ఎమ్మెల్యే సంజయ్ పార్టీ విడడం ఆత్మహత్య కన్నా హీనమైన చర్య
ఎమ్మెల్యే సంజయ్ పార్టీ విడడం ఆత్మహత్య కన్నా హీనమైన చర్య
జగిత్యాల జూన్ 24 (ప్రజా మంటలు)
జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక తహసిల్ చౌరస్తా వద్ద ధర్నా చేపట్టి దిష్టి బొమ్మను తగలబెట్టిన అనంతరం వారి ఇంటిని ముట్టడించిన కార్యక్రమంలో జగిత్యాల బిఆర్ఎస్ జిల్లా అద్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ,మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ,జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్,మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ,సీనియర్ నాయకులు ఓరుగంటి రమణారావు గారు రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ చైర్మెన్ లోక బాపు రెడ్డి పాల్గోన్నారు.
బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, ఉద్యమంలో పాల్గొనకున్న కెసిఆర్ పిలిచి మూడు సార్లు టికెట్ ఇచ్చారు.తల్లి పాలు తాగి రొమ్ము మీద గుద్ధినటువంటి సంజయ్ వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అని అన్నారు.
కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, కష్ట కాలంలో పార్టీని మోసం చేసి స్వార్థంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే డా.సంజయ్ ని జగిత్యాలలో తిరుగనివ్వమని.అలాంటి వారు బ్రతికున్న చచ్చిన శవంతో సమానమేనని అన్నారు.
జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ మాట్లాడుతూ, ల్వకుంట్ల కవితక్క చంటి పిల్లాడిలా పట్టుకుని కాలికి బట్ట కట్టకుండా తనే ఎమ్మెల్యే గా తిరిగి మూడు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి రెండు సార్లు ఎమ్మెల్యే గెలిపిస్తే నమ్మక ద్రోహానికి ఒక ప్రతిరూపం ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అని అన్నారు.
బిఆర్ఎస్ పార్టీ కుటుంబసభ్యులు కార్యకర్తలు సామాన్య ప్రజలు కూడా తమ ఓటు వృథా అయిందని స్వచ్ఛందంగా వచ్చి తీవ్రంగా ఖండించారు..
మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పై గెలిచిన నువ్వు రాజీనామా చేసి మళ్ళీ పోటీకి రావాలని అని అన్నారు..
ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ హరిచారణ్ రావు,జెడ్పీటీసీ నాగం భూమన్న,కెడిసీసీ జిల్లా మెంబర్ రాంచందర్ రావు,ఎంపీపీ సంధ్యారాణి,రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు,వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి,రాయికల్ మండల అధ్యక్షుడు కొల శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు శీలం ప్రియాంక,ఉదయ శ్రీ, నాగేశ్వర్ రావు,పట్టణ ఉపాధ్యక్షుడు వొల్లెం మల్లేశం, ఎంపీటీసీలు,సర్పంచ్లు, బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,పట్టణ మరియు మండల విభాగం నాయకులు, మహిళలు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రముఖ జ్యోతిష్య పండితులు రమణాచారి సూచనతో 22వ తేదీకి గ్రామ సర్పంచ్ బాధ్యతల ప్రమాణ స్వీకారం మార్చిన ప్రభుత్వం
కరీంనగర్ డిసెంబర్ 18 (ప్రజా మంటలు)ప్రభుత్వం ముందుగా 20వ తేదీన నూతనంగా ఏర్పడిన గ్రామ సర్పంచుల ప్రమాణ స్వీకారానికి నిర్ణయించగా ఆ ముహూర్తం బాగాలేదని ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమ శాస్త్ర పండితులు శ్రీమాన్ శ్రీ నమిలకొండ రమణాచార్యులు ప్రభుత్వానికి ,ప్రభుత్వ పెద్దలకు సూచించడంతో వారు ఆ సూచనలను పరిగణనలోకి తీసుకొని 22వ తేదీ... జిమ్మీ లాయ్ తీర్పు: హాంకాంగ్ స్వేచ్ఛపై వేసిన తుది ముద్ర
హాంకాంగ్ మీడియా దిగ్గజం, ప్రజాస్వామ్య ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన జిమ్మీ లాయ్కు కోర్టు దోషిగా తీర్పు ఇవ్వడం ఒక వ్యక్తిపై జరిగిన న్యాయ చర్యగా మాత్రమే చూడటం చరిత్రను చిన్నచూపు చేయడమే. ఇది హాంకాంగ్లో భిన్నాభిప్రాయాలకు, స్వతంత్ర మీడియాకు, ప్రజాస్వామ్య రాజకీయాలకు వేసిన చివరి ముద్రగా భావించాల్సిన ఘట్టం.
