కొండా సురేఖ వ్యాఖ్యలు ఆడ జన్మకే కలంకం -మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ దావ వసంతసురేష్
కొండా సురేఖ వ్యాఖ్యలు ఆడ జన్మకే కలంకం -మహిళా మంత్రులను అడ్డం పెట్టుకొని బిఆర్ఎస్ పై సిఎం రేవంత్ రెడ్డి దాడి
-మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ దావ వసంతసురేష్
జగిత్యాల అక్టోబర్ 03:
ఎంగిలి పూల బతుకమ్మ నాడు ఎంగిలి మాటలు మాట్లాడిన కొండా సురేఖ బేషరతుగా కేటీఆర్ కు వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ దావ వసంతసురేష్ డిమాండ్ చేశారు.
పార్టీ జగిత్యాల జిల్లా కార్యాలయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మీడియాతో మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొండా సురేఖ క్యాలి తప్పి మాట్లాడుతున్నారని, కొండా వ్యాఖ్యలపై మాట్లాడాలంటే అసహ్యం వేస్తుందని.రాజకీయాల్లో ఇలాంటి మహిళలు ఉన్నారంటే బాధగా ఉందని అన్నారు.
కాంగ్రెస్ పాలన వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకే మహిళా మంత్రులను శిఖండి లాగా పెట్టుకుని రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆమె అన్నారు.
రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న కొండా సురేఖ సంస్కారహీనంగా,సినిమా పరిశ్రమను కించపరిచేలా, కేటీఆర్ ని ఉద్దేశించి మంత్రి బజారు భాషాపై వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని హెచ్చరిస్తున్నాం...
మీ హాయాంలో N కన్వెన్షన్ కూలగొట్టారు మరి మీరు ఎవరిని పంపమని డిమాండ్ చేశారు.? పంపలేదు గనుకనే కూల్చివేశారా? అని మేము విమర్శించవచ్చు..కానీ మాకు ఒక సభ్యత సంస్కారం ఉంది..మహిళలను గౌరవించే ఒక విధానం మాది.అందుకే అలాంటి అసభ్యకరమైన విమర్శలు చేయమని అన్నారు.
హైడ్రా పేరుతో సిఎం రేవంత్ రెడ్డి పేదల ఇండ్లను కూలుస్తున్నారని,ప్రజలంతా బిఆర్ఎస్ వద్దకు వచ్చి తమ గోడు వెల్లబోసుకుంటున్నారని, ఈ క్రమంలో బిఆర్ఎస్ కు వస్తున్న ఆదరణ ఓర్వలేక కేటీఆర్ పై సురేఖ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని విమర్శించారు
రాజకీయంగా ఎదురుకోలేకనే ఇటువంటి నీచ సంస్కృతికి దిగజారుతున్నారని, అరాచకాలు,అవినీతి అక్రమాలకు పెట్టింది పేరుగా కాంగ్రెస్ పార్టీ పేరు గాంచిందన్నారు.
రాష్ట్ర మహిళా కమిషన్ ఒక కాంగ్రెస్ మహిళ కమిషన్ గానే కాకుండా మహిళల పక్షాన ఉండి వెంటనే కొండా సురేఖ మాట్లాడినటువంటి మాటల పై యాక్షన్ తీసుకోవాలన్నారు
కేటీఆర్ కి క్షమాపణ చెప్పకుంటే ఉర్కునేది లేదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల రాయికల్ AMC మాజీ చైర్మన్లు శీలం ప్రియాంక ప్రవీణ్,ఉదయ శ్రీ, రాయికల్ మండల మహిళా అధ్యక్షురాలు స్పందన తదితరులు ఉన్నారు...
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా సత్య సాయి ఆరాధన మహోత్సవ వేడుకలు
జగిత్యాల ఏప్రిల్ 24 (ప్రజా మంటలు)భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆరాధన ఉత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయము నగర సంకీర్తన అల్పాహార వితరణ రుద్ర పారాయణము రుద్రాభిషేకము మధ్యాహ్నం అర్హులైన వారికి వీల్ చైర్ ల పంపిణీ దుస్తుల... జగిత్యాల మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులకు కౌన్సిల్ ఆమోదం
జగిత్యాల ఏప్రిల్ 24 ( ప్రజా మంటలు) పురపాలక సంఘం కార్యాలయంలో పురపాలక సంఘ అధ్యక్షురాలు సమిండ్ల వాణి శ్రీనివాస్ అధ్యక్షతన కో-ఆప్షన్ ఎన్నికకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగినది.
ఇట్టి సమావేశము కౌన్సిల్ సమావేశములో వీరబత్తిని పద్మజ, గట్టు సతీష్, తస్లీం సుల్తాన మరియు మహమ్మద్ అబ్దుల్ కదీర్ అలియాస్ ముజ్జు భాయి... సహకార సంఘాలపై నామినేటెడ్ విధానం వెనక్కి తీసుకోవాలి: పిఎసిఎస్ మాజీ అధ్యక్షుల డిమాండ్
జగిత్యాల, ఏప్రిల్ 24 (ప్రజా మంటలు):
తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS), జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (DCCB)లకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ విధానం తీసుకురావడం ప్రజాస్వామ్య విరుద్ధమని పిఎసిఎస్ తాజా మాజీ అధ్యక్షులు తీవ్రంగా విమర్శించారు.
జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో పోతారం పిఎసిఎస్... వరి ధాన్యం కుప్పలను పరిశీలించిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత
సారంగాపూర్ ఏప్రిల్ 24 (ప్రజా మంటలు) మండల పర్యటనలో భాగంగా మండల కేంద్రంలోని వరి ధాన్య కుప్పలను రైతులతో కలిసి ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...నిన్న కురిసిన పడగళ్ల వర్షానికి తడిచిన ధాన్యాన్ని పరిశీలించి వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను తొందరగా... కవిత కొత్త పార్టీ: ఆశలు, ఆశయాలు – తెలంగాణ రాజకీయాలకుకొత్త దిశా?
హైదరాబాద్ ఏప్రిల్ 25:తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయం తెరలేపేందుకు కల్వకుంట్ల కవిత సిద్ధమవుతున్నారు. మునీరాబాద్లో అట్టహాసంగా ఏర్పాటు చేసిన సభలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్న ఈ పరిణామం, కేవలం ఒక పార్టీ ఆవిర్భావం మాత్రమే కాదు – ఇది తెలంగాణ రాజకీయ వ్యవస్థలో మార్పు అవసరంపై మరోసారి చర్చను తెరపైకి తెస్తోంది.... ట్రా"ఫికర్" పై నిద్రలేచిన జగిత్యాల మున్సిపాలిటీ
జగిత్యాల ఏప్రిల్ 24 (ప్రజా మంటలు) జగిత్యాలలో నానాటికి ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం వ్యాపారస్తులు తమ దుకాణాల ముందు ప్రదర్శన కోసం ఎన్నో వస్తువులను ఉంచడంతో రోడ్డు పైన నడిచే పాదాచార్లకు వాహనాలకు ఇబ్బందులు ఎదురవడమే కాకుండా ఒక్కోసారి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులదే బాధ్యత అన్నట్లుగా మున్సిపల్... జగిత్యాలలో RTC సమ్మెకు జీవన్ రెడ్డి మద్దతు | ప్రభుత్వం నిర్లక్ష్యంపై విమర్శలు
జగిత్యాల, ఏప్రిల్ 24 (ప్రజా మంటలు):
పట్టణంలోని RTC డిపో ముందు జరుగుతున్న RTC కార్మికుల సమ్మెకు మాజీ మంత్రి, BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, RTC కార్మికులు సమ్మెకు దిగడం దురదృష్టకరమని, ఈ పరిస్థితి పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఫలితమని విమర్శించారు.... కాలేశ్వరం ప్రాజెక్టు పై హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి కుట్రలకు చెంప దెబ్బ* *ఎవరు ఔనన్నా కాదన్నా* *తెలంగాణకు ప్రాణేశ్వరం ముమ్మాటికీ కాళేశ్వరమే* తొలి జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్
* జగిత్యాల ఏప్రిల్ 22 ( ప్రజా మంటలు) కాలేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సందర్భంగా ఈ రోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో తాసిల్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ నాయకులతో కలిసి సంబరాల్లో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...* ఘోష్ కమిషన్... ‘పరమపద సోపానం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా… ఏప్రిల్ 24న గ్రాండ్ రిలీజ్
హైదరాబాద్, ఏప్రిల్ 22 (ప్రజా మంటలు):
‘పరమపద సోపానం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. అర్జున్ అంబటి హీరోగా, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని గణపర్తి నారాయణరావు నిర్మించగా, నాగ శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ కార్యక్రమానికి ప్రముఖ... ఈ రోజు ఉదయం10 గంటలకు సభాస్థలి పరిశీలించనున్న కవిత
:హైదరాబాద్, ఏప్రిల్ 22 (ప్రజా మంటలు):
మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్ను ఈ రోజు (బుధవారం) ఉదయం 10 గంటలకు తెలంగాణ జాగృతి నాయకులు పరిశీలించనున్నారు.
ఈనెల 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటించనున్న నేపథ్యంలో, సభ ఏర్పాట్లను పర్యవేక్షించి సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రం... వెయ్యి ఏండ్లయినా బీఆర్ఎస్ మారదు: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఏప్రిల్ 21 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె, “వెయ్యి ఏండ్లు అయినా బీఆర్ఎస్ పార్టీ మారదు” అని మండిపడ్డారు.బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోకుండా ప్రజలనే తప్పు పడుతోందని... జగిత్య BRS సభ మరో ఉద్యమానికి, కాంగ్రెస్ పతనానికి నాంది - బి ఆర్ ఎస్ నాయకులు
జగిత్యాల, ఏప్రిల్ 21 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జెడ్పీ మాజీ ఛైర్పర్సన్ దావా వసంత, మార్క్ఫెడ్ లోక బాపురెడ్డి,... 