రాజకీయంగా జీవన్ రెడ్డి పరిస్థితి ఏమిటి?

ఇది జీవన రెడ్డి రాజకీయ చరిత్ర ముగింపుకు కుట్రనా? రేపటి భవిష్యత్ నిర్ణయమేమిటి? కాంగ్రెస్ లో సీనియర్ల పరిస్థితి ఇంతేనా?

On
రాజకీయంగా జీవన్ రెడ్డి పరిస్థితి ఏమిటి?

 జగిత్యాల రాజకీయాలను ఒక కుదుపు కుడిపిన రాజకీయ హత్య

ఇది జీవన రెడ్డి రాజకీయ చరిత్ర ముగింపుకు కుట్రనా?

రేపటి భవిష్యత్ నిర్ణయమేమిటి?

కాంగ్రెస్ లో సీనియర్ల పరిస్థితి ఇంతేనా?

జగిత్యాలలో జరిగిన కాంగ్రెస్ నాయకుడు మార గంగారెడ్డి హత్య తరువాత అక్కడ ఏం జరగనున్నది?

రాజకీయంగా జీవన్ రెడ్డి పరిస్థితి ఏమిటి?

 

జగిత్యాల రాజకీయాలలో అనూహ్య మార్పులకు నాంది

ఎటూ తేల్చుకోలేని స్థితిలో జీవన రెడ్డి

చాపకింది నీరులా కాంగ్రెస్ లో బిఆర్ఎస్ వ్యవహారం

 (సిహెచ్ వి ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్)

 

జగిత్యాల రాజకీయాలలో కాంగ్రెస్ నేత మారు గంగారెడ్డి అనూహ్యమైన మార్పులకు శ్రీకారం చుట్టనుందని, తలపండిన రాజకీయ నాయకుడు, జగిత్యాల రాజకీయాలలో కురువృద్ధుని లాంటి తాటిపర్తి  జీవన్ రెడ్డి జీవితంలో అనుకోని మలుపులకు, మార్పుకు నాంది కానుందా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంత పెద్ద కుదుపును ఆయన 40 ఏళ్ల తరువాత తట్టుకోవాల్సిన పరిసతీలు ఏర్పడ్డాయి.   

 

సామాజిక ఉద్యమాల నేపథ్యంలో, యువ న్యాయవాదిగా ఉంటూ, 1981 లో జరిగిన పంచాయత్ సమితి ఎన్నికల్లో మల్యాల నుండి సమితి అధ్యక్షునిగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి, రెండేళ్ల లోపే 1982-83 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జగిత్యాల నుండి గెలిచిన జీవన్ రెడ్డి, అనుకోని పరిస్థితులలో 1984 డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీలో చేరి, అప్పటి నుండి జగిత్యాల నుండి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో, ప్రస్తుత జగిత్యాల  జిల్లాలో తిరుగులేని నాయకునిగా చలామణి అవుతున్న జీవన రెడ్డికి, ఆయన పైనే రెండుసార్లు గెలిచిన బి ఆర్ ఎస్ అభ్యర్థి డా. సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడం, డానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వత్తాసు పలకడం, జీవన్ రెడ్డి ఆహాన్ని, ఆధిపత్యాన్ని కూకటివెళ్లతో పేకిలించి వేసిందనే చెప్పవచ్చు.

 

డిల్లీ వరకు వెళ్ళినా, సీనియర్లు ఎంత మంది చెప్పినా, ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ కాదనలేక, ఆయనకే అధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని జీవన రెడ్డికి, ఆయన సహచరుడు, ఆత్మీయుడు మార గంగారెడ్డి హత్య, అదీ, మొన్నటి వరకు బి ఆర్ ఎస్ పార్టీలో ఉన్న ఒక యువకుని చేతిలో హత్యకు గురికావడం, ఆయనకు కొలుకొని దెబ్బగా చెప్పుకొంటున్నారు. గంగారెడ్డి హత్య జరిగి రెండు రోజులైనా, ఆయన కొలుకోలేకపోతున్నారు. విషణ్ణ  వదనంతో  ఉన్న ఆయనను చూసిన ఎవరికైనా ఆయన ఎంతగా క్రుంగిపోయారో ఇట్టే పసికట్ట వచ్చు.

 

ఆయన ఎంత ఆవేశంగా ఉన్నా, ఎన్ని ఆరోపణలు చేసినా, ఎవరిని విమర్శించినా, కాంగ్రెస్ అధిష్టాన వర్గంలో కదలిక రావడం లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఓదార్చడానికి ఫోన్ చేసినా, హైదరాబాద్ లో విలేఖరులు అడిగిన ఒక  ప్రశ్నకు  జవాబిస్తూ, జీవన్ రెడ్డి నిన్న మీ పార్టీకొ  దండం -- ,నీకో దండం .. పార్టీలో ఉండాలా వద్దా .. అంటూ చేసిన విమర్శలు అన్నీ ఆయన వ్యక్తిగతమని కొట్టి పారేశారు. మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎంపి మధు యాష్కీ లాంటి వారు కొంత సీరియస్ గా తీసుకొన్నా, దానిపై ఎలాంటి రచ్చ చేసే పరిస్థితిలో లేరనే తెలుస్తుంది. 

