జగిత్యాల జర్నలిస్టుల జైత్రయాత్ర.

జో వాదా కియా వో నిభాన పడేగా - ప్రజా సంఘాల సంఘీభావమే జర్నలిస్టుల ఉద్యమానికి స్ఫూర్తి.

On
జగిత్యాల జర్నలిస్టుల జైత్రయాత్ర.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల 18 ఆగస్టు (ప్రజా మంటలు) : 

సమాజంలో ఎవరికి సమస్య వచ్చిన జర్నలిస్టులు మాత్రమే ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిల కొనసాగే జర్నలిస్టుకు సమస్య వస్తే ఎవరు తీరుస్తారు అన్న డాలర్ల ప్రశ్నకు ప్రతిరూపమే దీక్షలు తప్ప ఏ ఒక్క ప్రజాప్రతినిధికి తమ దీక్షలు వ్యతిరేకం కాదని కేవలము కొద్దిపాటి మిగిలిన ప్రభుత్వ భూమి తమకు ఎక్కడ అందకుండా పోతుందో అన్న భావనతో దీక్షలకు దిగామని మొదట్నుండి జర్నలిస్టులు అంటున్న మాటలే .

మొదట్లో జర్నలిస్టుల సమస్యను అందరు ప్రజా ప్రతినిధులు తీవ్రంగా తీసుకోలేదు. ప్రజా సంఘాలు, అన్ని వర్గాల వారి సంఘీభావంతో జర్నలిస్టుల దీక్షలు పూర్తిస్థాయిలో న్యాయబద్ధమైనవే అనే భావన ఏర్పడి ఎట్టకేలకు సమస్య పరిష్కరించి జర్నలిస్టులను ఓ ఇంటి వారిని చేయాలన్న కలను తీర్చే దిశగా స్థానిక శాసనసభ్యులు డా సంజయ్ కుమార్, చీఫ్ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమన్వయంతో సమస్య పరిష్కార దిశగా అడుగులు వేసి ఎట్టకేలకు దీక్షలను విరమింప చేశారు.

ఉద్యమాల్లో ఎత్తు పల్లాలు ఉంటాయని దానికి ఉదాహరణ తెలంగాణ ఉద్యమమేనని తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న జర్నలిస్టులకు తెలియంది కాదు.

అందుకే ప్రజాప్రతినిధులపై పూర్తి భరోసాతో దీక్షను విరమించారు.

నేటికీ జర్నలిస్టులు జగిత్యాల రోడ్డు మీదికి వచ్చి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఉద్యమం 15 రోజులు కొనసాగింది . వారిపై కనీస కనికరం లేదా ??? ఇంకా ఎన్ని రోజులు రోడ్ల పై ఉంటే వారికి పిడికెడు భూమి అందుతుంది ??? 

ఇప్పటివరకు జర్నలిస్టుల సంక్షేమం వచ్చేసరికి గత బారాస పార్టీ, నేటి కాంగ్రెస్ పార్టీ ఏమి తీసిపోయేలా లేవు !!! అని పలువురు విపక్ష నేత లు, పలువురు జర్నలిస్టులు అనుకున్నప్పటికీ

ఏది ఏమైనప్పటికి జగిత్యాల ప్రాంత రాజకీయ నాయకులే జర్నలిస్టులకు అండదండ కానీ

*జమీన్ కొరకు జిద్ద్ చేస్తేనే జీతెంగా క్యా ???* అన్నట్లుగా మాత్రం ఉండరాదు వారి దోస్తీ... సానుకూల స్పందనతో లక్ష్యం నెరవేరుతుందని ఆశ జర్నలిస్టులలో గుడిసెలో గుడ్డిదీపంలా మిణుకు మిణుకు మంటుంది .

 

*4th ఎస్టేట్ గా ఉన్న జర్నలిస్టులకు కావాల్సింది ఎస్టేట్ లు కాదు. వాళ్ళ ఊరిలో అనుకూలమైన కొన్ని సెంట్ల స్థలం.*

 

కైండ్‌ హార్టెడ్‌ కమిటెడ్‌ రెస్పాన్స్‌బుల్‌ లీడర్‌ ఎవరైనా ఉన్నారా ??? అని జర్నలిస్టు సమాజం మూగ మనసుతో ప్రశ్నిస్తుంది!!! అర్థం చేసుకోండి అని వేడుకున్నారు.

