రాజకీయంగా జీవన్ రెడ్డి పరిస్థితి ఏమిటి?

ఇది జీవన రెడ్డి రాజకీయ చరిత్ర ముగింపుకు కుట్రనా? రేపటి భవిష్యత్ నిర్ణయమేమిటి? కాంగ్రెస్ లో సీనియర్ల పరిస్థితి ఇంతేనా?

On
రాజకీయంగా జీవన్ రెడ్డి పరిస్థితి ఏమిటి?

 జగిత్యాల రాజకీయాలను ఒక కుదుపు కుడిపిన రాజకీయ హత్య

ఇది జీవన రెడ్డి రాజకీయ చరిత్ర ముగింపుకు కుట్రనా?

రేపటి భవిష్యత్ నిర్ణయమేమిటి?

కాంగ్రెస్ లో సీనియర్ల పరిస్థితి ఇంతేనా?

జగిత్యాలలో జరిగిన కాంగ్రెస్ నాయకుడు మార గంగారెడ్డి హత్య తరువాత అక్కడ ఏం జరగనున్నది?

రాజకీయంగా జీవన్ రెడ్డి పరిస్థితి ఏమిటి?

 

జగిత్యాల రాజకీయాలలో అనూహ్య మార్పులకు నాంది

ఎటూ తేల్చుకోలేని స్థితిలో జీవన రెడ్డి

చాపకింది నీరులా కాంగ్రెస్ లో బిఆర్ఎస్ వ్యవహారం

 (సిహెచ్ వి ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్)

 

జగిత్యాల రాజకీయాలలో కాంగ్రెస్ నేత మారు గంగారెడ్డి అనూహ్యమైన మార్పులకు శ్రీకారం చుట్టనుందని, తలపండిన రాజకీయ నాయకుడు, జగిత్యాల రాజకీయాలలో కురువృద్ధుని లాంటి తాటిపర్తి  జీవన్ రెడ్డి జీవితంలో అనుకోని మలుపులకు, మార్పుకు నాంది కానుందా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంత పెద్ద కుదుపును ఆయన 40 ఏళ్ల తరువాత తట్టుకోవాల్సిన పరిసతీలు ఏర్పడ్డాయి.   

 

సామాజిక ఉద్యమాల నేపథ్యంలో, యువ న్యాయవాదిగా ఉంటూ, 1981 లో జరిగిన పంచాయత్ సమితి ఎన్నికల్లో మల్యాల నుండి సమితి అధ్యక్షునిగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి, రెండేళ్ల లోపే 1982-83 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జగిత్యాల నుండి గెలిచిన జీవన్ రెడ్డి, అనుకోని పరిస్థితులలో 1984 డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీలో చేరి, అప్పటి నుండి జగిత్యాల నుండి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో, ప్రస్తుత జగిత్యాల  జిల్లాలో తిరుగులేని నాయకునిగా చలామణి అవుతున్న జీవన రెడ్డికి, ఆయన పైనే రెండుసార్లు గెలిచిన బి ఆర్ ఎస్ అభ్యర్థి డా. సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడం, డానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వత్తాసు పలకడం, జీవన్ రెడ్డి ఆహాన్ని, ఆధిపత్యాన్ని కూకటివెళ్లతో పేకిలించి వేసిందనే చెప్పవచ్చు.

 

డిల్లీ వరకు వెళ్ళినా, సీనియర్లు ఎంత మంది చెప్పినా, ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ కాదనలేక, ఆయనకే అధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని జీవన రెడ్డికి, ఆయన సహచరుడు, ఆత్మీయుడు మార గంగారెడ్డి హత్య, అదీ, మొన్నటి వరకు బి ఆర్ ఎస్ పార్టీలో ఉన్న ఒక యువకుని చేతిలో హత్యకు గురికావడం, ఆయనకు కొలుకొని దెబ్బగా చెప్పుకొంటున్నారు. గంగారెడ్డి హత్య జరిగి రెండు రోజులైనా, ఆయన కొలుకోలేకపోతున్నారు. విషణ్ణ  వదనంతో  ఉన్న ఆయనను చూసిన ఎవరికైనా ఆయన ఎంతగా క్రుంగిపోయారో ఇట్టే పసికట్ట వచ్చు.