 

అంతంత మాత్రమే ఆధిక్యంతో శాసన సభ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ, గతంలో బిఆర్ఎస్ చేసినట్లుగా, మొత్తం పార్టీని తనలో కలుపుకోవాలని చేసిన ప్రయత్నంలో 10 మంది మాత్రమే కాంగ్రెస్ లో చేరడం, అందులో కూడా చేరిన కొందరు కూడా తమకు ప్రాధాన్యత లభించడం లేదని కినుకు వహించి, దూరం - దూరంగా నే ఉంటున్నారు. దీనికి తోడు, బి ఆర్ ఎస్ పార్టీ హైకోర్ట్ వీరి సభ్యత్వాన్ని రద్దు చేయాలని వేసిన పిటిషన్ వీరి తలపై కత్తిలా వేలాడుతుంది. అందులో కడియం శ్రీహరి, దానం నాగేంద్ర, తెల్లం వెంకట రావు ల పేర్లు మాత్రమే ఉన్నా, వారి పట్ల హైకోర్ట్ ఇచ్చే  రేపు తెర్పే, మిగతా 7 గురు ఎమ్మెల్యేల కు వర్తిస్తుందని అనుకొంటున్నారు. సంవత్సరంలోగా, ఉప ఎన్నికలకు పోవడానికి ఎవరు కూడా సిద్దంగా లేరు.

 

ఈ నేపథ్యంలో, జగిత్యాలలోనే కాకుండా, అదే రోజు పఠాన్ చెరువు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ నాయకులపై కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే గడ్డం మహీపాల్ రెడ్డి వర్గీయులు దాడిచేయడం కూడా పార్టీలో కలకలం రేపింది. రాష్ట్ర ప్రజలను ఆకర్షించిన ఉదంతాలు ఈ రెండే అయినా, కొత్తగా పార్టీలో చేరిన బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేల నియోజక వర్గాలలో పాత -కొత్త కాంగ్రెస్ కార్యకర్తల మధ్య అనేక వివాదాలు చెలరేగుతున్నాయి. ఉన్న పార్టీలోని వారే కాకుండా కొత్తగా వచ్చిన వారు, మొన్నటి వరకు అధికారం అనుభవించి, కాంగ్రెస్ కార్యకర్తలను అనేక లకు గురి ఇబ్బందులకు గురి చేసిన వారే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నీళ్ళు నిండిన చేరువులోకి కప్పలు వచ్చినట్లు వచ్చి, ఆధిపత్యం చెలాయించడాన్ని పాత కాంగ్రెసన కార్యకర్తలు భరించలేకపోతున్నారు.

 

జగిత్యాల నియోజకవర్గంలో మొదటి నుండి ఒక సామాజిక వర్గానికి జీవన్ రెడ్డి పట్ల సానుకూలత లేదు. దాదాపు 36 సంవత్సరాల తరువాత ఆ వర్గానికి అధికారం వచ్చింది. జీవన రెడ్డి రెండవ సారి ఎమ్మెల్యేగా, వరుసగా రెండవసారి ఓడిపోవడం, అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, బి ఆర్ ఎస్ పార్టీ ఆధీనలో ఉన్న మున్సిపల్ కూడా కాంగ్రెస్ వశం అవడం కొందరికి కంటిలో నలకలా  మారిపోయింది.

 

మొదటి నుండి అంతా తానే అయి, ఒక్కడే పార్టీని వంటి చేతితో నడిపిన జీవన్ రెడ్డి, కొత్తగా ఎమ్మెల్యే పార్టీలో చేరి ఆధిపత్యం చెలాయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరో ఐదు నెలల్లో తన ఎమ్మెల్సీ పదవి కాలపరిమితి ముగిసిపోనుండగా, మళ్ళీ పోటీ చేయాలనే తపన ఉన్నా, మొన్నటి  రెండు ఎన్నికల్లో ఓడిపోయిన బాధ ఆయనను ముందుకు పోకుండా చేస్తుంది.  తనకంటూ ఒక వర్గం అంటూ లేని ఏకైక సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి, పెద్దగా ఆర్థిక బలం కూడా లేకపోవడంతో  రాబోయే రోజుల్లో అతన్ని ఎదుర్కోవడం ఏమంత కష్టం కాదని ఒక వర్గం భావిస్తుంది.

