రాజకీయంగా జీవన్ రెడ్డి పరిస్థితి ఏమిటి?

ఇది జీవన రెడ్డి రాజకీయ చరిత్ర ముగింపుకు కుట్రనా? రేపటి భవిష్యత్ నిర్ణయమేమిటి? కాంగ్రెస్ లో సీనియర్ల పరిస్థితి ఇంతేనా?

On
రాజకీయంగా జీవన్ రెడ్డి పరిస్థితి ఏమిటి?

 జగిత్యాల రాజకీయాలను ఒక కుదుపు కుడిపిన రాజకీయ హత్య

ఇది జీవన రెడ్డి రాజకీయ చరిత్ర ముగింపుకు కుట్రనా?

రేపటి భవిష్యత్ నిర్ణయమేమిటి?

కాంగ్రెస్ లో సీనియర్ల పరిస్థితి ఇంతేనా?

జగిత్యాలలో జరిగిన కాంగ్రెస్ నాయకుడు మార గంగారెడ్డి హత్య తరువాత అక్కడ ఏం జరగనున్నది?

రాజకీయంగా జీవన్ రెడ్డి పరిస్థితి ఏమిటి?

 

జగిత్యాల రాజకీయాలలో అనూహ్య మార్పులకు నాంది

ఎటూ తేల్చుకోలేని స్థితిలో జీవన రెడ్డి

చాపకింది నీరులా కాంగ్రెస్ లో బిఆర్ఎస్ వ్యవహారం

 (సిహెచ్ వి ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్)

 

జగిత్యాల రాజకీయాలలో కాంగ్రెస్ నేత మారు గంగారెడ్డి అనూహ్యమైన మార్పులకు శ్రీకారం చుట్టనుందని, తలపండిన రాజకీయ నాయకుడు, జగిత్యాల రాజకీయాలలో కురువృద్ధుని లాంటి తాటిపర్తి  జీవన్ రెడ్డి జీవితంలో అనుకోని మలుపులకు, మార్పుకు నాంది కానుందా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంత పెద్ద కుదుపును ఆయన 40 ఏళ్ల తరువాత తట్టుకోవాల్సిన పరిసతీలు ఏర్పడ్డాయి.   

 

సామాజిక ఉద్యమాల నేపథ్యంలో, యువ న్యాయవాదిగా ఉంటూ, 1981 లో జరిగిన పంచాయత్ సమితి ఎన్నికల్లో మల్యాల నుండి సమితి అధ్యక్షునిగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి, రెండేళ్ల లోపే 1982-83 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జగిత్యాల నుండి గెలిచిన జీవన్ రెడ్డి, అనుకోని పరిస్థితులలో 1984 డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీలో చేరి, అప్పటి నుండి జగిత్యాల నుండి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో, ప్రస్తుత జగిత్యాల  జిల్లాలో తిరుగులేని నాయకునిగా చలామణి అవుతున్న జీవన రెడ్డికి, ఆయన పైనే రెండుసార్లు గెలిచిన బి ఆర్ ఎస్ అభ్యర్థి డా. సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడం, డానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వత్తాసు పలకడం, జీవన్ రెడ్డి ఆహాన్ని, ఆధిపత్యాన్ని కూకటివెళ్లతో పేకిలించి వేసిందనే చెప్పవచ్చు.

 

డిల్లీ వరకు వెళ్ళినా, సీనియర్లు ఎంత మంది చెప్పినా, ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ కాదనలేక, ఆయనకే అధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని జీవన రెడ్డికి, ఆయన సహచరుడు, ఆత్మీయుడు మార గంగారెడ్డి హత్య, అదీ, మొన్నటి వరకు బి ఆర్ ఎస్ పార్టీలో ఉన్న ఒక యువకుని చేతిలో హత్యకు గురికావడం, ఆయనకు కొలుకొని దెబ్బగా చెప్పుకొంటున్నారు. గంగారెడ్డి హత్య జరిగి రెండు రోజులైనా, ఆయన కొలుకోలేకపోతున్నారు. విషణ్ణ  వదనంతో  ఉన్న ఆయనను చూసిన ఎవరికైనా ఆయన ఎంతగా క్రుంగిపోయారో ఇట్టే పసికట్ట వచ్చు.

