ప్రవాసీ ప్రజావాణి' నిర్వహణకు మార్గదర్శకాలు జారీ
ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార వ్యవస్థ బలోపేతం కోసం ప్రభుత్వం చర్యలు
ప్రవాసీ ప్రజావాణి' నిర్వహణకు మార్గదర్శకాలు జారీ
హైదారాబాద్ అక్టోబర్ 11 :
స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉత్తర్వుల ప్రతులను చేసిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జి.చిన్నారెడ్డి విడుదల చేశారు.
హైదరాబాద్లోని ప్రజా భవన్లో కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో గల్ఫ్ ఇతర గమ్యస్థాన దేశాల కార్మికులు, ఎన్నారైల కోసం ఏర్పాటు చేసిన 'ప్రవాసీ ప్రజావాణి' ఫిర్యాదుల స్వీకరణ కేంద్రం నిర్వహణకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజావాణి ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం సెప్టెంబర్ 16న జారీ చేసిన జీవో నెం.205 కు కొనసాగింపుగా సాధారణ పరిపాలన శాఖ లోని ప్రవాస భారతీయుల (జీఏడి - ఎన్నారై) విభాగం పక్షాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈనెల 9న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపి) మార్గదర్శకాల మెమో జారీ చేశారు. 'ప్రవాసీ ప్రజావాణి' లో స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారానికి సంస్థాగతంగా ప్రామాణికరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
'ప్రవాసీ ప్రజావాణి' నిర్వహణ మార్గదర్శకాల ఉత్తర్వుల ప్రతులను శుక్రవారం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జి. చిన్నారెడ్డి విడుదల చేశారు. టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి, దుబాయి లోని గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షులు గుండెల్లి నర్సింలు, స్వచ్ఛంద సేవకులు శాంతిప్రియ యాదవ్ (మలేసియా), బషీర్ అహ్మద్ (ఓమాన్ రిటనీ) తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'ప్రవాసీ ప్రజావాణి' నిర్వహణకు చక్కటి ఏర్పాటు చేసిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. జి. చిన్నారెడ్డి, నోడల్ అధికారి దివ్యా దేవరాజన్ కు వారు కృతఙ్ఞతలు తెలిపారు.
*'ప్రవాసీ ప్రజావాణి' మార్గదర్శకాలు*
గల్ఫ్, ఇతర గమ్యస్థాన దేశాల కార్మికులు, ఎన్నారైల కోసం ఏర్పాటు చేసిన 'ప్రవాసీ ప్రజావాణి' ఫిర్యాదుల స్వీకరణ కేంద్రంలో విదేశాల్లో ఉన్న బాధితుల పక్షాన వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయవచ్చు. తదుపరి చర్యల కోసం ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపిస్తారు.
*జీఏడి - ఎన్నారై విభాగం పరిధిలో:*
గల్ఫ్ తదితర దేశాల నుంచి మృతదేహాలను ఇండియాకు తెప్పించడం, విదేశాల నుంచి వచ్చిన శవపేటికలను హైదరాబాద్ విమానాశ్రయం నుంచి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేయడం (దారిద్ర రేఖకు దిగువన - బీపీఎల్ వారికి), పేషేంట్లను స్వదేశానికి రవాణా చేయడం, విదేశీ జైళ్లలో ఉన్నవారికి న్యాయ సహాయం చేసి విడుదలకు కృషి చేయడం, వీసా గడువును మించి (ఓవర్ స్టే) అక్కడే నివసించడం, అత్యవసర పరిస్థితులు, క్షమాభిక్ష (ఆమ్నెస్టీ), జీతం బకాయిలు ఇప్పించడం, విదేశాలలో మన వారికి అవసరమైన అన్నిసేవలను జీఏడి - ఎన్నారై విభాగం నేరుగా పర్యవేక్షిస్తుంది. విదేశాలలోని భారత రాయబార కార్యాలయాలు, ఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో అనుసంధానము చేస్తుంది. ఈ సేవలు వినియోగించుకోవడానికి తెల్ల కాగితంపై దరఖాస్తు, పాస్ పోర్ట్ మొదటి పేజీ అడ్రస్ పేజీ, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విదేశంలోని వివరాలు, తెలంగాణలోని కుటుంబ వివరాలు మొబైల్ నెంబర్లు సమకూర్చాలి.
*ఎన్నారై మహిళా పోలీస్ విభాగం పరిధిలో:*
విదేశాల్లోని ఎన్నారై కుటుంబ వివాదాల పరిష్కారం గురించి వచ్చిన దరఖాస్తులను తదుపరి చర్యల కోసం హైదరాబాద్ లక్డీకాపూల్ లోని పోలీస్ కార్యాలయంలోని ఎన్నారై విమెన్ సెల్ కు పంపిస్తారు. ఈ సేవలు వినియోగించుకోవడానికి తెల్ల కాగితంపై దరఖాస్తు, పాస్ పోర్ట్ మొదటి పేజీ అడ్రస్ పేజీ, ఆధార్ కార్డు, మ్యారేజ్ సర్టిఫికెట్, పోలీస్ ఎఫ్ఐఆర్, విదేశంలోని వివరాలు, తెలంగాణలోని కుటుంబ వివరాలు మొబైల్ నెంబర్లు సమకూర్చాలి.
