జగిత్యాల జర్నలిస్టుల జైత్రయాత్ర.

జో వాదా కియా వో నిభాన పడేగా - ప్రజా సంఘాల సంఘీభావమే జర్నలిస్టుల ఉద్యమానికి స్ఫూర్తి.

On
జగిత్యాల జర్నలిస్టుల జైత్రయాత్ర.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల 18 ఆగస్టు (ప్రజా మంటలు) : 

సమాజంలో ఎవరికి సమస్య వచ్చిన జర్నలిస్టులు మాత్రమే ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిల కొనసాగే జర్నలిస్టుకు సమస్య వస్తే ఎవరు తీరుస్తారు అన్న డాలర్ల ప్రశ్నకు ప్రతిరూపమే దీక్షలు తప్ప ఏ ఒక్క ప్రజాప్రతినిధికి తమ దీక్షలు వ్యతిరేకం కాదని కేవలము కొద్దిపాటి మిగిలిన ప్రభుత్వ భూమి తమకు ఎక్కడ అందకుండా పోతుందో అన్న భావనతో దీక్షలకు దిగామని మొదట్నుండి జర్నలిస్టులు అంటున్న మాటలే .

మొదట్లో జర్నలిస్టుల సమస్యను అందరు ప్రజా ప్రతినిధులు తీవ్రంగా తీసుకోలేదు. ప్రజా సంఘాలు, అన్ని వర్గాల వారి సంఘీభావంతో జర్నలిస్టుల దీక్షలు పూర్తిస్థాయిలో న్యాయబద్ధమైనవే అనే భావన ఏర్పడి ఎట్టకేలకు సమస్య పరిష్కరించి జర్నలిస్టులను ఓ ఇంటి వారిని చేయాలన్న కలను తీర్చే దిశగా స్థానిక శాసనసభ్యులు డా సంజయ్ కుమార్, చీఫ్ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమన్వయంతో సమస్య పరిష్కార దిశగా అడుగులు వేసి ఎట్టకేలకు దీక్షలను విరమింప చేశారు.

ఉద్యమాల్లో ఎత్తు పల్లాలు ఉంటాయని దానికి ఉదాహరణ తెలంగాణ ఉద్యమమేనని తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న జర్నలిస్టులకు తెలియంది కాదు.

అందుకే ప్రజాప్రతినిధులపై పూర్తి భరోసాతో దీక్షను విరమించారు.

నేటికీ జర్నలిస్టులు జగిత్యాల రోడ్డు మీదికి వచ్చి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఉద్యమం 15 రోజులు కొనసాగింది . వారిపై కనీస కనికరం లేదా ??? ఇంకా ఎన్ని రోజులు రోడ్ల పై ఉంటే వారికి పిడికెడు భూమి అందుతుంది ??? 

ఇప్పటివరకు జర్నలిస్టుల సంక్షేమం వచ్చేసరికి గత బారాస పార్టీ, నేటి కాంగ్రెస్ పార్టీ ఏమి తీసిపోయేలా లేవు !!! అని పలువురు విపక్ష నేత లు, పలువురు జర్నలిస్టులు అనుకున్నప్పటికీ

ఏది ఏమైనప్పటికి జగిత్యాల ప్రాంత రాజకీయ నాయకులే జర్నలిస్టులకు అండదండ కానీ

*జమీన్ కొరకు జిద్ద్ చేస్తేనే జీతెంగా క్యా ???* అన్నట్లుగా మాత్రం ఉండరాదు వారి దోస్తీ... సానుకూల స్పందనతో లక్ష్యం నెరవేరుతుందని ఆశ జర్నలిస్టులలో గుడిసెలో గుడ్డిదీపంలా మిణుకు మిణుకు మంటుంది .

 

*4th ఎస్టేట్ గా ఉన్న జర్నలిస్టులకు కావాల్సింది ఎస్టేట్ లు కాదు. వాళ్ళ ఊరిలో అనుకూలమైన కొన్ని సెంట్ల స్థలం.*

 

కైండ్‌ హార్టెడ్‌ కమిటెడ్‌ రెస్పాన్స్‌బుల్‌ లీడర్‌ ఎవరైనా ఉన్నారా ??? అని జర్నలిస్టు సమాజం మూగ మనసుతో ప్రశ్నిస్తుంది!!! అర్థం చేసుకోండి అని వేడుకున్నారు.

దయచేసి శ్రమ యొక్క విలువను రోడ్డున నిలబెట్టకండి అని వేడుకున్న జర్నలిస్టుల మాటలు ఈసారి వృధా కాలేదు.

హితుడా, జర్నలిస్టు మిత్రుడా నేటి పరిస్థితులకు మన అలిశెట్టి ప్రభాకరన్న మాటలు :  

శిల్పం చెక్కకముందు బండ

శిక్షణ పొందకముందు మొండి

ప్రతిభ వెనకాల ఎంతో ప్రయాస

సో.......

