మూసీకి రూ. లక్షా 50 వేల కోట్లు ఉంటాయి, కానీ రైతులకు రూ.15 వేలు ఇవ్వలేదా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం?? - దావ వసంత సురేష్.
మూసీకి రూ. లక్షా 50 వేల కోట్లు ఉంటాయి, కానీ రైతులకు రూ.15 వేలు ఇవ్వలేదా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం? - దావ వసంత సురేష్
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల 19 అక్టోబర్ (ప్రజా మంటలు) :
రైతులకు ఇవ్వాల్సిన వర్షాకాల రైతుభరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బిఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ,జగిత్యాల జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంతసురేష్...
ఈ సందర్భంగా సుంకే రవిశంకర్ మాట్లాడుతూ...
సాధారణ ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ద్వారా ఎకరానికి 10000 ఇస్తున్నారని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 15000ఇస్తామని చెప్పారని ఇంకా ఇవ్వడం లేదని రైతు భరోసా ఉన్నట్టా..లేనట్టా ?? వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతు భరోసా వేసంగి పంటకు ఇస్తామని పేర్కొనడం విడ్డురంగా ఉందని..
.... రైతు భరోసా కు చీకటి రోజు....
గడిచిన వాన కాలం పంట కోతలకు వచ్చిన రైతు భరోసా ఇవ్వలేక పోయారని..రుణమాఫీ ఆగష్టు 15లోపల చేస్తామని,సీఎం 40లక్షల కోట్లు మాఫీ చేశామని, వ్యవసాయ శాఖమంత్రి, ఇతర మంత్రులు ఒకరి మాటకు ఒకరికి పొంతన లేకుండా మాట్లాడుతున్నారని...కేసీఆర్ రుణమాఫీ,నాట్లు వేయడానికి ముందు రైతు బంధు,రైతు మరణిస్తే 5లక్షల రైతు బీమా, సకాలంలో ఎరువులు అందజేశారని..కేసీఆర్ ధాన్యం కొనుగోలు విషయంలో సంబంధిత మంత్రులతో, ఎమ్మెల్యే,కలెక్టర్ల తో సమీక్షా సమావేశము ఏర్పాటు చేసి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు,గన్ని బ్యాగ్ లు అందుబాటులో ఉంచడం జరిగిందని...
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు నడ్డి విరిచే ప్రభుత్వం....
రైతుల నోట్లో మట్టి కొడుతుందని స్కామ్ ప్రభుత్వం..
ఢిల్లీకి మూటలు పంపే ప్రభుత్వం..6గ్యారంటీల అమలు లో విఫలం
కళ్యాణలక్ష్మి కి అదనంగా తులం బంగారం, మహాలక్ష్మి 2500 పింఛన్ ఏమైందని ఏద్దేవా చేశారు.
ఈ సందర్భంగా దావ వసంతసురేష్ మాట్లాడుతూ....
ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గారు చావు కబురు చల్లగా చెప్పిండు.
దేశానికి అన్నం పెట్టే రైతన్న ఓట్లను ఎన్నికల సమయంలో వాడుకొని ఏర్పడ్డది ఈ నీచమైన కాంగ్రెస్ ప్రభుత్వం మూసీకి రూ. లక్షా 50 వేల కోట్లు ఉంటాయి,కానీ రైతులకు రూ.15 వేలు ఇవ్వలేవా?
బిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ నాయకత్వంలో మేమందరం రైతులందరికీ రైతుభరోసా వచ్చేంతవరకు రైతుల పక్షాన పోరాడుతాం.
రైతు బంధును రైతు భరోసాగా పేరు మార్చారు తప్ప ఎక్కడా మార్పు రాలేదన్నారు.
అమలు గాని హామీలతో గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో ఏ ఒక్క వర్గానికి హామీల అమలు కాలేదన్నారు
కెసిఆర్ గారిని కాదని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఇవ్వాల రైతన్ననే కాలదన్నె గడ్డు పరిస్థితి ఎవరి ద్వారా వచ్చిందో ఒకసారి రైతులందరు గమనించు కోవాలన్నారు.
