రాజకీయంగా జీవన్ రెడ్డి పరిస్థితి ఏమిటి?

ఇది జీవన రెడ్డి రాజకీయ చరిత్ర ముగింపుకు కుట్రనా? రేపటి భవిష్యత్ నిర్ణయమేమిటి? కాంగ్రెస్ లో సీనియర్ల పరిస్థితి ఇంతేనా?

On
రాజకీయంగా జీవన్ రెడ్డి పరిస్థితి ఏమిటి?

 జగిత్యాల రాజకీయాలను ఒక కుదుపు కుడిపిన రాజకీయ హత్య

ఇది జీవన రెడ్డి రాజకీయ చరిత్ర ముగింపుకు కుట్రనా?

రేపటి భవిష్యత్ నిర్ణయమేమిటి?

కాంగ్రెస్ లో సీనియర్ల పరిస్థితి ఇంతేనా?

జగిత్యాలలో జరిగిన కాంగ్రెస్ నాయకుడు మార గంగారెడ్డి హత్య తరువాత అక్కడ ఏం జరగనున్నది?

రాజకీయంగా జీవన్ రెడ్డి పరిస్థితి ఏమిటి?

 

జగిత్యాల రాజకీయాలలో అనూహ్య మార్పులకు నాంది

ఎటూ తేల్చుకోలేని స్థితిలో జీవన రెడ్డి

చాపకింది నీరులా కాంగ్రెస్ లో బిఆర్ఎస్ వ్యవహారం

 (సిహెచ్ వి ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్)

 

జగిత్యాల రాజకీయాలలో కాంగ్రెస్ నేత మారు గంగారెడ్డి అనూహ్యమైన మార్పులకు శ్రీకారం చుట్టనుందని, తలపండిన రాజకీయ నాయకుడు, జగిత్యాల రాజకీయాలలో కురువృద్ధుని లాంటి తాటిపర్తి  జీవన్ రెడ్డి జీవితంలో అనుకోని మలుపులకు, మార్పుకు నాంది కానుందా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంత పెద్ద కుదుపును ఆయన 40 ఏళ్ల తరువాత తట్టుకోవాల్సిన పరిసతీలు ఏర్పడ్డాయి.   

 

సామాజిక ఉద్యమాల నేపథ్యంలో, యువ న్యాయవాదిగా ఉంటూ, 1981 లో జరిగిన పంచాయత్ సమితి ఎన్నికల్లో మల్యాల నుండి సమితి అధ్యక్షునిగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి, రెండేళ్ల లోపే 1982-83 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జగిత్యాల నుండి గెలిచిన జీవన్ రెడ్డి, అనుకోని పరిస్థితులలో 1984 డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీలో చేరి, అప్పటి నుండి జగిత్యాల నుండి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో, ప్రస్తుత జగిత్యాల  జిల్లాలో తిరుగులేని నాయకునిగా చలామణి అవుతున్న జీవన రెడ్డికి, ఆయన పైనే రెండుసార్లు గెలిచిన బి ఆర్ ఎస్ అభ్యర్థి డా. సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడం, డానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వత్తాసు పలకడం, జీవన్ రెడ్డి ఆహాన్ని, ఆధిపత్యాన్ని కూకటివెళ్లతో పేకిలించి వేసిందనే చెప్పవచ్చు.

 

డిల్లీ వరకు వెళ్ళినా, సీనియర్లు ఎంత మంది చెప్పినా, ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ కాదనలేక, ఆయనకే అధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని జీవన రెడ్డికి, ఆయన సహచరుడు, ఆత్మీయుడు మార గంగారెడ్డి హత్య, అదీ, మొన్నటి వరకు బి ఆర్ ఎస్ పార్టీలో ఉన్న ఒక యువకుని చేతిలో హత్యకు గురికావడం, ఆయనకు కొలుకొని దెబ్బగా చెప్పుకొంటున్నారు. గంగారెడ్డి హత్య జరిగి రెండు రోజులైనా, ఆయన కొలుకోలేకపోతున్నారు. విషణ్ణ  వదనంతో  ఉన్న ఆయనను చూసిన ఎవరికైనా ఆయన ఎంతగా క్రుంగిపోయారో ఇట్టే పసికట్ట వచ్చు.