 

ఆయన ఎంత ఆవేశంగా ఉన్నా, ఎన్ని ఆరోపణలు చేసినా, ఎవరిని విమర్శించినా, కాంగ్రెస్ అధిష్టాన వర్గంలో కదలిక రావడం లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఓదార్చడానికి ఫోన్ చేసినా, హైదరాబాద్ లో విలేఖరులు అడిగిన ఒక  ప్రశ్నకు  జవాబిస్తూ, జీవన్ రెడ్డి నిన్న మీ పార్టీకొ  దండం -- ,నీకో దండం .. పార్టీలో ఉండాలా వద్దా .. అంటూ చేసిన విమర్శలు అన్నీ ఆయన వ్యక్తిగతమని కొట్టి పారేశారు. మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎంపి మధు యాష్కీ లాంటి వారు కొంత సీరియస్ గా తీసుకొన్నా, దానిపై ఎలాంటి రచ్చ చేసే పరిస్థితిలో లేరనే తెలుస్తుంది. 

 

అంతంత మాత్రమే ఆధిక్యంతో శాసన సభ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ, గతంలో బిఆర్ఎస్ చేసినట్లుగా, మొత్తం పార్టీని తనలో కలుపుకోవాలని చేసిన ప్రయత్నంలో 10 మంది మాత్రమే కాంగ్రెస్ లో చేరడం, అందులో కూడా చేరిన కొందరు కూడా తమకు ప్రాధాన్యత లభించడం లేదని కినుకు వహించి, దూరం - దూరంగా నే ఉంటున్నారు. దీనికి తోడు, బి ఆర్ ఎస్ పార్టీ హైకోర్ట్ వీరి సభ్యత్వాన్ని రద్దు చేయాలని వేసిన పిటిషన్ వీరి తలపై కత్తిలా వేలాడుతుంది. అందులో కడియం శ్రీహరి, దానం నాగేంద్ర, తెల్లం వెంకట రావు ల పేర్లు మాత్రమే ఉన్నా, వారి పట్ల హైకోర్ట్ ఇచ్చే  రేపు తెర్పే, మిగతా 7 గురు ఎమ్మెల్యేల కు వర్తిస్తుందని అనుకొంటున్నారు. సంవత్సరంలోగా, ఉప ఎన్నికలకు పోవడానికి ఎవరు కూడా సిద్దంగా లేరు.

 

ఈ నేపథ్యంలో, జగిత్యాలలోనే కాకుండా, అదే రోజు పఠాన్ చెరువు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ నాయకులపై కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే గడ్డం మహీపాల్ రెడ్డి వర్గీయులు దాడిచేయడం కూడా పార్టీలో కలకలం రేపింది. రాష్ట్ర ప్రజలను ఆకర్షించిన ఉదంతాలు ఈ రెండే అయినా, కొత్తగా పార్టీలో చేరిన బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేల నియోజక వర్గాలలో పాత -కొత్త కాంగ్రెస్ కార్యకర్తల మధ్య అనేక వివాదాలు చెలరేగుతున్నాయి. ఉన్న పార్టీలోని వారే కాకుండా కొత్తగా వచ్చిన వారు, మొన్నటి వరకు అధికారం అనుభవించి, కాంగ్రెస్ కార్యకర్తలను అనేక లకు గురి ఇబ్బందులకు గురి చేసిన వారే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నీళ్ళు నిండిన చేరువులోకి కప్పలు వచ్చినట్లు వచ్చి, ఆధిపత్యం చెలాయించడాన్ని పాత కాంగ్రెసన కార్యకర్తలు భరించలేకపోతున్నారు.

 

జగిత్యాల నియోజకవర్గంలో మొదటి నుండి ఒక సామాజిక వర్గానికి జీవన్ రెడ్డి పట్ల సానుకూలత లేదు. దాదాపు 36 సంవత్సరాల తరువాత ఆ వర్గానికి అధికారం వచ్చింది. జీవన రెడ్డి రెండవ సారి ఎమ్మెల్యేగా, వరుసగా రెండవసారి ఓడిపోవడం, అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, బి ఆర్ ఎస్ పార్టీ ఆధీనలో ఉన్న మున్సిపల్ కూడా కాంగ్రెస్ వశం అవడం కొందరికి కంటిలో నలకలా  మారిపోయింది.

