జగిత్యాల జర్నలిస్టుల జైత్రయాత్ర.
జో వాదా కియా వో నిభాన పడేగా - ప్రజా సంఘాల సంఘీభావమే జర్నలిస్టుల ఉద్యమానికి స్ఫూర్తి.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల 18 ఆగస్టు (ప్రజా మంటలు) :
సమాజంలో ఎవరికి సమస్య వచ్చిన జర్నలిస్టులు మాత్రమే ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిల కొనసాగే జర్నలిస్టుకు సమస్య వస్తే ఎవరు తీరుస్తారు అన్న డాలర్ల ప్రశ్నకు ప్రతిరూపమే దీక్షలు తప్ప ఏ ఒక్క ప్రజాప్రతినిధికి తమ దీక్షలు వ్యతిరేకం కాదని కేవలము కొద్దిపాటి మిగిలిన ప్రభుత్వ భూమి తమకు ఎక్కడ అందకుండా పోతుందో అన్న భావనతో దీక్షలకు దిగామని మొదట్నుండి జర్నలిస్టులు అంటున్న మాటలే .
మొదట్లో జర్నలిస్టుల సమస్యను అందరు ప్రజా ప్రతినిధులు తీవ్రంగా తీసుకోలేదు. ప్రజా సంఘాలు, అన్ని వర్గాల వారి సంఘీభావంతో జర్నలిస్టుల దీక్షలు పూర్తిస్థాయిలో న్యాయబద్ధమైనవే అనే భావన ఏర్పడి ఎట్టకేలకు సమస్య పరిష్కరించి జర్నలిస్టులను ఓ ఇంటి వారిని చేయాలన్న కలను తీర్చే దిశగా స్థానిక శాసనసభ్యులు డా సంజయ్ కుమార్, చీఫ్ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమన్వయంతో సమస్య పరిష్కార దిశగా అడుగులు వేసి ఎట్టకేలకు దీక్షలను విరమింప చేశారు.
ఉద్యమాల్లో ఎత్తు పల్లాలు ఉంటాయని దానికి ఉదాహరణ తెలంగాణ ఉద్యమమేనని తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న జర్నలిస్టులకు తెలియంది కాదు.
అందుకే ప్రజాప్రతినిధులపై పూర్తి భరోసాతో దీక్షను విరమించారు.
నేటికీ జర్నలిస్టులు జగిత్యాల రోడ్డు మీదికి వచ్చి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఉద్యమం 15 రోజులు కొనసాగింది . వారిపై కనీస కనికరం లేదా ??? ఇంకా ఎన్ని రోజులు రోడ్ల పై ఉంటే వారికి పిడికెడు భూమి అందుతుంది ???
ఇప్పటివరకు జర్నలిస్టుల సంక్షేమం వచ్చేసరికి గత బారాస పార్టీ, నేటి కాంగ్రెస్ పార్టీ ఏమి తీసిపోయేలా లేవు !!! అని పలువురు విపక్ష నేత లు, పలువురు జర్నలిస్టులు అనుకున్నప్పటికీ
ఏది ఏమైనప్పటికి జగిత్యాల ప్రాంత రాజకీయ నాయకులే జర్నలిస్టులకు అండదండ కానీ
*జమీన్ కొరకు జిద్ద్ చేస్తేనే జీతెంగా క్యా ???* అన్నట్లుగా మాత్రం ఉండరాదు వారి దోస్తీ... సానుకూల స్పందనతో లక్ష్యం నెరవేరుతుందని ఆశ జర్నలిస్టులలో గుడిసెలో గుడ్డిదీపంలా మిణుకు మిణుకు మంటుంది .
*4th ఎస్టేట్ గా ఉన్న జర్నలిస్టులకు కావాల్సింది ఎస్టేట్ లు కాదు. వాళ్ళ ఊరిలో అనుకూలమైన కొన్ని సెంట్ల స్థలం.*
కైండ్ హార్టెడ్ కమిటెడ్ రెస్పాన్స్బుల్ లీడర్ ఎవరైనా ఉన్నారా ??? అని జర్నలిస్టు సమాజం మూగ మనసుతో ప్రశ్నిస్తుంది!!! అర్థం చేసుకోండి అని వేడుకున్నారు.
దయచేసి శ్రమ యొక్క విలువను రోడ్డున నిలబెట్టకండి అని వేడుకున్న జర్నలిస్టుల మాటలు ఈసారి వృధా కాలేదు.
హితుడా, జర్నలిస్టు మిత్రుడా నేటి పరిస్థితులకు మన అలిశెట్టి ప్రభాకరన్న మాటలు :
శిల్పం చెక్కకముందు బండ
శిక్షణ పొందకముందు మొండి
ప్రతిభ వెనకాల ఎంతో ప్రయాస
సో.......