 

ఆయన ఎంత ఆవేశంగా ఉన్నా, ఎన్ని ఆరోపణలు చేసినా, ఎవరిని విమర్శించినా, కాంగ్రెస్ అధిష్టాన వర్గంలో కదలిక రావడం లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఓదార్చడానికి ఫోన్ చేసినా, హైదరాబాద్ లో విలేఖరులు అడిగిన ఒక  ప్రశ్నకు  జవాబిస్తూ, జీవన్ రెడ్డి నిన్న మీ పార్టీకొ  దండం -- ,నీకో దండం .. పార్టీలో ఉండాలా వద్దా .. అంటూ చేసిన విమర్శలు అన్నీ ఆయన వ్యక్తిగతమని కొట్టి పారేశారు. మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎంపి మధు యాష్కీ లాంటి వారు కొంత సీరియస్ గా తీసుకొన్నా, దానిపై ఎలాంటి రచ్చ చేసే పరిస్థితిలో లేరనే తెలుస్తుంది. 

 

అంతంత మాత్రమే ఆధిక్యంతో శాసన సభ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ, గతంలో బిఆర్ఎస్ చేసినట్లుగా, మొత్తం పార్టీని తనలో కలుపుకోవాలని చేసిన ప్రయత్నంలో 10 మంది మాత్రమే కాంగ్రెస్ లో చేరడం, అందులో కూడా చేరిన కొందరు కూడా తమకు ప్రాధాన్యత లభించడం లేదని కినుకు వహించి, దూరం - దూరంగా నే ఉంటున్నారు. దీనికి తోడు, బి ఆర్ ఎస్ పార్టీ హైకోర్ట్ వీరి సభ్యత్వాన్ని రద్దు చేయాలని వేసిన పిటిషన్ వీరి తలపై కత్తిలా వేలాడుతుంది. అందులో కడియం శ్రీహరి, దానం నాగేంద్ర, తెల్లం వెంకట రావు ల పేర్లు మాత్రమే ఉన్నా, వారి పట్ల హైకోర్ట్ ఇచ్చే  రేపు తెర్పే, మిగతా 7 గురు ఎమ్మెల్యేల కు వర్తిస్తుందని అనుకొంటున్నారు. సంవత్సరంలోగా, ఉప ఎన్నికలకు పోవడానికి ఎవరు కూడా సిద్దంగా లేరు.

 

ఈ నేపథ్యంలో, జగిత్యాలలోనే కాకుండా, అదే రోజు పఠాన్ చెరువు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ నాయకులపై కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే గడ్డం మహీపాల్ రెడ్డి వర్గీయులు దాడిచేయడం కూడా పార్టీలో కలకలం రేపింది. రాష్ట్ర ప్రజలను ఆకర్షించిన ఉదంతాలు ఈ రెండే అయినా, కొత్తగా పార్టీలో చేరిన బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేల నియోజక వర్గాలలో పాత -కొత్త కాంగ్రెస్ కార్యకర్తల మధ్య అనేక వివాదాలు చెలరేగుతున్నాయి. ఉన్న పార్టీలోని వారే కాకుండా కొత్తగా వచ్చిన వారు, మొన్నటి వరకు అధికారం అనుభవించి, కాంగ్రెస్ కార్యకర్తలను అనేక లకు గురి ఇబ్బందులకు గురి చేసిన వారే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నీళ్ళు నిండిన చేరువులోకి కప్పలు వచ్చినట్లు వచ్చి, ఆధిపత్యం చెలాయించడాన్ని పాత కాంగ్రెసన కార్యకర్తలు భరించలేకపోతున్నారు.

 

జగిత్యాల నియోజకవర్గంలో మొదటి నుండి ఒక సామాజిక వర్గానికి జీవన్ రెడ్డి పట్ల సానుకూలత లేదు. దాదాపు 36 సంవత్సరాల తరువాత ఆ వర్గానికి అధికారం వచ్చింది. జీవన రెడ్డి రెండవ సారి ఎమ్మెల్యేగా, వరుసగా రెండవసారి ఓడిపోవడం, అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, బి ఆర్ ఎస్ పార్టీ ఆధీనలో ఉన్న మున్సిపల్ కూడా కాంగ్రెస్ వశం అవడం కొందరికి కంటిలో నలకలా  మారిపోయింది.

