ప్రవాసీ ప్రజావాణి' నిర్వహణకు మార్గదర్శకాలు జారీ
ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార వ్యవస్థ బలోపేతం కోసం ప్రభుత్వం చర్యలు
ప్రవాసీ ప్రజావాణి' నిర్వహణకు మార్గదర్శకాలు జారీ
హైదారాబాద్ అక్టోబర్ 11 :
స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉత్తర్వుల ప్రతులను చేసిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జి.చిన్నారెడ్డి విడుదల చేశారు.
హైదరాబాద్లోని ప్రజా భవన్లో కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో గల్ఫ్ ఇతర గమ్యస్థాన దేశాల కార్మికులు, ఎన్నారైల కోసం ఏర్పాటు చేసిన 'ప్రవాసీ ప్రజావాణి' ఫిర్యాదుల స్వీకరణ కేంద్రం నిర్వహణకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజావాణి ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం సెప్టెంబర్ 16న జారీ చేసిన జీవో నెం.205 కు కొనసాగింపుగా సాధారణ పరిపాలన శాఖ లోని ప్రవాస భారతీయుల (జీఏడి - ఎన్నారై) విభాగం పక్షాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈనెల 9న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపి) మార్గదర్శకాల మెమో జారీ చేశారు. 'ప్రవాసీ ప్రజావాణి' లో స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారానికి సంస్థాగతంగా ప్రామాణికరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
'ప్రవాసీ ప్రజావాణి' నిర్వహణ మార్గదర్శకాల ఉత్తర్వుల ప్రతులను శుక్రవారం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జి. చిన్నారెడ్డి విడుదల చేశారు. టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి, దుబాయి లోని గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షులు గుండెల్లి నర్సింలు, స్వచ్ఛంద సేవకులు శాంతిప్రియ యాదవ్ (మలేసియా), బషీర్ అహ్మద్ (ఓమాన్ రిటనీ) తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'ప్రవాసీ ప్రజావాణి' నిర్వహణకు చక్కటి ఏర్పాటు చేసిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. జి. చిన్నారెడ్డి, నోడల్ అధికారి దివ్యా దేవరాజన్ కు వారు కృతఙ్ఞతలు తెలిపారు.
*'ప్రవాసీ ప్రజావాణి' మార్గదర్శకాలు*
గల్ఫ్, ఇతర గమ్యస్థాన దేశాల కార్మికులు, ఎన్నారైల కోసం ఏర్పాటు చేసిన 'ప్రవాసీ ప్రజావాణి' ఫిర్యాదుల స్వీకరణ కేంద్రంలో విదేశాల్లో ఉన్న బాధితుల పక్షాన వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయవచ్చు. తదుపరి చర్యల కోసం ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపిస్తారు.
*జీఏడి - ఎన్నారై విభాగం పరిధిలో:*
గల్ఫ్ తదితర దేశాల నుంచి మృతదేహాలను ఇండియాకు తెప్పించడం, విదేశాల నుంచి వచ్చిన శవపేటికలను హైదరాబాద్ విమానాశ్రయం నుంచి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేయడం (దారిద్ర రేఖకు దిగువన - బీపీఎల్ వారికి), పేషేంట్లను స్వదేశానికి రవాణా చేయడం, విదేశీ జైళ్లలో ఉన్నవారికి న్యాయ సహాయం చేసి విడుదలకు కృషి చేయడం, వీసా గడువును మించి (ఓవర్ స్టే) అక్కడే నివసించడం, అత్యవసర పరిస్థితులు, క్షమాభిక్ష (ఆమ్నెస్టీ), జీతం బకాయిలు ఇప్పించడం, విదేశాలలో మన వారికి అవసరమైన అన్నిసేవలను జీఏడి - ఎన్నారై విభాగం నేరుగా పర్యవేక్షిస్తుంది. విదేశాలలోని భారత రాయబార కార్యాలయాలు, ఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో అనుసంధానము చేస్తుంది. ఈ సేవలు వినియోగించుకోవడానికి తెల్ల కాగితంపై దరఖాస్తు, పాస్ పోర్ట్ మొదటి పేజీ అడ్రస్ పేజీ, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విదేశంలోని వివరాలు, తెలంగాణలోని కుటుంబ వివరాలు మొబైల్ నెంబర్లు సమకూర్చాలి.
