ఎమ్మెల్యే సంజయ్ పార్టీ విడడం ఆత్మహత్య కన్నా హీనమైన చర్య
ఎమ్మెల్యే సంజయ్ పార్టీ విడడం ఆత్మహత్య కన్నా హీనమైన చర్య
జగిత్యాల జూన్ 24 (ప్రజా మంటలు)
జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక తహసిల్ చౌరస్తా వద్ద ధర్నా చేపట్టి దిష్టి బొమ్మను తగలబెట్టిన అనంతరం వారి ఇంటిని ముట్టడించిన కార్యక్రమంలో జగిత్యాల బిఆర్ఎస్ జిల్లా అద్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ,మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ,జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్,మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ,సీనియర్ నాయకులు ఓరుగంటి రమణారావు గారు రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ చైర్మెన్ లోక బాపు రెడ్డి పాల్గోన్నారు.
బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, ఉద్యమంలో పాల్గొనకున్న కెసిఆర్ పిలిచి మూడు సార్లు టికెట్ ఇచ్చారు.తల్లి పాలు తాగి రొమ్ము మీద గుద్ధినటువంటి సంజయ్ వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అని అన్నారు.
కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, కష్ట కాలంలో పార్టీని మోసం చేసి స్వార్థంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే డా.సంజయ్ ని జగిత్యాలలో తిరుగనివ్వమని.అలాంటి వారు బ్రతికున్న చచ్చిన శవంతో సమానమేనని అన్నారు.
జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ మాట్లాడుతూ, ల్వకుంట్ల కవితక్క చంటి పిల్లాడిలా పట్టుకుని కాలికి బట్ట కట్టకుండా తనే ఎమ్మెల్యే గా తిరిగి మూడు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి రెండు సార్లు ఎమ్మెల్యే గెలిపిస్తే నమ్మక ద్రోహానికి ఒక ప్రతిరూపం ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అని అన్నారు.
బిఆర్ఎస్ పార్టీ కుటుంబసభ్యులు కార్యకర్తలు సామాన్య ప్రజలు కూడా తమ ఓటు వృథా అయిందని స్వచ్ఛందంగా వచ్చి తీవ్రంగా ఖండించారు..
మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పై గెలిచిన నువ్వు రాజీనామా చేసి మళ్ళీ పోటీకి రావాలని అని అన్నారు..
ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ హరిచారణ్ రావు,జెడ్పీటీసీ నాగం భూమన్న,కెడిసీసీ జిల్లా మెంబర్ రాంచందర్ రావు,ఎంపీపీ సంధ్యారాణి,రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు,వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి,రాయికల్ మండల అధ్యక్షుడు కొల శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు శీలం ప్రియాంక,ఉదయ శ్రీ, నాగేశ్వర్ రావు,పట్టణ ఉపాధ్యక్షుడు వొల్లెం మల్లేశం, ఎంపీటీసీలు,సర్పంచ్లు, బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,పట్టణ మరియు మండల విభాగం నాయకులు, మహిళలు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...
More News...
<%- node_title %>
<%- node_title %>
హర్ ఘర్ తిరంగా – తిరంగా యాత్రలో భాగంగా మాజీ సైనికుడు దూరిశెట్టి కిరణ్ కుమార్ను సన్మానించిన డా. బోగ శ్రావణి
జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు)భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం పిలుపు మేరకు నిర్వహిస్తున్న "హర్ ఘర్ తిరంగా – తిరంగా యాత్ర" కార్యక్రమంలో భాగంగా, భారత త్రివిధ దళాల్లో సేవలందించి పదవీ విరమణ పొందిన మాజీ సైనికుడు దూరిశెట్టి కిరణ్ కుమార్ ని బీజేపీ జగిత్యాల నియోజకవర్గ... బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ డా. బోగ శ్రావణి కి పోచమ్మ తల్లి బోనాల జాతర ఆహ్వాన పత్రిక అందజేత
జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా జగిత్యాల జిల్లా యూట్యూబర్స్ కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోచమ్మ తల్లి బోనాల జాతర మహోత్సవం సందర్భంగా ఆహ్వాన పత్రికను బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ డా. బోగ శ్రావణికి బోనాల జాతర వర్కింగ్ కమిటీ సభ్యులు, జగిత్యాల జిల్లా కళాకారులు మర్యాదపూర్వకంగా అందజేశారు.
ఈ సందర్భంగా... తల్లిపాలే శిశువుకు తొలి వరం – మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్
జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు )పట్టణంలోని స్థానిక 43వ వార్డు వాణీనగర్ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు సంప్రదాయబద్ధంగా శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాశన, అక్షరాభ్యాసం కార్యక్రమాలను నిర్వహించి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ సమీండ్ల... విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి – మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్
జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు)పట్టణంలోని నవ్య గర్ల్స్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన "పరిచయ్–2K26" ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ విద్య జీవితానికి బలమైన పునాది అని, ఈ దశలో విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను... సామాజిక న్యాయ తెలంగాణ కోసం టీఆర్ఎస్ సంకల్పం
హైదరాబాద్, ఆగస్టు 06 (ప్రజా మంటలు):
సామాజిక న్యాయ తెలంగాణ సాధన లక్ష్యంగా టీఆర్ఎస్ నిర్వహించిన **"సామాజిక న్యాయ సంకల్ప సభ"**లో పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత కీలక ప్రసంగం చేశారు. ఈ సభ దేశంలోని కోట్లాది మంది వెనుకబడిన వర్గాల జీవితాలను మార్చే ఉద్యమానికి నాంది అవుతుందని ఆమె పేర్కొన్నారు.
