కొండా సురేఖ వ్యాఖ్యలు ఆడ జన్మకే కలంకం -మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ దావ వసంతసురేష్
కొండా సురేఖ వ్యాఖ్యలు ఆడ జన్మకే కలంకం -మహిళా మంత్రులను అడ్డం పెట్టుకొని బిఆర్ఎస్ పై సిఎం రేవంత్ రెడ్డి దాడి
-మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ దావ వసంతసురేష్
జగిత్యాల అక్టోబర్ 03:
ఎంగిలి పూల బతుకమ్మ నాడు ఎంగిలి మాటలు మాట్లాడిన కొండా సురేఖ బేషరతుగా కేటీఆర్ కు వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ దావ వసంతసురేష్ డిమాండ్ చేశారు.
పార్టీ జగిత్యాల జిల్లా కార్యాలయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మీడియాతో మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొండా సురేఖ క్యాలి తప్పి మాట్లాడుతున్నారని, కొండా వ్యాఖ్యలపై మాట్లాడాలంటే అసహ్యం వేస్తుందని.రాజకీయాల్లో ఇలాంటి మహిళలు ఉన్నారంటే బాధగా ఉందని అన్నారు.
కాంగ్రెస్ పాలన వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకే మహిళా మంత్రులను శిఖండి లాగా పెట్టుకుని రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆమె అన్నారు.
రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న కొండా సురేఖ సంస్కారహీనంగా,సినిమా పరిశ్రమను కించపరిచేలా, కేటీఆర్ ని ఉద్దేశించి మంత్రి బజారు భాషాపై వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని హెచ్చరిస్తున్నాం...
మీ హాయాంలో N కన్వెన్షన్ కూలగొట్టారు మరి మీరు ఎవరిని పంపమని డిమాండ్ చేశారు.? పంపలేదు గనుకనే కూల్చివేశారా? అని మేము విమర్శించవచ్చు..కానీ మాకు ఒక సభ్యత సంస్కారం ఉంది..మహిళలను గౌరవించే ఒక విధానం మాది.అందుకే అలాంటి అసభ్యకరమైన విమర్శలు చేయమని అన్నారు.
హైడ్రా పేరుతో సిఎం రేవంత్ రెడ్డి పేదల ఇండ్లను కూలుస్తున్నారని,ప్రజలంతా బిఆర్ఎస్ వద్దకు వచ్చి తమ గోడు వెల్లబోసుకుంటున్నారని, ఈ క్రమంలో బిఆర్ఎస్ కు వస్తున్న ఆదరణ ఓర్వలేక కేటీఆర్ పై సురేఖ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని విమర్శించారు
రాజకీయంగా ఎదురుకోలేకనే ఇటువంటి నీచ సంస్కృతికి దిగజారుతున్నారని, అరాచకాలు,అవినీతి అక్రమాలకు పెట్టింది పేరుగా కాంగ్రెస్ పార్టీ పేరు గాంచిందన్నారు.
రాష్ట్ర మహిళా కమిషన్ ఒక కాంగ్రెస్ మహిళ కమిషన్ గానే కాకుండా మహిళల పక్షాన ఉండి వెంటనే కొండా సురేఖ మాట్లాడినటువంటి మాటల పై యాక్షన్ తీసుకోవాలన్నారు
కేటీఆర్ కి క్షమాపణ చెప్పకుంటే ఉర్కునేది లేదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల రాయికల్ AMC మాజీ చైర్మన్లు శీలం ప్రియాంక ప్రవీణ్,ఉదయ శ్రీ, రాయికల్ మండల మహిళా అధ్యక్షురాలు స్పందన తదితరులు ఉన్నారు...
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అగ్ని ప్రమాద బాధితులు
కొండగట్టు జనవరి 10 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టులో గతంలో షార్ట్ సర్క్యూట్ ద్వారా బొమ్మల వ్యాపారుల దుకాణాలు కాలిపోగా నిరాశ్రయులైన బొమ్మల దుకాణాల యజమానులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా విద్యుత్ శాఖ తరపున ఆర్థిక సహాయం అందించినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వడ్లూరి లక్ష్మణ్ కుమార్, కిషన్ రావుపేట ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు
వెల్గటూర్ జనవరి 10 (ప్రజా మంటలు) జక్కాపురం నారాయణస్వామి వెల్గటూర్
మండలంలోని కిషన్రావు పేట ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నర్ముల గంగన్న ఆధ్వర్యంలో పాఠశాలలకు సంక్రాంతి సెలవులు రావడం వలన ముందస్తుగా ఘనంగా సంక్రాంత్రి సంబరాలు జరుపుకున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులు, తోరణాలతో పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా అలంకరించారు. ... బిట్స్ పిలానీ యంగ్ అచీవర్స్ అవార్డు అనుదీప్ ఐఏఎస్కు ప్రదానం
హైదరాబాద్, జనవరి 10 (ప్రజా మంటలు):
ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థుల్లోంచి ఎంపిక చేసిన యంగ్ అచీవర్స్ అవార్డును ఐఏఎస్ అధికారి అనుదీప్ దురిశెట్టి అందుకున్నారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి వాసి అయిన అనుదీప్ దురిశెట్టి, ప్రజాజీవన రంగంలో విశిష్ట సేవలందించినందుకు పబ్లిక్ లైఫ్ కేటగిరీలో ఈ పురస్కారానికి... ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వకపోతే భూపోరాటాలు తప్పవు: తెలంగాణ జాగృతి
హైదరాబాద్, జనవరి 10 (ప్రజా మంటలు):
తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ హెచ్చరించారు. ముఖ్యంగా ఉద్యమకారులకు హామీ ఇచ్చిన 250 గజాల భూమిని వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు.
బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో జరిగిన ఉద్యమకారులతో ఆత్మీయ సమ్మేళనంలో... జాగృతి ఖతార్ చైర్పర్సన్కు నారీ శక్తి సమ్మాన్ అవార్డు
హైదరాబాద్, జనవరి 10 (ప్రజా మంటలు):
గల్ఫ్ దేశాల్లోని భారతీయ కార్మికులు, ప్రవాసులకు విశేష సేవలందిస్తున్న జాగృతి ఖతార్ అడ్వైజరీ చైర్పర్సన్ నందిని అబ్బగౌని ప్రతిష్టాత్మక నారీ శక్తి సమ్మాన్ అవార్డుకు ఎంపికయ్యారు.
ఖతార్లోని భారతీయ దౌత్య కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమం దోహా నగరంలోని ఐసీసీ అశోకా హాల్... ఆదర్శ అటవీశాఖాధికారి అశోక్ రావు.
జగిత్యాల జనవరి 10(ప్రజా మంటలు) ఆదర్శ జిల్లా అటవీశాఖ అధికారిగా పూసాల అశోక్ రావు పేరొందారని టీ పెన్షనర్స్,సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ అన్నారు.శనివారం జిల్లా సీనియర్ సిటీజేన్స్ సమావేశ మందిరంలో వయో వృద్ధుల చట్టం పై అవగాహన సదస్సు, రిటైర్డ్ జిల్లా ఆటవీ శాఖ అధికారి 65 వ
ఈ... విమర్శలకు అభివృద్ధి పనులతో బదులిస్తా ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల జనవరి 10 ( ప్రజా మంటలు)విమర్శలకు అభివృద్ధి పనులతో బదులిస్తానని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు.జగిత్యాల పట్టణంలో 36 42 43 వార్డులలో 1 కోటి 30 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులను పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ అనంతరం మాట్లాడుతూ
పట్టణంలో... కోరుట్ల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
కోరుట్ల జనవరి 10 (ప్రజా మంటలు) జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆకస్మికంగా కోరుట్ల పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, నేర నియంత్రణకు మరింత పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీలు, జనరల్ డైరీ, రిజిస్టర్లు, ఇతర రికార్డులను... వాసవి మాతా ఆలయంలో ఘనంగా లక్ష్మీ గణపతి హవనం
జగిత్యాల జనవరి 10(ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్లో వాసవి మాత ఆలయంలో శనివారం లక్ష్మీ గణపతి హోమం ఘనంగా నిర్వహించారూ .ఆలయంలో కొద్ది రోజుల్లో నూతనంగా కృష్ణ శిలతో కూడిన బ్రహ్మసూత్ర శివలింగం, మేధా దక్షిణామూర్తి, వాసవి మాత ,శక్తి గణపతి, దాసాంజనేయ స్వామి విగ్రహాలు ప్రతిష్టించరున్నారు. దీనికిగాను నాందిగా శ్రీ లక్ష్మీ... వనపర్తి జిల్లాలో ఏసీబీకి చిక్కిన మరో ప్రభుత్వ అధికారి
వనపర్తి, జనవరి 10 (ప్రజా మంటలు):
వనపర్తి జిల్లాలో మరో ప్రభుత్వ అధికారి అవినీతి బారిన పడటం కలకలం రేపింది. పౌర సరఫరాల శాఖ వనపర్తి జిల్లా మేనేజర్ కుంభ జగన్మోహన్ ఏసీబీ అధికారుల వలలో చిక్కారు. సీఎంఆర్ (Custom Milled Rice) కేటాయింపు పేరుతో మిల్లు యజమానిని లంచం కోరిన కేసులో ఆయనను ఏసీబీ... దావోస్ వేదికగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ : రేవంత్ రెడ్డి
హైదరాబాద్ జనవరి 10 (ప్రజా మంటలు):
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడే పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా, దావోస్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం–2026 సదస్సులో ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ను ప్రపంచానికి పరిచయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం కట్టుదిట్టంగా... ఇండెక్స్ మార్పులతో బంగారం–వెండి మార్కెట్లో కలకలం
లండన్ / అంతర్జాతీయ మార్కెట్లు జనవరి 10:
2026 సంవత్సరంలో అంతర్జాతీయ బులియన్ మార్కెట్ తొలి పెద్ద పరీక్షను ఎదుర్కొంటోంది. కమోడిటీ ఇండెక్స్లలో జరిగే వార్షిక పునఃసంఘటన (Index Rebalancing) కారణంగా బంగారం, వెండిలో $10 బిలియన్లకు పైగా విలువైన అమ్మకాలు జరగనున్నట్లు అంచనాలు వెలువడ్డాయి.
2025లో రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు... 