 

మొదటి నుండి అంతా తానే అయి, ఒక్కడే పార్టీని వంటి చేతితో నడిపిన జీవన్ రెడ్డి, కొత్తగా ఎమ్మెల్యే పార్టీలో చేరి ఆధిపత్యం చెలాయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరో ఐదు నెలల్లో తన ఎమ్మెల్సీ పదవి కాలపరిమితి ముగిసిపోనుండగా, మళ్ళీ పోటీ చేయాలనే తపన ఉన్నా, మొన్నటి  రెండు ఎన్నికల్లో ఓడిపోయిన బాధ ఆయనను ముందుకు పోకుండా చేస్తుంది.  తనకంటూ ఒక వర్గం అంటూ లేని ఏకైక సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి, పెద్దగా ఆర్థిక బలం కూడా లేకపోవడంతో  రాబోయే రోజుల్లో అతన్ని ఎదుర్కోవడం ఏమంత కష్టం కాదని ఒక వర్గం భావిస్తుంది.

 

ఎన్నడూ రాజకీయ హత్యలు, గొడవలు లేని జగిత్యాల రాజకీయాలలో మొదటిసారిగా మారు గంగారెడ్డి హత్య, నాయకులనే కాకుండా ప్రజలను కూడా ఉలిక్కిపడేట్లు చేసింది. అంతా శ్మశాన వైరాగ్యంలో ఉన్న ఈ పరిస్థితులలో, ఎమ్మెల్యే డా. సంజయ్ ఈ హత్యకు తనకు ఎలాంటి సంభందం లేదని, దీని వెనుక ఉన్నది ఎవరైనా పట్టుకొని కఠినంగా శిక్షించాలని ప్రకటించారు. అదే సమయంలో తాను ఇంకా బి ఆర్ ఎస్ లోనే ఉన్నట్లు, అభివృద్ధి కొరకే కాంగ్రెస్ తో నడుస్తున్నాననే ప్రకటన చేయడం కూడా అందరినీ గందరగోళంలో పడేసింది. ఇంతకూ ఆయన ఏ పార్టీలో ఉన్నట్లు అనే ప్రశ్న తలెత్తుతుంది.

 

మహారాష్ట్ర, జార్ఖండ్ శాసన సభ ఎన్నికల నేపథ్యంలో ఈ గోడవలను కాంగ్రెస్ నేపథ్యం పట్టించుకో లేక పోవచ్చు. ఆ ఎన్నికల తర్వాత, ఈనెల 24 హైకోర్ట్ ఇచ్చే తీర్పు, ఆదేశాల మేర ఆతరువాతి కార్యక్రమం ఉండవచ్చని, కొత్తగా చేరిన వరైకి ముఖ్యమంత్రి అండ ఉండడం వల్ల సీనియర్లు అయినా వారి మాటకు అంతగా ప్రాధాన్యత లభించక పోవచ్చని, సర్దుకొమ్మని చెప్పి, ఊరడించి పంపే అవకాశాలే ఎక్కువగా ఉండవచ్చని అనుకొంటున్నారు. ఏమైనా, జగిత్యాల నియోజక వర్గంలో ప్రజాబలం ఉన్న నాయకునిగా ఎప్పటికీ  నిలిచిపోయే నాయకుడు జీవన్ రెడ్డి. ఈ సంధి కాలంలో జీవన రెడ్డి లాంటి అనుభవం ఉన్న వారు మౌనంగా ఉండక తప్పదేమో. కాలమే ఇలాంటి వాటికి పరిష్కారం చూపాలి.

Tags
Join WhatsApp

More News...

పాశ్చాత్య ప్రభావంతో  లివ్-ఇన్ సంబంధాలు : విఫలం తర్వాత కేసులు

పాశ్చాత్య ప్రభావంతో  లివ్-ఇన్ సంబంధాలు : విఫలం తర్వాత కేసులు అలహాబాద్, జనవరి 24 ప్రత్యేక ప్రతినిధి):పాశ్చాత్య ఆలోచనల ప్రభావంతో యువత వివాహం లేకుండా లివ్-ఇన్ సంబంధాల్లోకి వెళ్తోందని, అలాంటి సంబంధాలు విఫలమైన తర్వాత అత్యాచారం వంటి కేసులు నమోదు అవుతున్నాయని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 'లైవ్ లా' లో ప్రచురించిన కథనం ప్రకారం, మహిళలకు అనుకూలంగా ఉన్న చట్టాల ఆధారంగా...
Read More...
National  State News 

