ప్రవాసీ ప్రజావాణి' నిర్వహణకు మార్గదర్శకాలు జారీ

ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార వ్యవస్థ బలోపేతం కోసం ప్రభుత్వం చర్యలు 

On
ప్రవాసీ ప్రజావాణి' నిర్వహణకు మార్గదర్శకాలు జారీ

ప్రవాసీ ప్రజావాణి' నిర్వహణకు మార్గదర్శకాలు జారీ

హైదారాబాద్ అక్టోబర్ 11 :

 స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉత్తర్వుల ప్రతులను  చేసిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జి.చిన్నారెడ్డి విడుదల చేశారు.

హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో గల్ఫ్ ఇతర గమ్యస్థాన దేశాల కార్మికులు, ఎన్నారైల కోసం ఏర్పాటు చేసిన 'ప్రవాసీ ప్రజావాణి' ఫిర్యాదుల స్వీకరణ కేంద్రం నిర్వహణకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజావాణి ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే. 

గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం సెప్టెంబర్ 16న జారీ చేసిన జీవో నెం.205 కు కొనసాగింపుగా సాధారణ పరిపాలన శాఖ లోని ప్రవాస భారతీయుల (జీఏడి - ఎన్నారై) విభాగం పక్షాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈనెల 9న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపి) మార్గదర్శకాల మెమో జారీ చేశారు. 'ప్రవాసీ ప్రజావాణి' లో స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారానికి సంస్థాగతంగా ప్రామాణికరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

'ప్రవాసీ ప్రజావాణి' నిర్వహణ మార్గదర్శకాల ఉత్తర్వుల ప్రతులను శుక్రవారం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జి. చిన్నారెడ్డి విడుదల చేశారు. టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి, దుబాయి లోని గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షులు గుండెల్లి నర్సింలు, స్వచ్ఛంద సేవకులు శాంతిప్రియ యాదవ్ (మలేసియా), బషీర్ అహ్మద్ (ఓమాన్ రిటనీ)  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'ప్రవాసీ ప్రజావాణి' నిర్వహణకు చక్కటి ఏర్పాటు చేసిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. జి. చిన్నారెడ్డి, నోడల్ అధికారి దివ్యా దేవరాజన్ కు వారు కృతఙ్ఞతలు తెలిపారు. 

*'ప్రవాసీ ప్రజావాణి' మార్గదర్శకాలు* 

గల్ఫ్, ఇతర గమ్యస్థాన దేశాల కార్మికులు, ఎన్నారైల కోసం ఏర్పాటు చేసిన 'ప్రవాసీ ప్రజావాణి' ఫిర్యాదుల స్వీకరణ కేంద్రంలో విదేశాల్లో ఉన్న బాధితుల పక్షాన వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయవచ్చు. తదుపరి చర్యల కోసం ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపిస్తారు.

*జీఏడి - ఎన్నారై విభాగం పరిధిలో:*

గల్ఫ్ తదితర దేశాల నుంచి మృతదేహాలను ఇండియాకు  తెప్పించడం, విదేశాల నుంచి వచ్చిన శవపేటికలను హైదరాబాద్ విమానాశ్రయం నుంచి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేయడం (దారిద్ర రేఖకు దిగువన - బీపీఎల్ వారికి),  పేషేంట్లను స్వదేశానికి రవాణా చేయడం, విదేశీ జైళ్లలో ఉన్నవారికి న్యాయ సహాయం చేసి విడుదలకు కృషి చేయడం, వీసా గడువును మించి (ఓవర్ స్టే) అక్కడే నివసించడం, అత్యవసర పరిస్థితులు, క్షమాభిక్ష (ఆమ్నెస్టీ), జీతం బకాయిలు ఇప్పించడం, విదేశాలలో మన వారికి అవసరమైన అన్నిసేవలను  జీఏడి - ఎన్నారై విభాగం నేరుగా పర్యవేక్షిస్తుంది. విదేశాలలోని భారత రాయబార కార్యాలయాలు, ఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో అనుసంధానము చేస్తుంది. ఈ సేవలు వినియోగించుకోవడానికి తెల్ల కాగితంపై దరఖాస్తు, పాస్ పోర్ట్ మొదటి పేజీ అడ్రస్ పేజీ, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విదేశంలోని వివరాలు, తెలంగాణలోని కుటుంబ వివరాలు మొబైల్ నెంబర్లు సమకూర్చాలి.   

*ఎన్నారై మహిళా పోలీస్ విభాగం పరిధిలో:* 

విదేశాల్లోని ఎన్నారై కుటుంబ వివాదాల పరిష్కారం గురించి వచ్చిన దరఖాస్తులను తదుపరి చర్యల కోసం హైదరాబాద్ లక్డీకాపూల్ లోని పోలీస్ కార్యాలయంలోని ఎన్నారై విమెన్ సెల్ కు పంపిస్తారు. ఈ సేవలు వినియోగించుకోవడానికి తెల్ల కాగితంపై దరఖాస్తు, పాస్ పోర్ట్ మొదటి పేజీ అడ్రస్ పేజీ, ఆధార్ కార్డు, మ్యారేజ్ సర్టిఫికెట్, పోలీస్ ఎఫ్ఐఆర్, విదేశంలోని వివరాలు, తెలంగాణలోని కుటుంబ వివరాలు మొబైల్ నెంబర్లు సమకూర్చాలి. 