 

మొదటి నుండి అంతా తానే అయి, ఒక్కడే పార్టీని వంటి చేతితో నడిపిన జీవన్ రెడ్డి, కొత్తగా ఎమ్మెల్యే పార్టీలో చేరి ఆధిపత్యం చెలాయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరో ఐదు నెలల్లో తన ఎమ్మెల్సీ పదవి కాలపరిమితి ముగిసిపోనుండగా, మళ్ళీ పోటీ చేయాలనే తపన ఉన్నా, మొన్నటి  రెండు ఎన్నికల్లో ఓడిపోయిన బాధ ఆయనను ముందుకు పోకుండా చేస్తుంది.  తనకంటూ ఒక వర్గం అంటూ లేని ఏకైక సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి, పెద్దగా ఆర్థిక బలం కూడా లేకపోవడంతో  రాబోయే రోజుల్లో అతన్ని ఎదుర్కోవడం ఏమంత కష్టం కాదని ఒక వర్గం భావిస్తుంది.

 

ఎన్నడూ రాజకీయ హత్యలు, గొడవలు లేని జగిత్యాల రాజకీయాలలో మొదటిసారిగా మారు గంగారెడ్డి హత్య, నాయకులనే కాకుండా ప్రజలను కూడా ఉలిక్కిపడేట్లు చేసింది. అంతా శ్మశాన వైరాగ్యంలో ఉన్న ఈ పరిస్థితులలో, ఎమ్మెల్యే డా. సంజయ్ ఈ హత్యకు తనకు ఎలాంటి సంభందం లేదని, దీని వెనుక ఉన్నది ఎవరైనా పట్టుకొని కఠినంగా శిక్షించాలని ప్రకటించారు. అదే సమయంలో తాను ఇంకా బి ఆర్ ఎస్ లోనే ఉన్నట్లు, అభివృద్ధి కొరకే కాంగ్రెస్ తో నడుస్తున్నాననే ప్రకటన చేయడం కూడా అందరినీ గందరగోళంలో పడేసింది. ఇంతకూ ఆయన ఏ పార్టీలో ఉన్నట్లు అనే ప్రశ్న తలెత్తుతుంది.

 

మహారాష్ట్ర, జార్ఖండ్ శాసన సభ ఎన్నికల నేపథ్యంలో ఈ గోడవలను కాంగ్రెస్ నేపథ్యం పట్టించుకో లేక పోవచ్చు. ఆ ఎన్నికల తర్వాత, ఈనెల 24 హైకోర్ట్ ఇచ్చే తీర్పు, ఆదేశాల మేర ఆతరువాతి కార్యక్రమం ఉండవచ్చని, కొత్తగా చేరిన వరైకి ముఖ్యమంత్రి అండ ఉండడం వల్ల సీనియర్లు అయినా వారి మాటకు అంతగా ప్రాధాన్యత లభించక పోవచ్చని, సర్దుకొమ్మని చెప్పి, ఊరడించి పంపే అవకాశాలే ఎక్కువగా ఉండవచ్చని అనుకొంటున్నారు. ఏమైనా, జగిత్యాల నియోజక వర్గంలో ప్రజాబలం ఉన్న నాయకునిగా ఎప్పటికీ  నిలిచిపోయే నాయకుడు జీవన్ రెడ్డి. ఈ సంధి కాలంలో జీవన రెడ్డి లాంటి అనుభవం ఉన్న వారు మౌనంగా ఉండక తప్పదేమో. కాలమే ఇలాంటి వాటికి పరిష్కారం చూపాలి.

Tags
Join WhatsApp

More News...

Local News 

జగిత్యాల పట్టణ మేరు సేవా సంఘం ఎన్నికలు మే నెల 17 న..