 

ఆయన ఎంత ఆవేశంగా ఉన్నా, ఎన్ని ఆరోపణలు చేసినా, ఎవరిని విమర్శించినా, కాంగ్రెస్ అధిష్టాన వర్గంలో కదలిక రావడం లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఓదార్చడానికి ఫోన్ చేసినా, హైదరాబాద్ లో విలేఖరులు అడిగిన ఒక  ప్రశ్నకు  జవాబిస్తూ, జీవన్ రెడ్డి నిన్న మీ పార్టీకొ  దండం -- ,నీకో దండం .. పార్టీలో ఉండాలా వద్దా .. అంటూ చేసిన విమర్శలు అన్నీ ఆయన వ్యక్తిగతమని కొట్టి పారేశారు. మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎంపి మధు యాష్కీ లాంటి వారు కొంత సీరియస్ గా తీసుకొన్నా, దానిపై ఎలాంటి రచ్చ చేసే పరిస్థితిలో లేరనే తెలుస్తుంది. 

 

అంతంత మాత్రమే ఆధిక్యంతో శాసన సభ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ, గతంలో బిఆర్ఎస్ చేసినట్లుగా, మొత్తం పార్టీని తనలో కలుపుకోవాలని చేసిన ప్రయత్నంలో 10 మంది మాత్రమే కాంగ్రెస్ లో చేరడం, అందులో కూడా చేరిన కొందరు కూడా తమకు ప్రాధాన్యత లభించడం లేదని కినుకు వహించి, దూరం - దూరంగా నే ఉంటున్నారు. దీనికి తోడు, బి ఆర్ ఎస్ పార్టీ హైకోర్ట్ వీరి సభ్యత్వాన్ని రద్దు చేయాలని వేసిన పిటిషన్ వీరి తలపై కత్తిలా వేలాడుతుంది. అందులో కడియం శ్రీహరి, దానం నాగేంద్ర, తెల్లం వెంకట రావు ల పేర్లు మాత్రమే ఉన్నా, వారి పట్ల హైకోర్ట్ ఇచ్చే  రేపు తెర్పే, మిగతా 7 గురు ఎమ్మెల్యేల కు వర్తిస్తుందని అనుకొంటున్నారు. సంవత్సరంలోగా, ఉప ఎన్నికలకు పోవడానికి ఎవరు కూడా సిద్దంగా లేరు.

 

ఈ నేపథ్యంలో, జగిత్యాలలోనే కాకుండా, అదే రోజు పఠాన్ చెరువు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ నాయకులపై కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే గడ్డం మహీపాల్ రెడ్డి వర్గీయులు దాడిచేయడం కూడా పార్టీలో కలకలం రేపింది. రాష్ట్ర ప్రజలను ఆకర్షించిన ఉదంతాలు ఈ రెండే అయినా, కొత్తగా పార్టీలో చేరిన బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేల నియోజక వర్గాలలో పాత -కొత్త కాంగ్రెస్ కార్యకర్తల మధ్య అనేక వివాదాలు చెలరేగుతున్నాయి. ఉన్న పార్టీలోని వారే కాకుండా కొత్తగా వచ్చిన వారు, మొన్నటి వరకు అధికారం అనుభవించి, కాంగ్రెస్ కార్యకర్తలను అనేక లకు గురి ఇబ్బందులకు గురి చేసిన వారే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నీళ్ళు నిండిన చేరువులోకి కప్పలు వచ్చినట్లు వచ్చి, ఆధిపత్యం చెలాయించడాన్ని పాత కాంగ్రెసన కార్యకర్తలు భరించలేకపోతున్నారు.

 

జగిత్యాల నియోజకవర్గంలో మొదటి నుండి ఒక సామాజిక వర్గానికి జీవన్ రెడ్డి పట్ల సానుకూలత లేదు. దాదాపు 36 సంవత్సరాల తరువాత ఆ వర్గానికి అధికారం వచ్చింది. జీవన రెడ్డి రెండవ సారి ఎమ్మెల్యేగా, వరుసగా రెండవసారి ఓడిపోవడం, అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, బి ఆర్ ఎస్ పార్టీ ఆధీనలో ఉన్న మున్సిపల్ కూడా కాంగ్రెస్ వశం అవడం కొందరికి కంటిలో నలకలా  మారిపోయింది.