డీఎంకే వైపు ఏఐఏడీఎంకే నేతల వలస

డీఎంకే వైపు ఏఐఏడీఎంకే నేతల వలస తమిళనాడులోని ముఖ్యమైన పార్టీల గుర్తులు చెన్నై, జనవరి 24 (ప్రత్యేక ప్రతినిధి): తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే వైపు ఏఐఏడీఎంకేకు చెందిన పలువురు మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చేరుతున్నారు. గత ఆరు నెలల్లో మాజీ మంత్రి–ఎంపీ అన్వర్ రాజా, మాజీ ఎంపీ వి. మైత్రేయన్, మాజీ ఎమ్మెల్యే కార్తిక్ తొండైమాన్ సహా,...
Read More...
National  International  

జపాన్‌లో ఎన్నిక‌ల సమరానికి సానే తకైచి పాంక్నిర్ణయం

జపాన్‌లో ఎన్నిక‌ల సమరానికి సానే తకైచి పాంక్నిర్ణయం టోక్యో జనవరి 24: జపాన్ అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) నాయకురాలు మరియు 104వ ప్రధాన మంత్రి సానే తకైచి, గత అక్టోబర్‌లో పదవీ స్వీకరించినప్పటికీ, పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం మేరకు ఫిబ్రవరి 8, 2026న దేశవ్యాప్త సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. తకైచి...
Read More...

అంతర్జాతీయ భ్రూణ హత్యల నివారణ దినోత్సవ కరపత్ర ఆవిష్కరణ

అంతర్జాతీయ భ్రూణ హత్యల నివారణ దినోత్సవ కరపత్ర ఆవిష్కరణ   జగిత్యాల జనవరి 24 (ప్రజా మంటలు)అంతర్జాతీయ భృణహత్యల నివారణ దినోత్సవం పురస్కరించుకొని పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం రూపొందించిన, కరపత్రాలను,  ప్రముఖ పౌరాణిక పండితులు బుర్రా భాస్కర శర్మ, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత, జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ ఎన్.శ్రీనివాస్, ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బుర్రా భాస్కర శర్మ మాట్లాడుతూ          పురి...
Read More...
Local News  State News 

జీవన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ బిజెపి కార్యకర్తలపై లేదా..? ఎంపీ అరవింద్ ఒంటెద్దు పోకడలు మానుకోవాలి.

జీవన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ బిజెపి కార్యకర్తలపై లేదా..?  ఎంపీ అరవింద్ ఒంటెద్దు పోకడలు మానుకోవాలి. జగిత్యాల, జనవరి 24 (ప్రజా మంటలు) 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో పని చేసిన జీవన్ రెడ్డిని కాంగ్రెస్ నాయకత్వం ఇబ్బంది పెట్టడం తనకు బాధ కలిగిస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించడాన్ని జగిత్యాల బిజెపి సీనియర్ నేతలు తీవ్రంగా ఖండించారు. శనివారం బిజెపి సీనియర్ నేతలు సీపెళ్లి రవీందర్, అంకార్ సుధాకర్,...
Read More...
State News 

టీ-హబ్‌ స్టార్టప్‌ల కేంద్రంగానే కొనసాగాలి: సీఎం రేవంత్ రెడ్డి

టీ-హబ్‌ స్టార్టప్‌ల కేంద్రంగానే కొనసాగాలి: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు): టీ-హబ్‌ను పూర్తిగా స్టార్టప్‌ల కేంద్రంగా మాత్రమే కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను టీ-హబ్‌కు మార్చనున్నారన్న వార్తలపై సీఎం వెంటనే స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో ఫోన్‌లో మాట్లాడి స్పష్టమైన ఆదేశాలు...
Read More...
National  International  

నోబెల్ శాంతి బహుమతి నిర్లక్ష్యమే గ్రీన్‌ల్యాండ్ అంశంపై వ్యాఖ్యలకు కారణమా?

