రాజకీయంగా జీవన్ రెడ్డి పరిస్థితి ఏమిటి?
ఇది జీవన రెడ్డి రాజకీయ చరిత్ర ముగింపుకు కుట్రనా? రేపటి భవిష్యత్ నిర్ణయమేమిటి? కాంగ్రెస్ లో సీనియర్ల పరిస్థితి ఇంతేనా?
జగిత్యాల రాజకీయాలను ఒక కుదుపు కుడిపిన రాజకీయ హత్య
ఇది జీవన రెడ్డి రాజకీయ చరిత్ర ముగింపుకు కుట్రనా?
రేపటి భవిష్యత్ నిర్ణయమేమిటి?
కాంగ్రెస్ లో సీనియర్ల పరిస్థితి ఇంతేనా?
జగిత్యాలలో జరిగిన కాంగ్రెస్ నాయకుడు మార గంగారెడ్డి హత్య తరువాత అక్కడ ఏం జరగనున్నది?
రాజకీయంగా జీవన్ రెడ్డి పరిస్థితి ఏమిటి?
జగిత్యాల రాజకీయాలలో అనూహ్య మార్పులకు నాంది
ఎటూ తేల్చుకోలేని స్థితిలో జీవన రెడ్డి
చాపకింది నీరులా కాంగ్రెస్ లో బిఆర్ఎస్ వ్యవహారం
(సిహెచ్ వి ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్)
జగిత్యాల రాజకీయాలలో కాంగ్రెస్ నేత మారు గంగారెడ్డి అనూహ్యమైన మార్పులకు శ్రీకారం చుట్టనుందని, తలపండిన రాజకీయ నాయకుడు, జగిత్యాల రాజకీయాలలో కురువృద్ధుని లాంటి తాటిపర్తి జీవన్ రెడ్డి జీవితంలో అనుకోని మలుపులకు, మార్పుకు నాంది కానుందా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంత పెద్ద కుదుపును ఆయన 40 ఏళ్ల తరువాత తట్టుకోవాల్సిన పరిసతీలు ఏర్పడ్డాయి.
సామాజిక ఉద్యమాల నేపథ్యంలో, యువ న్యాయవాదిగా ఉంటూ, 1981 లో జరిగిన పంచాయత్ సమితి ఎన్నికల్లో మల్యాల నుండి సమితి అధ్యక్షునిగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి, రెండేళ్ల లోపే 1982-83 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జగిత్యాల నుండి గెలిచిన జీవన్ రెడ్డి, అనుకోని పరిస్థితులలో 1984 డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీలో చేరి, అప్పటి నుండి జగిత్యాల నుండి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో, ప్రస్తుత జగిత్యాల జిల్లాలో తిరుగులేని నాయకునిగా చలామణి అవుతున్న జీవన రెడ్డికి, ఆయన పైనే రెండుసార్లు గెలిచిన బి ఆర్ ఎస్ అభ్యర్థి డా. సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడం, డానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వత్తాసు పలకడం, జీవన్ రెడ్డి ఆహాన్ని, ఆధిపత్యాన్ని కూకటివెళ్లతో పేకిలించి వేసిందనే చెప్పవచ్చు.
డిల్లీ వరకు వెళ్ళినా, సీనియర్లు ఎంత మంది చెప్పినా, ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ కాదనలేక, ఆయనకే అధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని జీవన రెడ్డికి, ఆయన సహచరుడు, ఆత్మీయుడు మార గంగారెడ్డి హత్య, అదీ, మొన్నటి వరకు బి ఆర్ ఎస్ పార్టీలో ఉన్న ఒక యువకుని చేతిలో హత్యకు గురికావడం, ఆయనకు కొలుకొని దెబ్బగా చెప్పుకొంటున్నారు. గంగారెడ్డి హత్య జరిగి రెండు రోజులైనా, ఆయన కొలుకోలేకపోతున్నారు. విషణ్ణ వదనంతో ఉన్న ఆయనను చూసిన ఎవరికైనా ఆయన ఎంతగా క్రుంగిపోయారో ఇట్టే పసికట్ట వచ్చు.