కాలానికి వదలకు భరోసా !!!! మాటలను

స్ఫూర్తిగా నింపుకుని మనము మన డిమాండ్లు నెరవేరే వరకు పోరాడుదాం.అనుకొని మొత్తం మీద 15 రోజులపాటు వివిధ రూపాల్లో తమ ఉద్యమాన్ని కొనసాగించారు.

ఈసారి మాత్రం ఉవ్వెత్తున లేచి పడిన ఉద్యమ కెరటానికి ప్రజా సంఘాలు ,వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాలు, వ్యాపార, వాణిజ్య వేత్తలు, విద్యాలయాల యాజమాన్యాలు, వ్యక్తులు ఒక్కరేమిటి ప్రతి ఒక్కరు జర్నలిస్టుల న్యాయబద్ధ మైన ఇండ్ల స్థలాల దీక్షలకు మద్దతు తెలపడం కొసమెరుపే కాదు.

కొంతవరకు జర్నలిస్టులలో నైతిక ధైర్యం పెంచడానికి, ఉద్యమస్ఫూర్తిని కొనసాగించడానికి దోహదపడిందని చెప్పక తప్పదు.

ఇది కేవలం స్థానిక ప్రజాప్రతినిధులకే పరిమితం కాక రాష్ట్రస్థాయిలో క్యాబినెట్ స్థాయి సంబంధిత మంత్రితో పాటు అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల మద్దతు రావడం పట్ల జర్నలిస్టులు తమకల నెరవేరుతుందని గట్టి నమ్మకంతో పాటు స్థానిక శాసనసభ్యులు, చీఫ్ విప్ అడ్లూరి, శాసనమండలి సభ్యులు ,ఐజేయు జర్నలిస్టుల నాయకుల తదితరుల సమక్షంలో నిమ్మరసం స్వీకరించడం ఒక గొప్ప ప్రయత్నానికి నాంది అని చెప్పక తప్పదు. 

అంతేకాకుండా దశాబ్దాల కాలంగా ఉన్న జర్నలిస్టుల కల నెరవేరుతుందని నమ్మకం సైతం కల్పించగలిగింది.

ఈ మైత్రి పర్వం లో

ప్రస్తుత అధికార హస్తం పార్టీ జగిత్యాల జర్నలిస్టులపై చేయూత హస్తం గా ఉంటుందని ఆశిద్దాం మూడు దశాబ్దాల చిరకాల వాంఛ నెరవేరుతుందని ఎదురుచూపులు నిజం కానున్నాయని ఆశావహ దృక్పథంతో జర్నలిస్టులు చూడాల్సిందే... 

జో వాదా కియా వో నిభానా పడేగా !!!

Tags
Join WhatsApp

More News...

National  Crime 

ప్రయాగ్‌రాజ్‌లో  చెరువులో పడిన శిక్షణ విమానం

 ప్రయాగ్‌రాజ్‌లో  చెరువులో పడిన శిక్షణ విమానం ప్రయాగ్‌రాజ్ జనవరి 21(ప్రజా మంటలు): ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నగర శివారులో శిక్షణ విమానం కూలిపోయింది. నగరానికి సమీపంలోని ఓ చెరువులో విమానం పడిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విమానం శిక్షణ ప్రయాణంలో భాగంగానే ప్రమాదానికి గురైనట్లు...
Read More...

టీ20 ప్రపంచకప్‌లో ఆడేది లేదంటున్న బంగ్లాదేశ్

టీ20 ప్రపంచకప్‌లో ఆడేది లేదంటున్న బంగ్లాదేశ్ ఢిల్లీ / ఢాకా జనవరి 21(ప్రజా మంటలు): రానున్న టీ20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంకలలో ప్రారంభం కానుంది. మొత్తం 20 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో బంగ్లాదేశ్ జట్టు ‘సీ’ గ్రూప్‌లో చోటు దక్కించుకుంది. బంగ్లాదేశ్ ఆడాల్సిన లీగ్ మ్యాచ్‌లు కోల్‌కతా, ముంబైలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో, ...
Read More...
National  Crime 

అక్రమాలు బయటపెట్టిందన్న కక్షతో ఎల్ఐసీ మహిళా మేనేజర్ హత్య

అక్రమాలు బయటపెట్టిందన్న కక్షతో ఎల్ఐసీ మహిళా మేనేజర్ హత్య మదురై జనవరి 21 (ప్రజా మంటలు):మదురైలోని ఎల్ఐసీ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం వెనుక దారుణ హత్య బయటపడింది. కార్యాలయంలో అక్రమాలను గుర్తించి ప్రశ్నించినందుకు సీనియర్ మహిళా మేనేజర్ కల్యాణి నంబి (55)పై పెట్రోల్ పోసి తగలబెట్టి హత్య చేసిన సహాయ పరిపాలన అధికారి రామ్ (45)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును ప్రమాదంగా...
Read More...

