ప్రవాసీ ప్రజావాణి' నిర్వహణకు మార్గదర్శకాలు జారీ

ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార వ్యవస్థ బలోపేతం కోసం ప్రభుత్వం చర్యలు 

On
ప్రవాసీ ప్రజావాణి' నిర్వహణకు మార్గదర్శకాలు జారీ

ప్రవాసీ ప్రజావాణి' నిర్వహణకు మార్గదర్శకాలు జారీ

హైదారాబాద్ అక్టోబర్ 11 :

 స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉత్తర్వుల ప్రతులను  చేసిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జి.చిన్నారెడ్డి విడుదల చేశారు.

హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో గల్ఫ్ ఇతర గమ్యస్థాన దేశాల కార్మికులు, ఎన్నారైల కోసం ఏర్పాటు చేసిన 'ప్రవాసీ ప్రజావాణి' ఫిర్యాదుల స్వీకరణ కేంద్రం నిర్వహణకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజావాణి ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే. 

గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం సెప్టెంబర్ 16న జారీ చేసిన జీవో నెం.205 కు కొనసాగింపుగా సాధారణ పరిపాలన శాఖ లోని ప్రవాస భారతీయుల (జీఏడి - ఎన్నారై) విభాగం పక్షాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈనెల 9న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపి) మార్గదర్శకాల మెమో జారీ చేశారు. 'ప్రవాసీ ప్రజావాణి' లో స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారానికి సంస్థాగతంగా ప్రామాణికరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

'ప్రవాసీ ప్రజావాణి' నిర్వహణ మార్గదర్శకాల ఉత్తర్వుల ప్రతులను శుక్రవారం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జి. చిన్నారెడ్డి విడుదల చేశారు. టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి, దుబాయి లోని గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షులు గుండెల్లి నర్సింలు, స్వచ్ఛంద సేవకులు శాంతిప్రియ యాదవ్ (మలేసియా), బషీర్ అహ్మద్ (ఓమాన్ రిటనీ)  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'ప్రవాసీ ప్రజావాణి' నిర్వహణకు చక్కటి ఏర్పాటు చేసిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. జి. చిన్నారెడ్డి, నోడల్ అధికారి దివ్యా దేవరాజన్ కు వారు కృతఙ్ఞతలు తెలిపారు. 

*'ప్రవాసీ ప్రజావాణి' మార్గదర్శకాలు* 

గల్ఫ్, ఇతర గమ్యస్థాన దేశాల కార్మికులు, ఎన్నారైల కోసం ఏర్పాటు చేసిన 'ప్రవాసీ ప్రజావాణి' ఫిర్యాదుల స్వీకరణ కేంద్రంలో విదేశాల్లో ఉన్న బాధితుల పక్షాన వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయవచ్చు. తదుపరి చర్యల కోసం ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపిస్తారు.

*జీఏడి - ఎన్నారై విభాగం పరిధిలో:*

గల్ఫ్ తదితర దేశాల నుంచి మృతదేహాలను ఇండియాకు  తెప్పించడం, విదేశాల నుంచి వచ్చిన శవపేటికలను హైదరాబాద్ విమానాశ్రయం నుంచి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేయడం (దారిద్ర రేఖకు దిగువన - బీపీఎల్ వారికి),  పేషేంట్లను స్వదేశానికి రవాణా చేయడం, విదేశీ జైళ్లలో ఉన్నవారికి న్యాయ సహాయం చేసి విడుదలకు కృషి చేయడం, వీసా గడువును మించి (ఓవర్ స్టే) అక్కడే నివసించడం, అత్యవసర పరిస్థితులు, క్షమాభిక్ష (ఆమ్నెస్టీ), జీతం బకాయిలు ఇప్పించడం, విదేశాలలో మన వారికి అవసరమైన అన్నిసేవలను  జీఏడి - ఎన్నారై విభాగం నేరుగా పర్యవేక్షిస్తుంది. విదేశాలలోని భారత రాయబార కార్యాలయాలు, ఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో అనుసంధానము చేస్తుంది. ఈ సేవలు వినియోగించుకోవడానికి తెల్ల కాగితంపై దరఖాస్తు, పాస్ పోర్ట్ మొదటి పేజీ అడ్రస్ పేజీ, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విదేశంలోని వివరాలు, తెలంగాణలోని కుటుంబ వివరాలు మొబైల్ నెంబర్లు సమకూర్చాలి.   