రైతు పక్షపాతి రేవంత్ రెడ్డి అని పార్టీ మారిన ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను అడుగడుగున ప్రతి గ్రామంలో నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు
పది సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ పాలనలో జగిత్యాల జిల్లాగా ఏర్పడి మెడికల్ కాలేజీ స్థాపన అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ప్రథమ స్థానంలో జగిత్యాల జిల్లా నిలిచింది అంటే కెసిఆర్ గారి వల్లే సాధ్యమైందన్నారు..
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్, బిఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు వొల్లెం మల్లేశం,ఆయిల్నేని వెంకటేశ్వర్ రావు,మజాహిర్ రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు..
More News...
<%- node_title %>
<%- node_title %>
గొల్లపల్లి మండలంలో 6 నామినేషన్ స్వీకరణ కేంద్రాలు
(అంకం భూమయ్య)
గొల్లపల్లి డిసెంబర్ 01 (ప్రజా మంటలు):
పంచాయతి ఎన్నికలు -2025 మండలం లోని మూడవ విడతలో 6 నామినేషన్ల స్వీకరణ కేంద్రాలలో తేది 3 నుండి 5 వరకు సర్పంచి మరియు వార్డు సభ్యులకు 6 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
గొల్లపల్లి మండలంలోని 27 గ్రామాలను ఆరు క్లస్టర్లుగా 6 కేంద్రాలు విభజించారు.... బాల్య వివాహాలపై అవగాహన సదస్సు.
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 01 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండలంలోనీ వర్షకొండ గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో బాల్య వివాహం అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది.మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది హేమశ్రీ మాట్లాడుతూ గ్రామ సభ్యులకు,పాఠశాల విద్యార్థులకు, మరియు తల్లులకు,కిశోర బాలికలకు బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల గురించి... ఫ్రీడమ్ సన్ ఫ్లవర్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు చేయూత...
కొండగట్టు డిసెంబర్ 1(ప్రజా మంటలు)ఫ్రీడమ్ సన్ ఫ్లవర్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు సోమవారం రూపాయలు 40 వేల విలువగల దుస్తువులను కంపెనీ ప్రతినిధులు అందజేశారు.
ఈ సందర్బంగా కంపెనీ ASM రమేష్ కుమార్ , CFA ఏజెంట్ వూటూరి నవీన్ కుమార్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం కొండగట్టులోని... హెచ్ఐవీ బాధితులు ఆందోళన చెందొద్దు : సూపరింటెండెంట్ డాక్టర్ వాణి
గాంధీ ఏఆర్టీ సెంటర్ లో అందుబాటులో చక్కటి వైద్యం
సికింద్రాబాద్, డిసెంబర్ 01 (ప్రజామంటలు) : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గాంధీ ఆసుపత్రిలోని జనరల్ మెడిసిన్ విభాగం,ఎ.ఆర్.టి. సెంటర్ ఆధ్వర్యంలో సోమవారం వరల్డ్ ఎయిడ్స్ డే ర్యాలీ, అవేర్నెస్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ వాణి హాజరయ్యారు.
అనంతరం ఎ ఆర్... మొబైల్ ఫోన్ పోతే సంబదిత పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయండి: : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 1 (ప్రజా మంటలు)
మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in CEIR అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 28 లక్షల విలువగల 136 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత.
సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ... ఇది ప్రభుత్వ భూమి..ఆక్రమిస్తే చర్యలు తప్పవు : ఐడీహెచ్ కాలనీలో బోర్డు పెట్టిన రెవిన్యూ సిబ్బంది
సికింద్రాబాద్, డిసెంబర్ 01 (ప్రజామంటలు):బన్సీలాల్ పేట డివిజన్ న్యూ బోయిగూడా ఐడిహెచ్ కాలనీ లోని ఉన్న భూమి ప్రభుత్వానికి చెందినదని స్పష్టంచేస్తూ సికింద్రాబాద్ తహాసీల్దార్ కార్యాలయ సిబ్బంది సోమవారం హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.