జగిత్యాల పట్టణ మేరు సేవా సంఘం ఎన్నికలు మే నెల 17 న.. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113) జగిత్యాల 21 ఏప్రిల్ (ప్రజా మంటలు) :  జగిత్యాల పట్టణ మేరు సేవా సంఘం ఎన్నికలు వచ్చె నెల 17 ఆదివారం రోజున నిర్వహిస్తున్నట్టు సంఘం ఎన్నికల కమిటీ కన్వీనర్ రాపర్తి. గంగాధర్, కో-కన్వీనర్ కొక్కు. శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగినది. ఈ సందర్బంగా కమిటీ...
Read More...
Spiritual   Social  State News 

మల్కాజ్‌గిరిలో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం మరియు కృతజ్ఞత అభినందన సభ

మల్కాజ్‌గిరిలో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం మరియు కృతజ్ఞత అభినందన సభ సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/ 9348322113.  హైదరాబాద్ 19 ఏప్రిల్ (ప్రజా మంటలు) :  మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని ఆనంద్ బాగ్, బృందావన్ గార్డెన్‌లో ఈరోజు బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం మరియు కృతజ్ఞత అభినందన సభ ఘనంగా నిర్వహించబడింది.  నేరేడ్మెట్ ప్రాంతంలో బ్రాహ్మణ భవన నిర్మాణం కోసం ఒక ఎకరం స్థలం (భూమి) కేటాయింపును...
Read More...
Local News 

హైకోర్టు జడ్జి శ్రీ రేణుక యార ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

హైకోర్టు జడ్జి శ్రీ రేణుక యార ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్    కోరుట్ల ఏప్రిల్ 18(ప్రజా మంటలు)పట్టణానికి మంజూరు చేసిన అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ & జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టును ప్రారంభించేందుకు కోరుట్లకు విచ్చేసిన గౌరవ హైకోర్టు జడ్జి  రేణుక యార ని జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,  మర్యాదపూర్వకంగా కలిసి  పూల బొకే ను అందజేశారు.
Read More...
Local News 

తొలి జెడ్పి చైర్ పర్సన్ నివాసానికి కేటీఆర్ హరీష్ రావు రాక స్వాగతం పలికిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత

తొలి జెడ్పి చైర్ పర్సన్ నివాసానికి కేటీఆర్ హరీష్ రావు రాక స్వాగతం పలికిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత   జగిత్యాల ఏప్రిల్ 18 (ప్రజా మంటలు)ఈనెల 20వ తేదీ కేసీఆర్ బహిరంగ సభ సందర్భంగా  సభ ప్రాంగణాన్ని పరిశీలించి అనంతరం జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్  నివాసానికి విచ్చేసిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరియు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కు...
Read More...
Crime  State News 

పోలీసుల నిర్బంధం నుంచి ఉద్యమకారులను విడిపించిన కల్వకుంట్ల కవిత

పోలీసుల నిర్బంధం నుంచి ఉద్యమకారులను విడిపించిన కల్వకుంట్ల కవిత హైదరాబాద్, ఏప్రిల్ 18 (ప్రజా మంటలు): కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం “చలో సెక్రటేరియట్”కు వెళ్లిన తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. 600 మందికి పైగా కార్యకర్తలను మెహదీపట్నం, నాంపల్లి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. ఈ సమాచారం తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మెహదీపట్నం పోలీస్ స్టేషన్‌కు...
Read More...
Local News 

స్వయంకృత అపరాధమే మన దుఃఖాలకు మూలం  నంబి వేణుగోపాల ఆచార్య

స్వయంకృత అపరాధమే మన దుఃఖాలకు మూలం  నంబి వేణుగోపాల ఆచార్య    జగిత్యాల ఏప్రిల్ 17 (ప్రజా మంటలు) స్వయంకృత అపరాధమే మన దుఃఖాలకు మూలమని నంబి వేణుగోపాలఆచార్య కౌశిక అన్నారు .శుక్రవారం పోచమ్మ బస్తీలోని గీతా భవన్ లో సాయంత్రం హిందూ సమ్మేళన సమితి వారి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న నంబి వేణుగోపాల ఆచార్య అనుగ్రహ భాషణం చేస్తూ మానవులు ప్రకృతిని ధ్వంసం...
Read More...
Local News 