 

ఎన్నడూ రాజకీయ హత్యలు, గొడవలు లేని జగిత్యాల రాజకీయాలలో మొదటిసారిగా మారు గంగారెడ్డి హత్య, నాయకులనే కాకుండా ప్రజలను కూడా ఉలిక్కిపడేట్లు చేసింది. అంతా శ్మశాన వైరాగ్యంలో ఉన్న ఈ పరిస్థితులలో, ఎమ్మెల్యే డా. సంజయ్ ఈ హత్యకు తనకు ఎలాంటి సంభందం లేదని, దీని వెనుక ఉన్నది ఎవరైనా పట్టుకొని కఠినంగా శిక్షించాలని ప్రకటించారు. అదే సమయంలో తాను ఇంకా బి ఆర్ ఎస్ లోనే ఉన్నట్లు, అభివృద్ధి కొరకే కాంగ్రెస్ తో నడుస్తున్నాననే ప్రకటన చేయడం కూడా అందరినీ గందరగోళంలో పడేసింది. ఇంతకూ ఆయన ఏ పార్టీలో ఉన్నట్లు అనే ప్రశ్న తలెత్తుతుంది.

 

మహారాష్ట్ర, జార్ఖండ్ శాసన సభ ఎన్నికల నేపథ్యంలో ఈ గోడవలను కాంగ్రెస్ నేపథ్యం పట్టించుకో లేక పోవచ్చు. ఆ ఎన్నికల తర్వాత, ఈనెల 24 హైకోర్ట్ ఇచ్చే తీర్పు, ఆదేశాల మేర ఆతరువాతి కార్యక్రమం ఉండవచ్చని, కొత్తగా చేరిన వరైకి ముఖ్యమంత్రి అండ ఉండడం వల్ల సీనియర్లు అయినా వారి మాటకు అంతగా ప్రాధాన్యత లభించక పోవచ్చని, సర్దుకొమ్మని చెప్పి, ఊరడించి పంపే అవకాశాలే ఎక్కువగా ఉండవచ్చని అనుకొంటున్నారు. ఏమైనా, జగిత్యాల నియోజక వర్గంలో ప్రజాబలం ఉన్న నాయకునిగా ఎప్పటికీ  నిలిచిపోయే నాయకుడు జీవన్ రెడ్డి. ఈ సంధి కాలంలో జీవన రెడ్డి లాంటి అనుభవం ఉన్న వారు మౌనంగా ఉండక తప్పదేమో. కాలమే ఇలాంటి వాటికి పరిష్కారం చూపాలి.

Tags

More News...

Local News 

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్ ఒంటరిగా ఉన్న మహిళ ఇంటిపై దాడి – బంగారం, నగదు అపహరణ వేలేరు, జూలై 11 (ప్రజా మంటలు)నెక్కొండ మండలంలోని పనికర గ్రామం అవతల ఒంటరిగా ఉన్న మహిళ ఇంటిలో శుక్రవారం ఉదయం 11:30 గంటల సమయంలో గుర్తుతెలియని ఇద్దరు దుండగులు దొంగతనానికి...
Read More...

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు    గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు వేలేరు, ప్రజామంటలు:గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్లో భాగంగా భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి సంబంధించి తుది సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రధాన అతిథిగా పాల్గొన్న ఆర్డీవో రమేష్ రాథోడ్ మాట్లాడుతూ, భూ నిర్వాసితులకు ఎదురవుతున్న ఏవైనా సమస్యలు ఉంటే, అవి అర్జీ రూపంలో సమర్పించాలని తెలిపారు....
Read More...
Local News 

గాజుల పోచమ్మ ఆలయంలో ఘనంగా గోరింటాకు ఉత్సవాలు

గాజుల పోచమ్మ ఆలయంలో ఘనంగా గోరింటాకు ఉత్సవాలు    జగిత్యాల  జూలై 11 ( ప్రజా మంటలు) ఆషాడమాసం శుక్రవారం సందర్భంగా పట్టణం లోని పురాణిపేట  శ్రీ లోకమాత (గాజుల) పోచమ్మ తల్లి ఆలయంలో మహిళలు గోరింటాకు సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ  కార్యక్రమంలో మహిళలు పాల్గొని గోరింటాకు సంబరాలు  జరుపుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి అమ్మవారి  ఆశీస్సులు కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని  కోరుకున్నారు....
Read More...
Local News 

ఓల్డ్ మల్కాజ్‌గిరిలో, సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్డు ప్యాచ్ పనులు ప్రారంభం: కార్పొరేటర్ శ్రవణ్

