జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మార్చడం సరైన సమయంలో సరియైన నిర్ణయమేనా?

On
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మార్చడం సరైన సమయంలో సరియైన నిర్ణయమేనా?

 
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మార్చడం సరైన సమయంలో సరియైన నిర్ణయమేనా?
కాంగ్రెస్ పార్టీలో కలవరం లేపిన సంజయ్ చేరిక  
ఇది రెడ్డి - రావుల కలయికా? కలహమా?
ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరిక బిజేపి కి లాభామా ?

(సిరిసిల్ల రాజేందర్ శర్మ 9348422113)

జగిత్యాల జూన్ 24 (ప్రజా మంటలు) : జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో అనుకోని కుదుపు. నాలబై ఏళ్లుగా ఎదురులేని జీవన రెడ్డికి పోటీగా వెలమ సామాజిక వర్గం నుండి పోటీ రావడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని అనుకొంటున్నారు. జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమర్ కాంగ్రెస్ పార్టీ హవాలో సైతం గెలవడం ఆయనకు వ్యక్తిగతంగా, వైద్యునిగా ఉన్న మంచి పేరు బహుశా సంజయ్ కి కలిసి వచ్చి రెండవసారి సైతం గెలువగలిగాడు అనే వాళ్ళు లేకపోలేదు. ఇదిలా ఉండగా డా. సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల పలువురు ఆశ్చర్యం ప్రకటిస్తున్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐదు సంవత్సరాల పాటు రాజకీయ నిరుద్యోగిగా ఉండడం ఎలాంటి నియోజకవర్గ అభివృద్ధి పనులు చేసే పరిస్థితులు కష్టమవుతుందేమోనని ఆ ఉద్దేశంతోనే సంజయ్ పార్టీ మారినట్లు పలువురు నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు.ఈ ఇద్దరు నాయకులు ఒకే పార్టీలో ఉంది తగువులాడుకోవడం వల్ల బిజేపి లాభపడవచ్చని చర్చించుకొంటున్నారు.

 

కాంగ్రెస్ పార్టీలో సంజయ్ సమన్వయంతో పనిచేయగలుగుతాడా? అని పలువురు సంజయ్ పార్టీ మార్పు పట్ల చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్లోకి వెళ్లడం వ్యక్తిగతంగా ఆయనకు ప్రయోజనం జరగవచ్చుకానీ తనను నమ్ముకున్న వారికి మోసగించి కాంగ్రెస్ పార్టీలోకి చేరినారని  బారాస నాయకులు కార్యకర్తలు బాహాటంగానే విమర్శిస్తూ సోమవారం డా. సంజయ్ దిష్టిబొమ్మను తగలబెట్టి తమ ఆవేదనను, ఆగ్రహాన్ని  వ్యక్తం చేయడమే కాకుండా పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీ లోకి   మారినందుకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు కోట్ల రూపాయలు ఆయన బ్యాంకు ఖాతాలో కాంగ్రెస్ పార్టీ జమ చేసిందని ధర్నా లో పాల్గొన్న పలువురు బారాస నాయకులు విమర్శించడం కొసమెరుపు . కాగా రాజకీయ దిగ్గజమైన ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో సమన్వయము డా.  సంజయ్ కి కుదురుతుందా? మొదటి నుండి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సంజయ్ కుమార్ కు పార్టీలపరంగా మరియు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విషయాలపై కూడా దుమ్మెత్తి పోసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జీవన్ రెడ్డితో సంజయ్ కుమార్ చివరి వరకు కొనసాగుతారా? అనే సందిగ్ధాన్ని సంజయ్ అభిమానులు చర్చించుకుంటున్నారు.

 

చివరి వరకు పార్టీ మార్చే విషయాన్ని చాలా రహస్యంగా ఉంచి పార్టీ క్యాడర్ కు ఎలాంటి సంకేతాలు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ ను కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం అటు కాంగ్రెస్ పార్టీలోని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. అదేవిధంగా జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత, బారాస నాయకులు ,కార్యకర్తలు సోమవారం జిల్లా కేంద్రములోని తాసిల్ చౌరస్తా వద్ద సంజయ్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. డా .సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగులుతుందా? ఎన్నో సంవత్సరాలుగా గెలుపు ఓటములను లెక్కచేయకుండా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న జీవన్ రెడ్డి ఎమ్మెల్యే డా సంజయ్ రాకను స్వాగతిస్తారా? లేదా తాను ఎమ్మెల్సీగా కొనసాగడమా? రాజీనామా చేయడమా? అనే ఆలోచనలో పడ్డట్టు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్నారు.

