కొండా సురేఖ వ్యాఖ్యలు ఆడ జన్మకే కలంకం -మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ దావ వసంతసురేష్
కొండా సురేఖ వ్యాఖ్యలు ఆడ జన్మకే కలంకం -మహిళా మంత్రులను అడ్డం పెట్టుకొని బిఆర్ఎస్ పై సిఎం రేవంత్ రెడ్డి దాడి
-మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ దావ వసంతసురేష్
జగిత్యాల అక్టోబర్ 03:
ఎంగిలి పూల బతుకమ్మ నాడు ఎంగిలి మాటలు మాట్లాడిన కొండా సురేఖ బేషరతుగా కేటీఆర్ కు వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ దావ వసంతసురేష్ డిమాండ్ చేశారు.
పార్టీ జగిత్యాల జిల్లా కార్యాలయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మీడియాతో మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొండా సురేఖ క్యాలి తప్పి మాట్లాడుతున్నారని, కొండా వ్యాఖ్యలపై మాట్లాడాలంటే అసహ్యం వేస్తుందని.రాజకీయాల్లో ఇలాంటి మహిళలు ఉన్నారంటే బాధగా ఉందని అన్నారు.
కాంగ్రెస్ పాలన వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకే మహిళా మంత్రులను శిఖండి లాగా పెట్టుకుని రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆమె అన్నారు.
రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న కొండా సురేఖ సంస్కారహీనంగా,సినిమా పరిశ్రమను కించపరిచేలా, కేటీఆర్ ని ఉద్దేశించి మంత్రి బజారు భాషాపై వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని హెచ్చరిస్తున్నాం...
మీ హాయాంలో N కన్వెన్షన్ కూలగొట్టారు మరి మీరు ఎవరిని పంపమని డిమాండ్ చేశారు.? పంపలేదు గనుకనే కూల్చివేశారా? అని మేము విమర్శించవచ్చు..కానీ మాకు ఒక సభ్యత సంస్కారం ఉంది..మహిళలను గౌరవించే ఒక విధానం మాది.అందుకే అలాంటి అసభ్యకరమైన విమర్శలు చేయమని అన్నారు.
హైడ్రా పేరుతో సిఎం రేవంత్ రెడ్డి పేదల ఇండ్లను కూలుస్తున్నారని,ప్రజలంతా బిఆర్ఎస్ వద్దకు వచ్చి తమ గోడు వెల్లబోసుకుంటున్నారని, ఈ క్రమంలో బిఆర్ఎస్ కు వస్తున్న ఆదరణ ఓర్వలేక కేటీఆర్ పై సురేఖ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని విమర్శించారు
రాజకీయంగా ఎదురుకోలేకనే ఇటువంటి నీచ సంస్కృతికి దిగజారుతున్నారని, అరాచకాలు,అవినీతి అక్రమాలకు పెట్టింది పేరుగా కాంగ్రెస్ పార్టీ పేరు గాంచిందన్నారు.
రాష్ట్ర మహిళా కమిషన్ ఒక కాంగ్రెస్ మహిళ కమిషన్ గానే కాకుండా మహిళల పక్షాన ఉండి వెంటనే కొండా సురేఖ మాట్లాడినటువంటి మాటల పై యాక్షన్ తీసుకోవాలన్నారు
కేటీఆర్ కి క్షమాపణ చెప్పకుంటే ఉర్కునేది లేదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల రాయికల్ AMC మాజీ చైర్మన్లు శీలం ప్రియాంక ప్రవీణ్,ఉదయ శ్రీ, రాయికల్ మండల మహిళా అధ్యక్షురాలు స్పందన తదితరులు ఉన్నారు...
More News...
<%- node_title %>
<%- node_title %>
మాజీ మంత్రి తలసాని 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి : కోట నీలిమ
సికింద్రాబాద్, జనవరి 12 (ప్రజా మంటలు ):
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ తీవ్రంగా ఖండించారు. తలసాని అహంకారపూరిత వ్యాఖ్యలు మానుకోవాలని హెచ్చరించారు.
తలసాని వ్యాఖ్యలకు నిరసనగా బేగంపేట్ పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు.... సీతాఫల్మండిలో సంక్రాంతి ముగ్గుల సంబరాలు
సికింద్రాబాద్, జనవరి 12 (ప్రజామంటలు):
భారతీయ జనతా పార్టీ సీతాఫల్మండి డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. బీజేపీ మాజీ ఉపాధ్యక్షులు రాచమల్ల కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు కనికట్ల హరి, మాజీ అధ్యక్షులు అంబాల రాజేశ్వరరావు మాట్లాడుతూ… ప్రజలు ముగ్గులు, పిండి వంటకాలు, పతంగులతో పండుగను ఆనందంగా జరుపుకుంటున్నారని తెలిపారు.