78 ఏళ్ల జిమ్మీ లాయ్... జగిత్యాల జిల్లాలో మూడవ విడత పోలింగ్ 79.64 శాతం 6 మండలాల్లో ఉత్సాహంగా ఓటింగ్
జగిత్యాల, డిసెంబర్ 17 (ప్రజా మంటలు):
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో నిర్వహించిన మూడవ విడత ఎన్నికల పోలింగ్ శాతం 79.64గా నమోదైంది. మొత్తం 1,71,920 ఓట్లకు గానూ 1,36,917 ఓట్లు పోలయ్యాయి.
బుధవారం బుగ్గారం, ధర్మపురి, ఎండపెల్లి, గొల్లపెల్లి, పెగడపెల్లి, వెల్గటూర్ మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు... జనావాసాల మధ్య మురుగునీరు : పట్టించుకోని మున్సిపల్ సిబ్బందిపై కాలనీవాసుల ఆవేదన
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 17 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డు, 1వ వార్డు సీతారాం నగర్ ప్రాంతంలో జనావాసాల మధ్య డ్రైనేజ్ మురుగునీరు ప్రవహిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో పాటు ఇళ్లలోకి కూడా ప్రవేశిస్తుండటంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సరైన... పద్మారావు నగర్ లో ఫుట్ పాత్ దుకాణాలకు మార్కింగ్
సికింద్రాబాద్ డిసెంబర్ 17 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్ పద్మారావునగర్ పార్కు నుండి సర్దార్ పటేల్ కాలేజ్ వరకు ఉన్న 26 ఫుట్ పాత్ వ్యాపారస్తులకు జిహెచ్ఎంసి అధికారులు బుధవారం మార్కింగ్ వేశారు. ఇకపై తమ పరిధిని దాటి ముందుకు రాకూడదని వారు ఫుట్ పాత్ దుకాణాల నిర్వాహకులను హెచ్చరించారు. వాహనాల రాకపోకలకు, ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని... పెన్షనర్స్ భవనంలో అదనపు గది,లిఫ్ట్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 17(ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా పెన్షనర్స్ భవన్ లో అదనపు గది మరియు నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ ను ప్రారంభోత్సవం చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అనంతరం పెన్షనర్స్ డే వేడుకల సందర్భంగా జగిత్యాల పట్టణ ఫంక్షన్ హాల్ లో... మూడవ విడత వివిధ గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
జగిత్యాల డిసెంబర్ 17 (ప్రజా మంటలు)
జిల్లాలో 3వ దశ పోలింగ్లో భాగంగా ధర్మపురి మండలంలోని జైన, రాజారాం, రాయపట్నం గ్రామాలు, ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లి, గుల్లకోట గ్రామాలు, పెగడపల్లి మండలంలోని నంచర్ల, బతికేపల్లి గ్రామాలు, అలాగే వెల్గటూర్ మరియు గొల్లపల్లి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ సెంటర్లను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్... ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
*జిల్లాలో ప్రశాంతంగా కొనసాగిన మూడవ విడత సర్పంచ్ ఎన్నికలు.*జగిత్యాల డిసెంబర్ 17 (ప్రజా మంటలు)మూడవ విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.ఎన్నికలు జరుగుతున్న ఇబ్రహీం నగర్, గొల్లపల్లి, బత్కపల్లి, నంచర్ల, గ్రామాల్లో గల పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
జిల్లాలో ఎక్కడా... కోరుట్ల ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన జగిత్యాల నేతలు
జగిత్యాల, డిసెంబర్ 18 (ప్రజా మంటలు):
జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్మీట్లో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ చేసిన వ్యాఖ్యలను జగిత్యాల నియోజకవర్గ నాయకులు తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి పనులు కావాలంటే అసెంబ్లీలో మాట్లాడటమే కాకుండా ఉన్నతాధికారులు, మంత్రులతో తరచుగా సమావేశమై ప్రతిపాదనలు తీసుకెళ్లాలని సూచించారు. రాజకీయంగా... లోక్ అదాలత్ కు న్యాయవాదులు సహకరించాలి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర రావు.
మెట్టుపల్లి డిసెంబర్ 17 ( ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
మెట్టుపల్లి లో బుధవారం మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్ అదాలత్ సన్నాహక సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 21 రోజున నిర్వహిస్తున్న లోక్ అదాలత్ లో
క్రిమినల్... ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగింపు దారుణం
సికింద్రాబాద్, డిసెంబర్ 17 (ప్రజామంటలు) :
ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగిస్తూ ‘వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గా పేరు మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లును పీసీసీ వైస్ప్రెసిడెంట్, సనత్నగర్ కాంగ్రెస్ ఇంచార్జి డా. కోట నీలిమ తీవ్రంగా ఖండించారు. గాంధీజీ ఆలోచనలు, విలువల... 