జగిత్యాల జర్నలిస్టుల జైత్రయాత్ర.

జో వాదా కియా వో నిభాన పడేగా - ప్రజా సంఘాల సంఘీభావమే జర్నలిస్టుల ఉద్యమానికి స్ఫూర్తి.

On
జగిత్యాల జర్నలిస్టుల జైత్రయాత్ర.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల 18 ఆగస్టు (ప్రజా మంటలు) : 

సమాజంలో ఎవరికి సమస్య వచ్చిన జర్నలిస్టులు మాత్రమే ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిల కొనసాగే జర్నలిస్టుకు సమస్య వస్తే ఎవరు తీరుస్తారు అన్న డాలర్ల ప్రశ్నకు ప్రతిరూపమే దీక్షలు తప్ప ఏ ఒక్క ప్రజాప్రతినిధికి తమ దీక్షలు వ్యతిరేకం కాదని కేవలము కొద్దిపాటి మిగిలిన ప్రభుత్వ భూమి తమకు ఎక్కడ అందకుండా పోతుందో అన్న భావనతో దీక్షలకు దిగామని మొదట్నుండి జర్నలిస్టులు అంటున్న మాటలే .

మొదట్లో జర్నలిస్టుల సమస్యను అందరు ప్రజా ప్రతినిధులు తీవ్రంగా తీసుకోలేదు. ప్రజా సంఘాలు, అన్ని వర్గాల వారి సంఘీభావంతో జర్నలిస్టుల దీక్షలు పూర్తిస్థాయిలో న్యాయబద్ధమైనవే అనే భావన ఏర్పడి ఎట్టకేలకు సమస్య పరిష్కరించి జర్నలిస్టులను ఓ ఇంటి వారిని చేయాలన్న కలను తీర్చే దిశగా స్థానిక శాసనసభ్యులు డా సంజయ్ కుమార్, చీఫ్ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమన్వయంతో సమస్య పరిష్కార దిశగా అడుగులు వేసి ఎట్టకేలకు దీక్షలను విరమింప చేశారు.

ఉద్యమాల్లో ఎత్తు పల్లాలు ఉంటాయని దానికి ఉదాహరణ తెలంగాణ ఉద్యమమేనని తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న జర్నలిస్టులకు తెలియంది కాదు.

అందుకే ప్రజాప్రతినిధులపై పూర్తి భరోసాతో దీక్షను విరమించారు.

నేటికీ జర్నలిస్టులు జగిత్యాల రోడ్డు మీదికి వచ్చి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఉద్యమం 15 రోజులు కొనసాగింది . వారిపై కనీస కనికరం లేదా ??? ఇంకా ఎన్ని రోజులు రోడ్ల పై ఉంటే వారికి పిడికెడు భూమి అందుతుంది ??? 

ఇప్పటివరకు జర్నలిస్టుల సంక్షేమం వచ్చేసరికి గత బారాస పార్టీ, నేటి కాంగ్రెస్ పార్టీ ఏమి తీసిపోయేలా లేవు !!! అని పలువురు విపక్ష నేత లు, పలువురు జర్నలిస్టులు అనుకున్నప్పటికీ

ఏది ఏమైనప్పటికి జగిత్యాల ప్రాంత రాజకీయ నాయకులే జర్నలిస్టులకు అండదండ కానీ

*జమీన్ కొరకు జిద్ద్ చేస్తేనే జీతెంగా క్యా ???* అన్నట్లుగా మాత్రం ఉండరాదు వారి దోస్తీ... సానుకూల స్పందనతో లక్ష్యం నెరవేరుతుందని ఆశ జర్నలిస్టులలో గుడిసెలో గుడ్డిదీపంలా మిణుకు మిణుకు మంటుంది .

 

*4th ఎస్టేట్ గా ఉన్న జర్నలిస్టులకు కావాల్సింది ఎస్టేట్ లు కాదు. వాళ్ళ ఊరిలో అనుకూలమైన కొన్ని సెంట్ల స్థలం.*

 

కైండ్‌ హార్టెడ్‌ కమిటెడ్‌ రెస్పాన్స్‌బుల్‌ లీడర్‌ ఎవరైనా ఉన్నారా ??? అని జర్నలిస్టు సమాజం మూగ మనసుతో ప్రశ్నిస్తుంది!!! అర్థం చేసుకోండి అని వేడుకున్నారు.

దయచేసి శ్రమ యొక్క విలువను రోడ్డున నిలబెట్టకండి అని వేడుకున్న జర్నలిస్టుల మాటలు ఈసారి వృధా కాలేదు.

హితుడా, జర్నలిస్టు మిత్రుడా నేటి పరిస్థితులకు మన అలిశెట్టి ప్రభాకరన్న మాటలు :  

శిల్పం చెక్కకముందు బండ

శిక్షణ పొందకముందు మొండి

ప్రతిభ వెనకాల ఎంతో ప్రయాస

సో.......

