డయల్ 100 కాల్స్ కి తక్షణమే స్పందించాలి - జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్
డయల్ 100 కాల్స్ కి తక్షణమే స్పందించాలి
వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవాలి సైబర్ మోసాల పై ప్రజలకు అవగాహన కల్పించాలి జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్
జగిత్యాల జూన్ 25 (ప్రజా మంటలు): జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మంగళవారం ఆకస్మికంగా జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నుండి రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడ ఎన్ని బిట్స్ నడుస్తున్నాయని తెలుసుకొని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24x7 గస్తీ నిర్వహించాలని సూచించారు. ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. జగిత్యాల పట్టణ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అందరి కృషి చేయాలని సిబ్బంది, అధికారులు అందరూ విధులు సక్రమంగా నిర్వహించడం ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని సూచించారు. టౌన్ పరిసరాలు ఎలాంటి సంఘటనలు జరిగినా పై అధికారులకు తక్షణమే తెలియజేయాలని సూచించారు. పట్టణ పరిధిలో ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం జరగకుండా చూసుకోవాలని సూచించారు. ప్రస్తుత రోజుల్లో మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి కావున ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ మరియు టౌన్ సిబ్బంది అందరూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై పై ఎక్కువ దృష్టి సారించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు.
డిఎస్పి రఘు చందర్ , టౌన్ ఇన్స్పెక్టర్ వేణు గోపాల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ వద్ద అక్రమ పార్కింగ్ వాహనాల తొలగింపు
సికింద్రాబాద్, డిసెంబర్ 27 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి, మెట్రో స్టేషన్, ఎంసీహెచ్ బస్ షెల్టర్ ప్రాంతాల్లో అక్రమంగా పార్కింగ్ చేసిన 12 వాహనాలకు ఫైన్ వేసి, అక్కడి నుంచి తొలగించారు. అలాగే ఏండ్ల తరబడిగా గాంధీ మెట్రో స్టేషన్, ఆసుపత్రి మెయిన్ గేట్, ఫుట్ పాత్ ప్రాంతాల్లో తిష్ట వేసుకొని ఉన్న యాచకులను
3... డబుల్ బెడ్రూం లబ్ధిదారుల సమస్యలపై జిల్లా కలెక్టర్కు హనుమండ్ల జయశ్రీ వినతి
జగిత్యాల డిసెంబర్ 27 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి మౌలిక వసతుల లేమితో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తాజా మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ, అవసరమైన మౌలిక... పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై కల్వకుంట్ల కవిత ఘాటు విమర్శలు
నాగర్ కర్నూల్, డిసెంబర్ 27 (ప్రజా మంటల):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించి పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితిని తీవ్రంగా విమర్శించారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాలను సందర్శించిన ఆమె, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
వట్టెం రిజర్వాయర్,... జీవో 252 సవరించాలని జగిత్యాల కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ధర్నా
జగిత్యాల, డిసెంబర్ 27 (ప్రజా మంటల):
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం.252లోని నిబంధనలు వేలాది మంది జర్నలిస్టుల ఉపాధికి ముప్పుగా మారాయని ఆరోపిస్తూ, శనివారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ జీవోను తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే హెచ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు... అంబారిపేట శ్రీవెంకటేశ్వర స్వామి వారి యుట్యూబ్ ఛానల్,భక్తి పాట ను ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 27 (ప్రజా మంటలు)అర్బన్ మండల అంబారిపేట శ్రీవెంకటేశ్వర స్వామి వారి మీద రూపొందించిన భక్తి పాట ను, శ్రీ వెంకటేశ్వర భక్తి యూట్యూబ్ చానల్ నుజగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ భక్తి పాట రూపొందించడానికి కృషి చేసిన పాట రచన సిరికొండ... అల్లిపూర్ నూతన సర్పంచ్, ఉపసర్పంచ్లకు శుభాకాంక్షలు తెలిపిన తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్
జగిత్యాల (రూరల్),డిసెంబర్ 27 ప్ర(జా మంటలు):జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఎంబరీ గౌతమి, ఉపసర్పంచ్ వినయ్లతో పాటు వార్డు సభ్యులుగా ఎన్నికైన మహిళలు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దావ వసంత సురేష్ వారిని శాలువాలతో సత్కరించి... అంబారిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి యూట్యూబ్ ఛానల్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 27 (ప్రజా మంటలు):
జగిత్యాల అర్బన్ మండలంలోని అంబారిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన భక్తి పాటను, అలాగే శ్రీ వెంకటేశ్వర భక్తి యూట్యూబ్ ఛానల్ను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగింది.
భక్తి పాట రూపకల్పనలో కీలకంగా పనిచేసిన... సారంగాపూర్లో మండలోజు వేణుగోపాల్ పదవీ విరమణ వేడుకలలో ఎమ్మెల్యే డా సంజయ్
సారంగాపూర్, డిసెంబర్ 27 – ప్రజా మంటలు:
సారంగాపూర్ మండలం రంగంపేట గ్రామ మండల పరిషత్ పాఠశాలలో నిర్వహించిన మండలోజు వేణుగోపాల్ పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మండలోజు వేణుగోపాల్ – శోభ దంపతులను శాలువాతో సత్కరించి, పదవీ విరమణ... ఆరుసార్లు గెలిచి! మళ్ళీ రాజీనామా చేసి, గెలుస్తా దానం ప్రకటన
హైదరాబాద్, డిసెంబర్ 27 (ప్రజా మంటలు):
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపు కేసులు, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో తాను పూర్తిగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేస్తూ, అవసరమైతే రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు.
శుక్రవారం... జగిత్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఆకుల శ్రీనివాస్ ఆకస్మిక మృతి
జగిత్యాల, డిసెంబర్ 27 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా వైద్యాధికారి (DMHO) డాక్టర్ ఆకుల శ్రీనివాస్ శనివారం ఉదయం అకస్మాత్తుగా మృతి చెందారు. ఆయన అకాల మరణం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, వైద్య వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.ప్రజారోగ్య సేవల్లో అంకితభావంతో పనిచేసిన డాక్టర్ ఆకుల శ్రీనివాస్, విధి నిర్వహణలో నిబద్ధత, మానవీయత... ఎన్.సి.సి. (NCC) ఆర్.డి (Republic Day) పరేడ్ కు ANO గా మన జగిత్యాల వాసి చేని.మంగ
సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113.
జగిత్యాల/ హైదరాబాద్ డిసెంబర్ 27 (ప్రజా మంటలు) :
జనవరి 26న ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్లో లో తెలంగాణ నుండి NCC క్యాడేట్స్ తో పాటు జగిత్యాలకు మౌంట్ కార్మెల్ స్కూల్ కు చెందిన అసోసియేట్ NCC ఆఫీసర్ పాఠశాల పి.ఈ.టి (వ్యాయామ ఉపాధ్యాయురాలు)... 