తాను బీసీల కోసం... ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయ సాధనే ఆయనకు నిజమైన నివాళి – మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్
జగిత్యాల ఆగస్ట్ 6(ప్రజా మంటలు)
మున్సిపాలిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా కరీంనగర్ రోడ్లోని జయశంకర్ విగ్రహం వద్ద, గొల్లపల్లి రోడ్లోని విగ్రహం వద్ద, అలాగే మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా జయంతి కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర... ధనం ఉంటే దాన స్వభావము ఉండాలి బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేష్ శర్మ
కోరుట్ల ఆగస్టు 5 ( ప్రజా మంటలు)
సిరిసిల్ల రాజేంద్ర శర్మ 9348422113
ధనమున్న వ్యక్తికి దాన స్వభావం ఉండాలని అదేవిధంగా శక్తి ఉంటే క్షమాగుణం ఉండాలని శృంగేరి శారదా పీఠ ఆస్థాన పౌరాణికులు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి శిష్యులు గర్రెపల్లి మహేష్ శర్మ అన్నారు. కోరుట్ల పట్టణములో సనాతన ధర్మ ప్రచార సమితి కోరుట్ల... తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపునకు మహారాష్ట్ర అనుమతులు ఇప్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ, ఆగస్టు 5 (ప్రజా మంటలు):ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు 150–152 మీటర్లకు పెంచేందుకు మహారాష్ట్ర అనుమతులు ఇప్పించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కోరారు. ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన కేంద్ర మంత్రిని కలిశారు.148 మీటర్లతో పోలిస్తే 152... నల్లమల్లలో చెంచు గిరిజనుల జీవన పరిస్థితులపై మానవ హక్కుల కమిషన్ చైర్మన్ క్షేత్రస్థాయి పరిశీలన
విద్య, వైద్యం, సంక్షేమం, మౌలిక వసతులపై అధికారులతో సమగ్ర సమీక్ష – చెంచు కుటుంబాలతో ముఖాముఖిహైదరాబాద్, ఆగస్టు 5 (ప్రజా మంటలు):
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న చెంచు గిరిజనుల జీవన పరిస్థితులను తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్... పూర్తిస్థాయి పంచాయతీ కార్యదర్శి లేక గొల్లపల్లి అభివృద్ధి కుంటుపాటు
గొల్లపల్లికి రావాలంటేనే జంకుతున్న కార్యదర్శులు!రాజకీయ ఒత్తిళ్లే కారణమా..? గ్రామంలో గుసగుసలు?
గొల్లపల్లి, ఆగస్టు 5 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పూర్తిస్థాయి కార్యదర్శి లేక తీవ్ర పరిపాలనా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నెలకోసారి ఇన్చార్జి కార్యదర్శిని నియమిస్తూ కాలం గడుపుతుండటంతో గ్రామ అభివృద్ధి పనులు పూర్తిగా స్తంభించిపోయే పరిస్థితి... ఐక్య ఉద్యమాలతోనే పీఆర్సీ సాధ్యం, అశాస్త్రీయమైన టెట్ పరీక్షను రద్దు చేయాలి : జిల్లా అధ్యక్షులు బైరం హరికిరణ్
జగిత్యాల ఆగస్టు 2 (ప్రజా మంటలు)రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్ లకు రావాల్సిన పి.ఆర్సి , డి.ఏ లు, పెండింగ్ బకాయిల సమస్యలు ఐక్య ఉద్యమాలతోనే పరిష్కారమవుతాయని స్టేట్ టీచర్స్ యూనియన్ జగిత్యాల జిల్లా శాఖ సమావేశం తీర్మానించింది. ఆదివారం జగిత్యాల పట్టణంలో రామకృష్ణ డిగ్రీ కళాశాల సమావేశమందిరంలో ఎస్టీయు తృతీయ కార్యవర్గ... సహస్ర లింగాల దేవాలయంలో ఘనంగా సంకష్టహర చతుర్థి వేడుకలు మహాగణపతికి ప్రత్యేక అభిషేకాలు
జగిత్యాల ఆగస్టు 2 (ప్రజా మంటలు)
రూరల్ పొలాస గ్రామం శివారులోని సహస్ర లింగాల దేవాలయంలో ఉదయం సంకటహర చతుర్థి వేడుకలు మహాగణపతికి ప్రత్యేక అభిషేకాలు. ఈ సందర్భంగా సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం ఆలయంలోని సహస్ర లింగాలకు ప్రత్యేక పూజలను నిర్వహించి అనంతరం ఆలయంలోని సంకటహర చతుర్థి సందర్భంగా మహాగణపతికి పలు పంచామృతాభిషేకాలను... 