*ఎన్నారై మహిళా పోలీస్ విభాగం పరిధిలో:* 

విదేశాల్లోని ఎన్నారై కుటుంబ వివాదాల పరిష్కారం గురించి వచ్చిన దరఖాస్తులను తదుపరి చర్యల కోసం హైదరాబాద్ లక్డీకాపూల్ లోని పోలీస్ కార్యాలయంలోని ఎన్నారై విమెన్ సెల్ కు పంపిస్తారు. ఈ సేవలు వినియోగించుకోవడానికి తెల్ల కాగితంపై దరఖాస్తు, పాస్ పోర్ట్ మొదటి పేజీ అడ్రస్ పేజీ, ఆధార్ కార్డు, మ్యారేజ్ సర్టిఫికెట్, పోలీస్ ఎఫ్ఐఆర్, విదేశంలోని వివరాలు, తెలంగాణలోని కుటుంబ వివరాలు మొబైల్ నెంబర్లు సమకూర్చాలి. 

*ఏజెంట్ల మోసాలు - పోలీస్ శాఖ పరిధిలో:*

నకిలీ ఏజెంట్లు, చీటింగ్ కేసులు, విదేశాలకు సంబంధించిన ఇతర సారూప్య సమస్యలపై తదుపరి చర్యల కోసం సంబంధిత కమీషనర్ ఆఫ్ పోలీస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ కు బదిలీ చేస్తారు. ఈ సేవలు వినియోగించుకోవడానికి తెల్ల కాగితంపై దరఖాస్తు, పాస్ పోర్ట్ తదితర వివరాలు అందజేయాలి. 

*గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా* 

రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా (మృతధన సహాయం) కోసం గల్ఫ్ దేశాలలో చనిపోయిన వ్యక్తి  జీవిత భాగస్వామి (భార్య / భర్త), పిల్లలు, తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విజ్ఞప్తిని సంబంధిత జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తారు. నేరుగా జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవడం మంచిది. తెల్లకాగితంపై అభ్యర్థన లేఖ, పాస్ పోర్ట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, భారత రాయబార కార్యాలయాలు జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాలి. 

*గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు:* 

గల్ఫ్ కార్మికుల పిల్లలకు ప్రభుత్వ గురుకుల పాఠశాలలలో అడ్మిషన్ల కొరకు వచ్చిన దరఖాస్తులను తదుపరి చర్యల కోసం విద్యా శాఖకు బదిలీ చేస్తారు. తెల్ల కాగితంపై దరఖాస్తు, పాస్ పోర్ట్ మొదటి పేజీ అడ్రస్ పేజీ, ఆధార్ కార్డు, విద్యార్థి సర్టిఫికెట్లు సమర్పించాలి.

Tags
Join WhatsApp

More News...

International  

ఇరాన్ అధికారులపై సౌదీ అరేబియా కఠిన నిర్ణయం – 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని నిష్క్రమణ ఉత్తర్వులు

ఇరాన్ అధికారులపై సౌదీ అరేబియా కఠిన నిర్ణయం – 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని నిష్క్రమణ ఉత్తర్వులు రియాద్ మార్చ్ 22: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ మరియు సౌదీ అరేబియా మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారుతున్నాయి. ఈ పరిణామాల్లో భాగంగా, సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అధికారులు ఒక ఇరాన్ సైనిక అధికారిని, అలాగే రాయబార కార్యాలయానికి చెందిన నలుగురు సిబ్బందిని “అనవసర వ్యక్తులు” (persona...
Read More...
Local News 

రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్     జగిత్యాల మార్చి 21 (ప్రజా మంటలు)ఈద్గా ల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పర్వదినాన్ని శాంతి, సామరస్య వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ఈద్గాల వద్ద ఏర్పాటు...
Read More...
Local News 

ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత

ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత      జగిత్యాల మార్చి 21 (ప్రజా మంటలు)పట్టణం లో పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా మంచినీళ్ల బావి ఈద్గా మరియు కిల్ల జగిత్యాల జమ మసీద్ దగ్గర  బి  ఆర్ ఎస్ నాయకులతో కలిసి మైనార్టీ సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా...
Read More...
Local News 

జనాకర్షక పథకాల కి తప్ప విద్యారంగానికి కేటాయింపులు లేవు_ )ఎస్ టి యు

జనాకర్షక పథకాల కి తప్ప విద్యారంగానికి కేటాయింపులు లేవు_ )ఎస్ టి యు    జగిత్యాల మార్చి 20(ప్రజా మంటలు)జనాకర్షక పథకాలకే తప్ప ప్రస్తుత విద్యా వ్యవస్థను బాగు చేసే విధంగా విద్యారంగానికి కేటాయింపులు లేవని స్టేట్ టీచర్స్ యూనియన్  జగిత్యాల జిల్లా శాఖ అభిప్రాయపడింది.  శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై ఎస్టీయూ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష,  ప్రధాన కార్యదర్శి లు బైరం హరికిరణ్,...
Read More...
National  State News 

అన్నాడీఎంకే కూటమిలో సీట్ల పంపకం ఎప్పుడు? ఏమిటి సమస్య? ఎవరికెంత?