*ఏజెంట్ల మోసాలు - పోలీస్ శాఖ పరిధిలో:*

నకిలీ ఏజెంట్లు, చీటింగ్ కేసులు, విదేశాలకు సంబంధించిన ఇతర సారూప్య సమస్యలపై తదుపరి చర్యల కోసం సంబంధిత కమీషనర్ ఆఫ్ పోలీస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ కు బదిలీ చేస్తారు. ఈ సేవలు వినియోగించుకోవడానికి తెల్ల కాగితంపై దరఖాస్తు, పాస్ పోర్ట్ తదితర వివరాలు అందజేయాలి. 

*గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా* 

రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా (మృతధన సహాయం) కోసం గల్ఫ్ దేశాలలో చనిపోయిన వ్యక్తి  జీవిత భాగస్వామి (భార్య / భర్త), పిల్లలు, తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విజ్ఞప్తిని సంబంధిత జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తారు. నేరుగా జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవడం మంచిది. తెల్లకాగితంపై అభ్యర్థన లేఖ, పాస్ పోర్ట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, భారత రాయబార కార్యాలయాలు జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాలి. 

*గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు:* 

గల్ఫ్ కార్మికుల పిల్లలకు ప్రభుత్వ గురుకుల పాఠశాలలలో అడ్మిషన్ల కొరకు వచ్చిన దరఖాస్తులను తదుపరి చర్యల కోసం విద్యా శాఖకు బదిలీ చేస్తారు. తెల్ల కాగితంపై దరఖాస్తు, పాస్ పోర్ట్ మొదటి పేజీ అడ్రస్ పేజీ, ఆధార్ కార్డు, విద్యార్థి సర్టిఫికెట్లు సమర్పించాలి.

Tags
Join WhatsApp

More News...

కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీకే? బీఆర్ఎస్ తప్పుకోవడంతో రాజకీయ ఉత్కంఠకు తెర

కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీకే? బీఆర్ఎస్ తప్పుకోవడంతో రాజకీయ ఉత్కంఠకు తెర కరీంనగర్  ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు): కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం విషయంలో కొనసాగుతున్న ఉత్కంఠకు చివరి నిమిషంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తం 66 డివిజన్లలో భారతీయ జనతా...
Read More...

రాయికల్ మున్సిపల్ రాజకీయాల్లో కీలక మలుపు: చైర్మన్ పీఠం బీఆర్ఎస్‌కేనా?

రాయికల్ మున్సిపల్ రాజకీయాల్లో కీలక మలుపు: చైర్మన్ పీఠం బీఆర్ఎస్‌కేనా? రాయికల్ ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా రాయికల్ మున్సిపల్ రాజకీయాల్లో రాష్ట్రంలో ఎక్కడా లేని వింత, కీలక పరిణామం చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి..రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు ఏకంకవలనే ప్రయత్నం ఆశ్చర్య పరుస్తోంది. అధిక సంఖ్యలో సీట్లు గెలిచిన బీజేపీ ప్రేక్షక పాత్ర వహిస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ లాంటి వారు...
Read More...
National  International  

భారత్ పేరు ప్రస్తావించని తారిక్ రెహ్మాన్ – సమతుల్య విదేశాంగ విధాన సంకేతాలు

భారత్ పేరు ప్రస్తావించని తారిక్ రెహ్మాన్ – సమతుల్య విదేశాంగ విధాన సంకేతాలు న్యూఢిల్లీ ఫిబ్రవరి 16: బంగ్లాదేశ్‌లో జరిగిన జాతీయ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత, ప్రధాని-నియమితుడిగా బాధ్యతలు స్వీకరించనున్న Tarique Rahman తన తొలి మీడియా సమావేశంలో దేశ విదేశాంగ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు.తన ప్రభుత్వం ఏ ఒక్క దేశం పక్షాన నిలిచే విధానాన్ని కాకుండా, “బంగ్లాదేశ్ ప్రయోజనాలే కేంద్రంగా...
Read More...
Spiritual   State News 

దుబ్బ రాజేశ్వర స్వామి ఆలయంపై రాజకీయ రంగుల వివాదం – భక్తుల విశ్వాసాలపై దాడేనా?

