జగిత్యాల జర్నలిస్టుల జైత్రయాత్ర.

జో వాదా కియా వో నిభాన పడేగా - ప్రజా సంఘాల సంఘీభావమే జర్నలిస్టుల ఉద్యమానికి స్ఫూర్తి.

On
జగిత్యాల జర్నలిస్టుల జైత్రయాత్ర.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల 18 ఆగస్టు (ప్రజా మంటలు) : 

సమాజంలో ఎవరికి సమస్య వచ్చిన జర్నలిస్టులు మాత్రమే ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిల కొనసాగే జర్నలిస్టుకు సమస్య వస్తే ఎవరు తీరుస్తారు అన్న డాలర్ల ప్రశ్నకు ప్రతిరూపమే దీక్షలు తప్ప ఏ ఒక్క ప్రజాప్రతినిధికి తమ దీక్షలు వ్యతిరేకం కాదని కేవలము కొద్దిపాటి మిగిలిన ప్రభుత్వ భూమి తమకు ఎక్కడ అందకుండా పోతుందో అన్న భావనతో దీక్షలకు దిగామని మొదట్నుండి జర్నలిస్టులు అంటున్న మాటలే .

మొదట్లో జర్నలిస్టుల సమస్యను అందరు ప్రజా ప్రతినిధులు తీవ్రంగా తీసుకోలేదు. ప్రజా సంఘాలు, అన్ని వర్గాల వారి సంఘీభావంతో జర్నలిస్టుల దీక్షలు పూర్తిస్థాయిలో న్యాయబద్ధమైనవే అనే భావన ఏర్పడి ఎట్టకేలకు సమస్య పరిష్కరించి జర్నలిస్టులను ఓ ఇంటి వారిని చేయాలన్న కలను తీర్చే దిశగా స్థానిక శాసనసభ్యులు డా సంజయ్ కుమార్, చీఫ్ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమన్వయంతో సమస్య పరిష్కార దిశగా అడుగులు వేసి ఎట్టకేలకు దీక్షలను విరమింప చేశారు.

ఉద్యమాల్లో ఎత్తు పల్లాలు ఉంటాయని దానికి ఉదాహరణ తెలంగాణ ఉద్యమమేనని తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న జర్నలిస్టులకు తెలియంది కాదు.

అందుకే ప్రజాప్రతినిధులపై పూర్తి భరోసాతో దీక్షను విరమించారు.

నేటికీ జర్నలిస్టులు జగిత్యాల రోడ్డు మీదికి వచ్చి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఉద్యమం 15 రోజులు కొనసాగింది . వారిపై కనీస కనికరం లేదా ??? ఇంకా ఎన్ని రోజులు రోడ్ల పై ఉంటే వారికి పిడికెడు భూమి అందుతుంది ??? 

ఇప్పటివరకు జర్నలిస్టుల సంక్షేమం వచ్చేసరికి గత బారాస పార్టీ, నేటి కాంగ్రెస్ పార్టీ ఏమి తీసిపోయేలా లేవు !!! అని పలువురు విపక్ష నేత లు, పలువురు జర్నలిస్టులు అనుకున్నప్పటికీ

ఏది ఏమైనప్పటికి జగిత్యాల ప్రాంత రాజకీయ నాయకులే జర్నలిస్టులకు అండదండ కానీ

*జమీన్ కొరకు జిద్ద్ చేస్తేనే జీతెంగా క్యా ???* అన్నట్లుగా మాత్రం ఉండరాదు వారి దోస్తీ... సానుకూల స్పందనతో లక్ష్యం నెరవేరుతుందని ఆశ జర్నలిస్టులలో గుడిసెలో గుడ్డిదీపంలా మిణుకు మిణుకు మంటుంది .

 

*4th ఎస్టేట్ గా ఉన్న జర్నలిస్టులకు కావాల్సింది ఎస్టేట్ లు కాదు. వాళ్ళ ఊరిలో అనుకూలమైన కొన్ని సెంట్ల స్థలం.*

 

కైండ్‌ హార్టెడ్‌ కమిటెడ్‌ రెస్పాన్స్‌బుల్‌ లీడర్‌ ఎవరైనా ఉన్నారా ??? అని జర్నలిస్టు సమాజం మూగ మనసుతో ప్రశ్నిస్తుంది!!! అర్థం చేసుకోండి అని వేడుకున్నారు.

