మూసీకి రూ. లక్షా 50 వేల కోట్లు ఉంటాయి, కానీ రైతులకు రూ.15 వేలు ఇవ్వలేదా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం?? - దావ వసంత సురేష్.
మూసీకి రూ. లక్షా 50 వేల కోట్లు ఉంటాయి, కానీ రైతులకు రూ.15 వేలు ఇవ్వలేదా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం? - దావ వసంత సురేష్
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల 19 అక్టోబర్ (ప్రజా మంటలు) :
రైతులకు ఇవ్వాల్సిన వర్షాకాల రైతుభరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బిఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ,జగిత్యాల జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంతసురేష్...
ఈ సందర్భంగా సుంకే రవిశంకర్ మాట్లాడుతూ...
సాధారణ ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ద్వారా ఎకరానికి 10000 ఇస్తున్నారని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 15000ఇస్తామని చెప్పారని ఇంకా ఇవ్వడం లేదని రైతు భరోసా ఉన్నట్టా..లేనట్టా ?? వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతు భరోసా వేసంగి పంటకు ఇస్తామని పేర్కొనడం విడ్డురంగా ఉందని..
.... రైతు భరోసా కు చీకటి రోజు....
గడిచిన వాన కాలం పంట కోతలకు వచ్చిన రైతు భరోసా ఇవ్వలేక పోయారని..రుణమాఫీ ఆగష్టు 15లోపల చేస్తామని,సీఎం 40లక్షల కోట్లు మాఫీ చేశామని, వ్యవసాయ శాఖమంత్రి, ఇతర మంత్రులు ఒకరి మాటకు ఒకరికి పొంతన లేకుండా మాట్లాడుతున్నారని...కేసీఆర్ రుణమాఫీ,నాట్లు వేయడానికి ముందు రైతు బంధు,రైతు మరణిస్తే 5లక్షల రైతు బీమా, సకాలంలో ఎరువులు అందజేశారని..కేసీఆర్ ధాన్యం కొనుగోలు విషయంలో సంబంధిత మంత్రులతో, ఎమ్మెల్యే,కలెక్టర్ల తో సమీక్షా సమావేశము ఏర్పాటు చేసి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు,గన్ని బ్యాగ్ లు అందుబాటులో ఉంచడం జరిగిందని...
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు నడ్డి విరిచే ప్రభుత్వం....
రైతుల నోట్లో మట్టి కొడుతుందని స్కామ్ ప్రభుత్వం..
ఢిల్లీకి మూటలు పంపే ప్రభుత్వం..6గ్యారంటీల అమలు లో విఫలం
కళ్యాణలక్ష్మి కి అదనంగా తులం బంగారం, మహాలక్ష్మి 2500 పింఛన్ ఏమైందని ఏద్దేవా చేశారు.
ఈ సందర్భంగా దావ వసంతసురేష్ మాట్లాడుతూ....
ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గారు చావు కబురు చల్లగా చెప్పిండు.
దేశానికి అన్నం పెట్టే రైతన్న ఓట్లను ఎన్నికల సమయంలో వాడుకొని ఏర్పడ్డది ఈ నీచమైన కాంగ్రెస్ ప్రభుత్వం మూసీకి రూ. లక్షా 50 వేల కోట్లు ఉంటాయి,కానీ రైతులకు రూ.15 వేలు ఇవ్వలేవా?
బిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ నాయకత్వంలో మేమందరం రైతులందరికీ రైతుభరోసా వచ్చేంతవరకు రైతుల పక్షాన పోరాడుతాం.
రైతు బంధును రైతు భరోసాగా పేరు మార్చారు తప్ప ఎక్కడా మార్పు రాలేదన్నారు.
అమలు గాని హామీలతో గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో ఏ ఒక్క వర్గానికి హామీల అమలు కాలేదన్నారు
కెసిఆర్ గారిని కాదని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఇవ్వాల రైతన్ననే కాలదన్నె గడ్డు పరిస్థితి ఎవరి ద్వారా వచ్చిందో ఒకసారి రైతులందరు గమనించు కోవాలన్నారు.
రైతు పక్షపాతి రేవంత్ రెడ్డి అని పార్టీ మారిన ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను అడుగడుగున ప్రతి గ్రామంలో నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు
పది సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ పాలనలో జగిత్యాల జిల్లాగా ఏర్పడి మెడికల్ కాలేజీ స్థాపన అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ప్రథమ స్థానంలో జగిత్యాల జిల్లా నిలిచింది అంటే కెసిఆర్ గారి వల్లే సాధ్యమైందన్నారు..
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్, బిఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు వొల్లెం మల్లేశం,ఆయిల్నేని వెంకటేశ్వర్ రావు,మజాహిర్ రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు..
More News...
