జాతీయ రహదారిలో భూములు కోల్పోతున్న రైతులు గ్రామ పంచాయతీకి వచ్చి నోటీసులు పొందండి - ప్రశ్నించిన రైతు ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ ?
జాతీయ రహదారిలో భూములు కోల్పోతున్న రైతులు గ్రామ పంచాయతీకి వచ్చి నోటీసులు పొందండి - ప్రశ్నించిన రైతు ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ ?
జగిత్యాల రూరల్ /కల్లెడ జూలై 27 (ప్రజా మంటలు)
జగిత్యాల మండలం కల్లెడ గ్రామానికి చెందిన రైతుల భూములు నేషనల్ హైవే లో కోల్పోతుండగా సదరు రైతులకు తగిన సమాచారం ఇచ్చి, వారితో సంప్రదింపులు జరపాల్సిన అధికారులునిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు కల్లెడ గ్రామ రైతులు ఆరోపిస్తున్నారు.
జాతీయ రహదారి కొరకు భూములను సేకరించడానికి గుర్తించిన భూమి యజమాని రైతుకు నేరుగా నోటీసులు ఇవ్వకుండా, నోటీసులను స్థానికంగా ఉండే వాట్సాప్ గ్రూపులో సమాచారం ఇచ్చి, గ్రామ పంచాయతీకి వచ్చి భూములు కోల్పోయే రైతులు తమ నోటీసులు పొందాలని మెసేజ్ ను పంపి అధికారులు చేతులు దులుపుకున్నారని ట్విట్టర్ (X) lo ప్రశ్నించిన రైతు తిరుపతిరెడ్డి, తన అకౌంట్ నే అధికారులు మూయించినట్లు ఆయన తెలిపారు.
కల్లేడ గ్రామానికి చెందిన రైతు సామ తిరుపతిరెడ్డి నోటీసుల విషయంపై రూరల్ తాసిల్దార్ ను ఫోన్లో సంప్రదించగా సిబ్బంది లేకపోవడంతో వాట్సాప్ లో సమాచారం ఇవ్వడం జరిగిందని తహసిల్దార్ జవాబు ఇచ్చినట్లు తిరుపతిరెడ్డి తెలిపారు.
ముఖ్యమంత్రి భూములు కోల్పోతున్న రైతులను ప్రత్యక్షంగా కలిసి, వారిని సంప్రదించి, భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, రెవెన్యూ అధికారులు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ రైతులను అవమానించే విధంగా వ్యవహరించడం సరికాదని తిరుపతి రెడ్డి అన్నారు.
గతంలో సైతం తమ గ్రామానికి సంబంధించిన సమస్యలను ట్విట్టర్ ద్వారా అప్పటి కలెక్టర్కు పలుమార్లు సమస్యలను ఏకరువు పెట్టడం జరిగిందని, దాని పర్యవసానం తన ట్విట్టర్ అకౌంట్ ని అధికారులు బ్లాక్ చేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా రెవెన్యూ సిబ్బంది గ్రామపంచాయతీ సిబ్బంది సహకారంతో భూములు కోల్పోతున్న రైతులను స్వయంగా కలిసి సంప్రదింపుల ప్రక్రియ జరిపి నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సర్పంచుల అపాయింట్మెంట్ డే వాయిదా
డిసెంబర్ 22న బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్, డిసెంబర్ 18 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు పదవి బాధ్యతలు స్వీకరించే అపాయింట్మెంట్ డే వాయిదా పడింది. ఈనెల 20న నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ డిసెంబర్ 22కు మార్చింది.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు, వార్డు సభ్యులు... గాంధీ బస్ షెల్టర్ లో ప్రైవేట్ వాహనాలు..
సికింద్రాబాద్, డిసెంబ 17 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఎంసీహెచ్ (మాతా,శిశు కేంద్రం) విభాగ భవనం సమీపంలో ఉన్న బస్ షెల్టర్ ప్రైవేట్ వాహనాలకు అడ్డగా మారింది. నిత్యం వివిద ప్రాంతాల నుంచి వందలాది మంది గర్బిణీలు, బాలింతలు, వారి సహాయకులు ఎంసీహెచ్ భవనానికి వైద్యానికి వస్తూ, పోతుంటారు. అయితే ఇక్కడి బస్ షెల్టర్... పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ కీలక తీర్పు
హైదరాబాద్, డిసెంబర్ 18 (ప్రజా మంటలు):
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి అనంతరం కాంగ్రెస్లో చేరిన ఐదుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన పార్టీ ఫిరాయింపుల అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తోసిపుచ్చారు.