దయచేసి శ్రమ యొక్క విలువను రోడ్డున నిలబెట్టకండి అని వేడుకున్న జర్నలిస్టుల మాటలు ఈసారి వృధా కాలేదు.

హితుడా, జర్నలిస్టు మిత్రుడా నేటి పరిస్థితులకు మన అలిశెట్టి ప్రభాకరన్న మాటలు :  

శిల్పం చెక్కకముందు బండ

శిక్షణ పొందకముందు మొండి

ప్రతిభ వెనకాల ఎంతో ప్రయాస

సో.......

కాలానికి వదలకు భరోసా !!!! మాటలను

స్ఫూర్తిగా నింపుకుని మనము మన డిమాండ్లు నెరవేరే వరకు పోరాడుదాం.అనుకొని మొత్తం మీద 15 రోజులపాటు వివిధ రూపాల్లో తమ ఉద్యమాన్ని కొనసాగించారు.

ఈసారి మాత్రం ఉవ్వెత్తున లేచి పడిన ఉద్యమ కెరటానికి ప్రజా సంఘాలు ,వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాలు, వ్యాపార, వాణిజ్య వేత్తలు, విద్యాలయాల యాజమాన్యాలు, వ్యక్తులు ఒక్కరేమిటి ప్రతి ఒక్కరు జర్నలిస్టుల న్యాయబద్ధ మైన ఇండ్ల స్థలాల దీక్షలకు మద్దతు తెలపడం కొసమెరుపే కాదు.

కొంతవరకు జర్నలిస్టులలో నైతిక ధైర్యం పెంచడానికి, ఉద్యమస్ఫూర్తిని కొనసాగించడానికి దోహదపడిందని చెప్పక తప్పదు.

ఇది కేవలం స్థానిక ప్రజాప్రతినిధులకే పరిమితం కాక రాష్ట్రస్థాయిలో క్యాబినెట్ స్థాయి సంబంధిత మంత్రితో పాటు అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల మద్దతు రావడం పట్ల జర్నలిస్టులు తమకల నెరవేరుతుందని గట్టి నమ్మకంతో పాటు స్థానిక శాసనసభ్యులు, చీఫ్ విప్ అడ్లూరి, శాసనమండలి సభ్యులు ,ఐజేయు జర్నలిస్టుల నాయకుల తదితరుల సమక్షంలో నిమ్మరసం స్వీకరించడం ఒక గొప్ప ప్రయత్నానికి నాంది అని చెప్పక తప్పదు. 

అంతేకాకుండా దశాబ్దాల కాలంగా ఉన్న జర్నలిస్టుల కల నెరవేరుతుందని నమ్మకం సైతం కల్పించగలిగింది.

ఈ మైత్రి పర్వం లో

ప్రస్తుత అధికార హస్తం పార్టీ జగిత్యాల జర్నలిస్టులపై చేయూత హస్తం గా ఉంటుందని ఆశిద్దాం మూడు దశాబ్దాల చిరకాల వాంఛ నెరవేరుతుందని ఎదురుచూపులు నిజం కానున్నాయని ఆశావహ దృక్పథంతో జర్నలిస్టులు చూడాల్సిందే... 

జో వాదా కియా వో నిభానా పడేగా !!!

Tags
Join WhatsApp

More News...

Local News  Crime  State News 

తండ్రి హత్యకు ప్రతీకారంగా మాజీ నక్సలైట్‌ నర్సయ్యను హతమార్చిన కొడుకు

తండ్రి హత్యకు ప్రతీకారంగా మాజీ నక్సలైట్‌ నర్సయ్యను హతమార్చిన కొడుకు సిరిసిల్ల నవంబర్ 28 (ప్రజా మంటలు): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండి లచ్చపేటకు చెందిన మాజీ నక్సలైట్ బల్లెపు సిద్దయ్య అలియాస్ నర్సయ్య (46) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గుట్ట వద్ద జరిగింది. జగిత్యాల పట్టణానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి నర్సయ్యను హతమార్చి,...
Read More...

మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి – కాంగ్రెస్ నేతల ఘన నివాళులు

మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి – కాంగ్రెస్ నేతల ఘన నివాళులు కరీంనగర్, నవంబర్ 28 (ప్రజా మంటలు): మహాత్మ జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా డిసిసి కార్యాలయం మరియు శాతవాహన యూనివర్సిటీ వద్ద జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ ఆధ్వర్యంలో ఘన కార్యక్రమాలు జరిగాయి. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్, కార్పొరేషన్ కాంగ్రెస్...
Read More...
Local News 

వృద్దుల కోసం జెరియాట్రిక్ వైద్య సేవలు -జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ బి. నరేష్.

వృద్దుల కోసం జెరియాట్రిక్ వైద్య సేవలు -జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ బి. నరేష్. జగిత్యాల నవంబర్ 28 (ప్రజా మంటలు): వయో వృద్ధులు (సీనియర్ సిటిజెన్లు ) ప్రత్యేక జెరియాట్రిక్ వైద్య సేవలు, కన్సల్టేషన్ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ బి. నరేష్ కోరారు.  శుక్రవారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వయో వృద్ధుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన జెరియాట్రిక్  ఉచిత వైద్య సేవల విభాగాన్ని  జిల్లా...
Read More...
State News 

కామారెడ్డిలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ - హైదరాబాద్ తరలింపు

కామారెడ్డిలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ - హైదరాబాద్ తరలింపు కామారెడ్డి నవంబర్ 28 (ప్రజా మంటలు): కామారెడ్డి రైలు రోకో కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం ఆమె తీవ్రంగా స్పందించారు.ఆమెను హైదరాబాద్ తరలించారు.   బీజేపీకే స్పష్టమైన హెచ్చరిక “రైల్ రోకో చేసి ఢిల్లీ వరకు మెసేజ్ పంపిస్తున్నాం.” “కచ్చితంగా బీజేపీ దిగిరావాలి… బీజేపీ ఎంపీలు...
Read More...
Local News 

స్వర్గీయ డా. మర్రి చెన్నారెడ్డి వర్ధంతి కార్యక్రమాల ఏర్పాట్లపై సమీక్ష

స్వర్గీయ డా. మర్రి చెన్నారెడ్డి వర్ధంతి కార్యక్రమాల ఏర్పాట్లపై సమీక్ష హైదరాబాద్, నవంబర్28 (ప్రజామంటలు):  రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. మర్రి చెన్నారెడ్డి  29వ వర్ధంతి కార్యక్రమాల ఏర్పాట్లపై బేగంపేట్‌లోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి, NDMA మాజీ ఉపాధ్యక్షులు, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు శ్రీ మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వం వహించారు. డిసెంబర్...
Read More...
Local News 

బాపు నగర్ సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటాం - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

బాపు నగర్ సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటాం - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ సికింద్రాబాద్, నవంబర్ 28 (ప్రజామంటలు) : సనత్ నగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ శుక్రవారం బస్తీ పర్యటన నిర్వహించారు. ప్రజా సమస్యలపై పర్యటన చేసిన కోట నీలిమ సనత్ నగర్ నియోజకవర్గంలోని అమీర్ పేట్ డివిజన్ లోని బాపు...
Read More...
Local News 

 గాంధీ ఆసుపత్రి ఆర్థోపెడిక్స్ విభాగానికి పరికరాల విరాళాలు

 గాంధీ ఆసుపత్రి ఆర్థోపెడిక్స్ విభాగానికి పరికరాల విరాళాలు గాంధీకి వచ్చే పేద రోగులకు సాయమందించండి..     సికింద్రాబాద్ నవంబర్ 28 (ప్రజామంటలు) : పేద రోగులు వచ్చే గాంధీ ఆసుపత్రిలో వారికి మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు గాను కార్పొరేట్, స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలని గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.ఇందిరా, సూపరింటెండెంట్ డా.వాణి లు పిలుపు నిచ్చారు. శుక్రవారం గాంధీ ఆసుపత్రి...
Read More...
Local News 

