రాజకీయంగా జీవన్ రెడ్డి పరిస్థితి ఏమిటి?

ఇది జీవన రెడ్డి రాజకీయ చరిత్ర ముగింపుకు కుట్రనా? రేపటి భవిష్యత్ నిర్ణయమేమిటి? కాంగ్రెస్ లో సీనియర్ల పరిస్థితి ఇంతేనా?

On
రాజకీయంగా జీవన్ రెడ్డి పరిస్థితి ఏమిటి?

 జగిత్యాల రాజకీయాలను ఒక కుదుపు కుడిపిన రాజకీయ హత్య

ఇది జీవన రెడ్డి రాజకీయ చరిత్ర ముగింపుకు కుట్రనా?

రేపటి భవిష్యత్ నిర్ణయమేమిటి?

కాంగ్రెస్ లో సీనియర్ల పరిస్థితి ఇంతేనా?

జగిత్యాలలో జరిగిన కాంగ్రెస్ నాయకుడు మార గంగారెడ్డి హత్య తరువాత అక్కడ ఏం జరగనున్నది?

రాజకీయంగా జీవన్ రెడ్డి పరిస్థితి ఏమిటి?

 

జగిత్యాల రాజకీయాలలో అనూహ్య మార్పులకు నాంది

ఎటూ తేల్చుకోలేని స్థితిలో జీవన రెడ్డి

చాపకింది నీరులా కాంగ్రెస్ లో బిఆర్ఎస్ వ్యవహారం

 (సిహెచ్ వి ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్)

 

జగిత్యాల రాజకీయాలలో కాంగ్రెస్ నేత మారు గంగారెడ్డి అనూహ్యమైన మార్పులకు శ్రీకారం చుట్టనుందని, తలపండిన రాజకీయ నాయకుడు, జగిత్యాల రాజకీయాలలో కురువృద్ధుని లాంటి తాటిపర్తి  జీవన్ రెడ్డి జీవితంలో అనుకోని మలుపులకు, మార్పుకు నాంది కానుందా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంత పెద్ద కుదుపును ఆయన 40 ఏళ్ల తరువాత తట్టుకోవాల్సిన పరిసతీలు ఏర్పడ్డాయి.   

 

సామాజిక ఉద్యమాల నేపథ్యంలో, యువ న్యాయవాదిగా ఉంటూ, 1981 లో జరిగిన పంచాయత్ సమితి ఎన్నికల్లో మల్యాల నుండి సమితి అధ్యక్షునిగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి, రెండేళ్ల లోపే 1982-83 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జగిత్యాల నుండి గెలిచిన జీవన్ రెడ్డి, అనుకోని పరిస్థితులలో 1984 డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీలో చేరి, అప్పటి నుండి జగిత్యాల నుండి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో, ప్రస్తుత జగిత్యాల  జిల్లాలో తిరుగులేని నాయకునిగా చలామణి అవుతున్న జీవన రెడ్డికి, ఆయన పైనే రెండుసార్లు గెలిచిన బి ఆర్ ఎస్ అభ్యర్థి డా. సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడం, డానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వత్తాసు పలకడం, జీవన్ రెడ్డి ఆహాన్ని, ఆధిపత్యాన్ని కూకటివెళ్లతో పేకిలించి వేసిందనే చెప్పవచ్చు.

 

డిల్లీ వరకు వెళ్ళినా, సీనియర్లు ఎంత మంది చెప్పినా, ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ కాదనలేక, ఆయనకే అధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని జీవన రెడ్డికి, ఆయన సహచరుడు, ఆత్మీయుడు మార గంగారెడ్డి హత్య, అదీ, మొన్నటి వరకు బి ఆర్ ఎస్ పార్టీలో ఉన్న ఒక యువకుని చేతిలో హత్యకు గురికావడం, ఆయనకు కొలుకొని దెబ్బగా చెప్పుకొంటున్నారు. గంగారెడ్డి హత్య జరిగి రెండు రోజులైనా, ఆయన కొలుకోలేకపోతున్నారు. విషణ్ణ  వదనంతో  ఉన్న ఆయనను చూసిన ఎవరికైనా ఆయన ఎంతగా క్రుంగిపోయారో ఇట్టే పసికట్ట వచ్చు.

