కొండా సురేఖ వ్యాఖ్యలు ఆడ జన్మకే కలంకం -మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ దావ వసంతసురేష్ 

On
కొండా సురేఖ వ్యాఖ్యలు ఆడ జన్మకే కలంకం  -మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ దావ వసంతసురేష్ 

కొండా సురేఖ వ్యాఖ్యలు ఆడ జన్మకే కలంకం -మహిళా మంత్రులను అడ్డం పెట్టుకొని బిఆర్ఎస్ పై సిఎం రేవంత్ రెడ్డి దాడి

-మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ దావ వసంతసురేష్ 

జగిత్యాల అక్టోబర్ 03:

ఎంగిలి పూల బతుకమ్మ నాడు ఎంగిలి మాటలు మాట్లాడిన కొండా సురేఖ బేషరతుగా కేటీఆర్ కు వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ దావ వసంతసురేష్ డిమాండ్ చేశారు.

పార్టీ జగిత్యాల జిల్లా కార్యాలయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మీడియాతో  మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొండా సురేఖ క్యాలి తప్పి మాట్లాడుతున్నారని, కొండా వ్యాఖ్యలపై మాట్లాడాలంటే అసహ్యం వేస్తుందని.రాజకీయాల్లో ఇలాంటి మహిళలు ఉన్నారంటే బాధగా ఉందని అన్నారు.

కాంగ్రెస్ పాలన వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకే మహిళా మంత్రులను  శిఖండి లాగా పెట్టుకుని రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆమె అన్నారు.

రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న కొండా సురేఖ సంస్కారహీనంగా,సినిమా పరిశ్రమను కించపరిచేలా, కేటీఆర్ ని ఉద్దేశించి మంత్రి బజారు భాషాపై వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని హెచ్చరిస్తున్నాం...

మీ హాయాంలో N కన్వెన్షన్ కూలగొట్టారు మరి మీరు ఎవరిని పంపమని డిమాండ్ చేశారు.? పంపలేదు గనుకనే కూల్చివేశారా? అని మేము విమర్శించవచ్చు..కానీ మాకు ఒక సభ్యత సంస్కారం ఉంది..మహిళలను గౌరవించే ఒక విధానం మాది.అందుకే అలాంటి అసభ్యకరమైన విమర్శలు చేయమని అన్నారు.

హైడ్రా పేరుతో సిఎం రేవంత్ రెడ్డి పేదల ఇండ్లను కూలుస్తున్నారని,ప్రజలంతా బిఆర్ఎస్ వద్దకు వచ్చి తమ గోడు వెల్లబోసుకుంటున్నారని, ఈ క్రమంలో బిఆర్ఎస్ కు వస్తున్న ఆదరణ ఓర్వలేక కేటీఆర్ పై సురేఖ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని విమర్శించారు

రాజకీయంగా ఎదురుకోలేకనే ఇటువంటి నీచ సంస్కృతికి దిగజారుతున్నారని, అరాచకాలు,అవినీతి అక్రమాలకు పెట్టింది పేరుగా కాంగ్రెస్ పార్టీ పేరు గాంచిందన్నారు.

రాష్ట్ర మహిళా కమిషన్ ఒక కాంగ్రెస్ మహిళ కమిషన్ గానే కాకుండా మహిళల పక్షాన ఉండి వెంటనే కొండా సురేఖ మాట్లాడినటువంటి మాటల పై యాక్షన్ తీసుకోవాలన్నారు

కేటీఆర్ కి క్షమాపణ చెప్పకుంటే ఉర్కునేది లేదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల రాయికల్ AMC మాజీ చైర్మన్లు శీలం ప్రియాంక ప్రవీణ్,ఉదయ శ్రీ, రాయికల్ మండల మహిళా అధ్యక్షురాలు స్పందన తదితరులు ఉన్నారు...

Tags
Join WhatsApp

More News...

Local News 

పెన్షనర్లకు ప్రభుత్వ హామీలను నెరవేర్చాలి.              -టీ.పీ.సి.ఏ.రాష్ర్ట కార్యదర్శి హరి అశోక్ కుమార్.      

పెన్షనర్లకు ప్రభుత్వ హామీలను నెరవేర్చాలి.              -టీ.పీ.సి.ఏ.రాష్ర్ట కార్యదర్శి హరి అశోక్ కుమార్.       జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు): అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెన్షనర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు.శుక్రవారం టీ.పి.సి.ఏ.ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్ల వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా అసోసియేషన్ కార్యాలయంలో పెన్షన్ నిబంధనలు-ప్రయోజనాలు అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం 2024...
Read More...

Today's Cartoon

Today's Cartoon
Read More...
Local News 

హర్షవర్ధన్ కుటుంబాన్ని పరామర్శించిన రాజేశం గౌడ్ 

హర్షవర్ధన్ కుటుంబాన్ని పరామర్శించిన రాజేశం గౌడ్  కోరుట్ల డిసెంబర్ 19|(ప్రజా మంటలు): కోరుట్లకు చెందిన విద్యార్థి హర్షవర్ధన్ క్యాన్సర్‌తో మృతి చెందడంపై తెలంగాణ తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మేడిపల్లి మాజీ జెడ్పీటీసీ అడ్డగట్ల లలితలతో కలిసి...
Read More...