*ఎన్నారై మహిళా పోలీస్ విభాగం పరిధిలో:*
విదేశాల్లోని ఎన్నారై కుటుంబ వివాదాల పరిష్కారం గురించి వచ్చిన దరఖాస్తులను తదుపరి చర్యల కోసం హైదరాబాద్ లక్డీకాపూల్ లోని పోలీస్ కార్యాలయంలోని ఎన్నారై విమెన్ సెల్ కు పంపిస్తారు. ఈ సేవలు వినియోగించుకోవడానికి తెల్ల కాగితంపై దరఖాస్తు, పాస్ పోర్ట్ మొదటి పేజీ అడ్రస్ పేజీ, ఆధార్ కార్డు, మ్యారేజ్ సర్టిఫికెట్, పోలీస్ ఎఫ్ఐఆర్, విదేశంలోని వివరాలు, తెలంగాణలోని కుటుంబ వివరాలు మొబైల్ నెంబర్లు సమకూర్చాలి.
*ఏజెంట్ల మోసాలు - పోలీస్ శాఖ పరిధిలో:*
నకిలీ ఏజెంట్లు, చీటింగ్ కేసులు, విదేశాలకు సంబంధించిన ఇతర సారూప్య సమస్యలపై తదుపరి చర్యల కోసం సంబంధిత కమీషనర్ ఆఫ్ పోలీస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కు బదిలీ చేస్తారు. ఈ సేవలు వినియోగించుకోవడానికి తెల్ల కాగితంపై దరఖాస్తు, పాస్ పోర్ట్ తదితర వివరాలు అందజేయాలి.
*గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా*
రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా (మృతధన సహాయం) కోసం గల్ఫ్ దేశాలలో చనిపోయిన వ్యక్తి జీవిత భాగస్వామి (భార్య / భర్త), పిల్లలు, తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విజ్ఞప్తిని సంబంధిత జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తారు. నేరుగా జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవడం మంచిది. తెల్లకాగితంపై అభ్యర్థన లేఖ, పాస్ పోర్ట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, భారత రాయబార కార్యాలయాలు జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాలి.
*గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు:*
గల్ఫ్ కార్మికుల పిల్లలకు ప్రభుత్వ గురుకుల పాఠశాలలలో అడ్మిషన్ల కొరకు వచ్చిన దరఖాస్తులను తదుపరి చర్యల కోసం విద్యా శాఖకు బదిలీ చేస్తారు. తెల్ల కాగితంపై దరఖాస్తు, పాస్ పోర్ట్ మొదటి పేజీ అడ్రస్ పేజీ, ఆధార్ కార్డు, విద్యార్థి సర్టిఫికెట్లు సమర్పించాలి.
More News...
<%- node_title %>
<%- node_title %>
మోతే గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులను అభినందించి సత్కరించిన డా .భోగ శ్రావణి ప్రవీణ్
జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)మోతే గ్రామపంచాయతీ ఎన్నికల్లో వార్డ్ మెంబర్లుగా గెలుపొందిన పల్లెకొండ రాజేశ్వరి-ప్రశాంత్ , ధనపనేని నరేష్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి ని మర్యాదపూర్వకంగా కలువగా వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల అర్బన్ మండల అధ్యక్షులు రాంరెడ్డి, సునీల్,ప్రశాంత్ మరియు... పొలాస గ్రామపంచాయతీ నూతన ఉపసర్పంచ్ ,వార్డ్ సభ్యులను సత్కరించిన డా భోగ శ్రావణి
జగిత్యాల రూరల్ డిసెంబర్ 15(ప్రజా మంటలు) మండలం పొలాస గ్రామం నూతన ఉపసర్పంచ్ మరియు వార్డు మెంబర్స్ గెలుపొందగా ఈరోజు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి ని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలువగా గెలుపొందిన ఉప సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మిల్కూరి... భారత మార్కెట్లో బ్రిటిష్ ఎయిర్వేస్ విస్తరణ – ఢిల్లీకి మూడో డైలీ ఫ్లైట్
న్యూఢిల్లీ డిసెంబర్ 14:భారతదేశంలో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు బ్రిటిష్ ఎయిర్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్–యూకే మధ్య పెరుగుతున్న ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫ్లైట్ ఫ్రీక్వెన్సీలు పెంచడంతో పాటు సేవలను అప్గ్రేడ్ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.