కాలానికి వదలకు భరోసా !!!! మాటలను
స్ఫూర్తిగా నింపుకుని మనము మన డిమాండ్లు నెరవేరే వరకు పోరాడుదాం.అనుకొని మొత్తం మీద 15 రోజులపాటు వివిధ రూపాల్లో తమ ఉద్యమాన్ని కొనసాగించారు.
ఈసారి మాత్రం ఉవ్వెత్తున లేచి పడిన ఉద్యమ కెరటానికి ప్రజా సంఘాలు ,వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాలు, వ్యాపార, వాణిజ్య వేత్తలు, విద్యాలయాల యాజమాన్యాలు, వ్యక్తులు ఒక్కరేమిటి ప్రతి ఒక్కరు జర్నలిస్టుల న్యాయబద్ధ మైన ఇండ్ల స్థలాల దీక్షలకు మద్దతు తెలపడం కొసమెరుపే కాదు.
కొంతవరకు జర్నలిస్టులలో నైతిక ధైర్యం పెంచడానికి, ఉద్యమస్ఫూర్తిని కొనసాగించడానికి దోహదపడిందని చెప్పక తప్పదు.
ఇది కేవలం స్థానిక ప్రజాప్రతినిధులకే పరిమితం కాక రాష్ట్రస్థాయిలో క్యాబినెట్ స్థాయి సంబంధిత మంత్రితో పాటు అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల మద్దతు రావడం పట్ల జర్నలిస్టులు తమకల నెరవేరుతుందని గట్టి నమ్మకంతో పాటు స్థానిక శాసనసభ్యులు, చీఫ్ విప్ అడ్లూరి, శాసనమండలి సభ్యులు ,ఐజేయు జర్నలిస్టుల నాయకుల తదితరుల సమక్షంలో నిమ్మరసం స్వీకరించడం ఒక గొప్ప ప్రయత్నానికి నాంది అని చెప్పక తప్పదు.
అంతేకాకుండా దశాబ్దాల కాలంగా ఉన్న జర్నలిస్టుల కల నెరవేరుతుందని నమ్మకం సైతం కల్పించగలిగింది.
ఈ మైత్రి పర్వం లో
ప్రస్తుత అధికార హస్తం పార్టీ జగిత్యాల జర్నలిస్టులపై చేయూత హస్తం గా ఉంటుందని ఆశిద్దాం మూడు దశాబ్దాల చిరకాల వాంఛ నెరవేరుతుందని ఎదురుచూపులు నిజం కానున్నాయని ఆశావహ దృక్పథంతో జర్నలిస్టులు చూడాల్సిందే...
జో వాదా కియా వో నిభానా పడేగా !!!
More News...
<%- node_title %>
<%- node_title %>
మహిళల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం_ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
పెగడపల్లి నవంబర్ 25 ( ప్రజా మంటలు)మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి_ మహిళల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ అన్నారు.
పెగడపల్లి మండల కేంద్రంలో ధర్మపురి నియోజకవర్గ వడ్డీలేని ఋణాల పంపిణీ కార్యక్రమం ప్రారంభంతో పాటు, ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న... ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ చీరల పంపిణీతో గ్రామాల్లో పండుగ వాతావరణం
జగిత్యాల నవంబర్ 25 (ప్రజా మంటలు)ఇందిరమ్మ ఇళ్లు,ఇందిరమ్మ చీరల పంపిణీతో గ్రామాల్లో పండగ వాతావరణము నెలకొందని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు.
▪️ జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జగిత్యాల అర్బన్ మండలానికి చెందిన 21 మంది ఆడబిడ్డలకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు అందజేసి,9మంది ఆడబిడ్డలకు మంజూరైన 9... రోడ్డుపై పశువులు ఇలా ప్రజలు ,వాహనాలు వెళ్లడం ఎలా?