అన్నాడీఎంకే కూటమిలో సీట్ల పంపకం ఎప్పుడు? ఏమిటి సమస్య? ఎవరికెంత? చెన్నై మార్చ్ 19: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో సీట్ల పంపకం చర్చలు తుది దశకు చేరుకున్నాయని సమాచారం.. ఇప్పటి వరకు లభ్యమైన వివరాల ప్రకారం:భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి – 27 స్థానాలుపట్టాళి మక్కల్ కచ్చి (పామక)కు...
Read More...
State News 

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా ఉగాది వేడుకలు.. ప్రజా బడ్జెట్ విడుదల

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా ఉగాది వేడుకలు.. ప్రజా బడ్జెట్ విడుదల హైదరాబాద్, మార్చ్ 19 (ప్రజా మంటలు):శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా తెలంగాణ జాగృతి కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం చేయగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఆమెతో పాటు అనిల్ దంపతులు, జాగృతి ముఖ్య నాయకులు హాజరయ్యారు. రూ.2,15,200...
Read More...
Local News 

ఆరెకటిక సంఘం భవననిధులకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు వినతి

ఆరెకటిక సంఘం భవననిధులకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు వినతి జగిత్యాల మార్చి 19 ప్రజా మంటలుజగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని క్యాంపు కార్యాలయంలో కలిసిన జగిత్యాల ఆరెకటిక సంఘం సభ్యులు.జగిత్యాల కటికవాడలో ఆరెకటిక సంఘ భవనానికి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు.సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే నిధుల మంజూరుకు కృషి చేస్తానని అన్నారు.
Read More...
Local News 

మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందు – దావ వసంత సురేష్

మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందు – దావ వసంత సురేష్ జగిత్యాల, మార్చ్ 18 (ప్రజా మంటలు): పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, బీఆర్ఎస్ నాయకులు కలిసి పాల్గొని మత సామరస్యాన్ని చాటారు.ఈ సందర్భంగా ప్రత్యేక...
Read More...
State News 

వెలుగుమట్ల బాధితులకు అండగా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ – తొలి రోజే సమస్యల పరిష్కారానికి చర్యలు

వెలుగుమట్ల బాధితులకు అండగా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ – తొలి రోజే సమస్యల పరిష్కారానికి చర్యలు వెలుగుమట్ల, ఖమ్మం (మార్చ్ 18 – ప్రజా మంటలు): ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వారికి కొండంత అండగా మారింది. తొలి రోజే బాధితుల సమస్యలు పరిష్కారమయ్యేలా కమిటీ సభ్యులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్‌లో...
Read More...
Local News 

విశ్వ గాయత్రి పరివార్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి

విశ్వ గాయత్రి పరివార్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి    జగిత్యాల మార్చి 18 (ప్రజా మంటలు)  విశ్వ గాయత్రి పరివార్ ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్. ఇట్టి కార్యక్రమములో సంఘ సభ్యులు చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ మరియు కౌన్సిలర్లు బొల్లరపు గిరిధర్ స్వప్న, దయాల...
Read More...
State News 

జగిత్యాలలో కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు తీవ్రం.. సంజయ్ కుమార్‌పై జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు

జగిత్యాలలో కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు తీవ్రం.. సంజయ్ కుమార్‌పై జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు కాంగ్రెస్ వీడే పరిస్థితి ఎందుకు వచ్చింది? జీవన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్జగిత్యాల రాజకీయాలు హీట్.. ఎమ్మెల్యేపై మాజీ మంత్రి ఆగ్రహంకాంగ్రెస్‌లో చిచ్చు పెట్టిందెవరు? జీవన్ రెడ్డి బహిరంగ విమర్శలుజగిత్యాల మార్చ్ 27 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి...
Read More...
Local News 

రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు మౌంట్ కార్మెల్ హైస్కూల్ విద్యార్థిని జి.శివాణి ఎంపిక.

రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు మౌంట్ కార్మెల్ హైస్కూల్ విద్యార్థిని జి.శివాణి ఎంపిక. జగిత్యాల 16 మార్చి (ప్రజా మంటలు) :  ఈ నెల 20 నుండి 22 వరకు హైదరాబాద్ వాక్సన్ యూనివర్శిటీ లో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్స్ బాస్కెట్‌బాల్ పోటీలకి జగిత్యాల ధరూర్ లోని మౌంట్ కార్మెల్ హైస్కూల్ కి చెందిన జి.శివాణి  ఎంపిక కావడము జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ జ్యోతిస్మరియ,...
Read More...