నూలు పోగుల బతుకు చిత్రం "కామ్ గార్ "
నూలు పోగుల బతుకు చిత్రం "కామ్ గార్ ".
- అల్లే రమేష్, జర్నలిస్టు, సిరిసిల్ల
కష్టాలను కలబోసుకుని నూలు పోగుల బతుకు చిత్రాల ఒకచోట పోగేసుకుని లక్ష్మణ్ కలబోసుకుంటున్న దృశ్యాలు అతని కవిత్వంలో ఆవిష్కృతం అవుతుంటాయి." రాత్ ఫైల్ దివాస్ పైల్ "కవిత సంకలనంలో సిరిసిల్ల నేత బతుకుల ముఖచిత్రాలను ఆవిష్కరించిన సిరిసిల్ల కార్మిక కవి ఆడెపు లక్ష్మణ్. కవిత్వం కొనసాగింపు క్రమంలోంచి వచ్చిందే "కామ్ గార్" కవిత్వ సంకలనం. 2007 నుంచి 2023 వరకు తాను సిరిసిల్ల నేత బతుకుల తండ్లాటను అక్షరాల్లో సవరించిన సందర్భాలను సిరిసిల్ల మానేరు రచయితల సంఘం పుస్తక రూపంలో తీసుకొచ్చింది.
స్వతహా మరమగ్గాల కార్మికుడైన లక్ష్మణ్ తన జీవితంలో ఎదురైన అనుభవా లను తన చుట్టూ ఉన్న కార్మికుల జీవితాల్లో కల్లోలాన్ని ప్రత్యక్ష చూసినవాడు. తన అనుభవాల నుంచి కార్మికుల జీవితాల్లోని అనేక కోణాలను దుఃఖ భరిత జీవితాలను కవిత్వంగా మలిచి అందించిన కవిత్వమే" కామ్ గార్". కవిత్వం నిండా పరుచుకున్న కార్మికుల జీవితాలు నిటారుగా నిలబడి కవిత్వమై సమాజాన్ని నిలదీసి ప్రశ్నిస్తున్నట్లే కనిపిస్తుంది. అవసరం తీరకుండానే అలా వచ్చి పోయే "పగరా" చిన్నచిన్న సంతోషాలను కూడా వాయిదా వేస్తూ సమస్యలు తీరకుండానే ...సంక్షోభాల ఊబిలో మర మగ్గాల కార్మికుల జీవితాల అస్తిత్వంపై దెబ్బ కొట్టి పోతే కన్నీటిని దాచుకున్న కండ్ల వెనుక భవిష్యత్ తరాలకు ఇచ్చి పోతున్న బాకీల చిట్టాలు జీవితాలు కవిత్వం నిండా మనతో కలబోసుకుంటాయి. వదిలోచ్చిన వలసల అనుభవాల మరోసారి లక్ష్మణ్ యాది చేస్తాడు. మాటల్లో చెప్పలేం దుఃఖం , కనిపిస్తున్న సంక్షోభాల వెనుక కరిగిపోయిన కార్మికుల జీవితాల తాలుకు ప్రశ్నలను మన ముందు ఉంచుతున్న కవిత్వం. కాలక్షేపం కోసం కాకుండా కార్మికుల జీవితాలను పట్టిచూపి కవిత్వం అందరూ ఓసారి తడిమి చూడాల్సిందే.. కవిత్వానికి ముందుమాట రాసిన మచ్చ ప్రభాకర్, 5 తరగతి వరకు చదువుకున్న తన సాహితి నేపథ్యం గురించి లక్ష్మణ్ చెప్పుకున్న మాట ప్రత్యేకంగా కందుకూరి రమేష్ బాబు అందరికోసం చెప్పిన మాట కవిత్వం వెనుక ఉన్న గుండె తడిని గుర్తు చేస్తాయి...
సంకలనంలోని ఒక కవిత.
భీవండీకి పోయి రావాలె
భీవండికి మళ్లీ
ఒకసారి పోయి రావాలె
కడుపునిండా తిండి పెట్టి
కుటుంబాన్ని సాకిన దేశం పోయి రావాలె
ఏ రాత్రో అపరాత్రో పోయిన
పొట్టకు పెట్టిన అమ్మ చల్లని చేయని
ఒకసారి తడిమి రావాలె
......
. ఎంతమంది బతికున్నారో
ఎంతమంది చీకటి పోగులు కలిసిపోయారో
మల్లొక్కసారి సంచాల కార్ఖానాలోకి పోవాలె
......
More News...
<%- node_title %>
<%- node_title %>
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన
మిర్యాలగూడ, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ‘ప్రజాపాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
కార్యక్రమంలో నీలగిరి జిల్లా మహిళా సమాఖ్యకు రూ.1138 కోట్ల... జగిత్యాలలో 20 అడుగుల శ్రీవేంకటేశ్వర స్వామి 3డి సైకత శిల్ప ప్రదర్శన
జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
శ్రీ వెంకటేశ్వర స్వామి సమితి ఆధ్వర్యంలో తెలంగాణలో తొలిసారిగా జగిత్యాల కరీంనగర్ రోడ్ సర్కస్ గ్రౌండ్లో 20 అడుగుల కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి 3డి సైకత శిల్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను శ్రీమాన్ నంబి వేణుగోపాల చార్య ప్రారంభించారు.
