డయల్ 100 కాల్స్ కి తక్షణమే స్పందించాలి - జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్
డయల్ 100 కాల్స్ కి తక్షణమే స్పందించాలి
వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవాలి సైబర్ మోసాల పై ప్రజలకు అవగాహన కల్పించాలి జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్
జగిత్యాల జూన్ 25 (ప్రజా మంటలు): జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మంగళవారం ఆకస్మికంగా జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నుండి రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడ ఎన్ని బిట్స్ నడుస్తున్నాయని తెలుసుకొని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24x7 గస్తీ నిర్వహించాలని సూచించారు. ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. జగిత్యాల పట్టణ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అందరి కృషి చేయాలని సిబ్బంది, అధికారులు అందరూ విధులు సక్రమంగా నిర్వహించడం ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని సూచించారు. టౌన్ పరిసరాలు ఎలాంటి సంఘటనలు జరిగినా పై అధికారులకు తక్షణమే తెలియజేయాలని సూచించారు. పట్టణ పరిధిలో ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం జరగకుండా చూసుకోవాలని సూచించారు. ప్రస్తుత రోజుల్లో మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి కావున ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ మరియు టౌన్ సిబ్బంది అందరూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై పై ఎక్కువ దృష్టి సారించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు.
డిఎస్పి రఘు చందర్ , టౌన్ ఇన్స్పెక్టర్ వేణు గోపాల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మున్సిపల్ రాజకీయాలు: చైర్మన్ పదవిపై అనివార్య సయోధ్య
చైర్మన్ పదవి : ఘర్షణా? సయోధ్యా?
నలుగురి మధ్యలో పోటీ
జగిత్యాల ఫిబ్రవరి 13 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్సిపల్ ఎన్నికలు జగిత్యాల రాజకీయాన్ని పూర్తిగా తలకిందులు చేశాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచి, కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్ ఈ ఎన్నికల్లో తన రాజకీయ బలాన్ని స్పష్టంగా చూపించారు. కాంగ్రెస్ తరఫున... మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: బీజేపీ ఆధిక్యం, హంగ్ మున్సిపాలిటీ
మెటుపల్లి ఫిబ్రవరి 13 (ప్రజా మంటలు)
మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో అధికారికంగా గెలుపొందిన అభ్యర్థుల వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం 26 వార్డులకు గానూ బీజేపీ 10 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తలా 6 స్థానాలు దక్కాయి. స్వతంత్ర అభ్యర్థులు 4 వార్డుల్లో విజయం సాధించారు. ఈ ఫలితాలతో మెట్పల్లి... జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: కాంగ్రెస్ ముందంజ,
జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించి ముందంజలో నిలిచింది. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు గణనీయమైన సంఖ్యలో విజయం సాధించారు. మొత్తం 50 వార్డులకు గాను కాంగ్రెస్ 23 (ఇందులో 6-8 మంది జీవన్ రెడ్డి వర్గం)స్థానాలు, బీజేపీ 6, బీఆర్ఎస్ 4, ఎంఐఎం 2 స్థానాలు... తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: వడ్డేపల్లిలో. తెలంగాణ జాగృతి - AIFB సంచలనం
హైదరాబాద్ ఫిబ్రవరి 13 (ప్రజా మంటలు):
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పలు జిల్లాల్లో భిన్న పార్టీల ఫలితాలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.