దయచేసి శ్రమ యొక్క విలువను రోడ్డున నిలబెట్టకండి అని వేడుకున్న జర్నలిస్టుల మాటలు ఈసారి వృధా కాలేదు.

హితుడా, జర్నలిస్టు మిత్రుడా నేటి పరిస్థితులకు మన అలిశెట్టి ప్రభాకరన్న మాటలు :  

శిల్పం చెక్కకముందు బండ

శిక్షణ పొందకముందు మొండి

ప్రతిభ వెనకాల ఎంతో ప్రయాస

సో.......

కాలానికి వదలకు భరోసా !!!! మాటలను

స్ఫూర్తిగా నింపుకుని మనము మన డిమాండ్లు నెరవేరే వరకు పోరాడుదాం.అనుకొని మొత్తం మీద 15 రోజులపాటు వివిధ రూపాల్లో తమ ఉద్యమాన్ని కొనసాగించారు.

ఈసారి మాత్రం ఉవ్వెత్తున లేచి పడిన ఉద్యమ కెరటానికి ప్రజా సంఘాలు ,వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాలు, వ్యాపార, వాణిజ్య వేత్తలు, విద్యాలయాల యాజమాన్యాలు, వ్యక్తులు ఒక్కరేమిటి ప్రతి ఒక్కరు జర్నలిస్టుల న్యాయబద్ధ మైన ఇండ్ల స్థలాల దీక్షలకు మద్దతు తెలపడం కొసమెరుపే కాదు.

కొంతవరకు జర్నలిస్టులలో నైతిక ధైర్యం పెంచడానికి, ఉద్యమస్ఫూర్తిని కొనసాగించడానికి దోహదపడిందని చెప్పక తప్పదు.

ఇది కేవలం స్థానిక ప్రజాప్రతినిధులకే పరిమితం కాక రాష్ట్రస్థాయిలో క్యాబినెట్ స్థాయి సంబంధిత మంత్రితో పాటు అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల మద్దతు రావడం పట్ల జర్నలిస్టులు తమకల నెరవేరుతుందని గట్టి నమ్మకంతో పాటు స్థానిక శాసనసభ్యులు, చీఫ్ విప్ అడ్లూరి, శాసనమండలి సభ్యులు ,ఐజేయు జర్నలిస్టుల నాయకుల తదితరుల సమక్షంలో నిమ్మరసం స్వీకరించడం ఒక గొప్ప ప్రయత్నానికి నాంది అని చెప్పక తప్పదు. 

అంతేకాకుండా దశాబ్దాల కాలంగా ఉన్న జర్నలిస్టుల కల నెరవేరుతుందని నమ్మకం సైతం కల్పించగలిగింది.

ఈ మైత్రి పర్వం లో

ప్రస్తుత అధికార హస్తం పార్టీ జగిత్యాల జర్నలిస్టులపై చేయూత హస్తం గా ఉంటుందని ఆశిద్దాం మూడు దశాబ్దాల చిరకాల వాంఛ నెరవేరుతుందని ఎదురుచూపులు నిజం కానున్నాయని ఆశావహ దృక్పథంతో జర్నలిస్టులు చూడాల్సిందే... 

జో వాదా కియా వో నిభానా పడేగా !!!

Tags
Join WhatsApp

More News...

National  State News 

పద్మభూషణ్‌, పద్మశ్రీ పురస్కారాల గ్రహీతలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

పద్మభూషణ్‌, పద్మశ్రీ పురస్కారాల గ్రహీతలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు హైదరాబాద్, జనవరి 25 (ప్రజా మంటలు): 2026 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్‌, పద్మశ్రీ పురస్కారాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎంపికైన ప్రముఖులకు ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి   హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సేవ, శాస్త్ర–సాంకేతికం, వైద్యం, విద్య, సాహిత్యం, కళల రంగాల్లో వారు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ...
Read More...