? జగిత్యాల నవంబర్ 25 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలో నానాటికి ట్రాఫిక్ పెరుగుతుంది. దీనికి కారణం రవాణా సౌకర్యాలు పెరిగి పోరుగు జిల్లాలు దగ్గర కావడంతో జగిత్యాల జిల్లా కేంద్రానికి పొరుగు జిల్లాల వాళ్ళు రావడం మరింత ట్రా "ఫికర్ " అయింది. వీటన్నిటికీ తోడు జిల్లాలో ఏ మూల చూసినా పశువులే... తెలంగాణా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 పనుల్లో వేగం — ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షణ
హైదరాబాద్ నవంబర్ 25 (ప్రజా మంటలు):
డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న టెలంగాణా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ అంతర్జాతీయ సమ్మిట్కు దేశ-విదేశాల నుండి భారీగా ప్రతినిధులు హాజరుకానుండగా, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా అన్ని... వరంగల్లో ‘నిత్య పెళ్లికూతురు’ ఘరానా మోసం — బంగారం, నగదుతో పరారైన మహిళ
వరంగల్ నవంబర్ 25 (ప్రజా మంటలు):
మ్యారేజ్ బ్యూరో ద్వారా పెళ్లి పేరుతో యువకులను మోసం చేసే నిత్య పెళ్లికూతురు ఘరానా మరోసారి బయటపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నిమిషకవి ఇందిర (30) ఇదే తరహా మోసాలతో పలువురిని మభ్యపెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
వివరాల్లోకి వెళితే…
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామానికి... మధిరలో ఏసీబీ వలలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్
మధిర నవంబర్ 24 (ప్రజా మంటలు):
మధిరలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్గా పని చేస్తున్న కె. చందర్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశారు. లంచం స్వీకరిస్తున్న సమయంలో డీఎస్పీ వై. రమేష్ నేతృత్వంలోని ఏసీబీ బృందం చందర్ను పట్టుకున్నట్టు తెలుస్తోంది.
➤ భవన కార్మికుడు మృతి – ఇన్సూరెన్స్ మొత్తం బిల్లు కోసం... ప్రజావాణి సమస్యలపై సమగ్ర విచారణ జరిపి త్వరగా పరిశీలించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
జగిత్యాల నవంబర్ 24 (ప్రజా మంటలు)పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అదేశించారు.
సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు... బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల కు రాజకీయ అధికారం దగ్గర చేయడమే మా లక్ష్యం రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్.
జగిత్యాల నవంబర్ 24(ప్రజా మంటలు) బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు రాజకీయ అధికారం దగ్గరకు చేయడమే మా లక్ష్యం అన్నారు రాష్ట్రీయ లోకల్ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్అవినీతి రహిత సమాజం కోసం యువత రాజకీయాల్లోకి రావాలని రాష్ట్రీయ లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి... న్యూస్ రిపోర్టర్ షఫీ ని ఆసుపత్రిలో పరామర్శించిన జగిత్యాల తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత
ఐ
హైదరాబాద్ నవంబర్ 24(ప్రజా మంటలు)జగిత్యాల ఐ న్యూస్ రిపోర్టర్ షఫీ అనారోగ్యంతో బంజారాహిల్స్ లోని రెనోవ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా షఫీ ని ఆస్పత్రి లో పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన జిల్లా తొలి జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపు రెడ్డి... ఐబొమ్మ రవి కన్ఫెషన్లో సంచలన వివరాలు వెల్లడి?
హైదరాబాద్ నవంబర్ 24 (ప్రజా మంటలు):
ఐబొమ్మ బెట్టింగ్ వెబ్సైట్ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన రవి (ఐబొమ్మ రవి) అరెస్ట్ అనంతరం ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. రవిది చిన్నప్పటి నుంచే క్రిమినల్ మెంటాలిటీ అని విచారణ అధికారులు వెల్లడించారు. నేరాలకు పాల్పడేందుకు తన స్నేహితుల ఫేక్ ఐడెంటిటీ కార్డులను వినియోగించినట్లు... పల్లె పకృతి వనంలో గంజాయి తొ పట్టుబడిన యువకులు
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 24 (ప్రజా మంటలు): బుగ్గారం మండలంలోని గోపులాపూర్ పల్లె ప్రక్రుతి వనం గంజాయి తో పట్టు బడ్డ యువకులు ఏ1 సురజ్ కుమార్,సం18 ఏ2. రాహుల్ కుమార్,బీహార్ రాష్ట్రం చెందిన ఇద్దరు యువకులు గంజాయి తాగుతూ పట్టుబడిన ఇద్దరీ వద్ద 60 గ్రాముల గంజాయి స్వాధీన పరుచుకొని ఎన్డిపిఎస్ సెక్షన్... గాంధీ వైద్యులు, సిబ్బంది పోస్టల్సేవలను వినియోగించుకోవాలి
సికింద్రాబాద్, నవంబర్ 24 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్గాంధీఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పోస్టల్సేవలను వినియోగించు కోవాలని సికింద్రాబాద్డివిజన్సీనియర్సూపరింటెండెంట్, ఐపీఓఎస్అధికారిణి అనన్యప్రియ కోరారు. ఈమేరకు గాంధీ సూపరింటెండెంట్ప్రొఫెసర్వాణిని సోమవారం కలిసి పోస్టల్శాఖ అందిస్తున్న పోస్టల్ఖాతాలు, లైఫ్ఇన్సూరెన్స్, సుకన్య సమృద్ధి యోజన తదితర సేవలను వివరించారు.
ఎక్కువ వడ్డీ ఇచ్చే ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ పోస్టల్శాఖ అని పేర్కొన్నారు.... 