నూలు పోగుల బతుకు చిత్రం "కామ్ గార్ "
నూలు పోగుల బతుకు చిత్రం "కామ్ గార్ ".
- అల్లే రమేష్, జర్నలిస్టు, సిరిసిల్ల
కష్టాలను కలబోసుకుని నూలు పోగుల బతుకు చిత్రాల ఒకచోట పోగేసుకుని లక్ష్మణ్ కలబోసుకుంటున్న దృశ్యాలు అతని కవిత్వంలో ఆవిష్కృతం అవుతుంటాయి." రాత్ ఫైల్ దివాస్ పైల్ "కవిత సంకలనంలో సిరిసిల్ల నేత బతుకుల ముఖచిత్రాలను ఆవిష్కరించిన సిరిసిల్ల కార్మిక కవి ఆడెపు లక్ష్మణ్. కవిత్వం కొనసాగింపు క్రమంలోంచి వచ్చిందే "కామ్ గార్" కవిత్వ సంకలనం. 2007 నుంచి 2023 వరకు తాను సిరిసిల్ల నేత బతుకుల తండ్లాటను అక్షరాల్లో సవరించిన సందర్భాలను సిరిసిల్ల మానేరు రచయితల సంఘం పుస్తక రూపంలో తీసుకొచ్చింది.
స్వతహా మరమగ్గాల కార్మికుడైన లక్ష్మణ్ తన జీవితంలో ఎదురైన అనుభవా లను తన చుట్టూ ఉన్న కార్మికుల జీవితాల్లో కల్లోలాన్ని ప్రత్యక్ష చూసినవాడు. తన అనుభవాల నుంచి కార్మికుల జీవితాల్లోని అనేక కోణాలను దుఃఖ భరిత జీవితాలను కవిత్వంగా మలిచి అందించిన కవిత్వమే" కామ్ గార్". కవిత్వం నిండా పరుచుకున్న కార్మికుల జీవితాలు నిటారుగా నిలబడి కవిత్వమై సమాజాన్ని నిలదీసి ప్రశ్నిస్తున్నట్లే కనిపిస్తుంది. అవసరం తీరకుండానే అలా వచ్చి పోయే "పగరా" చిన్నచిన్న సంతోషాలను కూడా వాయిదా వేస్తూ సమస్యలు తీరకుండానే ...సంక్షోభాల ఊబిలో మర మగ్గాల కార్మికుల జీవితాల అస్తిత్వంపై దెబ్బ కొట్టి పోతే కన్నీటిని దాచుకున్న కండ్ల వెనుక భవిష్యత్ తరాలకు ఇచ్చి పోతున్న బాకీల చిట్టాలు జీవితాలు కవిత్వం నిండా మనతో కలబోసుకుంటాయి. వదిలోచ్చిన వలసల అనుభవాల మరోసారి లక్ష్మణ్ యాది చేస్తాడు. మాటల్లో చెప్పలేం దుఃఖం , కనిపిస్తున్న సంక్షోభాల వెనుక కరిగిపోయిన కార్మికుల జీవితాల తాలుకు ప్రశ్నలను మన ముందు ఉంచుతున్న కవిత్వం. కాలక్షేపం కోసం కాకుండా కార్మికుల జీవితాలను పట్టిచూపి కవిత్వం అందరూ ఓసారి తడిమి చూడాల్సిందే.. కవిత్వానికి ముందుమాట రాసిన మచ్చ ప్రభాకర్, 5 తరగతి వరకు చదువుకున్న తన సాహితి నేపథ్యం గురించి లక్ష్మణ్ చెప్పుకున్న మాట ప్రత్యేకంగా కందుకూరి రమేష్ బాబు అందరికోసం చెప్పిన మాట కవిత్వం వెనుక ఉన్న గుండె తడిని గుర్తు చేస్తాయి...
సంకలనంలోని ఒక కవిత.
భీవండీకి పోయి రావాలె
భీవండికి మళ్లీ
ఒకసారి పోయి రావాలె
కడుపునిండా తిండి పెట్టి
కుటుంబాన్ని సాకిన దేశం పోయి రావాలె
ఏ రాత్రో అపరాత్రో పోయిన
పొట్టకు పెట్టిన అమ్మ చల్లని చేయని
ఒకసారి తడిమి రావాలె
......
. ఎంతమంది బతికున్నారో
ఎంతమంది చీకటి పోగులు కలిసిపోయారో
మల్లొక్కసారి సంచాల కార్ఖానాలోకి పోవాలె
......