ఆయన ఎంత ఆవేశంగా ఉన్నా, ఎన్ని ఆరోపణలు చేసినా, ఎవరిని విమర్శించినా, కాంగ్రెస్ అధిష్టాన వర్గంలో కదలిక రావడం లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఓదార్చడానికి ఫోన్ చేసినా, హైదరాబాద్ లో విలేఖరులు అడిగిన ఒక ప్రశ్నకు జవాబిస్తూ, జీవన్ రెడ్డి నిన్న మీ పార్టీకొ దండం -- ,నీకో దండం .. పార్టీలో ఉండాలా వద్దా .. అంటూ చేసిన విమర్శలు అన్నీ ఆయన వ్యక్తిగతమని కొట్టి పారేశారు. మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎంపి మధు యాష్కీ లాంటి వారు కొంత సీరియస్ గా తీసుకొన్నా, దానిపై ఎలాంటి రచ్చ చేసే పరిస్థితిలో లేరనే తెలుస్తుంది.
అంతంత మాత్రమే ఆధిక్యంతో శాసన సభ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ, గతంలో బిఆర్ఎస్ చేసినట్లుగా, మొత్తం పార్టీని తనలో కలుపుకోవాలని చేసిన ప్రయత్నంలో 10 మంది మాత్రమే కాంగ్రెస్ లో చేరడం, అందులో కూడా చేరిన కొందరు కూడా తమకు ప్రాధాన్యత లభించడం లేదని కినుకు వహించి, దూరం - దూరంగా నే ఉంటున్నారు. దీనికి తోడు, బి ఆర్ ఎస్ పార్టీ హైకోర్ట్ వీరి సభ్యత్వాన్ని రద్దు చేయాలని వేసిన పిటిషన్ వీరి తలపై కత్తిలా వేలాడుతుంది. అందులో కడియం శ్రీహరి, దానం నాగేంద్ర, తెల్లం వెంకట రావు ల పేర్లు మాత్రమే ఉన్నా, వారి పట్ల హైకోర్ట్ ఇచ్చే రేపు తెర్పే, మిగతా 7 గురు ఎమ్మెల్యేల కు వర్తిస్తుందని అనుకొంటున్నారు. సంవత్సరంలోగా, ఉప ఎన్నికలకు పోవడానికి ఎవరు కూడా సిద్దంగా లేరు.
ఈ నేపథ్యంలో, జగిత్యాలలోనే కాకుండా, అదే రోజు పఠాన్ చెరువు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ నాయకులపై కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే గడ్డం మహీపాల్ రెడ్డి వర్గీయులు దాడిచేయడం కూడా పార్టీలో కలకలం రేపింది. రాష్ట్ర ప్రజలను ఆకర్షించిన ఉదంతాలు ఈ రెండే అయినా, కొత్తగా పార్టీలో చేరిన బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేల నియోజక వర్గాలలో పాత -కొత్త కాంగ్రెస్ కార్యకర్తల మధ్య అనేక వివాదాలు చెలరేగుతున్నాయి. ఉన్న పార్టీలోని వారే కాకుండా కొత్తగా వచ్చిన వారు, మొన్నటి వరకు అధికారం అనుభవించి, కాంగ్రెస్ కార్యకర్తలను అనేక లకు గురి ఇబ్బందులకు గురి చేసిన వారే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నీళ్ళు నిండిన చేరువులోకి కప్పలు వచ్చినట్లు వచ్చి, ఆధిపత్యం చెలాయించడాన్ని పాత కాంగ్రెసన కార్యకర్తలు భరించలేకపోతున్నారు.
జగిత్యాల నియోజకవర్గంలో మొదటి నుండి ఒక సామాజిక వర్గానికి జీవన్ రెడ్డి పట్ల సానుకూలత లేదు. దాదాపు 36 సంవత్సరాల తరువాత ఆ వర్గానికి అధికారం వచ్చింది. జీవన రెడ్డి రెండవ సారి ఎమ్మెల్యేగా, వరుసగా రెండవసారి ఓడిపోవడం, అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, బి ఆర్ ఎస్ పార్టీ ఆధీనలో ఉన్న మున్సిపల్ కూడా కాంగ్రెస్ వశం అవడం కొందరికి కంటిలో నలకలా మారిపోయింది.