అన్నపూర్ణ మాత సేవ వారి అన్న ప్రసాద వితరణ లో పాల్గొన్న చైర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ 

అన్నపూర్ణ మాత సేవ వారి అన్న ప్రసాద వితరణ లో పాల్గొన్న చైర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్     జగిత్యాల ఏప్రిల్ 17(ప్రజా మంటలు)బీట్ చౌరస్తా లో నిర్వహించిన  అమావాస్య అన్నపూర్ణ మాత సేవ ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్  హాజరై భక్తులకు స్వయంగా వడ్డించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో సేవాభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.  కార్యక్రమములో...
Read More...
Local News 

ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి జగిత్యాల ఏప్రిల్ 17(ప్రజా మంటలు)టీజీఈజెఏసి జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో  నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మిక , పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీ విస్తృతస్థాయి కార్యనిర్వాహక సమావేశం (తేది: 07-04-2026) లో తీసుకున్న తీర్మానాల మేరకు జెఏసి రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్  మరియు సెక్రటరీ...
Read More...
Local News 

సురభి గోషాలలో గో గ్రాసం పంపిణీ

సురభి గోషాలలో గో గ్రాసం పంపిణీ   జగిత్యాల రూరల్ ఏప్రిల్ 17 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రానికి సమీపంలోని తాటిపల్లి సురభి గోశాలలో గోవుల గ్రాసం గడ్డి, తవుడు, మేత  కోసం ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. జగిత్యాల వాస్తవ్యులైన ఊటూరి అశోక్ కుమార్, తాటికొండ శ్రీనివాస్, బాసెట్టి లవ కుమార్, ప్రతినెల అమావాస్య రోజు ఒక్కొక్కరివద్ద 100 చొప్పున, వసూలు చేసి...
Read More...
State News 

ప్రత్యేక తెలంగాణ అస్తిత్వాల పరిరక్షణకు ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’ ఆవిర్భావం

ప్రత్యేక తెలంగాణ అస్తిత్వాల పరిరక్షణకు ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’ ఆవిర్భావం    ఆవిర్భావ సభ వివరాలు:* 📅 తేదీ: ఏప్రిల్ 19, 2026 (ఆదివారం)* 🕙 సమయం: ఉదయం 10 గంటలకు* 📌 వేదిక: రవీంద్రభారతి    హైదరాబాద్, ఏప్రిల్ 17 (ప్రజా మంటలు):    తెలంగాణ భూమి కేవలం భౌగోళిక పరిమితి మాత్రమే కాకుండా వేల సంవత్సరాల సాంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక అస్తిత్వాలకు ప్రతీకగా నిలిచిందని...
Read More...
State News 

మారోజు వీరన్న అనుచరుల మద్దతుతో జాగృతి పార్టీకి బలమైన ఊపు: కవిత

మారోజు వీరన్న అనుచరుల మద్దతుతో జాగృతి పార్టీకి బలమైన ఊపు: కవిత హైదరాబాద్, ఏప్రిల్ 17 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పడబోయే కొత్త రాజకీయ పార్టీకి మారోజు వీరన్న అనుచరులు, సీపీయూఎస్ఐ (CPUSI), దళిత బహుజన రాజ్యాధికార సంస్థ మద్దతు ప్రకటించాయి. జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కలిసి సీపీయూఎస్ఐ కేంద్ర కమిటీ కార్యదర్శి కోదండం, రాష్ట్ర కార్యదర్శి వెంకన్న, దళిత...
Read More...
Local News 

జాతీయ వాగ్దేవి పురస్కారం అందుకున్న మహేశ్వర శర్మ

జాతీయ వాగ్దేవి పురస్కారం అందుకున్న మహేశ్వర శర్మ   రాయికల్ ఏప్రిల్ 16 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు కు చెందిన తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ కు కందుకూరి వీరేశలింగం పంతులు స్మారక జాతీయ వాగ్దేవి పురస్కారాన్ని గురువారం ఆచార్య పద్మశ్రీ  కొలకనూరి ఇనాక్ ,  జాతీయ తెలుగు సారస్వత పరిషత్ కార్యనిర్వహక...
Read More...