రాజకీయంగా జీవన్ రెడ్డి పరిస్థితి ఏమిటి?

ఇది జీవన రెడ్డి రాజకీయ చరిత్ర ముగింపుకు కుట్రనా? రేపటి భవిష్యత్ నిర్ణయమేమిటి? కాంగ్రెస్ లో సీనియర్ల పరిస్థితి ఇంతేనా?

On
రాజకీయంగా జీవన్ రెడ్డి పరిస్థితి ఏమిటి?

 జగిత్యాల రాజకీయాలను ఒక కుదుపు కుడిపిన రాజకీయ హత్య

ఇది జీవన రెడ్డి రాజకీయ చరిత్ర ముగింపుకు కుట్రనా?

రేపటి భవిష్యత్ నిర్ణయమేమిటి?

కాంగ్రెస్ లో సీనియర్ల పరిస్థితి ఇంతేనా?

జగిత్యాలలో జరిగిన కాంగ్రెస్ నాయకుడు మార గంగారెడ్డి హత్య తరువాత అక్కడ ఏం జరగనున్నది?

రాజకీయంగా జీవన్ రెడ్డి పరిస్థితి ఏమిటి?

 

జగిత్యాల రాజకీయాలలో అనూహ్య మార్పులకు నాంది

ఎటూ తేల్చుకోలేని స్థితిలో జీవన రెడ్డి

చాపకింది నీరులా కాంగ్రెస్ లో బిఆర్ఎస్ వ్యవహారం

 (సిహెచ్ వి ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్)

 

జగిత్యాల రాజకీయాలలో కాంగ్రెస్ నేత మారు గంగారెడ్డి అనూహ్యమైన మార్పులకు శ్రీకారం చుట్టనుందని, తలపండిన రాజకీయ నాయకుడు, జగిత్యాల రాజకీయాలలో కురువృద్ధుని లాంటి తాటిపర్తి  జీవన్ రెడ్డి జీవితంలో అనుకోని మలుపులకు, మార్పుకు నాంది కానుందా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంత పెద్ద కుదుపును ఆయన 40 ఏళ్ల తరువాత తట్టుకోవాల్సిన పరిసతీలు ఏర్పడ్డాయి.   

 

సామాజిక ఉద్యమాల నేపథ్యంలో, యువ న్యాయవాదిగా ఉంటూ, 1981 లో జరిగిన పంచాయత్ సమితి ఎన్నికల్లో మల్యాల నుండి సమితి అధ్యక్షునిగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి, రెండేళ్ల లోపే 1982-83 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జగిత్యాల నుండి గెలిచిన జీవన్ రెడ్డి, అనుకోని పరిస్థితులలో 1984 డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీలో చేరి, అప్పటి నుండి జగిత్యాల నుండి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో, ప్రస్తుత జగిత్యాల  జిల్లాలో తిరుగులేని నాయకునిగా చలామణి అవుతున్న జీవన రెడ్డికి, ఆయన పైనే రెండుసార్లు గెలిచిన బి ఆర్ ఎస్ అభ్యర్థి డా. సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడం, డానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వత్తాసు పలకడం, జీవన్ రెడ్డి ఆహాన్ని, ఆధిపత్యాన్ని కూకటివెళ్లతో పేకిలించి వేసిందనే చెప్పవచ్చు.

 

డిల్లీ వరకు వెళ్ళినా, సీనియర్లు ఎంత మంది చెప్పినా, ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ కాదనలేక, ఆయనకే అధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని జీవన రెడ్డికి, ఆయన సహచరుడు, ఆత్మీయుడు మార గంగారెడ్డి హత్య, అదీ, మొన్నటి వరకు బి ఆర్ ఎస్ పార్టీలో ఉన్న ఒక యువకుని చేతిలో హత్యకు గురికావడం, ఆయనకు కొలుకొని దెబ్బగా చెప్పుకొంటున్నారు. గంగారెడ్డి హత్య జరిగి రెండు రోజులైనా, ఆయన కొలుకోలేకపోతున్నారు. విషణ్ణ  వదనంతో  ఉన్న ఆయనను చూసిన ఎవరికైనా ఆయన ఎంతగా క్రుంగిపోయారో ఇట్టే పసికట్ట వచ్చు.