 

ఏది ఏమైనప్పటికీ జగిత్యాల నియోజకవర్గం పలుమార్లు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఒకటైతే శాసనసభ్యులు వేరే పార్టీ వారు ఉండడం అభివృద్ధి నోచుకోక పోయిందని అపవాది ఉండేది. సంజయ్ కుమార్ కాంగ్రెస్ లోకి ప్రవేశించడంతో తాను గతంలో బారాస ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయలేని పెండింగ్ పనులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత చేయడానికి, నియోజకవర్గానికి కావలసిన నిధులు తేవడానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాల్సిందేనని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. నాలుగురైదుగురు ఎమ్మెల్యేలు, మంత్రి శ్రీధర్ బాబు వచ్చి సముదాయించినా, జీవన రద్దీ తన నిర్ణయాన్ని వాయిదావేసుకొన్నారే కానీ, వారి ప్రతిపాదనలకు ఒప్పుకోలేదని తెలుస్తుంది.

ఒక వేళ ఈ ఇద్దరూకాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే ఇటు కార్యకర్తలు, అటు అధికారులు ఇబ్బందులను ఎదుర్కొనక తప్పని పరిస్థితులు ఏర్పదనున్నాయి. ఇద్దరు వెనిక్కి తగ్గే స్వభామ లేకపోవడం, రాజకీయ అనుభవంతో రాష్ట్ర స్థాయిలో నెగ్గుక రాగళననే ధీమాతో ఉన్న జీవన రెడ్డి, ఎమ్మెల్యే అనే అధికార భావనతో సంజయ్ కుమార్ లు వ్యవహరించడం వల్ల జగిత్యాల అభివృద్ధి కుంటుపడుతుందో లేక మరిన్ని ఎక్కువ నిధులతో అభివృద్ధి చెందుతుందా అనేది కాలమే చెపుతుందని ప్రజలు భావిస్తున్నారు.    

 

Tags
Join WhatsApp

More News...

Local News 

ఘనంగా శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల ప్రత్యేక వేడుకలు శ్రీ నరసింహ స్వామి జయంతి ప్రత్యేక వేడుకలు

ఘనంగా శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల ప్రత్యేక వేడుకలు  శ్రీ నరసింహ స్వామి జయంతి ప్రత్యేక వేడుకలు    జగిత్యాల ఏప్రిల్ 30 (ప్రజా మంటలు)  పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో గురువారం ఉదయం 11 గంటలకు బ్రహ్మోత్సవ వేడుకల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి అనంతరం శ్రీ లక్ష్మీనరసింహ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా   నవగ్రహ పూజా  అలాగే సంతాన గోపాల హోమ పూజా కార్యక్రమంలో...
Read More...
Local News 

కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ కు ప్రతిష్టాత్మక దళిత రత్న పురస్కారం 

కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ కు ప్రతిష్టాత్మక దళిత రత్న పురస్కారం     కోరుట్ల, ఏప్రిల్ 30(ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది  బైరి విజయ్ కుమార్ దళిత రత్న పురస్కారం అందించారు. గురువారం  హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో డా. బాబు జగ్జీవన్ రామ్, డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్...
Read More...
Local News 

సినీ దర్శకుడు బండి రఘురాం కన్నుమూత

సినీ దర్శకుడు బండి రఘురాం కన్నుమూత హైదరాబాద్, ఏప్రిల్ 30 (ప్రజా మంటలు): జగిత్యాలకు చెందిన సినీ దర్శకుడు బండి రఘురాం ఏప్రిల్ 28న కన్నుమూశారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో నివాసముంటున్న ఆయన సాయంత్రం పార్క్‌లో నడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి సినీ, జర్నలిజం వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.రఘురాం జగిత్యాలకు చెందిన బండి...
Read More...
Local News 

ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ ఎస్ ఎస్ సి ర్యాంకర్లకు అభినందనలు

ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ ఎస్ ఎస్ సి ర్యాంకర్లకు అభినందనలు జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రానికి చెందిన ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ కు చెందిన సింగిడి చక్రిత 561/600, ఎంబారి చరణ్ 547/600 బుధవారం విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించినారు. 500 పైబడి 45 శాతం విద్యార్థులు ఫలితాలు సాధించారు. 100% విద్యార్థులు ఉత్తీర్ణత...
Read More...
Local News 

ఎస్ఎస్ఎస్సి లో578/600 మార్కులు సాధించిన పాలెపు హాసిని శర్మను అభినందించిన పాఠశాల యాజమాన్యం

ఎస్ఎస్ఎస్సి లో578/600 మార్కులు సాధించిన పాలెపు హాసిని శర్మను అభినందించిన పాఠశాల యాజమాన్యం జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు)  పొలాస గ్రామానికి చెందిన పాలెపు రాజు కూతురు పాలెపు హాసిని శర్మ జిల్లా కేంద్రంలోని శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాలలో చదువుచున్నది. బుధవారం విడుదలైన ఎస్ఎస్ఎస్సి ఫలితాలలో 578/600 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాల కరస్పాండెంట్ ఎం రాజేందర్ ప్రిన్సిపల్ మేఘమాల డైరెక్టర్
Read More...
Local News 