*ఏజెంట్ల మోసాలు - పోలీస్ శాఖ పరిధిలో:*
నకిలీ ఏజెంట్లు, చీటింగ్ కేసులు, విదేశాలకు సంబంధించిన ఇతర సారూప్య సమస్యలపై తదుపరి చర్యల కోసం సంబంధిత కమీషనర్ ఆఫ్ పోలీస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కు బదిలీ చేస్తారు. ఈ సేవలు వినియోగించుకోవడానికి తెల్ల కాగితంపై దరఖాస్తు, పాస్ పోర్ట్ తదితర వివరాలు అందజేయాలి.
*గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా*
రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా (మృతధన సహాయం) కోసం గల్ఫ్ దేశాలలో చనిపోయిన వ్యక్తి జీవిత భాగస్వామి (భార్య / భర్త), పిల్లలు, తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విజ్ఞప్తిని సంబంధిత జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తారు. నేరుగా జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవడం మంచిది. తెల్లకాగితంపై అభ్యర్థన లేఖ, పాస్ పోర్ట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, భారత రాయబార కార్యాలయాలు జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాలి.
*గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు:*
గల్ఫ్ కార్మికుల పిల్లలకు ప్రభుత్వ గురుకుల పాఠశాలలలో అడ్మిషన్ల కొరకు వచ్చిన దరఖాస్తులను తదుపరి చర్యల కోసం విద్యా శాఖకు బదిలీ చేస్తారు. తెల్ల కాగితంపై దరఖాస్తు, పాస్ పోర్ట్ మొదటి పేజీ అడ్రస్ పేజీ, ఆధార్ కార్డు, విద్యార్థి సర్టిఫికెట్లు సమర్పించాలి.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలి
హైదరాబాద్, డిసెంబర్ 18 (ప్రజా మంటలు):
ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలని, లేదంటే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ మంత్రి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి హెచ్చరించారు.
మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీ పథకం నుంచి... గొల్లపల్లి సర్పంచ్ నల్ల నీరజ సతీష్ రెడ్డి విజయోత్స ర్యాలీ
గొల్లపల్లి డిసెంబర్ 18 (ప్రజా మంటలు- అంకం భూమయ్య)
గొల్లపల్లి మండల కేంద్రంలో ఇండిపెండెంట్ సర్పంచ్ విజయోత్స ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా నుండి నల్ల గుట్ట వరకు గొల్లపల్లి సర్పంచ్గా నన్ను గెలిపించిన సందర్భంగా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని సర్పంచ్ నల్ల నీరజ సతీష్ రెడ్డి గురువారం మండల కేంద్రంలో బారి ర్యాలీ
గొల్లపల్లి... కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను మరిచిపోయింది - కవిత
కొత్తగూడెం డిసెంబర్ 18 :ప్రజా మంటలు)::తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్తగూడెం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. రెండు రోజుల పాటు జిల్లాలో ప్రజల సమస్యలను తెలుసుకొని, బాధితులతో నేరుగా మాట్లాడి పరిష్కార దిశగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఇల్లందు: దర్గా–ఆలయ సందర్శన, మత సామరస్యానికి నిదర్శనం... వృద్ధుడి దప్పు మల్లయ్య పరిస్థితిపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సువో–మోటో కేసు
హైదరాబాద్ డిసెంబర్ 18 (ప్రజా మంటలు):
తెలుగు దినపత్రికలో ప్రచురితమైన వార్తను ఆధారంగా చేసుకుని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ డా. షమీం అక్తర్ సువో–మోటోగా పరిగణనలోకి తీసుకున్నారు. రంగా రెడ్డి జిల్లా, కోతూర్ మండలం, మల్లాపూర్ గ్రామానికి చెందిన వృద్ధుడు దప్పు మల్లయ్య తన సంతానం నిర్లక్ష్యానికి గురై, ఆస్తి నుంచి... డిల్లీ హైకోర్టు తీర్పుతోనైనా బీజేపీ కి కనువిప్పు కలుగాలి... వేధింపుల రాజకీయం మానుకొని.. ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలి... ఉపాధి హామీ పథకానికి మహాత్మ గాంధీ పేరు తొలగించాలనే ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి.. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి..