 

ఆయన ఎంత ఆవేశంగా ఉన్నా, ఎన్ని ఆరోపణలు చేసినా, ఎవరిని విమర్శించినా, కాంగ్రెస్ అధిష్టాన వర్గంలో కదలిక రావడం లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఓదార్చడానికి ఫోన్ చేసినా, హైదరాబాద్ లో విలేఖరులు అడిగిన ఒక  ప్రశ్నకు  జవాబిస్తూ, జీవన్ రెడ్డి నిన్న మీ పార్టీకొ  దండం -- ,నీకో దండం .. పార్టీలో ఉండాలా వద్దా .. అంటూ చేసిన విమర్శలు అన్నీ ఆయన వ్యక్తిగతమని కొట్టి పారేశారు. మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎంపి మధు యాష్కీ లాంటి వారు కొంత సీరియస్ గా తీసుకొన్నా, దానిపై ఎలాంటి రచ్చ చేసే పరిస్థితిలో లేరనే తెలుస్తుంది. 

 

అంతంత మాత్రమే ఆధిక్యంతో శాసన సభ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ, గతంలో బిఆర్ఎస్ చేసినట్లుగా, మొత్తం పార్టీని తనలో కలుపుకోవాలని చేసిన ప్రయత్నంలో 10 మంది మాత్రమే కాంగ్రెస్ లో చేరడం, అందులో కూడా చేరిన కొందరు కూడా తమకు ప్రాధాన్యత లభించడం లేదని కినుకు వహించి, దూరం - దూరంగా నే ఉంటున్నారు. దీనికి తోడు, బి ఆర్ ఎస్ పార్టీ హైకోర్ట్ వీరి సభ్యత్వాన్ని రద్దు చేయాలని వేసిన పిటిషన్ వీరి తలపై కత్తిలా వేలాడుతుంది. అందులో కడియం శ్రీహరి, దానం నాగేంద్ర, తెల్లం వెంకట రావు ల పేర్లు మాత్రమే ఉన్నా, వారి పట్ల హైకోర్ట్ ఇచ్చే  రేపు తెర్పే, మిగతా 7 గురు ఎమ్మెల్యేల కు వర్తిస్తుందని అనుకొంటున్నారు. సంవత్సరంలోగా, ఉప ఎన్నికలకు పోవడానికి ఎవరు కూడా సిద్దంగా లేరు.

 

ఈ నేపథ్యంలో, జగిత్యాలలోనే కాకుండా, అదే రోజు పఠాన్ చెరువు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ నాయకులపై కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే గడ్డం మహీపాల్ రెడ్డి వర్గీయులు దాడిచేయడం కూడా పార్టీలో కలకలం రేపింది. రాష్ట్ర ప్రజలను ఆకర్షించిన ఉదంతాలు ఈ రెండే అయినా, కొత్తగా పార్టీలో చేరిన బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేల నియోజక వర్గాలలో పాత -కొత్త కాంగ్రెస్ కార్యకర్తల మధ్య అనేక వివాదాలు చెలరేగుతున్నాయి. ఉన్న పార్టీలోని వారే కాకుండా కొత్తగా వచ్చిన వారు, మొన్నటి వరకు అధికారం అనుభవించి, కాంగ్రెస్ కార్యకర్తలను అనేక లకు గురి ఇబ్బందులకు గురి చేసిన వారే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నీళ్ళు నిండిన చేరువులోకి కప్పలు వచ్చినట్లు వచ్చి, ఆధిపత్యం చెలాయించడాన్ని పాత కాంగ్రెసన కార్యకర్తలు భరించలేకపోతున్నారు.

 

జగిత్యాల నియోజకవర్గంలో మొదటి నుండి ఒక సామాజిక వర్గానికి జీవన్ రెడ్డి పట్ల సానుకూలత లేదు. దాదాపు 36 సంవత్సరాల తరువాత ఆ వర్గానికి అధికారం వచ్చింది. జీవన రెడ్డి రెండవ సారి ఎమ్మెల్యేగా, వరుసగా రెండవసారి ఓడిపోవడం, అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, బి ఆర్ ఎస్ పార్టీ ఆధీనలో ఉన్న మున్సిపల్ కూడా కాంగ్రెస్ వశం అవడం కొందరికి కంటిలో నలకలా  మారిపోయింది.

 

మొదటి నుండి అంతా తానే అయి, ఒక్కడే పార్టీని వంటి చేతితో నడిపిన జీవన్ రెడ్డి, కొత్తగా ఎమ్మెల్యే పార్టీలో చేరి ఆధిపత్యం చెలాయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరో ఐదు నెలల్లో తన ఎమ్మెల్సీ పదవి కాలపరిమితి ముగిసిపోనుండగా, మళ్ళీ పోటీ చేయాలనే తపన ఉన్నా, మొన్నటి  రెండు ఎన్నికల్లో ఓడిపోయిన బాధ ఆయనను ముందుకు పోకుండా చేస్తుంది.  తనకంటూ ఒక వర్గం అంటూ లేని ఏకైక సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి, పెద్దగా ఆర్థిక బలం కూడా లేకపోవడంతో  రాబోయే రోజుల్లో అతన్ని ఎదుర్కోవడం ఏమంత కష్టం కాదని ఒక వర్గం భావిస్తుంది.