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ గాగుల్స్, వాటర్ ఫ్లాస్క్స్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల మే 25(ప్రజా మంటలు) జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది ఆరోగ్య రక్షణ కోసం జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా స్థానిక ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ గాగుల్స్ మరియు వాటర్... శాంతి కళ్యాణంతో ఘనంగా ముగిసిన విష్ణు పురాణ ప్రవచన సప్తాహం
జగిత్యాల మే 24 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కృష్ణ నగర్ లోని ఉమా శంకర్ గార్డెన్స్ లో గత వారం రోజులుగా ప్రముఖ పౌరాణిక వేద పండితులు బుర్రా భాస్కర శర్మ చే అంగ రంగ వైభవంగా జరిగిన శ్రీ మహా విష్ణు పురాణం ప్రవచనం సమాప్తి సందర్బంగా శ్రీ లక్ష్మి నారాయణుల... చదువుతోనే చక్కటి జీవితం జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్
జగిత్యాల మే 24 (ప్రజా మంటలు)చదువుతోనే సమాజంలో గుర్తింపు, చక్కటి జీవితం లభిస్తుందని జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ అన్నారు పట్టణంలోని ఎల్ ఎల్ గార్డెన్స్ లో జరిగిన గౌడ ప్రొఫెషనల్ అండ్ అఫీషియల్స్ అసోసియేషన్ (గోప) జగిత్యాల జిల్లా కమిటీ నిర్వహించిన ప్రతిభ పురస్కారాల అవార్డ్స్ మహోత్సవంలో ఆయన ముఖ్య... భాగవత ప్రవచకునికి భాగవత చూర్ణిక అందజేత
జగిత్యాల మే 24 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని గీత భవన్ లో ఖండవల్లి ఆదిత్య శర్మచే శ్రీమద్ భాగవత సప్తాహం కొనసాగుతుండగా ఆదివారం ఉదయము కీ"శే " సరాబు మందిరం వెంకటేశ్వర శర్మచే తెలుగులో అనువదించబడిన భాగవత సప్తాహ చూర్ణిక పుస్తకాలను వెంకటేశ్వర శర్మ కుమారుడు భారవిశర్మ పురాణ ప్రవచకులు ఆదిత్య శర్మకు అందజేశారు. ... ఆరవ రోజు కొనసాగుతున్న విష్ణు పురాణం
జగిత్యాల మే 23(ప్రజా మంటలు) జిల్లా కేoద్రం కృష్ణా నగర్ లోని ఉమా శంకర్ గార్డెన్స్ లో, ప్రముఖ పౌరాణిక, వేద, పండితులు, మంచిర్యాల వాస్తవ్యులు, బహ్మ శ్రీ బుర్రా భాస్కర శర్మ చే, ఎంతో వైభవంగా ,జరుగుతున్న విష్ణు పురాణం శనివారం 6వ రోజు కు చేరింది. సామూహిక శ్రీ విష్ణు స హస్ర... క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి జ్ఞాపికలు, అందజేసిన అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్
జగిత్యాల మే 23(ప్రజా మంటలు)జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించిన “99 రోజుల యాక్షన్ ప్లాన్ – ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” ముగింపు కార్యక్రమం జిల్లా యువజన మరియు క్రీడల శాఖ స్వామి వివేకానంద ఇండోర్ మినీ స్టేడియంలో ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య... తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలు - 23.05.2026
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
హైదరాబాద్ 23 మే (ప్రజా మంటలు) :
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలు మరియు హైలైట్స్.
1. రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
మొత్తం 2 లక్షల 50 వేల మంది పేద కుటుంబాల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి... గొల్లపల్లి మండల కేంద్రంలో ట్రెయిన్డ్ డాగ్స్ నారకోటిక్ నిషేధిత గంజాయి మధిక ద్రవ్యాల ప్రత్యేక తనిఖీలు
గొల్లపల్లి మే 22 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి ధర్మపురి సర్కిల్ రామ్ నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి పోలీస్ సిబ్బంది ట్రెయిన్డ్ డాగ్ స్క్వాడ్ తో గంజాయి నిషేధిత మాదక ద్రవ్యాల కోసం విస్తృత తనిఖీలు చేపట్టారు. మాదక... ఘనంగా ప్రారంభమైన శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞం
జగిత్యాల మే 21 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని గీత భవన్ లో పండిత శిరోమణి బ్రహ్మశ్రీ ఖండవల్లి ఆదిత్య శర్మ చే శ్రీమద్భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞము గురువారం ప్రారంభమైంది. ఉదయము 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి సాయంత్రం 3_30 నుండి 6_30 వరకు కొనసాగుచున్నది.
ఈనెల 27వ... ధర్మపురి పట్టణ లో ట్రెయిన్డ్ డాగ్స్ సహాయంతో నారకోటిక్ నిషేధిత గంజాయి మధిక ద్రవ్యాల ప్రత్యేక తనిఖీలు
గొల్లపల్లి మే 21 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి సూచనలతో, ధర్మపురి సర్కిల్ రామ్ నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై మహేష్ పోలీస్ సిబ్బంది ట్రెయిన్డ్ డాగ్ స్క్వాడ్ సహాయంతో గంజాయి నిషేధిత మాదక ద్రవ్యాల కోసం విస్తృత తనిఖీలు చేపట్టారు. జగిత్యాల జిల్లా... కుత్బుల్లాపూర్లో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ: ప్రభుత్వానికి కల్వకుంట్ల కవిత అల్టిమేటం
కుత్బుల్లాపూర్, హైదరాబాద్ | మే 21 (ప్రజా మంటలు):
తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన పార్టీ ఏర్పాటైందని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పలు రాజకీయ, సామాజిక అంశాలపై ప్రభుత్వానికి డెడ్లైన్ విధించారు.
జూన్ 2లోగా హామీలు... అనుమానాస్పద వ్యక్తులకు లాడ్జ్ గదులు ఇవ్వొద్దు, గుర్తింపు పత్రాలు తప్పనిసరి: టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్
జగిత్యాల మే 20(ప్రజా మంటలు)
చుక్క గంగారెడ్డి ప్రతినిధి
పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ మరియు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పట్టణ పోలీస్ స్టేషన్ పరిదిలోని లాడ్జ్ యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నిర్వాహకులు తప్పనిసరిగా పాటించవలసిన భద్రత నిబంధనలు మరియు మార్గదర్శకాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ,... 