 

మొదటి నుండి అంతా తానే అయి, ఒక్కడే పార్టీని వంటి చేతితో నడిపిన జీవన్ రెడ్డి, కొత్తగా ఎమ్మెల్యే పార్టీలో చేరి ఆధిపత్యం చెలాయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరో ఐదు నెలల్లో తన ఎమ్మెల్సీ పదవి కాలపరిమితి ముగిసిపోనుండగా, మళ్ళీ పోటీ చేయాలనే తపన ఉన్నా, మొన్నటి  రెండు ఎన్నికల్లో ఓడిపోయిన బాధ ఆయనను ముందుకు పోకుండా చేస్తుంది.  తనకంటూ ఒక వర్గం అంటూ లేని ఏకైక సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి, పెద్దగా ఆర్థిక బలం కూడా లేకపోవడంతో  రాబోయే రోజుల్లో అతన్ని ఎదుర్కోవడం ఏమంత కష్టం కాదని ఒక వర్గం భావిస్తుంది.

 

ఎన్నడూ రాజకీయ హత్యలు, గొడవలు లేని జగిత్యాల రాజకీయాలలో మొదటిసారిగా మారు గంగారెడ్డి హత్య, నాయకులనే కాకుండా ప్రజలను కూడా ఉలిక్కిపడేట్లు చేసింది. అంతా శ్మశాన వైరాగ్యంలో ఉన్న ఈ పరిస్థితులలో, ఎమ్మెల్యే డా. సంజయ్ ఈ హత్యకు తనకు ఎలాంటి సంభందం లేదని, దీని వెనుక ఉన్నది ఎవరైనా పట్టుకొని కఠినంగా శిక్షించాలని ప్రకటించారు. అదే సమయంలో తాను ఇంకా బి ఆర్ ఎస్ లోనే ఉన్నట్లు, అభివృద్ధి కొరకే కాంగ్రెస్ తో నడుస్తున్నాననే ప్రకటన చేయడం కూడా అందరినీ గందరగోళంలో పడేసింది. ఇంతకూ ఆయన ఏ పార్టీలో ఉన్నట్లు అనే ప్రశ్న తలెత్తుతుంది.

 

మహారాష్ట్ర, జార్ఖండ్ శాసన సభ ఎన్నికల నేపథ్యంలో ఈ గోడవలను కాంగ్రెస్ నేపథ్యం పట్టించుకో లేక పోవచ్చు. ఆ ఎన్నికల తర్వాత, ఈనెల 24 హైకోర్ట్ ఇచ్చే తీర్పు, ఆదేశాల మేర ఆతరువాతి కార్యక్రమం ఉండవచ్చని, కొత్తగా చేరిన వరైకి ముఖ్యమంత్రి అండ ఉండడం వల్ల సీనియర్లు అయినా వారి మాటకు అంతగా ప్రాధాన్యత లభించక పోవచ్చని, సర్దుకొమ్మని చెప్పి, ఊరడించి పంపే అవకాశాలే ఎక్కువగా ఉండవచ్చని అనుకొంటున్నారు. ఏమైనా, జగిత్యాల నియోజక వర్గంలో ప్రజాబలం ఉన్న నాయకునిగా ఎప్పటికీ  నిలిచిపోయే నాయకుడు జీవన్ రెడ్డి. ఈ సంధి కాలంలో జీవన రెడ్డి లాంటి అనుభవం ఉన్న వారు మౌనంగా ఉండక తప్పదేమో. కాలమే ఇలాంటి వాటికి పరిష్కారం చూపాలి.

Tags
Join WhatsApp

More News...

National  State News 

తెలంగాణ ప్రభుత్వంలో కోవర్ట్ కలకలం: కీలక నిర్ణయాలు లీక్ ‌‌యవుతున్నాయనే అనుమానాలు తీవ్రం

తెలంగాణ ప్రభుత్వంలో కోవర్ట్ కలకలం: కీలక నిర్ణయాలు లీక్ ‌‌యవుతున్నాయనే అనుమానాలు తీవ్రం విజిలెన్స్ దర్యాప్తు – ముఖ్య నివేదిక సీఎం వద్దకు కాంగ్రెస్‌కు పెద్ద ఇబ్బంది :  కోవర్ట్ పాత్రపై కాంగ్రెస్‌లో తీవ్ర చర్చ హైదరాబాద్‌ డిసెంబర్ 03:తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్న అత్యంత కీలక నిర్ణయాలు బహిర్గతం అవుతుండటంపై అధికార యంత్రాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా హిల్ట్ పాలసీ వంటి సున్నితమైన అంశం కేబినెట్‌లో...
Read More...
Local News 