2026 పద్మ అవార్డ్స్ ప్రకటన: దక్షిణ భారతానికి ప్రత్యేక గుర్తింపు

2026 పద్మ అవార్డ్స్ ప్రకటన: దక్షిణ భారతానికి ప్రత్యేక గుర్తింపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు వచ్చిన అవార్డుల వివరాలు న్యూఢిల్లీ, జనవరి 25 (ప్రజా మంటలు): మొత్తం 131 పద్మ అవార్డులు – 2026 ప్రముఖ వైద్యులు నోరి దత్తాత్రేయకు పద్మభూషణ్ తెలంగాణకు 8, ఆంధ్రప్రదేశ్‌కు 4 పద్మశ్రీ అవార్డులు దక్షిణ భారత రాష్ట్రాలకు ఈ ఏడాది విశేష గుర్తింపు భారత ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ...
Read More...
Local News  Sports 

జింఖానా గ్రౌండ్‌లో ప్రధానమంత్రి ఖేలో ఇండియా క్రికెట్ పోటీలు

జింఖానా గ్రౌండ్‌లో ప్రధానమంత్రి ఖేలో ఇండియా క్రికెట్ పోటీలు సికింద్రాబాద్, జనవరి 25 ( ప్రజామంటలు): ప్రధానమంత్రి ఖేలో ఇండియా పోటీల్లో భాగంగా ఆదివారం  సికింద్రాబాద్ జింఖానా మైదానంలో సనత్‌నగర్ టైగర్స్, గోల్డెన్ టైమ్స్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో సనత్‌నగర్ టైగర్స్ జట్టు ఘన విజయం సాధించింది.మొదట బ్యాటింగ్ చేసిన గోల్డెన్ టైమ్స్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల...
Read More...

వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్

వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్, జనవరి 25 (ప్రజా మంటలు): కరీంనగర్ పాత మార్కెట్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథసప్తమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, సూర్యప్రభ వాహనసేవలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్...
Read More...

కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక Medal for Meritorious Service (MSM)" మెడల్‌ కు ASI ఆనందం ఎంపిక అభినందించిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక Medal for Meritorious Service (MSM)      జగిత్యాల జనవరి 25 ( ప్రజా మంటలు)  జిల్లా పోలీస్ శాఖకు చెందిన స్పెషల్ బ్రాంచ్ ఏ ఎస్ ఐ ఆనందం  కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన  మెడల్ ఫర్ మెడిటోరియస్ సర్వీస్ (ఎం ఎస్ ఎం) మెడల్‌ కు ఎంపిక కావడం గర్వకారణమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. విధి నిర్వహణలో...
Read More...

అర్చకుల పట్ల అమర్యాద సరికాదు – ఈవోపై చర్యలు తీసుకోవాలి

అర్చకుల పట్ల అమర్యాద సరికాదు – ఈవోపై చర్యలు తీసుకోవాలి జగిత్యాల, జనవరి 25 (ప్రజా మంటలు): హిందూ మతానికి మూల స్తంభాలుగా, భక్తునికి భగవంతునికి మధ్య వారధులుగా అర్చకులు ఉంటారని భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు అన్నారు. జగిత్యాలలోని భారత్ సురక్ష సమితి కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో సామాజిక సమరసతా వేదిక...
Read More...
National  Comment  International  

జింబాబ్వేలో భూస్వాధీనాల బాధిత తెల్లజాతి రైతులు: పరిహారం కోసం అమెరికా జోక్యం కోరుతున్నారా?

జింబాబ్వేలో భూస్వాధీనాల బాధిత తెల్లజాతి రైతులు: పరిహారం కోసం అమెరికా జోక్యం కోరుతున్నారా? జింబాబ్వేలో 2000వ దశకంలో అప్పటి ప్రభుత్వం చేపట్టిన హింసాత్మక భూస్వాధీన విధానాల వల్ల వేలాది మంది తెల్లజాతి రైతులు తమ భూములు, ఉపాధి కోల్పోయారు. ఈ రైతులకు పరిహారం చెల్లిస్తామని జింబాబ్వే ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగలేదు. ఈ నేపథ్యంలో, బాధిత రైతులు ఇప్పుడు అమెరికా ప్రభుత్వ జోక్యాన్ని కోరుతున్నారు....
Read More...