మొదటి నుండి అంతా తానే అయి, ఒక్కడే పార్టీని వంటి చేతితో నడిపిన జీవన్ రెడ్డి, కొత్తగా ఎమ్మెల్యే పార్టీలో చేరి ఆధిపత్యం చెలాయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరో ఐదు నెలల్లో తన ఎమ్మెల్సీ పదవి కాలపరిమితి ముగిసిపోనుండగా, మళ్ళీ పోటీ చేయాలనే తపన ఉన్నా, మొన్నటి రెండు ఎన్నికల్లో ఓడిపోయిన బాధ ఆయనను ముందుకు పోకుండా చేస్తుంది. తనకంటూ ఒక వర్గం అంటూ లేని ఏకైక సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి, పెద్దగా ఆర్థిక బలం కూడా లేకపోవడంతో రాబోయే రోజుల్లో అతన్ని ఎదుర్కోవడం ఏమంత కష్టం కాదని ఒక వర్గం భావిస్తుంది.
ఎన్నడూ రాజకీయ హత్యలు, గొడవలు లేని జగిత్యాల రాజకీయాలలో మొదటిసారిగా మారు గంగారెడ్డి హత్య, నాయకులనే కాకుండా ప్రజలను కూడా ఉలిక్కిపడేట్లు చేసింది. అంతా శ్మశాన వైరాగ్యంలో ఉన్న ఈ పరిస్థితులలో, ఎమ్మెల్యే డా. సంజయ్ ఈ హత్యకు తనకు ఎలాంటి సంభందం లేదని, దీని వెనుక ఉన్నది ఎవరైనా పట్టుకొని కఠినంగా శిక్షించాలని ప్రకటించారు. అదే సమయంలో తాను ఇంకా బి ఆర్ ఎస్ లోనే ఉన్నట్లు, అభివృద్ధి కొరకే కాంగ్రెస్ తో నడుస్తున్నాననే ప్రకటన చేయడం కూడా అందరినీ గందరగోళంలో పడేసింది. ఇంతకూ ఆయన ఏ పార్టీలో ఉన్నట్లు అనే ప్రశ్న తలెత్తుతుంది.
మహారాష్ట్ర, జార్ఖండ్ శాసన సభ ఎన్నికల నేపథ్యంలో ఈ గోడవలను కాంగ్రెస్ నేపథ్యం పట్టించుకో లేక పోవచ్చు. ఆ ఎన్నికల తర్వాత, ఈనెల 24 హైకోర్ట్ ఇచ్చే తీర్పు, ఆదేశాల మేర ఆతరువాతి కార్యక్రమం ఉండవచ్చని, కొత్తగా చేరిన వరైకి ముఖ్యమంత్రి అండ ఉండడం వల్ల సీనియర్లు అయినా వారి మాటకు అంతగా ప్రాధాన్యత లభించక పోవచ్చని, సర్దుకొమ్మని చెప్పి, ఊరడించి పంపే అవకాశాలే ఎక్కువగా ఉండవచ్చని అనుకొంటున్నారు. ఏమైనా, జగిత్యాల నియోజక వర్గంలో ప్రజాబలం ఉన్న నాయకునిగా ఎప్పటికీ నిలిచిపోయే నాయకుడు జీవన్ రెడ్డి. ఈ సంధి కాలంలో జీవన రెడ్డి లాంటి అనుభవం ఉన్న వారు మౌనంగా ఉండక తప్పదేమో. కాలమే ఇలాంటి వాటికి పరిష్కారం చూపాలి.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఢిల్లీలో ఓసిల మహా ధర్నాను విజయవంతం చేయాలి ధర్నా పోస్టరును ఆవిష్కరించిన ఓసి నేతలు
జగిత్యాల ఫిబ్రవరి 14 ( ప్రజా మంటలు)
ఓసి ల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈ నెల 23 న డిల్లీలో జంతర్ మంతర్ వద్ద జాతీయ స్థాయి ఓసి ల మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు ఓసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, జగిత్యాల జిల్లా కన్వీనర్ మహంకాళి రాజన్నలు
ఈసందర్భంగా... శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ దంపతులు
సారంగాపూర్ ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు)
పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ గ్రామంలో వెలసిన శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవానికి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ దంపతులు హాజరై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక... భక్తులను ఆకర్షిస్తున్న కలియుగ దైవం సైకత శిల్పం
జగిత్యాల ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో గత పది రోజుల క్రితం ప్రతిష్టించబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి సైకత శిల్పం, రోజురోజుకు ప్రజలు దర్శించుకోవడం పెరిగిపోయింది. శివ కేశవులు ఒకే చోట ఉండాలనుకున్నారేమో శివరాత్రికి శివుని సైకత లింగం కూడా వెంకటేశ్వర స్వామి ముందు... శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా శివపార్వతుల కళ్యాణ వేడుకలు
జగిత్యాల ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం అరవింద నగర్లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో, శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయార్చకులు రోహిత్ శర్మ, ప్రముఖ పౌరాణిక పండితులు సభాపతి బ్రహ్మశ్రీ తిగుళ్ల విశు శర్మ, భరత్ శర్మ, కార్యక్రమ క్రతువు నిర్వహించారు. అనంతరం మహా అన్న ప్రసాదం భక్తులందరికీ అందించారు.... శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా రుద్ర హవనం
జగిత్యాల ఫిబ్రవరి 14 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ రోడ్డులో గల రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీమడేలే శ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం శ్రీ గణపతి పూజ, పుణ్యాహవాచనము, నవగ్రహ ఆరాధన, స్థాపితదేవత ఆరాధన నిర్వహించారు. అంతకముందు ఉదయము మూలమూర్తికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.