2026 నుంచి (అనుమతులకు లోబడి) లండన్ హీత్రో – న్యూఢిల్లీ మార్గంలో మూడో డైలీ... మెహదీపట్నం రైతు బజార్ను సందర్శించిన కవిత – మోడ్రన్ మల్టీ లెవల్ మార్కెట్గా అభివృద్ధి చేయాలని డిమాండ్
మెహందీపట్నం డిసెంబర్ 14 (ప్రజా మంటలు):
మెహదీపట్నం రైతు బజార్ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు సందర్శించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు కనీస సదుపాయాలు కూడా లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బోర్డు లేకపోవటంతో చాలా మందికి ఇది రైతు... ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటే ఆయుధం: మాజీ మంత్రి రాజేశం గౌడ్
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 14 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా అంతర్గాం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్ గారు సతీమణి శ్యామలాదేవితో కలిసి ఓటు హక్కును వినియోగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు... సీసీ కెమెరాల నూతన నైపుణ్యాలపై భారత్ భవన్లో ముగిసిన మూడు రోజుల ప్రదర్శనలు
ఢిల్లీ డిసెంబర్ 14 (ప్రజా మంటలు)ఢిల్లీలో ప్రతి ఏటా సీసీ కెమెరాలపై ఎప్పటికప్పుడు వస్తున్న నూతన పోకడలు వాడే ఉపకరణాలపై ప్రదర్శనలు నిర్వహిస్తారు ఇదిలా ఉండగా ఈనెల 11 12 13 తేదీలలోభారత్ భవన్ మంటపం లో ప్రదర్శనలు నిర్వహించారు.
దీనిలో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ద్వారా రోబోలు సెక్యూరిటీగా వ్యవహరించడం... ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి : ప్రజా కళాకారులు, గ్రంథాలయాలు
నేటి ఆధునిక ప్రపంచానికి దూరంగా,.. నిజమైన ప్రజా ప్రతినిధులతో....
ఈనెల 13న రంగవల్లి విజ్ఞాన కేంద్రం( గ్రంథాలయం) వార్షికోత్సవం వేములవాడ దగ్గర మరియు ఆమె 26వ వర్ధంతిని పురస్కరించుకొని ఒక సమావేశం రంగవల్లి విజ్ఞాన కేంద్రం కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నన్ను "ప్రజా గ్రంధాలయాల ఆవశ్యకత" ' విమల మిగతా ముఖ్యులు
సభ... 493 ఓట్ల మెజారిటి తో రాజగోపాల్ రావు విజయం
బీర్పూర్, డిసెంబర్, 14( ప్రజా మంటలు )
బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామస్టులు రాజగోపాల్ రావు 30 ఏళ్ల తర్వాత కూడా మళ్లీ ఓటేసి అక్కున చేర్చుకున్నారు.
35 ఏళ్ల నాడు ఆ గ్రామంలో ప్రజాప్రతినిధి కావడం..అప్పటి పరిస్థితులకు ఇబ్బంది పడ్డ ఆయన ఎంతో ఆవేదనతో ఊరు విడిచి వెళ్లిపోయారు. దీంతో మళ్లీ వచ్చి ఆయన... జగిత్యాల జిల్లాలో 2వ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తి
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 14 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 7 మండలాల్లో కలిపి మొత్తం 2,08,168 ఓట్లు ఉండగా 1,63,074 ఓట్లు పోలవ్వడంతో 78.34 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. బీర్పూర్, జగిత్యాల, జగిత్యాల రూరల్, కొడిమ్యాల, మల్యాల, రాయికల్, సారంగాపూర్ మండలాల్లో ఆదివారం... ఒకే కుటుంబం నుండి ముగ్గురు వార్డు సభ్యుల గెలుపుపై గ్రామస్తుల హర్షం
జగిత్యాల డిసెంబర్ 14 (ప్రజా మంటలు)జిల్లాలో జరిగినరెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఒకే కుటుంబం నుండి ముగ్గురు గెలిచిన సంఘటన గ్రామస్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ కుటుంబం పైన ప్రజలకు విశ్వాసం వెరసి ఒకే కుటుంబం నుండి ముగ్గురు అభ్యర్థులు గెలవడం ఆ కుటుంబం పై ఉన్న విశ్వాసం అని గ్రామస్తులు... ఎంటర్టైన్మెంట్ కోసం గంటకు ₹10 కోట్లు ఖర్చు – సింగరేణి నిధులు దుర్వినియోగం
హైదరాబాద్ డిసెంబర్ 14 (ప్రజా మంటలు):
"జాగృతి జనం బాట" కార్యక్రమంలో భాగంగా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ప్రెస్మీట్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం గంట ఎంటర్టైన్మెంట్ కోసం పది కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, అది కూడా సింగరేణి కార్మికుల... రెండో విడత 7 మండలాల్లోని గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతం
జగిత్యాల డిసెంబర్ 14 (ప్రజా మంటలు)జిల్లాలో రెండో విడత నిర్వహించిన గ్రామపంచాయతీ పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సందర్శించి పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ గౌడ్ డిపిఓ రఘువరన్ తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు... 