కాలనీ అభివృద్ధిపై జోనల్ కమిషనర్ తో సమావేశం

కాలనీ అభివృద్ధిపై జోనల్ కమిషనర్ తో సమావేశం సికింద్రాబాద్‌, డిసెంబర్ 03 (ప్రజామంటలు):  కాలనీ సమస్యల పరిష్కారానికి చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఏసీఆర్‌డబ్ల్యూఏ అధ్యక్షుడు  ఎన్‌.చంద్రపాల్ రెడ్డి, సంఘ ప్రతినిధులు GHMC నార్త్‌జోన్ జోనల్ కమిషనర్‌ను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. కేంద్ర బొగ్గు ఖనిజ శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రైవేట్ సెక్రటరీ ఇచ్చిన పత్రాన్ని కమిషనర్‌కు వ్యక్తిగతంగా అందజేశారు. కాలనీ రహదారులు సహా...
Read More...
Local News  State News 

హిందూ దేవుళ్ళ పై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సరికాదు : క్షమాపణ చెప్పాలి : బీజేపీ నాయకురాలు రాజేశ్వరి

హిందూ దేవుళ్ళ పై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సరికాదు  : క్షమాపణ చెప్పాలి : బీజేపీ నాయకురాలు రాజేశ్వరి సికింద్రాబాద్,  డిసెంబర్ 03 (ప్రజా మంటలు):  హిందూ దేవీదేవతలను అవమానించేలా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని హిందువులకు క్షమాపణ చెప్పాలని బీజేపీ ఓబీసీ మోర్చా రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి డిమాండ్ చేశారు.కాంగ్రెస్‌కు హిందూ వ్యతిరేకత కొత్తేమీ కాదని, పీసీసీ సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కోట్లాది హిందువుల మనోభావాలను...
Read More...
Local News  Crime 

భవన నిర్మాణ పనుల్లో అపశృతి..జేసీబీ తగిలి కూలీ మృతి

భవన నిర్మాణ పనుల్లో అపశృతి..జేసీబీ తగిలి కూలీ మృతి సికింద్రాబాద్, డిసెంబర్ 03 ( ప్రజామంటలు) : భవన నిర్మాణ పనుల్లో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ కూలీ తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మహాంకాళి పోలీసులు తెలిపిన వివరాలు..పాన్ బజార్ లో ఓ భవనం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గత నెల 28న నిర్మాణ పనుల్లో భాగంగా అక్కడ...
Read More...
Local News  State News 

హైదరాబాద్ ను సేఫరాబాద్ గా మార్చాలనేది తమ లక్ష్యం : సర్వేజనా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గురువారెడ్డి

హైదరాబాద్ ను సేఫరాబాద్ గా మార్చాలనేది తమ లక్ష్యం : సర్వేజనా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గురువారెడ్డి    సికింద్రాబాద్, డిసెంబర్ 03 ( ప్రజామంటలు) : హైదరాబాద్‌ను సేఫరాబాద్ గా మార్చాలన్న లక్ష్యంతో సర్వేజనా ఫౌండేషన్ రోడ్డు భద్రతపై వినూత్న కార్యక్రమానికి నాంది పలికింది. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న సప్త పాపాలపై అవగాహన కల్పించేందుకు ప్రతీకాత్మకంగా యమలోకం నుంచి వచ్చిన యమధర్మరాజును రంగంలోకి దింపారు. రసూల్‌పురా జంక్షన్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని నగరంలోని 365...
Read More...
Local News 

గాంధీనగర్ సర్పంచ్‌గా కేతిరి లక్ష్మారెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

గాంధీనగర్ సర్పంచ్‌గా కేతిరి లక్ష్మారెడ్డి ఏకగ్రీవ ఎన్నిక భీమదేవరపల్లి, డిసెంబర్ 3 (ప్రజామంటలు): మండలంలోని గాంధీనగర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఖరారైంది. గ్రామ అభివృద్ధి, ఐక్యత, సామరస్యాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామ ప్రజల ఏకాభిప్రాయంతో కేతిరి లక్ష్మారెడ్డి సర్పంచ్‌గా ఎన్నుకోబడ్డారు. సర్పంచ్ బరిలో నలుగురు అభ్యర్థులు కేతిరి లక్ష్మారెడ్డి, గడ్డం వెంకన్న, తాళ్లపల్లి రవీందర్, తాళ్లపల్లి దయాకర్ నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ,...
Read More...
Local News 

ముల్కనూరులో కాకతీయ టయోటా ‘ఇయర్ ఎండింగ్ బంపర్ ఆఫర్లు’