శ్రీ రుద్ర... లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్షలపై అవగాహన కార్యక్రమం
జగిత్యాల ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని శ్రీ చైతన్య, శ్రీనిధి విద్యా సంస్థలలో లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షల పట్ల అవగాహన కల్పించే శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్రస్థాయి లీడ్ ఇండియా శిక్షణ సమన్వయకర్త తాడూరి శ్రీనివాస్ ఆచార్య మాట్లాడుతూ, విద్యార్థులు పరీక్షలకు ఎలా... పోలింగ్ బూత్లో మైనర్ ఓటింగ్ ఘటన
ముంబయి, ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు):
మహారాష్ట్రలో జరిగిన జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్లో మైనర్ బాలుడు ప్రవేశించిన ఘటనపై మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనకు బాధ్యులైన ఒక పోలింగ్ అధికారి, ఒక పోలీస్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.... మీనా ప్రధాన పాత్రలో ‘రోస్లిన్’ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల
చెన్నై ఫిబ్రవరి 13:
థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన కొత్త వెబ్ సిరీస్ రోస్లిన్ ట్రైలర్ విడుదలైంది. ఈ సిరీస్కు ప్రముఖ దర్శకుడు జితు జోసెఫ్ షోరన్నర్గా వ్యవహరిస్తున్నారు.
సిరీస్కు సుమేష్ నందకుమార్ దర్శకత్వం వహించగా, కథను వినాయక్ శశికుమార్ రచించారు. మాథ్యూ జార్జ్ ఈ సిరీస్ను నిర్మించారు.
ఈ సిరీస్లో ప్రముఖ నటి మీనా ప్రధాన... జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులకు సన్మానం
జగిత్యాల ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు దేవేందర్ నాయక్, అవారి పవిత్ర శివ కేసరి బాబు, కోరుగంటి రాము, హరీష్లు జిల్లా పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ ఎల్. రమణ, కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్... దామోదరం సంజీవయ్య 105వ జయంతి: మాజీ సీఎం సేవలు చిరస్మరణీయం
కరీంనగర్, ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు):
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా.కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని సంజీవయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,... ప్రజలకు ప్రత్యామ్నాయ పార్టీ లేకపోవడంతోనే కాంగ్రెస్ గెలిచింది - కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు):
మున్సిపల్ ఎన్నికలు కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ఇంకా మిగిలే ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమెతో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి ... DMK కూటమిలో కాంగ్రెస్కు ఎక్కువ వాటా? 2021 ఫలితాల ప్రస్తావనతో మాణికం ఠాకూర్ వ్యాఖ్యలు
చెన్నై ఫిబ్రవరి 14:
తమిళనాడు రాజకీయాల్లో కూటమి సమీకరణలపై చర్చకు తెరలేపుతూ కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను ప్రస్తావించిన ఆయన,“డీఎంకే నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి అధికార భాగస్వామ్యం కోరే హక్కు ఉంది. ప్రభుత్వంలో పంచుకునే హక్కు... 