ట్రంప్ ఆస్తులపై న్యూయార్క్ కోర్టు జప్తు చర్యలు

ట్రంప్ ఆస్తులపై న్యూయార్క్ కోర్టు జప్తు చర్యలు న్యూయార్క్ జనవరి 25: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ఆస్తులను న్యూయార్క్ కోర్టు జప్తు చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ట్రంప్ సంస్థలపై నమోదైన భారీ ఆర్థిక మోసం కేసులో కోర్టు పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. అధికారంలో ఉన్న దేశాధ్యక్షుని ఆస్తులు జప్తు చేయాలని కోర్ట్ ప్రకటించడం అమెరికా చరిత్రలోనే...
Read More...
National  State News 

మామల్లపురంలో విజయ్ పార్టీ కార్యకర్తల సమావేశం

మామల్లపురంలో విజయ్ పార్టీ కార్యకర్తల సమావేశం చెన్నై / మామల్లపురం జనవరి 25: తమిళనాడులోని మామల్లపురం (మహాబలిపురం)లో నిర్వహిస్తున్న తన పార్టీ కార్యకర్తల సమావేశంలో సినీ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణతో పాటు రాబోయే ఎన్నికల వ్యూహాలపై విస్తృతంగా చర్చ జరగనుంది. తాజాగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన విజయ్, పార్టీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయడంపై...
Read More...
National  State News 

జాగ్రత్త! వందేమాతరం గౌరవంలో చిన్న తప్పుకు కూడా భారీ మూల్యం చెల్లించాలి

జాగ్రత్త! వందేమాతరం గౌరవంలో చిన్న తప్పుకు కూడా భారీ మూల్యం చెల్లించాలి న్యూఢిల్లీ జనవరి 25 (ప్రజా మంటలు): భారతదేశంలో త్వరలోనే **జాతీయ గీతం ‘వందేమాతరం’**కు సంబంధించిన నియమాలు మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు జన గణ మన (జాతీయ గీతం) సమయంలో మాత్రమే కఠిన ప్రోటోకాల్‌, చట్టపరమైన బాధ్యతలు ఉండేవి. అయితే ఇకపై కేంద్ర ప్రభుత్వం వందేమాతరానికి కూడా అదే స్థాయి గౌరవం, చట్టబద్ధత కల్పించేందుకు సిద్ధమవుతున్నట్లు...
Read More...
Crime  State News 

నిజామాబాద్‌లో గంజాయి ముఠా దాడి: మహిళా కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి విషమం

నిజామాబాద్‌లో గంజాయి ముఠా దాడి: మహిళా కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి విషమం నిజామాబాద్, జనవరి 25 (ప్రజా మంటలు): నిజామాబాద్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో మహిళా కానిస్టేబుల్ సౌమ్యపై గంజాయి ముఠా దారుణంగా దాడి చేసింది. కారులో గంజాయి తరలిస్తున్న ముఠాను ఆపేందుకు ప్రయత్నించిన సమయంలో నిందితులు సౌమ్యను ఢీకొట్టి, ఆమె కడుపు మీద నుంచి కారు నడిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో...
Read More...

పాశ్చాత్య ప్రభావంతో  లివ్-ఇన్ సంబంధాలు : విఫలం తర్వాత కేసులు

పాశ్చాత్య ప్రభావంతో  లివ్-ఇన్ సంబంధాలు : విఫలం తర్వాత కేసులు అలహాబాద్, జనవరి 24 ప్రత్యేక ప్రతినిధి):పాశ్చాత్య ఆలోచనల ప్రభావంతో యువత వివాహం లేకుండా లివ్-ఇన్ సంబంధాల్లోకి వెళ్తోందని, అలాంటి సంబంధాలు విఫలమైన తర్వాత అత్యాచారం వంటి కేసులు నమోదు అవుతున్నాయని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 'లైవ్ లా' లో ప్రచురించిన కథనం ప్రకారం, మహిళలకు అనుకూలంగా ఉన్న చట్టాల ఆధారంగా...
Read More...