 

ఆయన ఎంత ఆవేశంగా ఉన్నా, ఎన్ని ఆరోపణలు చేసినా, ఎవరిని విమర్శించినా, కాంగ్రెస్ అధిష్టాన వర్గంలో కదలిక రావడం లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఓదార్చడానికి ఫోన్ చేసినా, హైదరాబాద్ లో విలేఖరులు అడిగిన ఒక  ప్రశ్నకు  జవాబిస్తూ, జీవన్ రెడ్డి నిన్న మీ పార్టీకొ  దండం -- ,నీకో దండం .. పార్టీలో ఉండాలా వద్దా .. అంటూ చేసిన విమర్శలు అన్నీ ఆయన వ్యక్తిగతమని కొట్టి పారేశారు. మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎంపి మధు యాష్కీ లాంటి వారు కొంత సీరియస్ గా తీసుకొన్నా, దానిపై ఎలాంటి రచ్చ చేసే పరిస్థితిలో లేరనే తెలుస్తుంది. 

 

అంతంత మాత్రమే ఆధిక్యంతో శాసన సభ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ, గతంలో బిఆర్ఎస్ చేసినట్లుగా, మొత్తం పార్టీని తనలో కలుపుకోవాలని చేసిన ప్రయత్నంలో 10 మంది మాత్రమే కాంగ్రెస్ లో చేరడం, అందులో కూడా చేరిన కొందరు కూడా తమకు ప్రాధాన్యత లభించడం లేదని కినుకు వహించి, దూరం - దూరంగా నే ఉంటున్నారు. దీనికి తోడు, బి ఆర్ ఎస్ పార్టీ హైకోర్ట్ వీరి సభ్యత్వాన్ని రద్దు చేయాలని వేసిన పిటిషన్ వీరి తలపై కత్తిలా వేలాడుతుంది. అందులో కడియం శ్రీహరి, దానం నాగేంద్ర, తెల్లం వెంకట రావు ల పేర్లు మాత్రమే ఉన్నా, వారి పట్ల హైకోర్ట్ ఇచ్చే  రేపు తెర్పే, మిగతా 7 గురు ఎమ్మెల్యేల కు వర్తిస్తుందని అనుకొంటున్నారు. సంవత్సరంలోగా, ఉప ఎన్నికలకు పోవడానికి ఎవరు కూడా సిద్దంగా లేరు.

 

ఈ నేపథ్యంలో, జగిత్యాలలోనే కాకుండా, అదే రోజు పఠాన్ చెరువు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ నాయకులపై కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే గడ్డం మహీపాల్ రెడ్డి వర్గీయులు దాడిచేయడం కూడా పార్టీలో కలకలం రేపింది. రాష్ట్ర ప్రజలను ఆకర్షించిన ఉదంతాలు ఈ రెండే అయినా, కొత్తగా పార్టీలో చేరిన బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేల నియోజక వర్గాలలో పాత -కొత్త కాంగ్రెస్ కార్యకర్తల మధ్య అనేక వివాదాలు చెలరేగుతున్నాయి. ఉన్న పార్టీలోని వారే కాకుండా కొత్తగా వచ్చిన వారు, మొన్నటి వరకు అధికారం అనుభవించి, కాంగ్రెస్ కార్యకర్తలను అనేక లకు గురి ఇబ్బందులకు గురి చేసిన వారే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నీళ్ళు నిండిన చేరువులోకి కప్పలు వచ్చినట్లు వచ్చి, ఆధిపత్యం చెలాయించడాన్ని పాత కాంగ్రెసన కార్యకర్తలు భరించలేకపోతున్నారు.