వడ్డేపల్లి మున్సిపాలిటీ: AIFB ఘన విజయం
వడ్డేపల్లి మున్సిపాలిటీలో, తెలంగాణ jagruthi -ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) సంచలనం సృష్టించింది. మొత్తం 10 వార్డులకు గానూ 8 వార్డుల్లో... ఇప్పటి వరకు జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
ఇప్పటి వరకు11.30, ప్రకటించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, వారీగా
వార్డు నంబర్
పార్టీ
గెలిచిన అభ్యర్థి
1
ఇండిపెండెంట్
చెట్టే గంగాధర్
4
కాంగ్రెస్
క్యాదాసు నవీన్
7
బీఆర్ఎస్
కోరుకంటి రాము
10 (TR నగర్)
కాంగ్రెస్
చాంద్ పాషా
14
కాంగ్రెస్
బాలే లత శంకర్
16
కాంగ్రెస్
దూమాల రాజ్ కుమార్... శివరాత్రి పూజకు ముక్కోట అందజేత
జగిత్యాల 12 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని నిజాంబాద్ రోడ్డు లో గల శ్రీమడేశ్వర స్వామి శివరాత్రి ఉత్సవాలకు గాను మహాశివరాత్రి సందర్భముగా పరమశివునికి అలంకరించే ఆలయానికి సంబంధించిన వెండి ముక్కోటాను పూర్వ అధ్యక్షులు బోరుగళ్ల దేవరాజు ప్రస్తుత అధ్యక్షుడు గుండారపు రవీందర్ కు ఆలయ ప్రధాన అర్చకులు సిరిసిల్ల పార్థసారధి శర్మ సమక్షంలో ఆలయంలో... శతాధిక ఆచార్యుని పరమపదం
లక్షెట్టిపేట ఫిబ్రవరి 12 ( ప్రజా మంటలు)ఉభయ వేదాంతులు పౌరాణికులు శ్రీమాన్ మందపల్లి పరాంకుశ ఆచార్య (103) గురువారం ఉదయం హైదరాబాదులో తన చిన్న కుమారుని నివాసంలో పరమపదించారు. ఆయన స్వగృహం లక్షేటిపేట లో ఆయన భౌతిక కాయాన్ని శిష్యులు బంధువుల దర్శనార్థం ఉంచారు.
ఆయన సుమారు ఎనిమిది వందల పైబడి భాగవత సప్తాహాలు... హైదరాబాద్లో జగిత్యాల యువకుని అనుమానాస్పద మృతి
జగిత్యాల, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని మార్కండేయ నగర్కు చెందిన చేట్పల్లి సంజయ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ యువకుడు హైదరాబాద్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. మియాపూర్ చెరువులో ఆయన మృతదేహం లభ్యమైంది.
సమాచారం ప్రకారం, సంజయ్ నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకుని రాత్రి హైదరాబాద్కు బయలుదేరాడు. అయితే... కుల బహిష్కరణకు గురైన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొనని గ్రామస్థులు
జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనకుంట గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కుల బహిష్కరణకు గురైన ఎదుల రాజేశం మృతి చెందగా, ఆయన అంత్యక్రియల్లో పాడె మోయడానికి గ్రామస్థులు ముందుకు రాకపోవడం కలకలం రేపింది.
గ్రామ సర్పంచ్ మరియు కుల పెద్దలు గ్రామస్తులు, దూరపు బంధువులు ఎవరూ... చీఫ్ మినిస్టర్ కప్ ఎంపిక పోటీలు ప్రారంభించిన అదనపు కలెక్టర్ బిఎస్ లత
జగిత్యాల ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకముగా తల పెట్టిన 2వ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్ 2025 సందర్భముగా జగిత్యాల జిల్లా కలెక్టర్ అదేశాల మేరకు జిల్లాలోని వివిధ క్రీడా అంశములను జిల్లా స్థాయిలో ఎంపిక పోటీలు ఉదయం 10 గం. ల జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి... ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేస్తాం –కల్వకుంట్ల కవిత
న్యాయం కోసం మరో ఉద్యమం – త్వరలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటిస్తాం: కల్వకుంట్ల కవిత
బాగ్ లింగంపల్లి, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు):
బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి... పశ్చిమ దేశాలలో స్టార్మర్ నాయకత్వ సంక్షోభం ప్రభావం
స్టార్మర్ సంక్షోభం – మార్కెట్లపై ప్రభావం
యూకే రాజకీయ పరిణామాలు ఆర్థిక మార్కెట్లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. లేబర్ పార్టీ నాయకుడు సర్ కీర్ స్టార్మర్ నాయకత్వంపై నెలకొన్న అనిశ్చితి పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించింది. ముఖ్యంగా పాలసీలు వామపక్ష వైపు మళ్లవచ్చనే భయంతో మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి.
పౌండ్ యూరోతో పోలిస్తే 0.5% పడిపోయి €1.146... 