అధికారుల సమన్వయం తో గ్రామపంచాయతీ ఎన్నికలు  విజయవంతం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

అధికారుల సమన్వయం తో గ్రామపంచాయతీ ఎన్నికలు  విజయవంతం  జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు)మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా, విజయవంతంగా ముగియడం పట్ల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్   ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న అన్ని శాఖల అధికారులు, అన్ని స్థాయిల అధికారులను మరియు సిబ్బందిని అభినందించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన...
Read More...

ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలుపై ప్రజల సంతృప్తి_ గ్రామపంచాయతీ ఎన్నికల తీర్పు నిదర్శనం

ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలుపై ప్రజల సంతృప్తి_ గ్రామపంచాయతీ ఎన్నికల తీర్పు నిదర్శనం జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలుపరుస్తున్న తీరుకు, గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నిదర్శనమని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాటు...
Read More...

భార్యను హత్య చేసిన కేసులో భర్తకు జీవిత ఖైదు, ₹4,000 జరిమానా కీలక తీర్పును వెలువరించిన . జిల్లా సెషన్స్ జడ్జి  రత్న పద్మావతి

భార్యను హత్య చేసిన కేసులో భర్తకు జీవిత ఖైదు, ₹4,000 జరిమానా  కీలక తీర్పును వెలువరించిన . జిల్లా సెషన్స్ జడ్జి  రత్న పద్మావతి   జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు)నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకోలేరు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లం రాజేశ్వరి అనే మహిళ కు స్టంభంపల్లి గ్రామానికి చెందిన  బొల్లం జగదీష్‌ను 2016 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, బొల్లం...
Read More...
National  State News 

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు తాత్కాలికంగా రద్దు

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు తాత్కాలికంగా రద్దు న్యూఢిల్లీ డిసెంబర్ 19| (ప్రజా మంటలు): కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ ఏడాది అవార్డుల ప్రకటనకు ముందే అవార్డు జాబితా ఒక ఆంగ్ల పత్రికకు లీక్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గురువారం(18 డిసెంబర్ ),మధ్యాహ్నం జరగాల్సిన సాహిత్య అకాడమీ మీడియా సమావేశాన్ని...
Read More...
Local News 

ఆర్‌యు‌పి‌పి జగిత్యాల  జిల్లా అధ్యక్షుడిగా వేల్పుల స్వామి యాదవ్, ప్రధాన కార్యదర్శిగా ఎనగందుల రాజేంద్రప్రసాద్

ఆర్‌యు‌పి‌పి జగిత్యాల  జిల్లా అధ్యక్షుడిగా వేల్పుల స్వామి యాదవ్, ప్రధాన కార్యదర్శిగా ఎనగందుల రాజేంద్రప్రసాద్ జగిత్యాల డిసెంబర్ 19 (|ప్రజా మంటలు): రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ రాష్ట్రం (ఆర్‌యు‌పి‌పి‌టీఎస్) ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శానమోని నర్సిములు, రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి సత్తిరాజు శశికుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షుడిగా అల్లకట్టు సత్యనారాయణను...
Read More...

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన వేతనం నిరాకరణపై టీజీహెచ్‌ఆర్‌సీ సీరియస్

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన వేతనం నిరాకరణపై టీజీహెచ్‌ఆర్‌సీ సీరియస్   హైదరాబాద్ డిసెంబర్ 19 (ప్రజా మంటలు): రాష్ట్రవ్యాప్తంగా మండల విద్యా కార్యాలయాల్లో (MEO కార్యాలయాలు) మెసెంజర్లు (ఆఫీస్ సబార్డినేట్లు)గా అవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సమాన వేతనం నిరాకరించడంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. డా. జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన జరిగిన విచారణలో, 20 సంవత్సరాలకు పైగా...
Read More...
Local News  State News 

మణుగూరు–భద్రాచలం జనం బాటలో గిరిజనుల పక్షాన కల్వకుంట్ల కవిత పోరాటం

మణుగూరు–భద్రాచలం జనం బాటలో గిరిజనుల పక్షాన కల్వకుంట్ల కవిత పోరాటం భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 19 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేపట్టిన జనం బాట కార్యక్రమంలో గిరిజనులు, ఆదివాసీలు, సింగరేణి కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. మణుగూరు ఓసీ–2 గనిని సందర్శించిన కవిత, కార్మికులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం క్యాంటీన్‌లో కార్మికులతో కలిసి...
Read More...
Local News  State News 

ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలి

ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలి హైదరాబాద్, డిసెంబర్ 18 (ప్రజా మంటలు): ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలని, లేదంటే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ మంత్రి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి హెచ్చరించారు. మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీ పథకం నుంచి...
Read More...
Local News 

గొల్లపల్లి సర్పంచ్  నల్ల నీరజ సతీష్ రెడ్డి విజయోత్స ర్యాలీ 

గొల్లపల్లి సర్పంచ్  నల్ల నీరజ సతీష్ రెడ్డి విజయోత్స ర్యాలీ  గొల్లపల్లి డిసెంబర్ 18 (ప్రజా మంటలు- అంకం భూమయ్య)    గొల్లపల్లి మండల కేంద్రంలో ఇండిపెండెంట్ సర్పంచ్ విజయోత్స ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా నుండి నల్ల గుట్ట వరకు గొల్లపల్లి సర్పంచ్‌గా నన్ను గెలిపించిన సందర్భంగా   గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని సర్పంచ్ నల్ల నీరజ సతీష్ రెడ్డి గురువారం మండల కేంద్రంలో బారి ర్యాలీ గొల్లపల్లి...
Read More...