పార్టీ ఫిరాయించినట్లు స్పష్టమైన ఆధారాలు లేవని పేర్కొంటూ, ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్... ఘనంగా ధనుర్మాస ఉత్సవం ప్రారంభం
జగిత్యాల డిసెంబర్ 16 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవ వేడుకలు మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
అమ్మవారికి పంచామృతాలతో అభిషేకము నిర్వహించి వివిధ పుష్పాలతో మాలలు అల్లి అలంకరించారు .సాయంత్రం మొదటి పాశురం సామూహికంగా... గ్రామపంచాయతీ ఎన్నికల్లో బి ఆర్ఎస్ మద్దతు తో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను అభినందించి సత్కరించిన జిల్లా అధ్యక్షులు మాజీ జెడ్పి చైర్పర్సన్
జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జగిత్యాల నియోజకవర్గం లోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లను సన్మానించిన జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...... మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై మండిపడ్డ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి డిసెంబర్ 16 (ప్రజా మంటలు) నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూమాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గత 10 సంవత్సరాలలో చేసిన అరాచకాలు, అవినీతి త్వరలో ప్రజల ముందుంచుతాననిఅబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ మీ ప్రభుత్వం అన్నారు.
, మీ నాయకత్వమే., సంక్షేమ శాఖ మంత్రిగా... మూడవ విడత సర్పంచ్ ఎన్నికకు 853 మంది పోలీసులతో భారీ బందోబస్తు:జిల్లా ఎస్పి అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 16( ప్రజా మంటలు)
పోలింగ్ కేంద్రాల వద్ద 200 మీటర్ల వరకు 163 బి ఎన్ ఎస్ ఎస్(144 సెక్షన్ అమలు) విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదు
జిల్లాలో జరగనున్న మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా,నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా ఎస్పీ... దళితుల భూమిని ఆక్రమించి, దారి మూసివేత
ఎల్కతుర్తి డిసెంబర్ 16 (ప్రజా మంటలు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల పరిధిలోని దండేపల్లి, దగ్గువారి పల్లె మధ్య ఉన్న డిబిఎం 20 ఎస్సారెస్పీ కాలువ ప్రభుత్వ భూమిని ఆక్రమించి సాగు చేసుకుంటూ, దళితుల పొలాలకు వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేస్తున్నారని దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సూరారం గ్రామానికి చెందిన బచ్చు శ్రీనివాస్... ఈనెల 21 న జాతీయ లోక్ ఆదాలత్ సద్వినియోగం చేసుకోండి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి
జగిత్యాల డిసెంబర్ 16 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి మాట్లాడుతూ ఈనెల 21న జాతీయ మెగా లోక్ ఆదాలత్ నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వి నియోగం చేసుకుని రాజీ కుదుర్చుకోవాలని సూచించారు.
జిల్లాలో సుమారు 18 యేళ్ళనుంచి కేసులు నమోదు అయి... యంగ్ ఇండియా స్కూల్, IIM హైదరాబాద్, కేంద్రీయ–నవోదయ విద్యాలయాలపై కీలక చర్చలు
న్యూఢిల్లీ డిసెంబర్ 16 (ప్రజా మంటలు):
తెలంగాణలో విద్యా రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు కేంద్రం మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. న్యూఢిల్లీలో జరిగిన భేటీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు... నేను జీవన్ రెడ్డికి నమ్మిన బంటును జీవన్ రెడ్డికు చెడ్డ పేరు వస్తే అర్ధగంటలో రాజీనామా చేస్తా..జగిత్యాల డిసిసి అధ్యక్షుడు ...గాజంగి నందయ్య .
జగిత్యాల డిసెంబర్ 16(ప్రజా మంటలు)నావల్ల కాంగ్రెస్ పార్టీకి, జీవన్ రెడ్డికి చెడ్డపేరు వస్తే అర్ధగంటలో రాజీనామా చేస్తా అన్నారు డిసిసి అధ్యక్షులు నందయ్య
జగిత్యాలలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో అభినందన సభ కొనసాగుతుండగా
ఎమ్మెల్యే సంజయ్తో నందయ్య సన్నిహితంగా కార్యక్రమాల్లో పాల్గొనడంపై అసంతృప్తి వ్యక్తం చేసిమంత్రి అడ్లూరి లక్ష్మణ్... 