SSC ఫలితాలలో  రాష్ట్ర స్థాయిలో సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

SSC ఫలితాలలో  రాష్ట్ర స్థాయిలో సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం    జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు) పట్టణంలోని సిద్ధార్థ విద్యా సంస్థలు  మరోసారి తమ ప్రతిభను చాటుకుంటూ SSC ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో అద్భుత విజయాన్ని సాధించాయి.  ఈరోజు విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో రాష్ట్ర స్థాయి లో 591, 590  మార్కులతో  జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. అదే విధంగా...
Read More...
Local News 

పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేయాలి-రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేయాలి-రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి ఏప్రిల్ 28 (ప్రజా మంటలు) రానున్న 2027  గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై  సమీక్షపుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.2027లో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్ల నేపథ్యంలో చేపట్టాల్సిన భూసేకరణ (ల్యాండ్ అక్విజిషన్) మరియు దేవాలయ అభివృద్ధి పనులపై  టెంపుల్ మాస్టర్...
Read More...
Local News 

రాష్ట్ర ప్రభుత్వం వాసవి మాత జయంతి ప్రభుత్వ పరంగా నిర్వహించడం హర్షణీయం... - ఎమ్మెల్యే సంజయ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం వాసవి మాత జయంతి ప్రభుత్వ పరంగా నిర్వహించడం హర్షణీయం...  - ఎమ్మెల్యే సంజయ్ కుమార్    జగిత్యాల ఏప్రిల్ 26 (ప్రజా మంటలు) శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతా జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణం లో ఆర్య వైశ్య సంఘం ఆద్వర్యం లో జయంతి వేడుకల్లో పాల్గొని పోచమ్మ ఆలయం నుండి వాసవి మాత ఆలయానికి వాసవి కన్యకా పరమేశ్వరి మాతని పల్లకిలో తీసుకొచ్చే కార్యక్రమంలో పాల్గొని పల్లకి మోసి ప్రత్యేక...
Read More...
Local News 

ఘనంగా వాసవీ మాత జయంతి వేడుకలు

ఘనంగా వాసవీ మాత జయంతి వేడుకలు జగిత్యాల ఏప్రిల్ 26 ( ప్రజా మంటలు)  జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో  వాసవీ మాత జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బి. ఎస్.లత పాల్గొన్నారు.*ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్.లత మాట్లాడుతూ*  వాసవీ మాత        
Read More...
Local News 

ఈత సరదాకు వెళ్ళి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు

ఈత సరదాకు వెళ్ళి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు    బుగ్గారం ఏప్రిల్ 26 ( ప్రజా మంటలు)  సర్పంచ్ లు గ్రామాలలో టామ్ - టామ్ చేయించాలి బుగ్గారం ఎస్సై జి.సతీష్  వేసవి కాలం కదా అని ఈత సరదాతో బావుల్లోకి, చెరువుళ్ళోకి  వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని జగిత్యాల జిల్లా బుగ్గారం ఎస్సై జి.సతీష్ అన్నారు. ఆదివారం ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక...
Read More...
Local News  Crime 

పెళ్లి వేడుకలో విషాదం – సరదా ఈత ప్రాణం తీసింది… 13 ఏళ్ల బాలుడు మృతి

పెళ్లి వేడుకలో విషాదం – సరదా ఈత ప్రాణం తీసింది… 13 ఏళ్ల బాలుడు మృతి గొల్లపల్లి, ఏప్రిల్ 26 (ప్రజా మంటలు): పెళ్లి వేడుకలో పాల్గొన్న అనంతరం సరదాగా ఈతకు వెళ్లిన బాలుడు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఘటన జగిత్యాల జిల్లాలో విషాదాన్ని నింపింది.బుగ్గారం మండలం బీర్సాని గ్రామానికి చెందిన కాంపెళ్లి రితేష్ (13) గొల్లపల్లి మండలం లోతునూరు గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యాడు. మధ్యాహ్న సమయంలో స్నేహితులతో...
Read More...
Local News 

ఘనంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు

ఘనంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు . జగిత్యాల ఏప్రిల్ 26( ప్రజా మంటలు)వాల్మీకి ఆవాసం సేవాభారతి అధ్వర్యంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆదివారం ఉదయం 11 గంటలకు ఘనంగా నిర్వహించారు. జగిత్యాల పట్టణం ధరూర్ క్యాంపులో గ్రామీణ నిరుపేద విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న  వాల్మీకి ఆవాసంలో ప్రతి సంవత్సరం వేసవి సెలవుల అనంతరం సామూహిక సత్యనారాయణ స్వామి...
Read More...