ఈ భూమి ప్రభుత్వానికి చెందిన భూమి...అక్రమంగా ఆక్రమించే వారికి కఠిన చర్యలు తప్పవు.. అని బోర్డుపై పేర్కొన్నారు. సదరు... ఈశ్వరీబాయి పోరాట పటిమ అందరికీ ఆదర్శం : ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్- కంటోన్మెంట్, డిసెంబర్ 01 ( ప్రజా మంటలు):
ఈశ్వరీబాయి 107వ జయంతి వేడుకలు మారేడ్పల్లిలో సోమవారం ఘనంగా జరిగాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్, మాజీ మంత్రి గీతారెడ్డి ఈశ్వరీబాయి విగ్రహానికి పూలమాలలు సమర్పించారు.ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ— మహిళా సాధికారతకు ప్రతీక అయిన ఈశ్వరీబాయి 100 ఏళ్ల క్రితమే లింగ వివక్షను ఎదుర్కొంటూ ఉన్నత... ‘భూతశుద్ధి వివాహం’ అంటే ఏమిటి?
హైదరాబాద్ డిసెంబర్ 01 (ప్రజా మంటలు):
సమంత–రాజ్ నిడిమోరు వివాహం కోయంబత్తూరు ఈషా యోగా సెంటర్లోని లింగభైరవి ఆలయంలో ‘భూతశుద్ధి వివాహం’ పద్ధతిలో జరిగినట్లు ఈషా సంస్థ వెల్లడించింది. ఈ వార్త బయటకు రావడంతో భూతశుద్ధి వివాహం అంటే ఏమిటి? అనే ఆసక్తి అందరిలో పెరిగింది.
ఈషా నిర్వాహకుల వివరణ ప్రకారం, భూతశుద్ధి వివాహం అనేది... సీనియర్ సిటిజెన్స్ డిమాండ్లు పరిష్కరించాలి. -టాస్కా జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్.
జగిత్యాల డిసెంబర్ 01 (ప్రజా మంటలు):
తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ డిమాండ్లు సత్వరం పరిష్కరించాలని జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రం లోని టాస్కా కార్యాలయంలో అయన విలేకరులతో మాట్లాడారు.సీనియర్ సిటిజెన్స్ సమస్యలు పరిష్కారం, సంక్షేమం కోసం రాష్ట్ర స్థాయిలో సీనియర్... సినీనటి సమంత–రాజ్ నిడిమోరు వివాహం
కోయంబత్తూరులో
హైదరాబాద్ డిసెంబర్ 01 (ప్రజా మంటలు):
టాలీవుడ్ స్టార్ సమంత రూత్ ప్రభు దర్శకుడు రాజ్ నిడిమోరుతో డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ – లింగభైరవి ఆలయంలో వివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్న ఇద్దరూ, కుటుంబ సభ్యులు–సన్నిహితుల సమక్షంలో సాంప్రదాయ భూతశుద్ధి వివాహం విధానం ద్వారా... ఎయిడ్స్ కు చికిత్స కంటే నివారణే మేలు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్
జగిత్యాల డిసెంబర్ 1 ( ప్రజా మంటలు)ఎయిడ్స్ కు చికిత్స కంటే .. నివారణే మేలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజ గౌడ్ అన్నారు
యువత ఎట్టి పరిస్థితుల్లోని ఎయిడ్స్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలనీ
సోమవారం రోజున ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నివారణ... గీతా భవన్ లో ఘనంగా గీత జయంతి వేడుకలు
జగిత్యాల డిసెంబర్ 1 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం గంజ్ రోడ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీత భవన్ లో గీతా జయంతి పురస్కరించుకొని గీతా సత్సంగం 31వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు.
ఉదయం సంపూర్ణ సామూహిక శ్రీలక్ష్మి అష్టోత్తర సహిత శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, మరియు శ్రీమద్భవద్గీత 18... 