ముఖ్య అతిథిగా... గాంధీ ఆసుపత్రిలో హైరిస్క్ శస్త్రచికిత్స విజయవంతం
సికింద్రాబాద్, జనవరి 12 ( ప్రజా మంటలు):
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అత్యంత హైరిస్క్ శస్ర్త చికిత్సను చేసిన వైద్యులు రోగి ప్రాణాలను కాపాడారు. వివరాలు ఇవి..ఖమ్మం జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు (56) గత 20 రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ ఈనెల 6న అర్ధరాత్రి గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. రోగికి గుండె సంబంధిత... లక్ష్మణ్ కుమార్ ప్రశ్నలకు జాబితాతో సమాధా నం ఇచ్చిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ధర్మపురి, జనవరి 12 (ప్రజా మంటలు):
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధర్మపురిలో ఏం అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురిలో ప్రెస్మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన హయాంలో ధర్మపురి మున్సిపాలిటీ ఏర్పాటు, డబుల్ రోడ్లు, హైవే అభివృద్ధి, ఇంటర్నల్ రోడ్లు, బ్రిడ్జిల... TPUS రాష్ట్ర అధ్యక్షునిగా వోడ్నాల రాజశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక
జగిత్యాల జనవరి 12 (ప్రజా మంటలు):
జిల్లా: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల్లో జగిత్యాల జిల్లా ఉపాధ్యాయుడు వోడ్నాల రాజశేఖర్ రాష్ట్ర అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా వోడ్నాల రాజశేఖర్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యలు, విద్యారంగానికి సంబంధించిన వివిధ అంశాలపై అంకితభావంతో పనిచేస్తూ సంఘాన్ని మరింత బలోపేతం... మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులుగా బీర్పూర్ తిరుపతి
గొల్లపల్లి జనవరి 12 (ప్రజా మంటలు):
బుగ్గారం మండల సర్పంచ్ ల ఫోరం ఎన్నికలు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్ సమక్షంలో సోమవారం ఏకగ్రీవంగా జరిగాయి.మండలంలోనీ సర్పంచులు సమావేశమై మండల ఫోరం అధ్యక్షులుగా సర్పంచ్ బీర్ పూర్ తిరుపతి... ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి
ఇబ్రహీంపట్నం జనవరి 12(ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలోని బస్టాండ్ వద్ద గల స్వామి వివేకానంద విగ్రహానికి హిందూ సేన ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవవాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సర్పంచ్ ఫోనుకంటి చిన్న వెంకట్ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా
ఈ... ఫుడ్ ఫెస్టివల్ లో పాల్గొని విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల జనవరి 12 (ప్రజా మంటలు)జగిత్యాల పట్టణ నలంద డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థినులు తయారు చేసిన తినుబండారాలు, స్వీట్ల ను పరిశీలించి విద్యార్థులను అభినందించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు గిరి నాగభూషణం,
అడువాల జ్యోతి... జగిత్యాలలో C.C రోడ్ పనుల పరిశీలన: అక్రమ కట్టడాలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆగ్రహం
జగిత్యాల జనవరి 12 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎల్ ఎల్ గార్డెన్ సమీపంలో నిధులు మంజూరైన సి.సి రోడ్ నిర్మాణ పనులను మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి గారు పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు పనుల నాణ్యత, వెడల్పు అంశాలపై ఆయన ఆరా తీశారు.
మున్సిపల్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడిన... జగిత్యాలలో వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ప్రారంభం
జగిత్యాల జనవరి 12 (ప్రజా మంటలు):
జిల్లాలో ఒంటరిగా ఉన్న సీనియర్ సిటీజేన్స్(వృద్ధుల)కోసం బైపాస్ రోడ్డులో వయో వృద్ధుల సంక్షేమ శాఖ తరపున డే కేర్ సెంటర్ ను సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్చువల్ గా ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా సంక్షేమాధికారి బి.నరేశ్ మాట్లాడుతూ వృద్దులు సామాజికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఈ డే కేర్... అలిశెట్టి అక్షరాలు… సమాజ హితాన్ని కోరాయి
జగిత్యాల, జనవరి 12 (ప్రజా మంటలు):
అలిశెట్టి ప్రభాకర్ రచనలు కణికల వంటివని, ఆయన సాహిత్యం సమాజ హితాన్ని కోరుతూ ప్రజలను చైతన్యవంతులను చేసిందని సినీ కథా రచయిత, అలిశెట్టి జీవిత సాఫల్య పురస్కార గ్రహీత పెద్దింటి అశోక్ కుమార్ అన్నారు. యువతరానికి అలిశెట్టి సాహిత్యం నేటికీ ఆదర్శంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఆదివారం కళాశ్రీ... అలిశెట్టి ప్రభాకర్కు జగిత్యాలలో ఘన నివాళులు
జగిత్యాల జనవరి 12 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని అంగడి బజార్లో ప్రజాకవి, చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్, ఉద్యమకారుడు అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి మరియు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ప్రజల పక్షాన నిలబడి అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని సమాజ మార్పు కోసం జీవితాంతం పోరాడిన అక్షరయోధుడిగా అలిశెట్టి ప్రభాకర్... 