జగిత్యాల డిసెంబర్ 18 (ప్రజా మంటలు)ఇందిరా భవన్ నుండి తహశీల చౌరస్తా వరకు కాంగ్రెస్ నాయకులూ,కార్యకర్తల ర్యాలీ నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు
తహసిల్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణుల బైఠాయించారు
నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో దశాబ్ద కాలంగా బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరిత రాజకీయాలతో ఈడీ దాడులతో సోనియా... ఈ నెల 24 న పెన్షనర్ల నిరాహార దీక్షలు రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వెల్లడి.
జగిత్యాల డిసెంబర్ 18 (ప్రజా మంటలు) :
జిల్లా కేంద్రాలలో ఈ నెల 24 న నిరాహార దీక్షలు చేపట్టాలని రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు జగిత్యాల జిల్లా రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వెల్లడించింది.
గురువారం మధ్యాహ్నం 12 గంటలకు పెన్షనర్స్ భవన్ లో జిల్లా అధ్యక్షులు ఏ.నరేందర్ రావు అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ... మాస శివరాత్రి సందర్భంగా సహస్ర లింగాలకు సహస్ర వస్త్రాల అలంకరణ ప్రత్యేక పూజలు
జగిత్యాల డిసెంబర్ 18 (ప్రజా మంటలు) రూరల్ పొలాస గ్రామంలోని సహస్ర లింగాల దేవాలయంలో మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు
ఈ సందర్భంగా గురువారం మాస శివరాత్రి పురస్కరించుకొని ఆలయాన్ని సర్వంగ సుందరంగా అలంకరించి సహస్ర లింగాలకు అభిషేకాలు, ప్రత్యేక పూజలను నిర్వహించి సహస్ర లింగాలకు భక్తుల స్వహస్తాలతో అభిషేకించి చక్కగా వస్త్రాలతో అలంకరించి... మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద పలువురుపై వెలుగటూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
వెల్గటూర్ డిసెంబర్ 18 ( ప్రజా మంటలు)పోలీస్ స్టేషన్ పరిధిలోని పైడిపల్లి గ్రామంలో తేదీ 17 వ తేదీన జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓట్ల లెక్కింపు అనంతరం, ఎన్నికల్లో ఓడిపోయిన ఒక వ్యక్తి తన అనుచరులు మరియు కొందరు గ్రామస్తులతో కలిసి పోలింగ్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా ఆందోళనకారులు... రాయికల్ మండలం పలు గ్రామపంచాయతీ సర్పంచి వార్డు సభ్యులను సత్కరించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
రాయికల్ డిసెంబర్ 18 ( ప్రజా మంటలు)మండలం మాంఖ్యనాయక్ తండ సర్పంచ్ గా మాలోత్ తిరుపతి, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు నూతనంగా ఎన్నికైనందున మరియు ఓడ్డేలింగాపూర్ ఉపసర్పంచిగా బుక్యా శేఖర్ ఎన్నికైన సందర్భంగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలువగా వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు..... జగిత్యాల రూరల్ /బీర్పూర్/ సారంగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించి శాలువ తో
సత్కరించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్జగిత్యాల/ బీర్పూర్/ సారంగాపూర్ డిసెంబర్ 18 (ప్రజా మంటలు)జగిత్యాల రూరల్ మండలం తక్కల్లపల్లి గ్రామం వార్డు సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ని కలవగా వారిని శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు..బీర్పూర్ .....మండలం చర్లపల్లి గ్రామం సర్పంచ్ గా... 1500 జనాభా గ్రామంలో 3 నెలల్లోనే 27 వేల జననాలు ఎలా నమోదయ్యాయి?
(ప్రజా మంటలు ప్రత్యేక కథనం)
మహారాష్ట్రలో జనన ధ్రువపత్రాల భారీ స్కామ్:
ముంబై డిసెంబర్ 18:
మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో ఒక చిన్న గ్రామం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేవలం 1500 మంది జనాభా మాత్రమే ఉన్న శేందుర్సనీ గ్రామ పంచాయతీలో మూడు నెలల వ్యవధిలోనే ఏకంగా 27,397 జననాలు నమోదవడం అధికారులను అవాక్కయ్యేలా... అతనేప్పటికీ చేరగని ,సుదీర్ఘ జ్ఞాపకమే
యాది....
*అతనేప్పటికీ చేరగని ,సుదీర్ఘ జ్ఞాపకమే.
- అల్లె రమేష్
*మానేటి మట్టి పరిమళం సుదీర్ఘ కవి, యేన్నం సత్యం ఇక లేరు
సిరిసిల్ల మనసంతా పరుచుకున్న మానేరు మట్టి పరిమాలాల్లో ఎదిగొచ్చిన సాహిత్య కారులు అనేకమంది ప్రవాహంలా సాహిత్యలో సాగిపోతు తమదైన ప్రత్యేకముద్ర వేశారు. యేన్నం సత్యం బహుశా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన
తెలుగు... 