 

ఎన్నడూ రాజకీయ హత్యలు, గొడవలు లేని జగిత్యాల రాజకీయాలలో మొదటిసారిగా మారు గంగారెడ్డి హత్య, నాయకులనే కాకుండా ప్రజలను కూడా ఉలిక్కిపడేట్లు చేసింది. అంతా శ్మశాన వైరాగ్యంలో ఉన్న ఈ పరిస్థితులలో, ఎమ్మెల్యే డా. సంజయ్ ఈ హత్యకు తనకు ఎలాంటి సంభందం లేదని, దీని వెనుక ఉన్నది ఎవరైనా పట్టుకొని కఠినంగా శిక్షించాలని ప్రకటించారు. అదే సమయంలో తాను ఇంకా బి ఆర్ ఎస్ లోనే ఉన్నట్లు, అభివృద్ధి కొరకే కాంగ్రెస్ తో నడుస్తున్నాననే ప్రకటన చేయడం కూడా అందరినీ గందరగోళంలో పడేసింది. ఇంతకూ ఆయన ఏ పార్టీలో ఉన్నట్లు అనే ప్రశ్న తలెత్తుతుంది.

 

మహారాష్ట్ర, జార్ఖండ్ శాసన సభ ఎన్నికల నేపథ్యంలో ఈ గోడవలను కాంగ్రెస్ నేపథ్యం పట్టించుకో లేక పోవచ్చు. ఆ ఎన్నికల తర్వాత, ఈనెల 24 హైకోర్ట్ ఇచ్చే తీర్పు, ఆదేశాల మేర ఆతరువాతి కార్యక్రమం ఉండవచ్చని, కొత్తగా చేరిన వరైకి ముఖ్యమంత్రి అండ ఉండడం వల్ల సీనియర్లు అయినా వారి మాటకు అంతగా ప్రాధాన్యత లభించక పోవచ్చని, సర్దుకొమ్మని చెప్పి, ఊరడించి పంపే అవకాశాలే ఎక్కువగా ఉండవచ్చని అనుకొంటున్నారు. ఏమైనా, జగిత్యాల నియోజక వర్గంలో ప్రజాబలం ఉన్న నాయకునిగా ఎప్పటికీ  నిలిచిపోయే నాయకుడు జీవన్ రెడ్డి. ఈ సంధి కాలంలో జీవన రెడ్డి లాంటి అనుభవం ఉన్న వారు మౌనంగా ఉండక తప్పదేమో. కాలమే ఇలాంటి వాటికి పరిష్కారం చూపాలి.

Tags

More News...

Local News 

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష  ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం  ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్ ధర్మపురి సెప్టెంబర్ 17(ప్రజా మంటలు) ధర్మపురిలో పలు ప్రాంతాలను పరిశీలించిన దేవదాయ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ 2027 జూలై లో రానున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని దేవదాయ కమిషనర్ శైలజ రామయ్యార్ అధికారులను ఆదేశించారు.  ఈ సందర్బంగా ధర్మపురి పట్టణానికి విచ్చేసిన దేవదాయ కమిషనర్...
Read More...
Local News  State News 

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి (రామ కిష్టయ్య సంగన భట్ల - 9440595494) ధర్మపురి సెప్టెంబర్ 15: 2027లో జులై 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలను కుంభ మేళా తరహాలో నిర్వహించాలని, అందుకు, వ్యవధి ఉన్నందున శాశ్వతమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్...
Read More...
Local News 

మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా 

మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా  (రామ కిష్టయ్య సంగన భట్ల సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్...9440595494) సౌమ్య బొజ్జా ‘మిసెస్ చికాగో యూనివర్స్ 2026’ కిరీటాన్ని సొంతం చేసుకుని తెలుగు ప్రజలకు గర్వకారణమయ్యారు. అమెరికా న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్ వేదికగా సెప్టెంబర్ 12, 2025న నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అందాల పోటీలో ఆమె విజయం సాధించడం విశేషం. చికాగోలో...
Read More...
Local News  State News 

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్ న్యూఢిల్లీ సెప్టెంబర్ 17: చాలా రాష్ట్రాల్లోని సగం కంటే ఎక్కువ మంది ఓటర్లు SIRలో ఎటువంటి పత్రాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చునని EC అధికారులు తెలిపారు.చాలా రాష్ట్రాలు 2002 మరియు 2004 మధ్య ఓటర్ల జాబితా యొక్క చివరి స్పెషల్ ఇంటెన్సివ్ సవరణను కలిగి ఉన్నాయని వారు తెలిపారు.ఆ సంవత్సరం తదుపరి SIR కోసం...
Read More...
Local News 