 

జగిత్యాల నియోజకవర్గంలో మొదటి నుండి ఒక సామాజిక వర్గానికి జీవన్ రెడ్డి పట్ల సానుకూలత లేదు. దాదాపు 36 సంవత్సరాల తరువాత ఆ వర్గానికి అధికారం వచ్చింది. జీవన రెడ్డి రెండవ సారి ఎమ్మెల్యేగా, వరుసగా రెండవసారి ఓడిపోవడం, అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, బి ఆర్ ఎస్ పార్టీ ఆధీనలో ఉన్న మున్సిపల్ కూడా కాంగ్రెస్ వశం అవడం కొందరికి కంటిలో నలకలా  మారిపోయింది.

 

మొదటి నుండి అంతా తానే అయి, ఒక్కడే పార్టీని వంటి చేతితో నడిపిన జీవన్ రెడ్డి, కొత్తగా ఎమ్మెల్యే పార్టీలో చేరి ఆధిపత్యం చెలాయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరో ఐదు నెలల్లో తన ఎమ్మెల్సీ పదవి కాలపరిమితి ముగిసిపోనుండగా, మళ్ళీ పోటీ చేయాలనే తపన ఉన్నా, మొన్నటి  రెండు ఎన్నికల్లో ఓడిపోయిన బాధ ఆయనను ముందుకు పోకుండా చేస్తుంది.  తనకంటూ ఒక వర్గం అంటూ లేని ఏకైక సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి, పెద్దగా ఆర్థిక బలం కూడా లేకపోవడంతో  రాబోయే రోజుల్లో అతన్ని ఎదుర్కోవడం ఏమంత కష్టం కాదని ఒక వర్గం భావిస్తుంది.

 

ఎన్నడూ రాజకీయ హత్యలు, గొడవలు లేని జగిత్యాల రాజకీయాలలో మొదటిసారిగా మారు గంగారెడ్డి హత్య, నాయకులనే కాకుండా ప్రజలను కూడా ఉలిక్కిపడేట్లు చేసింది. అంతా శ్మశాన వైరాగ్యంలో ఉన్న ఈ పరిస్థితులలో, ఎమ్మెల్యే డా. సంజయ్ ఈ హత్యకు తనకు ఎలాంటి సంభందం లేదని, దీని వెనుక ఉన్నది ఎవరైనా పట్టుకొని కఠినంగా శిక్షించాలని ప్రకటించారు. అదే సమయంలో తాను ఇంకా బి ఆర్ ఎస్ లోనే ఉన్నట్లు, అభివృద్ధి కొరకే కాంగ్రెస్ తో నడుస్తున్నాననే ప్రకటన చేయడం కూడా అందరినీ గందరగోళంలో పడేసింది. ఇంతకూ ఆయన ఏ పార్టీలో ఉన్నట్లు అనే ప్రశ్న తలెత్తుతుంది.

 

మహారాష్ట్ర, జార్ఖండ్ శాసన సభ ఎన్నికల నేపథ్యంలో ఈ గోడవలను కాంగ్రెస్ నేపథ్యం పట్టించుకో లేక పోవచ్చు. ఆ ఎన్నికల తర్వాత, ఈనెల 24 హైకోర్ట్ ఇచ్చే తీర్పు, ఆదేశాల మేర ఆతరువాతి కార్యక్రమం ఉండవచ్చని, కొత్తగా చేరిన వరైకి ముఖ్యమంత్రి అండ ఉండడం వల్ల సీనియర్లు అయినా వారి మాటకు అంతగా ప్రాధాన్యత లభించక పోవచ్చని, సర్దుకొమ్మని చెప్పి, ఊరడించి పంపే అవకాశాలే ఎక్కువగా ఉండవచ్చని అనుకొంటున్నారు. ఏమైనా, జగిత్యాల నియోజక వర్గంలో ప్రజాబలం ఉన్న నాయకునిగా ఎప్పటికీ  నిలిచిపోయే నాయకుడు జీవన్ రెడ్డి. ఈ సంధి కాలంలో జీవన రెడ్డి లాంటి అనుభవం ఉన్న వారు మౌనంగా ఉండక తప్పదేమో. కాలమే ఇలాంటి వాటికి పరిష్కారం చూపాలి.