ఓల్డ్ మల్కాజ్‌గిరిలో, సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్డు ప్యాచ్ పనులు ప్రారంభం: కార్పొరేటర్ శ్రవణ్    మల్కాజ్‌గిరి, జూలై 11 (ప్రజా మంటలు) మల్కాజ్‌గిరి సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఓల్డ్ మల్కాజ్‌గిరిలో మరియు సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్ల ప్యాచ్ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్కాజ్‌గిరి కార్పొరేటర్ శ్రావణ్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో సీసీ రోడ్లు, నాలా (డ్రైనేజీ) పనులు, అలాగే పెద్ద ఎత్తున ప్యాచ్...
Read More...
Local News 

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనాభా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనాభా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం   జగిత్యాల జమంటలు11 (ప్రజా మంటలు)జిల్లా వైద్య, మరియు ఆరోగ్యశాఖ వారి ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం వారోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఐఎంఏ భవన్ వరకుఈ యాత్ర కొనసాగింది  . ఈ నాటి  కార్యక్రమంలో డిఎంహెచ్ఓ ప్రమోద్ కుమార్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ.ఎన్ శ్రీనివాస్, ప్రోగ్రాం ఆఫీసర్...
Read More...
Local News 

జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల జులై 11 ( ప్రజా మంటలు) మోతే రోడ్డు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన జగిత్యాల జిల్లా ప్రెస్ క్లబ్  కార్యవర్గ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చన్ని అందజేశారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల శాసనసభ్యులు...
Read More...
Local News 

నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్: 316 వాహనాలు సీజ్: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్: 316 వాహనాలు సీజ్: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  జగిత్యాల జులై 11 ( ప్రజా మంటలు) జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  ఆదేశాల మేరకు  జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ నంబర్ లేని, నంబర్ ప్లేట్ దాచి,కొన్ని నంబర్లు తొలగించిన వాహనాలను గుర్తించేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది వివిధ టీంలు గా ఏర్పడి ఏక  కాలంలో ముమ్మర తనిఖీ లు చేసారు. వాహనాల తనిఖీ చేయగా...
Read More...
Local News 

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలు సీజ్ 

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలు సీజ్  గొల్లపల్లి జూలై 11 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని చిల్వర్ కోడూర్ గ్రామ శివారులో బసంత్ నగర్ నుండి నిజామాబాద్ కు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు టిప్పర్ సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం.కృష్ణ సాగర్ రెడ్డి తెలిపారు
Read More...
Local News 

ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దాము.. తపస్

ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దాము.. తపస్ జగిత్యాల జులై 11(ప్రజా మంటలు) ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దామని ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణే  ధ్యేయంగా పనిచేద్దామని తపస్ జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవయ్య రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఐల్నేని నరేందర్ రావు పిలుపునిచ్చారు.. శుక్రవారం అర్బన్ మండలంలోని వివిధ పాఠశాలల్లో ఆ సంఘ సభ్యత్వాన్ని నిర్వహించి మాట్లాడారు.. ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలలు సుశిక్షితమైన ఉపాధ్యాయులతో...
Read More...
Local News  State News 

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.- తెలంగాణ జన సమితి

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.- తెలంగాణ జన సమితి హైదరాబాద్ జూలై 11: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కె.ధర్మార్జున్,పల్లె వినయ్ కుమార్, తెలంగాణ జన సమితి పార్టి  ప్రధాన కార్యదర్శులు అన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అదేస్పూర్తితోటి సామాజిక తెలంగాణ దిశగా అడుగులు వేయుట కొరకు రాష్ట్రంలోని వివిధ సామాజిక శక్తులు...
Read More...
Local News  State News 

హైకోర్టులో కేవియట్ వేసి బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైకోర్టులో కేవియట్ వేసి బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రిజర్వేషన్ల పెంపు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ ఇవ్వాలి - ఆర్డినెన్స్ పాస్ చేసేలా బీజేపీ రాష్ట్ర నేతలు చొరవ తీసుకోవాలి - తాత్కాలికంగా రైల్ రోకో వాయిదా- ఆర్డినెన్స్ జారీలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఉద్యమం ఉధృతం చేస్తాం - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ జూలై...
Read More...
Local News 

మల్లన్నపేట పాఠశాలలో ఆషాఢ మాస గోరింటాకు పండగ

మల్లన్నపేట పాఠశాలలో ఆషాఢ మాస గోరింటాకు పండగ గొల్లపల్లి జూలై 11 (ప్రజా మంటలు)  గొల్లపల్లి మండలం లోని మల్లన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిలు ఉపాధ్యాయురాళ్లు ఆషాఢమాస గోరింటాకు పండగను ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమర్ నాథ్ రెడ్డి విద్యార్థులతో మాట్లాడుతూ, ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం మన సాంప్రదాయం అలాగే దీని వెనుక ఆరోగ్యపరమైన కారణాలు...
Read More...