జగిత్యాల జర్నలిస్టుల జైత్రయాత్ర.
జో వాదా కియా వో నిభాన పడేగా - ప్రజా సంఘాల సంఘీభావమే జర్నలిస్టుల ఉద్యమానికి స్ఫూర్తి.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల 18 ఆగస్టు (ప్రజా మంటలు) :
సమాజంలో ఎవరికి సమస్య వచ్చిన జర్నలిస్టులు మాత్రమే ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిల కొనసాగే జర్నలిస్టుకు సమస్య వస్తే ఎవరు తీరుస్తారు అన్న డాలర్ల ప్రశ్నకు ప్రతిరూపమే దీక్షలు తప్ప ఏ ఒక్క ప్రజాప్రతినిధికి తమ దీక్షలు వ్యతిరేకం కాదని కేవలము కొద్దిపాటి మిగిలిన ప్రభుత్వ భూమి తమకు ఎక్కడ అందకుండా పోతుందో అన్న భావనతో దీక్షలకు దిగామని మొదట్నుండి జర్నలిస్టులు అంటున్న మాటలే .
మొదట్లో జర్నలిస్టుల సమస్యను అందరు ప్రజా ప్రతినిధులు తీవ్రంగా తీసుకోలేదు. ప్రజా సంఘాలు, అన్ని వర్గాల వారి సంఘీభావంతో జర్నలిస్టుల దీక్షలు పూర్తిస్థాయిలో న్యాయబద్ధమైనవే అనే భావన ఏర్పడి ఎట్టకేలకు సమస్య పరిష్కరించి జర్నలిస్టులను ఓ ఇంటి వారిని చేయాలన్న కలను తీర్చే దిశగా స్థానిక శాసనసభ్యులు డా సంజయ్ కుమార్, చీఫ్ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమన్వయంతో సమస్య పరిష్కార దిశగా అడుగులు వేసి ఎట్టకేలకు దీక్షలను విరమింప చేశారు.
ఉద్యమాల్లో ఎత్తు పల్లాలు ఉంటాయని దానికి ఉదాహరణ తెలంగాణ ఉద్యమమేనని తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న జర్నలిస్టులకు తెలియంది కాదు.
అందుకే ప్రజాప్రతినిధులపై పూర్తి భరోసాతో దీక్షను విరమించారు.
నేటికీ జర్నలిస్టులు జగిత్యాల రోడ్డు మీదికి వచ్చి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఉద్యమం 15 రోజులు కొనసాగింది . వారిపై కనీస కనికరం లేదా ??? ఇంకా ఎన్ని రోజులు రోడ్ల పై ఉంటే వారికి పిడికెడు భూమి అందుతుంది ???
ఇప్పటివరకు జర్నలిస్టుల సంక్షేమం వచ్చేసరికి గత బారాస పార్టీ, నేటి కాంగ్రెస్ పార్టీ ఏమి తీసిపోయేలా లేవు !!! అని పలువురు విపక్ష నేత లు, పలువురు జర్నలిస్టులు అనుకున్నప్పటికీ
ఏది ఏమైనప్పటికి జగిత్యాల ప్రాంత రాజకీయ నాయకులే జర్నలిస్టులకు అండదండ కానీ
*జమీన్ కొరకు జిద్ద్ చేస్తేనే జీతెంగా క్యా ???* అన్నట్లుగా మాత్రం ఉండరాదు వారి దోస్తీ... సానుకూల స్పందనతో లక్ష్యం నెరవేరుతుందని ఆశ జర్నలిస్టులలో గుడిసెలో గుడ్డిదీపంలా మిణుకు మిణుకు మంటుంది .
*4th ఎస్టేట్ గా ఉన్న జర్నలిస్టులకు కావాల్సింది ఎస్టేట్ లు కాదు. వాళ్ళ ఊరిలో అనుకూలమైన కొన్ని సెంట్ల స్థలం.*
కైండ్ హార్టెడ్ కమిటెడ్ రెస్పాన్స్బుల్ లీడర్ ఎవరైనా ఉన్నారా ??? అని జర్నలిస్టు సమాజం మూగ మనసుతో ప్రశ్నిస్తుంది!!! అర్థం చేసుకోండి అని వేడుకున్నారు.
దయచేసి శ్రమ యొక్క విలువను రోడ్డున నిలబెట్టకండి అని వేడుకున్న జర్నలిస్టుల మాటలు ఈసారి వృధా కాలేదు.