<%- node_title %>
<%- node_title %>
క్రమశిక్షణతో ఉండడం తప్పా: జీవన్ రెడ్డి
జగిత్యాల, ఫిబ్రవరి 3 (ప్రజా మంటలు):
నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తూ, రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించడమే నా తప్పా? అని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ—కష్టకాలంలో పార్టీని నమ్ముకుని... జగిత్యాల మాల జంగం పురోహితులచే రాజరాజేశ్వర స్వామి పల్లకి సేవ
జగిత్యాల ఫిబ్రవరి 3 ( ప్రజా మంటలు) మాల జంగం కు చెందిన వేల్పుల వంశస్థులు మంగళవారం రాజరాజేశ్వర స్వామి పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా మంచినీళ్ల భావి వద్ద గల శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో మాల జంగం పురోహితులు లక్కం శివనాథం, మురళీదాస్, మోహన్, కోదాది సాంబయ్య తదితరులు సామూహికంగా భజనలు... జగిత్యాల పట్టణ బి ఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు కు శుభాకాంక్షలు తెలిపిన దావా వసంత
జగిత్యాల ఫిబ్రవరి 3 (ప్రజా మంటలు)జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశాల మేరకు పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంకటేశ్వరరావు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ని మర్యాదపూర్వకంగా కలవగా వారికి శాలువ కప్పి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
మున్సిపల్ ఎలక్షన్లో బిఆర్ఎస్ పార్టీ... రాయికల్ మున్సిపల్ బి ఆర్ఎస్ అభ్యర్థులకు బీఫాంలు అందజేసిన దావా వసంత
రాయికల్ ఫిబ్రవరి 3 ( ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు జగిత్యాల రాయికల్ పట్టణ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశానుసారం రాయికల్ పట్టణ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులకు బిఆర్ఎస్ పార్టీ బీ ఫాములు... పంతం నెగ్గించుకొన్న MLA సంజయ్: 35 సీట్లతో పై చేయి.
జీవన్ రెడ్డి వర్గంలో తీవ్ర అసంతృప్తి – కార్యకర్తల ఆగ్రహం
జీవన్ రెడ్డి నిర్ణయం కొరకు ఎదిరి చూపు?
జగిత్యాల ఫిబ్రవరి 03 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపు తీవ్ర వివాదానికి దారితీసింది. టికెట్ల పంపిణీలో అన్యాయం జరిగిందంటూ సీనియర్ నేత జీవన్ రెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తిని... రావి నారాయణ రెడ్డికి తెలంగాణలో సముచిత స్థానం కల్పిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
భూమి–భుక్తి–వెట్టిచాకిరి విముక్తి పోరాట వీరుడికి ప్రభుత్వ గౌరవం
హైదరాబాద్ ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు):
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన సమరయోధుడు రావి నారాయణ రెడ్డికి తెలంగాణ సమాజంలో ప్రభుత్వం సముచితమైన స్థానం కల్పిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రావి నారాయణ రెడ్డి చరిత్రను పాఠ్యాంశాల్లో... హుస్నాబాద్ పట్టణాన్ని రాష్ట్రంలో రోల్ మోడల్ చేస్తా - పొన్నం
హుస్నాబాద్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, ఫిబ్రవరి2,(ప్రజా మంటలు):
ఈనెల 11 వ తేదీన జరిగే ఎన్నికల్లో హుస్నాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని 20 లోస్థానాలు గెలిపించి తనకు మరింత బలాన్ని ఇవ్వాలని హుస్నాబాద్ పట్టణంను ప్రత్యేక ప్రణాళిక ద్వారా అభివృద్ధి చేస్తున్నామని ,గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఒక్క డబుల్... లయన్స్ క్లబ్, లీడ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమం
గొల్లపల్లి, ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో సోమవారం లయన్స్ క్లబ్ గొల్లపల్లి, లీడ్ ఇండియా ఫౌండేషన్ సంయుక్తంగా విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మోటివేటివ్ స్పీకర్ కెప్టెన్ డా. లయన్ బుర్ర మధుసూదన్ రెడ్డి విద్యార్థుల్లో ఉత్సాహం, ఆత్మవిశ్వాసాన్ని నింపారు.... అంగరంగ వైభవంగా బుగ్గారం పోచమ్మల జాతర – రథోత్సవం
బుగ్గారం / గొల్లపల్లి ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో సోమవారం శ్రీ ముత్యాల పోచమ్మ – నల్ల పోచమ్మల జాతర, రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ జిల్లాలతో పాటు అంతర్రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తజనం తండోప తండాలుగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు.
ఆలయ కమిటీ చైర్మన్... మొదటిరోజు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతం
జగిత్యాల ఫిబ్రవరి 2 ( ప్రజా మంటలు)జిల్లాలో సోమవారం 17 (జనరల్ మరియు ఒకేషనల్) పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల్లో భాగంగా ఈరోజు జరిగిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ రోజు జరిగిన ప్రాక్టికల్ పరీక్షలలో ఉదయం 1409 మంది విద్యార్థులకు గాను 1312 మంది విద్యార్థులు హాజరైనారు.
జనరల్ విభాగంలో... గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల ఫిబ్రవరి 2 ( ప్రజా మంటలు)బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం
ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 7గురు అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్... 