నోబెల్ శాంతి బహుమతి నిర్లక్ష్యమే గ్రీన్‌ల్యాండ్ అంశంపై వ్యాఖ్యలకు కారణమా? అమెరికా రాజకీయాల్లో మరో వివాదాస్పద ప్రకటన వాషింగ్టన్ జనవరి 24: గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న గత వ్యాఖ్యల వెనుక కారణం నోబెల్ శాంతి బహుమతి అందకపోవడంపై అసంతృప్తినేనని అమెరికా మాజీ అధ్యక్షుడు వ్యాఖ్యానించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ వ్యాఖ్యలు మరోసారి ప్రపంచ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. తాను అంతర్జాతీయంగా శాంతి స్థాపనకు...
Read More...
State News 

నాంపల్లి ఎగ్జిబిషన్‌కు ఎవరూ రావొద్దు: సీపీ సజ్జనార్

నాంపల్లి ఎగ్జిబిషన్‌కు ఎవరూ రావొద్దు: సీపీ సజ్జనార్ హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు): నాంపల్లి ప్రాంతంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం నేపథ్యంలో ప్రజలు **నాంపల్లి ఎగ్జిబిషన్ (నుమాయిష్)**కు రావద్దని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రజలకు స్పష్టంగా సూచించారు. ఈరోజు నుమాయిష్ సందర్శనను వాయిదా వేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నాంపల్లిలోని బచ్చాస్ ఫర్నీచర్ షోరూమ్ గోదాంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది....
Read More...
Local News  State News 

మున్సిపల్ ఎన్నికల బరిలో తెలంగాణ జాగృతి?

మున్సిపల్ ఎన్నికల బరిలో తెలంగాణ జాగృతి? హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు): తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపుతూ, తెలంగాణ జాగృతి పార్టీ చీఫ్ కవిత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని తుద నిర్ణయం తీసుకున్నారు. స్థానిక రాజకీయాల్లో తన ఉనికిని ఘాటుగా చాటేందుకు, పార్టీ అభ్యర్థులను సింహం గుర్తుతో బరిలో నిలపనుంది. పార్టీకి శాశ్వత గుర్తింపుగా సింహం గుర్తును ప్రజల్లో...
Read More...
State News 

పంటల ధర నిర్ణయ అధికారం రైతులకే ఉండాలి

పంటల ధర నిర్ణయ అధికారం రైతులకే ఉండాలి హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు):పంటల ధరలను నిర్ణయించే అధికారం రైతులకే ఉండాలని, మార్కెట్‌లో జరిగే మోసాలను నియంత్రించడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి స్పష్టం చేశారు.శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన వ్యవసాయ శాఖ రిటైర్డ్ అధికారుల సంఘం రాష్ట్ర...
Read More...

ప్రముఖ విద్యావేత్త, సామాజిక సేవా తత్పరుడు కాసుగంటి సుధాకర్ రావు సేవలు నేటి తరానికి స్ఫూర్తి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రముఖ విద్యావేత్త, సామాజిక సేవా తత్పరుడు కాసుగంటి  సుధాకర్ రావు సేవలు నేటి తరానికి స్ఫూర్తి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల జనవరి 24 (ప్రజా మంటలు)ప్రముఖ విద్యావేత్త,సామాజిక వేత్త,పారిశ్రామిక వేత్త సరస్వతీ శిశు మందిర్, శ్రీవాణి జూనియర్ కళాశాల ఛైర్మెన్ కాసుగంటి సుధాకర్ రావు  ప్రథమ మాసికం( సంస్మరణ   ) కార్యక్రమానికి ఎమ్మెల్యే దా సంజయ్ కుమార్ పద్మనాయక కళ్యాణ మండపానికి హాజరై వారి చిత్రపటానికి నివాళులర్పించి వారు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఎందరో...
Read More...
Crime  State News 

నాంపల్లి రోడ్‌లో ఫర్నిచర్ షాప్ భవనంలో అగ్నిప్రమాదం

నాంపల్లి రోడ్‌లో ఫర్నిచర్ షాప్ భవనంలో అగ్నిప్రమాదం హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు): హైదరాబాద్ నాంపల్లి రోడ్‌లోని ఓ బహుళ అంతస్తుల ఫర్నిచర్ షాప్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం ఆరుగురు మంటల్లో చిక్కుకుని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఫర్నిచర్ షాప్‌కు చెందిన సెల్లార్‌లో ముందుగా అగ్ని...
Read More...