హితుడా, జర్నలిస్టు మిత్రుడా నేటి పరిస్థితులకు మన అలిశెట్టి ప్రభాకరన్న మాటలు :
శిల్పం చెక్కకముందు బండ
శిక్షణ పొందకముందు మొండి
ప్రతిభ వెనకాల ఎంతో ప్రయాస
సో.......
కాలానికి వదలకు భరోసా !!!! మాటలను
స్ఫూర్తిగా నింపుకుని మనము మన డిమాండ్లు నెరవేరే వరకు పోరాడుదాం.అనుకొని మొత్తం మీద 15 రోజులపాటు వివిధ రూపాల్లో తమ ఉద్యమాన్ని కొనసాగించారు.
ఈసారి మాత్రం ఉవ్వెత్తున లేచి పడిన ఉద్యమ కెరటానికి ప్రజా సంఘాలు ,వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాలు, వ్యాపార, వాణిజ్య వేత్తలు, విద్యాలయాల యాజమాన్యాలు, వ్యక్తులు ఒక్కరేమిటి ప్రతి ఒక్కరు జర్నలిస్టుల న్యాయబద్ధ మైన ఇండ్ల స్థలాల దీక్షలకు మద్దతు తెలపడం కొసమెరుపే కాదు.
కొంతవరకు జర్నలిస్టులలో నైతిక ధైర్యం పెంచడానికి, ఉద్యమస్ఫూర్తిని కొనసాగించడానికి దోహదపడిందని చెప్పక తప్పదు.
ఇది కేవలం స్థానిక ప్రజాప్రతినిధులకే పరిమితం కాక రాష్ట్రస్థాయిలో క్యాబినెట్ స్థాయి సంబంధిత మంత్రితో పాటు అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల మద్దతు రావడం పట్ల జర్నలిస్టులు తమకల నెరవేరుతుందని గట్టి నమ్మకంతో పాటు స్థానిక శాసనసభ్యులు, చీఫ్ విప్ అడ్లూరి, శాసనమండలి సభ్యులు ,ఐజేయు జర్నలిస్టుల నాయకుల తదితరుల సమక్షంలో నిమ్మరసం స్వీకరించడం ఒక గొప్ప ప్రయత్నానికి నాంది అని చెప్పక తప్పదు.
అంతేకాకుండా దశాబ్దాల కాలంగా ఉన్న జర్నలిస్టుల కల నెరవేరుతుందని నమ్మకం సైతం కల్పించగలిగింది.
ఈ మైత్రి పర్వం లో
ప్రస్తుత అధికార హస్తం పార్టీ జగిత్యాల జర్నలిస్టులపై చేయూత హస్తం గా ఉంటుందని ఆశిద్దాం మూడు దశాబ్దాల చిరకాల వాంఛ నెరవేరుతుందని ఎదురుచూపులు నిజం కానున్నాయని ఆశావహ దృక్పథంతో జర్నలిస్టులు చూడాల్సిందే...
జో వాదా కియా వో నిభానా పడేగా !!!
More News...
<%- node_title %>
<%- node_title %>
#Draft: Add Your Titleకరీంనగర్ డీసీసీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు
కరీంనగర్, జనవరి 26 (ప్రజా మంటలు):
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, బాబు రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నాయకత్వంలో... జగిత్యాల బిఆర్ఎస్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం.. పార్టీలో భారీ చేరికలు
జగిత్యాల, జనవరి 26 (ప్రజా మంటలు)::
జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలదండ వేసి నివాళులు అర్పించారు.
అదే కార్యక్రమంలో బిఆర్ఎస్... వికసించిన భారతీయ నాగరిక విద్యా సమితి
జగిత్యాల జనవరి 26 ( ప్రజా మంటలు) భారతీయ నాగరిక విద్యా సమితి సంస్థ శ్రీ సరస్వతి శిశు మందిర్ ,భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా విద్యతో పాటు వివిధ రంగాల్లో విద్యార్థులను ఎప్పటికప్పుడు మారుతున్న సామాజిక అవసరాల దృష్ట్యా నూతన పోకడలకు అనుగుణంగా విద్యాసంస్థ భారతీయ నాగరిక విద్యాసంస్థ వ్యవస్థాపకులు కీర్తిశేషులు కాసు... గణతంత్ర దినోత్సవ వేడుకలలో కలెక్టర్ చేతుల మీదుగా బెస్ట్ మెడికల్ ఆఫీసర్ గా ప్రశంస పత్రం అందుకున్న డాక్టర్ ఎం. మౌనిక
మల్యాల జనవరి 26 (ప్రజా మంటలు) మల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలుగా పనిచేస్తున్న ఎం మౌనిక గణతంత్ర దినోత్సవం సందర్భంగా జగిత్యాలలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ చేతుల మీదుగా "బెస్ట్ మెడికల్ ఆఫీసర్ గా " ప్రశంస పత్రం అందుకున్నది .
ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి సుజాత,... పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాల గ్రహీతలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
హైదరాబాద్, జనవరి 25 (ప్రజా మంటలు):
2026 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎంపికైన ప్రముఖులకు ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
సేవ, శాస్త్ర–సాంకేతికం, వైద్యం, విద్య, సాహిత్యం, కళల రంగాల్లో వారు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ... 2026 పద్మ అవార్డ్స్ ప్రకటన: దక్షిణ భారతానికి ప్రత్యేక గుర్తింపు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు వచ్చిన అవార్డుల వివరాలు
న్యూఢిల్లీ, జనవరి 25 (ప్రజా మంటలు):
మొత్తం 131 పద్మ అవార్డులు – 2026
ప్రముఖ వైద్యులు నోరి దత్తాత్రేయకు పద్మభూషణ్
తెలంగాణకు 8, ఆంధ్రప్రదేశ్కు 4 పద్మశ్రీ అవార్డులు
దక్షిణ భారత రాష్ట్రాలకు ఈ ఏడాది విశేష గుర్తింపు
భారత ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ... జింఖానా గ్రౌండ్లో ప్రధానమంత్రి ఖేలో ఇండియా క్రికెట్ పోటీలు
సికింద్రాబాద్, జనవరి 25 ( ప్రజామంటలు):
ప్రధానమంత్రి ఖేలో ఇండియా పోటీల్లో భాగంగా ఆదివారం సికింద్రాబాద్ జింఖానా మైదానంలో సనత్నగర్ టైగర్స్, గోల్డెన్ టైమ్స్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్లో సనత్నగర్ టైగర్స్ జట్టు ఘన విజయం సాధించింది.మొదట బ్యాటింగ్ చేసిన గోల్డెన్ టైమ్స్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల... వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్, జనవరి 25 (ప్రజా మంటలు):
కరీంనగర్ పాత మార్కెట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథసప్తమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, సూర్యప్రభ వాహనసేవలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్... కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక Medal for Meritorious Service (MSM)" మెడల్ కు ASI ఆనందం ఎంపిక అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల జనవరి 25 ( ప్రజా మంటలు) జిల్లా పోలీస్ శాఖకు చెందిన స్పెషల్ బ్రాంచ్ ఏ ఎస్ ఐ ఆనందం కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మెడల్ ఫర్ మెడిటోరియస్ సర్వీస్ (ఎం ఎస్ ఎం) మెడల్ కు ఎంపిక కావడం గర్వకారణమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
విధి నిర్వహణలో... అర్చకుల పట్ల అమర్యాద సరికాదు – ఈవోపై చర్యలు తీసుకోవాలి
జగిత్యాల, జనవరి 25 (ప్రజా మంటలు):
హిందూ మతానికి మూల స్తంభాలుగా, భక్తునికి భగవంతునికి మధ్య వారధులుగా అర్చకులు ఉంటారని భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు అన్నారు.
జగిత్యాలలోని భారత్ సురక్ష సమితి కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో సామాజిక సమరసతా వేదిక... జింబాబ్వేలో భూస్వాధీనాల బాధిత తెల్లజాతి రైతులు: పరిహారం కోసం అమెరికా జోక్యం కోరుతున్నారా?
జింబాబ్వేలో 2000వ దశకంలో అప్పటి ప్రభుత్వం చేపట్టిన హింసాత్మక భూస్వాధీన విధానాల వల్ల వేలాది మంది తెల్లజాతి రైతులు తమ భూములు, ఉపాధి కోల్పోయారు. ఈ రైతులకు పరిహారం చెల్లిస్తామని జింబాబ్వే ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగలేదు.
ఈ నేపథ్యంలో, బాధిత రైతులు ఇప్పుడు అమెరికా ప్రభుత్వ జోక్యాన్ని కోరుతున్నారు.... ట్రంప్ ఆస్తులపై న్యూయార్క్ కోర్టు జప్తు చర్యలు
న్యూయార్క్ జనవరి 25:
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన ఆస్తులను న్యూయార్క్ కోర్టు జప్తు చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ట్రంప్ సంస్థలపై నమోదైన భారీ ఆర్థిక మోసం కేసులో కోర్టు పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. అధికారంలో ఉన్న దేశాధ్యక్షుని ఆస్తులు జప్తు చేయాలని కోర్ట్ ప్రకటించడం అమెరికా చరిత్రలోనే... 