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ  జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్   జగిత్యాల సెప్టెంబర్ 17 (ప్రజా మంటలు) జిల్లా సమీకృత భవన సముదాయం లో శిల్పకళ, వాస్తు శిల్పి విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్బంగా బిసి కమిషన్ చైర్మన్  జి. నిరంజన్,జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  అనంతరం...
Read More...
Local News 

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల సెప్టెంబర్ 17 (ప్రజా మంటలు)ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల జగిత్యాల లో ఎన్సిసి లెఫ్ట్నెంట్ అధికారిగా జంతుశాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ గా బోధన విధులు నిర్వహిస్తున్న పర్లపల్లి రాజుకు తెలంగాణ రాష్ట్ర గౌరవ  ముఖ్యమంత్రి  అనుముల రేవంత్ రెడ్డి  చేతుల మీదుగా సెప్టెంబర్ 5వ తేదీన...
Read More...
Local News 

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు సికింద్రాబాద్, సెప్టెంబర్ 17 (ప్రజామంటలు): హైదరాబాద్ విముక్తి దినోత్సవం,విశ్వకర్మ జయంతి సందర్భంగా బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.మొదటగా నిజాం పాలన నుండి విముక్తి సాధించిన ఘనతను స్మరించుకుంటూ జాతీయ జెండా ఆవిష్కరణ జరగగా, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అనంతరం విశ్వకర్మ జయంతి, ప్రధాని నరేంద్ర మోదీ...
Read More...
Local News 

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్‌రెడ్డి వీడ్కోలు సభ

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్‌రెడ్డి వీడ్కోలు సభ    సికింద్రాబాద్‌, సెప్టెంబర్ 17 (ప్రజామంటలు) : వృత్తి నిబద్ధతతో చేసే సేవలే అధికారులకు శాశ్వత గుర్తింపునిస్తాయని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వాణి అన్నారు. గాంధీ ఆస్పత్రి సెమినార్‌ హాలులో బుధవారం రంగారెడ్డి జిల్లా ఫార్మసీ ఆఫీసర్‌గా పదోన్నతి పొందిన మధుసుధాకర్‌రెడ్డి వీడ్కోలు, అభినందన సభ ఉత్సాహంగా జరిగింది.ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్‌ వాణి...
Read More...
Local News 

కల్లుగీత పారిశ్రామిక సంఘం భవన నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యేకు. సంఘం ఆహ్వానం

కల్లుగీత పారిశ్రామిక సంఘం భవన నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యేకు. సంఘం ఆహ్వానం జగిత్యాల సెప్టెంబర్ 17 (ప్రజా మంటలు)ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని కలిసిన గౌడ కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం జగిత్యాల మోతే తిమ్మాపూర్ సభ్యులు. సెప్టెంబర్ 24వ తేదీన గౌడ సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపనకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికను అందజేసి,గౌడ పారిశ్రామిక సహకార సంఘం, వనదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ...
Read More...
Local News 

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు జగిత్యాల సెప్టెంబర్ 17 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్*ఈ కార్యక్రమంలో డిఎస్పీ లు వెంకటరమణ, రఘు చందర్, రాములు, ఇన్స్పెక్టర్ లు ఆరిఫ్ అలీ ఖాన్,అనిల్ కుమార్, రామ్ నరసింహారెడ్డి,సుధాకర్, కరుణాకర్ ఆర్.ఐ...
Read More...
Local News 

స్టైఫండ్ ల విడుదలలో  జాప్యం నివారించండి

స్టైఫండ్ ల విడుదలలో  జాప్యం నివారించండి తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం ఆందోళన సికింద్రాబాద్, సెప్టెంబర్ 17 (ప్రజామంటలు):తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ( టీ జూడా) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్లు, సూపర్ స్పెషాలిటీ, డెంటల్ పీజీలు, హౌస్ సర్జన్లు, నర్సింగ్ విద్యార్థుల తరఫున తమ  ఆందోళనను వ్యక్తం చేసింది. వేతన భత్యాల...
Read More...
Local News 

గాంధీ ఆవరణలో గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీ 

గాంధీ ఆవరణలో గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీ  సికింద్రాబాద్, సెప్టెంబర్ 17 (ప్రజా మంటలు):  గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీ వెలుగు చూసింది.  చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ సిబ్బందికి మెయిన్ గేటు వద్ద పడి ఉన్న గుర్తు తెలియని మహిళ డెడ్ బాడీ ( దాదాపు  45-50 ఏళ్ల వయసు) కనిపించింది....
Read More...