ముల్కనూరులో కాకతీయ టయోటా ‘ఇయర్ ఎండింగ్ బంపర్ ఆఫర్లు’ భీమదేవరపల్లి, డిసెంబర్ 3 (ప్రజామంటలు)  : మండలంలోని ముల్కనూర్ ప్రజా గ్రంథాలయం వద్ద ఈ నెల 3, 4 తేదీల్లో (సోమ,మంగళ) కాకతీయ టయోటా కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ‘ఇయర్ ఎండింగ్ బంపర్ ఆఫర్లు’ నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రతి కారు కొనుగోలుపై లక్ష రూపాయల వరకు ప్రత్యేక రాయితీలు లభిస్తాయని సేల్స్ మేనేజర్...
Read More...

రంగపేట వడ్డెర కాలనీ గ్రామపంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవం

రంగపేట వడ్డెర కాలనీ గ్రామపంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవం    సారంగాపూర్ డిసెంబర్ 3 (ప్రజా మంటలు)మండల రంగపేట వడ్డెర కాలనీ గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ పూర్తయి సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డ్ సభ్యులకు ఒక్కో నామినేషన్ రాగా నూతన పాలకవర్గం  ఏకగ్రీవంగా ఎన్నిక కాగా  జగిత్యాలలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ని సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు మర్యాద పూర్వకంగా కలవగా వడ్డరకాలని నూతన...
Read More...

సిలెండర్ బుడ్డీల దొంగ అరెస్ట్ _సిలిండర్లు స్వాధీనం

సిలెండర్ బుడ్డీల దొంగ అరెస్ట్ _సిలిండర్లు స్వాధీనం   జగిత్యాల డిసెంబర్ 3(ప్రజా మంటలు)జగిత్యాల పట్టణ పరిధిలో డోమెస్టిక్ వంట గ్యాస్ బుడ్డిలను దొంగిలిస్తున్న దొంగ వివరాలను డిఎస్పీ రఘు చందర్ వెల్లడించారు. జగిత్యాల పట్టణానికి చెందిన షేక్ సుమేర్ అనే వ్యక్తి గత కొద్దిరోజులుగా ఇండ్లలోకి దూరి బయట ఉంచుతున్న వంట గ్యాసు బుడ్డిలను దొంగిలిస్తున్న క్రమంలో బాధితుల ఫిర్యాదు మేరకు సిసి...
Read More...

దివ్యాంగుల కోసం ఎక్కువ నిధులు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి_ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

దివ్యాంగుల కోసం ఎక్కువ నిధులు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి_ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కరీంనగర్ డిసెంబర్ 3 (ప్రజా మంటలు)దివ్యాంగుల కోసం ఎక్కువ నిధులు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని రాష్ట్ర మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీ సమీపంలో గల దివ్యాంగుల బదిరుల ఆశ్రమ పాఠశాలలో లో మహిళలు పిల్లలు,దివ్యాంగులు వయోవృద్ధుల సాధికారత...
Read More...
Local News 

నామినేషన్ల కేంద్రాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్ బి. సత్యప్రసాద్

నామినేషన్ల కేంద్రాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలి:  కలెక్టర్ బి. సత్యప్రసాద్ (అంకం భూమయ్య)  గొల్లపల్లి డిసెంబర్ 03 (ప్రజా మంటలు):  గ్రామ పంచాయతీ మూడవ విడత ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 3 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా బుధవారం గొల్లపెల్లి మండల కేంద్రం తొ పాటు చిల్వకోడూర్, తిరుమలాపూర్ గ్రామంలో  పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ తీరును...
Read More...
Local News 

గొల్లపల్లి సర్పంచ్ అభ్యర్థి గా  నామినేషన్ దాఖలు చేసిన నల్ల నీరజ _సతీశ్ రెడ్డి 

గొల్లపల్లి సర్పంచ్ అభ్యర్థి గా  నామినేషన్ దాఖలు చేసిన  నల్ల నీరజ _సతీశ్ రెడ్డి  (అంకం భూమయ్య) గొల్లపల్లి డిసెంబర్  03, (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండల కేంద్రంలో  సర్పంచ్ అభ్యర్థిగా నల్ల నీరజ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు  అనంతరం ఆమె మాట్లాడుతూ   నన్ను గెలిపిస్తే ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తా అని  స్థానికంగా తాను ప్రజల్లోనే ఉంటూ గ్రామ యువత సమక్షంలో
Read More...