ధర్మపురిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ తనిఖీ
ధర్మపురిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ తనిఖీ
ధర్మపురి ఆగస్ట్ 30 (ప్రజా మంటలు)
జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నందున శుక్రవారం రోజున ధర్మపురి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ బి సత్య ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వైద్యుల హాజరు పట్టికను పరిశీలించి గైర్హాజరైన వైద్యుల వివరాలు సేకరించి వారిపై తగిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఇన్ పేషంట్ మరియు ఔట్ పేషెంట్ విభాగాలను పరిశీలించి అడ్మిట్ అయి ఉన్నటువంటి పేషెంట్లను వారికి అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ల పనితీరు బాగుందా అని వైద్య సేవలు సరిగ్గా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. తర్వాత డ్రగ్ స్ స్టోర్ రూమ్ ను తనిఖీ చేసి రిజిస్టర్ ప్రకారం మందులు స్టాక్ నిల్వలు ఉన్నాయా లేవా అని సరిచూశారు. జ్వరాలు ఎక్కువగా ప్రబలుతున్న నేపథ్యంలో వైద్యులందరూ మరియు సిబ్బంది సమయపాలన పాటించాలని గైర్హాజరైనటువంటి వైద్యులపై తగిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీఓ మధు సుధన్, మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సమియుద్దిన్, డిప్యూటీ . జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్, ఆర్ ఎం ఓ డాక్టర్ రామకృష్ణ ,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కరీఫ్ వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రణాళికలు సిద్ధం చేయాలి _రైస్ మిల్లర్ల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

పెండింగ్ ఓటర్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

హర్యానా కేడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ కు నివాళులు అర్పించిన మాజీ కౌన్సిలర్ భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసిఎస్ రాజు "

పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం_ఏఐసిసి పరిశీలకుడు డాక్టర్ నరేష్ కుమార్, టిపిసిసి ఆర్గనైజర్ అబ్జర్వర్ జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి

వాల్మీకి ఆవాసంలో జిల్లాస్థాయి గోవిజ్ఞాన పరీక్షలు

పెన్షనర్ల బకాయిలు చెల్లింపునకు రాజీలేని పోరాటం.-టీ పెన్షనర్ల రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్

అధికారుల అలసత్వం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుంది -జీవన్ రెడ్డి

సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కోట నీలిమ

గాంధీలో ప్రపంచ అనస్థీషియా దినోత్సవం

ఐసీసీ అవార్డులు గెలుచుకున్న అభిషేక్ శర్మ, స్మృతి మంధాన!

చెక్ బౌన్స్ కేసులో గంటా రామ్మోహన్ కు 6 నెలల జైలుశిక్ష
.jpeg)
బిసి బంద్ ను విజయవంతం కొరకు ముందుకు రండి...
