్న బైరి వేణు ,కడారి భరత్ లు గాయాలపాలు అయినారు. ఇట్టి విషయంపై జిల్లా కేంద్రం విజయపురి కాలనీకి చెందిన సంబుమహేష్( 29) తండ్రి మల్లయ్య సోమవారం  తుమ్మచెట్టు కాలడానికి కారకులైన మిట్టపల్లి...
Read More...
Local News 

ఎంవి నరసింహారెడ్డి అస్తమయం 

ఎంవి నరసింహారెడ్డి అస్తమయం  జగిత్యాల జూన్ 8 (ప్రజా మంటలు)జగిత్యాల ఎస్ కె ఎల్ ఎన్ రావు బిఈడి కళాశాల కరెస్పాండెంట్, రచయిత ఎం.వి నరసింహారెడ్డి ఈరోజు సోమవారం సాయంత్రం 7 గంటలకు జగిత్యాలలో ఆయన నివాసంలో మృతి చెందారు. ఆయన నాలుగు వేదాలు మరియు ఉపనిషత్తులు జోక్స్ బ్యాంక్ జోక్స్ టానిక్ లాంటి హాస్య రచనల పుస్తకాలు,...
Read More...
National  Comment 

మమతా కాంగ్రెస్ గూటికి చేరితే... బీజేపీ వ్యూహానికి అతిపెద్ద ఎదురుదెబ్బ?

మమతా కాంగ్రెస్ గూటికి చేరితే... బీజేపీ వ్యూహానికి అతిపెద్ద ఎదురుదెబ్బ? న్యూ డిల్లీ జూన్ 08 : భారత రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఒక కొత్త రాజకీయ పునర్వ్యవస్థీకరణకు సంకేతాలిస్తున్నాయా? ఢిల్లీలో జరిగిన INDIA కూటమి సమావేశం తర్వాత రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చలను పరిశీలిస్తే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలవాలంటే ప్రతిపక్ష శక్తుల ఐక్యత తప్పనిసరి అనే...
Read More...
Local News 

మారుతి స్నేహ మండలి వారిచే ప్రతిభా పురస్కారాల వితరణ 

మారుతి స్నేహ మండలి వారిచే ప్రతిభా పురస్కారాల వితరణ  జగిత్యాల జూన్ 7( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో మారుతి స్నేహ మండలి వారిచే ప్రతిభా పురస్కారాలు అందజేయబడినవి. 2025 26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ యందు 1000 మార్కులకు గాను 982 ఎంపీసీ విభాగం నందు సాధించిన జి సుప్రీత్, ఎస్ ఎస్ సి నందు పి .  హాసినిశర్మ 600/578 మార్కులు సాధించగా...
Read More...
Local News 

హనుమాన్ చాలీసా భక్త బృందం వారిచే విద్యార్థులకు పురస్కారాల ప్రధానం

హనుమాన్ చాలీసా భక్త బృందం వారిచే విద్యార్థులకు పురస్కారాల ప్రధానం జగిత్యాల జూన్ 7(ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో గత తొమ్మిది సంవత్సరాలుగా హనుమాన్ చాలీసా భక్త బృందం వారిచే సామూహిక పారాయణం నిర్వహించబడుచున్నది. కాగా ఈ సంవత్సరము నుండి నూతనంగా ఎస్  ఎస్ఎస్సి ,ఇంటర్మీడియట్, డిగ్రీ నందు 90% పైబడి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడానికి శ్రీకారం చుట్టారు....
Read More...
State News  Crime 

₹80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్

₹80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జగిత్యాల, జూన్ 04 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మొయినుద్దీన్ ₹80 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ నేతృత్వంలో గురువారం ఈ దాడి నిర్వహించారు....
Read More...
Local News  State News  Crime 

నందికొండ మున్సిపల్ అధికారుల తీరుపై టీఆర్ఎస్ ఆగ్రహం

నందికొండ మున్సిపల్ అధికారుల తీరుపై టీఆర్ఎస్ ఆగ్రహం నాగార్జునసాగర్, జూన్ 4 (ప్రజా మంటలు): నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నందికొండ మున్సిపల్ అధికారులు పైలాన్ క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండా గద్దెను కూల్చివేయడంపై ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల జెండా గద్దెలను వదిలి టీఆర్ఎస్ గద్దెను మాత్రమే తొలగించడం వివక్షపూరిత చర్య అని...
Read More...
Local News 

కన్నాపూర్ లో కాలిన ఈత - తాటి వనం సందర్శించిన మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్

కన్నాపూర్ లో కాలిన ఈత - తాటి వనం  సందర్శించిన మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్    జగిత్యాల  జూన్2- ( ప్రజా మంటలు)జగిత్యాల రూరల్ మండలం కన్నాపూర్ గ్రామంలో గత 5 రోజుల క్రితం ప్రమాదవశాత్తు కాలిపోయిన 500 ఈత - తాటి చెట్లను  జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ మంగళ వారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...కన్నాపూర్ గ్రామంలోని దాదాపు 27...
Read More...
Local News 

మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాల పెంపు కోసం ప్రచారo 

మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాల పెంపు కోసం ప్రచారo  మల్యాల జూన్ 2 (ప్రజా మంటలు) ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలను పెంచడం మరియు ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలతో పోటీని ఎదుర్కొనే దృష్టితో, మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం శివరామకృష్ణ మరియు అధ్యాపకులు ఇంటింటికీ ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారంలో ఎస్.ఎస్.సి. పాసైన ప్రతి విద్యార్థిని మరియు వారి తల్లిదండ్రులను కలిసి, కళాశాల...
Read More...
Local News 

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు   జగిత్యాల జూన్ 2 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మంగళవారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టౌన్ సిఐ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ ,ట్రాఫిక్ కానిస్టేబుళ్ళు ,టౌన్ ఎస్సై తదితరులు పాల్గొన్నారు.
Read More...
Local News 

జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు

జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు జగిత్యాల జూన్ 2 (ప్రజా మంటలు)ఎంపికైన అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని   రాష్ట్ర ప్రభుత్వం  ప్రకటించిన ప్రతిష్టాత్మకమైన “సేవా పథకం”లకు ఎంపికైన జగిత్యాల జిల్లా పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో నిబద్ధత,...
Read More...
Local News 

జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థలో రాష్ట్రావిర్భావ వేడుకు

జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థలో రాష్ట్రావిర్భావ వేడుకు జగిత్యాల జూన్ 02 (ప్రజా మంటలు): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సంఘనభట్ల దినేష్  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం తెలంగాణ ఆవిర్భావం, రాష్ట్ర సాధనలో జరిగిన ఉద్యమాల ప్రాముఖ్యతపై విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో స్థానిక విద్యార్థిని, విద్యార్థులు...
Read More...