కాలానికి వదలకు భరోసా !!!! మాటలను

స్ఫూర్తిగా నింపుకుని మనము మన డిమాండ్లు నెరవేరే వరకు పోరాడుదాం.అనుకొని మొత్తం మీద 15 రోజులపాటు వివిధ రూపాల్లో తమ ఉద్యమాన్ని కొనసాగించారు.

ఈసారి మాత్రం ఉవ్వెత్తున లేచి పడిన ఉద్యమ కెరటానికి ప్రజా సంఘాలు ,వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాలు, వ్యాపార, వాణిజ్య వేత్తలు, విద్యాలయాల యాజమాన్యాలు, వ్యక్తులు ఒక్కరేమిటి ప్రతి ఒక్కరు జర్నలిస్టుల న్యాయబద్ధ మైన ఇండ్ల స్థలాల దీక్షలకు మద్దతు తెలపడం కొసమెరుపే కాదు.

కొంతవరకు జర్నలిస్టులలో నైతిక ధైర్యం పెంచడానికి, ఉద్యమస్ఫూర్తిని కొనసాగించడానికి దోహదపడిందని చెప్పక తప్పదు.

ఇది కేవలం స్థానిక ప్రజాప్రతినిధులకే పరిమితం కాక రాష్ట్రస్థాయిలో క్యాబినెట్ స్థాయి సంబంధిత మంత్రితో పాటు అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల మద్దతు రావడం పట్ల జర్నలిస్టులు తమకల నెరవేరుతుందని గట్టి నమ్మకంతో పాటు స్థానిక శాసనసభ్యులు, చీఫ్ విప్ అడ్లూరి, శాసనమండలి సభ్యులు ,ఐజేయు జర్నలిస్టుల నాయకుల తదితరుల సమక్షంలో నిమ్మరసం స్వీకరించడం ఒక గొప్ప ప్రయత్నానికి నాంది అని చెప్పక తప్పదు. 

అంతేకాకుండా దశాబ్దాల కాలంగా ఉన్న జర్నలిస్టుల కల నెరవేరుతుందని నమ్మకం సైతం కల్పించగలిగింది.

ఈ మైత్రి పర్వం లో

ప్రస్తుత అధికార హస్తం పార్టీ జగిత్యాల జర్నలిస్టులపై చేయూత హస్తం గా ఉంటుందని ఆశిద్దాం మూడు దశాబ్దాల చిరకాల వాంఛ నెరవేరుతుందని ఎదురుచూపులు నిజం కానున్నాయని ఆశావహ దృక్పథంతో జర్నలిస్టులు చూడాల్సిందే... 

జో వాదా కియా వో నిభానా పడేగా !!!

Tags
Join WhatsApp

More News...

State News 

హిందూ–ముస్లింలు నాకు రెండు కళ్లలాంటి వారు: సీఎం రేవంత్ రెడ్డి

హిందూ–ముస్లింలు నాకు రెండు కళ్లలాంటి వారు: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 13: హిందూ–ముస్లింల మధ్య తనకు ఎలాంటి వ్యత్యాసం లేదని, ఇరువర్గాలు తనకు రెండు కళ్లలాంటి వారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన యువత తెలంగాణ రైజింగ్ కోసం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కొమురం భీమ్...
Read More...
Local News  Crime 

బీర్ పూర్ లో ఎసిబి దాడులు - రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన గిర్ధావర్ 

బీర్ పూర్ లో ఎసిబి దాడులు - రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన గిర్ధావర్     బీర్ పూర్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, ప్రజా మంటలు, ఆగస్ట్ 13:  జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.లంచం తీసుకుంటున్న రెవెన్యూ శాఖ గిర్ధావర్ రాహుల్ ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితురాలికి సంబంధించిన 12 గుంటల భూమిని సాదాబైనామా ద్వారా...
Read More...
Local News 

కరీంనగర్ డైరీ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

 కరీంనగర్ డైరీ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు జగిత్యాల  ఆగస్టు 13 : ప్రతినిధి, ప్రజా మంటలు, జగిత్యాల పట్టణంలోనీ కరీంనగర్ డైరీ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు గురు వారం తనిఖీలు చేశారు.  600 ఐస్ క్రీములు ఏప్రిల్ మాసంలోని తేదీ తయారీ ఉండగా ఫ్రీజర్ సరిగా పనిచేయక ఐస్ క్రీములు ఫంగస్ తో పాటు మెల్ట్ కావటంతో డైరీ నిర్వాహకులను ప్రశ్నించారు....
Read More...
Local News  State News 

అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన పెన్షన్లు - మంత్రి అద్లూరి

అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన పెన్షన్లు - మంత్రి అద్లూరి జగిత్యాల, ఆగస్టు 13 (ప్రజా మంటలు): అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ నూతన పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. నూతన రేషన్ కార్డులు, నూతన పెన్షన్లపై గురువారం జగిత్యాల కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్...
Read More...
Local News 

హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో జగిత్యాలలో ఘనంగా తిరంగా ర్యాలీ

హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో జగిత్యాలలో ఘనంగా తిరంగా ర్యాలీ జగిత్యాల, ఆగస్టు 13 (ప్రజా మంటలు): భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జగిత్యాల పట్టణంలో గురువారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల పట్టణంలోని స్థానిక టౌన్‌హాల్‌ నుంచి తహసీల్‌ చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీలో నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌...
Read More...
Local News 

అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య

అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య నిజామాబాద్, ఆగస్టు 13 (ప్రజా మంటలు): అప్పుల బాధతో నిజామాబాద్‌లో ఓ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నరేష్ (38), భార్య మేఘన (34), పిల్లలు అయాన్ష్ (9), మిథున్ (7)తో కలిసి నివసిస్తున్నాడు....
Read More...
State News 

ఆర్టీసీలో ఎలక్ట్రిక్ ఆటోల ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని డిమాండ్

ఆర్టీసీలో ఎలక్ట్రిక్ ఆటోల ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని డిమాండ్    హైదరాబాద్ ఆగస్టు 12 (ప్రజా మంటలు): ఆటో కార్మికుల జీవితాలను దెబ్బతీసే నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ (టీఆర్టీయూ) అనుబంధ ఆటో కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ ఆటోలు నడపాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ బుధవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో మహాధర్నా నిర్వహించారు. ఆటో కార్మికులకు...
Read More...
State News 

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ 2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి: CM రేవంత్

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ 2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి: CM రేవంత్ హైదరాబాద్, ఆగస్టు 12 (ప్రజా మంటలు): తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌–2026 పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి యువ క్రీడాకారులు పాల్గొనే ఈ పోటీలకు అవసరమైన మౌలిక వసతులను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు....
Read More...
Science   Entertainment   Social  State News 

గొల్లపల్లిలో అలరించిన సాధనాసురుల విన్యాసాలు

గొల్లపల్లిలో అలరించిన సాధనాసురుల విన్యాసాలు ఆకట్టుకున్న ప్రాచీన జానపద ఇంద్రజాల ప్రదర్శనలు గొల్లపల్లి, ఆగస్టు 09 (ప్రజా మంటలు):గొల్లపల్లి మండల కేంద్రంలో సాధనాసురులు (సాధన శూరులు) నిర్వహించిన ప్రాచీన జానపద కళా ప్రదర్శనలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. తరతరాలుగా పద్మశాలి సమాజానికి చెందిన కళాకారులు తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన ఈ అరుదైన కళను పరిరక్షిస్తూ వస్తున్నారు. సాధనాసురుల కళాకారులు...
Read More...
Local News 

వెల్ నెస్ బై హార్ట్ ఫుల్నెస్, కన్హా ఆశ్రమం, శ్రీరామచంద్రమిషన్, ఇస్కా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకఉచితవైద్యశిభిరం

వెల్ నెస్ బై హార్ట్ ఫుల్నెస్, కన్హా ఆశ్రమం, శ్రీరామచంద్రమిషన్, ఇస్కా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకఉచితవైద్యశిభిరం    జగిత్యాల ఆగస్ట్ 9(ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని క్లబ్ ఆవరణలో ఆదివారం వెల్ నెస్ బై హార్ట్ ఫుల్నెస్, కన్హా ఆశ్రమం, శ్రీరామచంద్రమిషన్, ఇస్కా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఉచిత వైద్యశిభిరం నిర్వహించారు. వెల్ నెస్ బై హార్ట్ ఫుల్నెస్ జనరల్ మేనేజర్ భరద్వాజ్, ఇస్కా ఫౌండేషన్ నిర్వాహకులు మంచాల క్రిష్ణ, రెడ్ క్రాస్ సొసైటీ...
Read More...
Local News  Crime 

మహిళపై లైంగిక దాడి, బెదిరింపులు.. నలుగురు నిందితుల అరెస్ట్

 మహిళపై లైంగిక దాడి, బెదిరింపులు.. నలుగురు నిందితుల అరెస్ట్ జగిత్యాల ga, ఆగస్టు 08 (ప్రజా మంటలు): మహిళపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు పాల్పడిన నలుగురు నిందితులను మల్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 3న నూకపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో బాధితురాలు తనకు...
Read More...
Local News 

హర్ ఘర్ తిరంగా – తిరంగా యాత్రలో భాగంగా మాజీ సైనికుడు దూరిశెట్టి కిరణ్ కుమార్‌ను సన్మానించిన  డా. బోగ శ్రావణి

హర్ ఘర్ తిరంగా – తిరంగా యాత్రలో భాగంగా మాజీ సైనికుడు దూరిశెట్టి కిరణ్ కుమార్‌ను సన్మానించిన  డా. బోగ శ్రావణి జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు)భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం పిలుపు మేరకు నిర్వహిస్తున్న "హర్ ఘర్ తిరంగా – తిరంగా యాత్ర" కార్యక్రమంలో భాగంగా, భారత త్రివిధ దళాల్లో సేవలందించి పదవీ విరమణ పొందిన మాజీ సైనికుడు దూరిశెట్టి కిరణ్ కుమార్ ని బీజేపీ జగిత్యాల నియోజకవర్గ...
Read More...