Tags
Join WhatsApp

More News...

National  Sports  International  

మూడు టీ20 మ్యాచ్‌ల్లో  అభిషేక్ శర్మ వరుసగా డక్ అవుట్

మూడు టీ20 మ్యాచ్‌ల్లో  అభిషేక్ శర్మ వరుసగా డక్ అవుట్ అహ్మదాబాద్ ఫిబ్రవరి 18: భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా మూడు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో శూన్య పరుగులకే అవుట్ కావడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆయా మ్యాచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి: 1️⃣ భారత్ – అమెరికా వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం ఎవరి బౌలింగ్‌లో: షాడ్లీ వాన్ షాల్క్విక్ ఎన్ని బంతులు:...
Read More...
National  Local News  International  

ముత్తాత సమాధి కోసం 19 ఏళ్ల అన్వేషణ.. ఇంగ్లండ్ నుంచి హైదరాబాద్‌కు బ్రిటిష్ పౌరుడు

ముత్తాత సమాధి కోసం 19 ఏళ్ల అన్వేషణ.. ఇంగ్లండ్ నుంచి హైదరాబాద్‌కు బ్రిటిష్ పౌరుడు సికింద్రాబాద్‌, ఫిబ్రవరి 18 (ప్రజా మంటలు): 130 ఏళ్ల క్రితం సికింద్రాబాద్‌లో మరణించిన తన ముత్తాత సమాధిని వెతుక్కుంటూ ఇంగ్లండ్‌కు చెందిన రాబిన్ డిక్సన్ హైదరాబాద్‌కు వచ్చారు. దాదాపు 19 ఏళ్ల అన్వేషణ ఎట్టకేలకు ఫలించడంతో, పూర్వీకుడి సమాధి వద్ద భావోద్వేగంతో నివాళులర్పించారు. రాబిన్ డిక్సన్ తన కుటుంబ పాత దస్త్రాల ద్వారా తన ముత్తాత...
Read More...
Crime  State News 

చంచల్‌గూడా జైలు నుంచి విడుదలైన ఐబొమ్మ రవి

చంచల్‌గూడా జైలు నుంచి విడుదలైన ఐబొమ్మ రవి హైదరాబాద్, ఫిబ్రవరి 18 (ప్రజా మంటలు): ఐబొమ్మ వ్యవహారంలో అరెస్టై సుమారు 90 రోజులుగా జైలులో ఉన్న ఐబొమ్మ రవి కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. బెయిల్ ఉత్తర్వుల నేపథ్యంలో రవిని చంచల్‌గూడా జైలు అధికారులు విడుదల చేశారు. ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వహణకు సంబంధించి రవిపై మొత్తం ఐదు...
Read More...
National  Spiritual  

నేటి నుంచే రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం

నేటి నుంచే రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం హైదరాబాద్, ఫిబ్రవరి 18 (ప్రజా మంటలు): పవిత్ర రంజాన్ నెలవంక భారత్‌లో నిన్న దర్శనమివ్వడంతో, ముస్లిం సోదరులు ఈరోజు (గురువారం) నుంచి రంజాన్ ఉపవాస దీక్షలను ప్రారంభించనున్నారు. నెల రోజుల పాటు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసాలు పాటిస్తూ, అల్లాహ్‌కు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. రంజాన్ మాసం ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది....
Read More...
Local News 

నియోజకవర్గ సర్పంచులకు న్యాక్ కేంద్రంలో దిశా నిర్దేశం చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

నియోజకవర్గ సర్పంచులకు న్యాక్ కేంద్రంలో దిశా నిర్దేశం చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల ఫిబ్రవరి 18 ( ప్రజా మంటలు)తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి ఆద్వర్యం లో జగిత్యాల న్యాక్ కేంద్రం లో జగిత్యాల నియోజకవర్గ సర్పంచుల ఓరియంటేషన్ 5 రోజుల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సర్పంచులకు దిశానిర్దేశం చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ...
Read More...
Crime  State News 