ఈ 3డి సైకత శిల్ప... మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చాం : జిల్లా BRS అధ్యక్షులు
జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలోని జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసి బి-ఫారాలు అందజేశామని తెలిపారు. జనరల్ స్థానాల్లోనూ బీసీ... తెలంగాణ అధ్యయన కమిటీల సభ్యులతో కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీలతో నేటి నుంచి వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి, సబ్బండ వర్గాల వికాసం, సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా 50 అధ్యయన కమిటీలను తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసింది.
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బ్లూ ప్రింట్ రూపొందించే... “విద్యార్థులే.. స్వీపర్లు!” అనే వార్తా కథనంపై హక్కుల కమీషన్ కేసు
హైదరాబాద్, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సభ్యులు (న్యాయ విభాగం) సివడి ప్రవీణ గారు, నమస్తే తెలంగాణ దినపత్రికలో 04.02.2026న ప్రచురితమైన “విద్యార్థులే.. స్వీపర్లు!” అనే వార్తా కథనాన్ని ఆధారంగా తీసుకొని స్వయంచాలక (సూవో-మోటు) విచారణ చేపట్టారు.
హైదరాబాద్లోని అనేక ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో స్వీపర్లు అందుబాటులో లేకపోవడంతో, 1వ... జగిత్యాల మున్సిపాలిటీ పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు
జగిత్యాల ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
బిఆర్ఎస్ - బీజేపీ | కాంగ్రెస్ మూడు ప్రధాన పార్టీల నుండి పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు, వార్డుల వారిగా..
వార్డు
రిజర్వేషన్
BRS
BJP
కాంగ్రెస్
1
BC(G)
నిమిషకవి వంశీకృష్ణ
పుప్పాల రాజేష్
అనిల్ కుమార్ కూసరి
2
UR(W)
వొడ్డినేని సంధ్య కుమారి
కాశెట్టి... ఐల్నేని ఆసుపత్రి వారి సౌజన్యముతో క్యాన్సర్ పై అవగాహన సదస్సు
జగిత్యాల ఫిబ్రవరి 4 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని వాల్మీకి ఆవాసం గీతావిద్యాలయం గ్రౌండ్ లో బుధవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకొని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. క్యాన్సర్ వలన అనారోగ్యము మరణాలు తగ్గించడమే అవగాహన యొక్క ముఖ్య లక్ష్యం అని వైద్యులు పేర్కొన్నారు. డా వంశీ చేతన ప్రముఖ ఆంకాలజిస్ట్, డా వినీల ,డా... క్యాన్సర్ మరణశాసనం కాదు –మెగాస్టార్ చిరంజీవి
(పి కోటేశ్వర్)
సికింద్రాబాద్, పిబ్రవరి 04 ( ప్రజామంటలు) :
క్యాన్సర్ అనేది దేవుడు ఇచ్చిన శాపం కాదని, ముందస్తుగా గుర్తిస్తే ఈ వ్యాధిని కూడా జయించి సాధారణ జీవితం గడపవచ్చని పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవ కార్యక్రమంలో ఆయన
ఈ... రూ.15 లక్షల లంచంతో తీసుకొంటూ పట్టుబడ్డ జీహెచ్ఎంసీ ఎస్ఈ
హైదరాబాద్, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
హైదరాబాద్ కూకట్పల్లి జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సూపరింటెండింగ్ ఇంజనీర్ చిన్నారెడ్డి కాంట్రాక్టర్ నుంచి రూ.15 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
పెండింగ్లో ఉన్న బిల్లుల క్లియరెన్స్ కోసం లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి.... కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా: దివాళా కంపెనీకి వేల కోట్ల పనులు ఎలా? కెటిఆర్ ప్రశ్న
హైదరాబాద్ ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
దివాళా తీసినట్లు ప్రకటించిన కే ఎస్ ఎల్ ఆర్ ఇన్ఫ్రాటెక్ కాని 6వేల కోట్ల పనులను ఇచ్చిందని, ఇది cm రేవంత్ రెడ్డి బినామీ సంస్థ అని, బిఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు కేటీఆర్ పత్రిక సమావేశంలో ఆరోపించారు. ఈ ప్రశ్న నేను కాదు, సుప్రీంకోర్టు గత జనవరి 23... జగిత్యాల రాజకీయాల్లో మాటల యుద్ధం:జీవన్ Vs సంజయ్
జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
జగిత్యాల రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్పై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్ను అసెంబ్లీ స్పీకర్ కొట్టివేయడంతో, ఆయన “అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా” అని స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని, పార్టీ మారలేదని అఫిడవిట్, పార్టీ ఫండ్ చెల్లింపుల... స్పీకర్ క్లిన్ చిట్: జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ బీఆర్ఎస్లోనే
జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్పై బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్ను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. ఎమ్మెల్యే పార్టీ మారినట్లు నిరూపించే ఆధారాలు లేవని స్పష్టంగా పేర్కొన్నారు.
అభివృద్ధి కోసమే కాంగ్రెస్తో సమన్వయం – డా. సంజయ్ స్పష్టం
ఈ తీర్పుపై... 