దుబ్బ రాజేశ్వర స్వామి ఆలయంపై రాజకీయ రంగుల వివాదం – భక్తుల విశ్వాసాలపై దాడేనా? భక్తుల విశ్వాసాలపై దాడేనా? –(కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్)    జగిత్యాల జిల్లా, సారంగాపూర్ మండలం, పెంబట్ల కోనాపూర్ గ్రామంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన దుబ్బ రాజేశ్వర స్వామి దేవాలయం ప్రస్తుతం తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారింది. జిల్లాలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా అపారమైన ఖ్యాతి పొందిన ఈ ఆలయంలో మహాశివరాత్రి జాతర...
Read More...
Comment  State News 

జగిత్యాల మున్సిపల్ రాజకీయాలు: ఛైర్పర్సన్ పీఠం చుట్టూ శక్తి–సమీకరణల రాజకీయ క్రీడ

జగిత్యాల మున్సిపల్ రాజకీయాలు: ఛైర్పర్సన్ పీఠం చుట్టూ శక్తి–సమీకరణల రాజకీయ క్రీడ మూడు కుర్చీకాటగా పదవి రాజకీయాలు జగిత్యాల మున్సిపల్ రాజకీయాలు ఇక స్థానిక పరిమితుల్లో లేవు. రాబోయే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలతో ముడిపడి, ఇవి రాష్ట్ర స్థాయి అధికార కేంద్రాల వరకూ చేరాయి. ముఖ్యంగా మున్సిపల్ ఛైర్పర్సన్ ఎంపిక ఒక్క పదవిగా కాకుండా, ఇద్దరు కీలక నేతల రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే అంశంగా...
Read More...

పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటా – ఎమ్మెల్యే సంజయ్ కుమార్

పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటా – ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల, ఫిబ్రవరి 15 (ప్రజా మంటలు): జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల విషయంలో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కౌన్సిలర్‌లుగా గెలిచిన సమీండ్ల వాణి, అడువాల జ్యోతి పేర్లను చైర్‌పర్సన్ అభ్యర్థులుగా ప్రతిపాదించినట్లు తెలిపారు. వీరికి కాంగ్రెస్ పార్టీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 30...
Read More...
Local News  Crime 

జగిత్యాల పట్టణంలో దారుణ హత్య: బోరే విశ్వనాథ్ మృతి

జగిత్యాల పట్టణంలో దారుణ హత్య: బోరే విశ్వనాథ్ మృతి (అంకం భూమయ్య)   జగిత్యాల ఫిబ్రవరి 15 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలో పట్టపగలు జరిగిన హత్య కలకలం రేపింది. జగిత్యాల బైపాస్ రోడ్డులోని కరీంనగర్ డైరీ ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది. జగిత్యాల రూరల్ మండలానికి చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తున్న విశ్వనాథ్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు నడిరోడ్డుపై అత్యంత దారుణంగా...
Read More...
State News 

రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి

రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి పాలేరు రిజర్వాయర్‌లో ఘోర ప్రమాదం: ఖమ్మం, ఫిబ్రవరి 15 (ప్రజా మంటలు):ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్ వద్ద శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి నేరుగా రిజర్వాయర్‌లోకి దూసుకువెళ్లడంతో, వెనుక సీట్లో ప్రయాణిస్తున్న ప్రముఖ రచయిత, సాహిత్య పరిశోధకుడు బొగ్గుల శ్రీనివాస్ (49) నీట...
Read More...

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ 287వ జయంతి వేడుకలు

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ 287వ జయంతి వేడుకలు హైదరాబాద్, ఫిబ్రవరి 15 (ప్రజా మంటలు): బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ 287వ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని సేవాలాల్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి భోగ్ బండార్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కవిత...
Read More...

ఢిల్లీలో ఓసిల మహా ధర్నాను విజయవంతం చేయాలి ధర్నా పోస్టరును ఆవిష్కరించిన ఓసి నేతలు

ఢిల్లీలో ఓసిల మహా ధర్నాను విజయవంతం చేయాలి  ధర్నా పోస్టరును ఆవిష్కరించిన ఓసి నేతలు    జగిత్యాల ఫిబ్రవరి 14 ( ప్రజా మంటలు)   ఓసి ల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈ నెల 23 న డిల్లీలో జంతర్ మంతర్ వద్ద  జాతీయ స్థాయి ఓసి ల మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు ఓసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, జగిత్యాల జిల్లా కన్వీనర్ మహంకాళి రాజన్నలు   ఈసందర్భంగా...
Read More...

శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ దంపతులు

శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ దంపతులు సారంగాపూర్ ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు) పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ గ్రామంలో వెలసిన శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవానికి జిల్లా కలెక్టర్  బి. సత్య ప్రసాద్ దంపతులు హాజరై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక...
Read More...

భక్తులను ఆకర్షిస్తున్న కలియుగ దైవం సైకత శిల్పం

భక్తులను ఆకర్షిస్తున్న కలియుగ దైవం సైకత శిల్పం   జగిత్యాల ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో గత పది రోజుల క్రితం ప్రతిష్టించబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి సైకత శిల్పం, రోజురోజుకు ప్రజలు దర్శించుకోవడం పెరిగిపోయింది. శివ కేశవులు ఒకే చోట ఉండాలనుకున్నారేమో శివరాత్రికి శివుని సైకత లింగం కూడా వెంకటేశ్వర స్వామి ముందు...
Read More...