ఎడప్పాడి పేరు చెప్పేందుకు నిరాకరించిన టీటీవీ దినకరన్

ఎడప్పాడి పేరు చెప్పేందుకు నిరాకరించిన టీటీవీ దినకరన్ చెన్నై జనవరి 21 (ప్రజా మంటలు): అన్నాడీఎంకే–బీజేపీ కూటమిలో చేరినప్పటికీ, అన్నాడీఎంకే నేత ఎడప్పాడి కె. పళనిస్వామి పేరును చెప్పేందుకు కూడా ఏఎంఎంకే నేత టిటివి దినకరన్ నిరాకరించడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్‌డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు స్పందించిన దినకరన్, “ఎన్‌డీఏ సీఎం అభ్యర్థి ఎవరో అందరికీ తెలుసు” అని...
Read More...
Local News  State News 

అంబేద్కర్ ఎస్సీ స్టడీ సర్కిల్‌కు శాశ్వత భవనం మంజూరు చేయాలి

అంబేద్కర్ ఎస్సీ స్టడీ సర్కిల్‌కు శాశ్వత భవనం మంజూరు చేయాలి ధర్మపురి, జనవరి 21 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాలోని అంబేద్కర్ ఎస్సీ స్టడీ సర్కిల్‌కు శాశ్వత భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కోరారు. ఈ మేరకు ఆయన డిప్యూటీ సీఎంకు లేఖ రాసి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్...
Read More...
Local News  State News 

ధర్మపురిలో అభివృద్ధి పనుల శంకుస్థాపన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం

ధర్మపురిలో అభివృద్ధి పనుల శంకుస్థాపన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం ధర్మపురి, జనవరి 21 (ప్రజా మంటలు): ధర్మపురి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం లభించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వచ్చిన డిప్యూటీ సీఎంకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల MLA సంజయ్...
Read More...
State News 

ఫోన్ ట్యాపింగ్ విచారణ డైవర్షన్ డ్రామా

ఫోన్ ట్యాపింగ్ విచారణ డైవర్షన్ డ్రామా మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రశ్నలు దాచేందుకే నాటకం: కవిత హైదరాబాద్, జనవరి 21 (ప్రజా మంటలు): తెలంగాణ ఉద్యమకారులు, మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
Read More...
Local News 

వడ్డెర సంఘం మండల అధ్యక్షుడిగా బొమ్మిశెట్టి రమేష్

వడ్డెర సంఘం మండల అధ్యక్షుడిగా బొమ్మిశెట్టి రమేష్ వడ్డెర సంఘం సంక్షేమం కోసం నిరంతరంగా కృషి చేస్తా.
Read More...
Local News  State News 

మంత్రి దామోదర రాజనర్సింహ కు జోగిపేట లో చుక్కెదురు.

మంత్రి దామోదర రాజనర్సింహ కు జోగిపేట లో చుక్కెదురు. (సిరిసిల్ల రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జోగిపేట 21 జనవరి (ప్రజా మంటలు) :  మంత్రి దామోదర రాజనర్సింహ ఇచ్చిన ఇందిరమ్మ చీర తీసుకోవడానికి నిరాకరించిన మహిళలు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అంటూ నిలదీసిన మహిళలు సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఒక కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేసిన మంత్రి దామోదర రాజనర్సింహ...
Read More...
National  State News 

చరిత్రలో ఈరోజు జనవరి 21.

చరిత్రలో ఈరోజు జనవరి 21. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  చరిత్రలో ఈరోజు జనవరి 21  సంఘటనలు :  1972: త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. జననాలు : 1910: బి.ఎన్.బి.రావు, భారతీయ వైద్యుడు, పరిశోధకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1995) 1915: పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి, నెల్లూరు నగరంలో నడుస్తున్న రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల వ్యవస్థాపకుడు 1939: సత్యమూర్తి, వ్యంగ్య...
Read More...

సిట్ విచారణ నేపథ్యంలో మాజీమంత్రి హరీష్ రావుకు సంఘీభావం, కేటీఆర్ ను కలిసిన మాజీ మంత్రి కొప్పుల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల, మాజీ జెడ్పి చైర్ పర్సన్

సిట్ విచారణ నేపథ్యంలో మాజీమంత్రి హరీష్ రావుకు సంఘీభావం, కేటీఆర్ ను కలిసిన మాజీ మంత్రి కొప్పుల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల, మాజీ జెడ్పి చైర్ పర్సన్ హైదరాబాద్ జనవరి 20 (ప్రజా మంటలు)సిట్ విచారణ అనంతరం తెలంగాణ భవన్ కు చేరుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కి సంఘీభావం తెలిపి అనంతరం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్  జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్...
Read More...

450 పడకల ఆసుపత్రికి భూమి పూజ పాల్గొన్న ఎస్సీ ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్

450 పడకల ఆసుపత్రికి భూమి పూజ పాల్గొన్న ఎస్సీ ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్    జగిత్యాల జనవరి 20 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో 235 కోట్ల తో  నిర్మించనున్న 450 పడకల ఆసుపత్రి కి భూమిపూజ చేసి,23.5 కోట్ల తో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ ,3 కోట్ల తో  నిర్మించిన సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ,1.5 కోట్ల తో టి ఆర్ నగర్ లో...
Read More...