బాల్యవివాహాల రహిత భారత దేశం కోసం విద్యార్థులచే  ప్రతిజ్ఞ

బాల్యవివాహాల రహిత భారత దేశం కోసం విద్యార్థులచే  ప్రతిజ్ఞ మహిళా భివృద్ధి శిశు సంక్షేమ శాఖ జగిత్యాల ఆధ్వర్యంలో  (అంకం భూమయ్య)   గొల్లపల్లి నవంబర్ 28 (ప్రజా మంటలు):   గొల్లపల్లి మండలంలోని రాపల్లి గ్రామంలో జడ్పీహెచ్ఎస్ హైస్కూల్  మరియు నందిపల్లి పంచాయతీ ఆవరణలో బాల్యవివాహాల నిరోధం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు జిల్లా బాలల పరిరక్షణ విభాగం నుండి పరిరక్షణ అధికారి పడాల సురేష్, జాన్సన్...
Read More...

సూర్య ధన్వంతరి ఆలయంలో కాలభైరవాష్టమి సందర్భంగా ప్రత్యేక కుంకుమ పూజలు

సూర్య ధన్వంతరి ఆలయంలో కాలభైరవాష్టమి సందర్భంగా ప్రత్యేక కుంకుమ పూజలు .   జగిత్యాల నవంబర్ 28(ప్రజా మంటలు)  పట్టణము లోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం లో  శ్రీ ధనలక్ష్మి సేవా సమితి  అధ్వర్యంలో    శుక్రవారం కాలభైరవాష్టమి  పర్వదినం  పురస్కరించుకొని, మాతలు పాల్గొని  అమ్మవారికి ప్రత్యేక  కుంకుమార్చన,  లలితా సహస్ర నామాల స్థోత్ర పారాయణం చేసారు. పారాయణం అనంతరం మాతలు  అమ్మ వారికి ఒడి బియ్యం సమర్పించారు.కుంకుమ...
Read More...

మర్యాద పూర్వకముగా ఎమ్మెల్యే ను కలిసిన డి సి సి అధ్యక్షుడు నందయ్య

మర్యాద పూర్వకముగా ఎమ్మెల్యే ను కలిసిన డి సి సి అధ్యక్షుడు నందయ్య జగిత్యాల నవంబర్ 28 (ప్రజా మంటలు)జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చన్ని అందజేసి,శాలువా తో సత్కరించిన జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నూతనంగా నియామకం అయిన గాజెంగి నందయ్య ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందయ్య కి హార్దిక...
Read More...

ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలి ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున 50 వేల లోపు నగదు మాత్రమే అనుమతి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలి  ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున 50 వేల లోపు నగదు మాత్రమే అనుమతి   జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల నవంబర్ 28(ప్రజా మంటలు) ఎన్నికల సమయంలో అక్రమ నగదు, మద్యం, ఆయుధాలు వంటి వాటిని తనిఖీ చేసి పట్టుకోవడానికి ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించడం జరిగిందని తెలిపారు.  శుక్రవారం రోజున కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎన్నికల విధులకు సంబంధించి 3 ఎస్.ఎస్.టి, 20 ఎఫ్.ఎస్.టి టీంలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి....
Read More...
Local News 

జగిత్యాల ఐ న్యూస్ రిపోర్టర్ షఫీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రూ.50 వేల ఆర్థిక సహాయం

జగిత్యాల ఐ న్యూస్ రిపోర్టర్ షఫీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రూ.50 వేల ఆర్థిక సహాయం జగిత్యాల నవంబర్ 28 (ప్రజా మంటలు): అనారోగ్యంతో హైదరాబాద్ రెనోవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగిత్యాల ఐ న్యూస్ ఛానెల్ రిపోర్టర్ షఫీ కి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  రూ. 50,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సహాయాన్ని ఈరోజు జగిత్యాల ప్రెస్ క్లబ్ యూనియన్ ప్రతినిధులకు మంత్రి అందించారు....
Read More...