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ – మార్చి 3 వరకు రిమాండ్

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ – మార్చి 3 వరకు రిమాండ్ క్యాతనపల్లి, ఫిబ్రవరి 18 (ప్రజా మంటలు): మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను క్యాతనపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎంపిక సందర్భంగా జరిగిన గందరగోళంలో పోలీసులపై దాడి చేశారనే ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం, చైర్మన్ ఎన్నికల సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు...
Read More...
National  State News 

బయోఏషియా–2026 వేదికగా హైదరాబాద్‌ను ప్రపంచ జీవవిజ్ఞాన రాజధానిగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

బయోఏషియా–2026 వేదికగా హైదరాబాద్‌ను ప్రపంచ జీవవిజ్ఞాన రాజధానిగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు): వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ గుర్తింపు పొందిన హైదరాబాద్‌ను ఇకపై ప్రపంచ జీవవిజ్ఞాన (Life Sciences) రాజధానిగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. BioAsia–2026 అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన ఈ పిలుపునిచ్చారు. హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన 23వ బయోఏషియా సదస్సును పరిశ్రమల శాఖ మంత్రి ...
Read More...
State News 

తెలంగాణలో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణలో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు): ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్రంలో మార్చి 16 నుంచి పాఠశాలలను ఒంటిపూటగా నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు వర్తించనుంది. అధికారుల ప్రకారం ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. అనంతరం...
Read More...
Local News  State News 

ఆర్ఎన్ఐ గుర్తింపు ఉన్న పత్రికలకూ అక్రెడిటేషన్లు ఇవ్వాలి : మంత్రి పొంగులేటిని కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు

ఆర్ఎన్ఐ గుర్తింపు ఉన్న పత్రికలకూ అక్రెడిటేషన్లు ఇవ్వాలి : మంత్రి పొంగులేటిని కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు): ఆర్ఎన్ఐ, పీఆర్ జీఐ రిజిస్ట్రేషన్ కలిగిన చిన్న, మధ్య తరహా పత్రికలకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. మంగళవారం సచివాలయంలో రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...
Read More...
State News 

చిన్న పత్రికలపై వివక్షపై నిరసన : సమాచార భవన్ వద్ద జర్నలిస్టుల ఆందోళన

చిన్న పత్రికలపై వివక్షపై నిరసన : సమాచార భవన్ వద్ద జర్నలిస్టుల ఆందోళన హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు): కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్ఎన్ఐ, పీఆర్ జీఐ గుర్తింపు ఉన్న చిన్న, మధ్య తరహా పత్రికలకు అక్రెడిటేషన్లు, ఎంప్యానల్‌మెంట్ ఇవ్వకుండా వివక్ష చూపుతున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. టీడబ్ల్యూజేఎఫ్ ఇచ్చిన “ఛలో సమాచార భవన్” పిలుపు...
Read More...
Local News 

జగిత్యాలలో అర్ధరాత్రి కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు

జగిత్యాలలో అర్ధరాత్రి కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు    జగిత్యాల, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు):జిల్లాకేంద్రంలోని టవర్ సర్కిల్‌తో పాటు పలు ప్రాంతాల్లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) 72వ జన్మదిన వేడుకలు, ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. అర్ధరాత్రి 12 గంటలకు టవర్ సర్కిల్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి...
Read More...
Local News 

కేసీఆర్ జన్మదినం సందర్భంగా జగిత్యాలలో సేవా కార్యక్రమాలు

కేసీఆర్ జన్మదినం సందర్భంగా జగిత్యాలలో సేవా కార్యక్రమాలు జగిత్యాల ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, స్వరాష్ట్ర సాధకుడు కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ధరూర్ క్యాంప్ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్...
Read More...