ఎమ్మెల్యే సంజయ్ పార్టీ విడడం ఆత్మహత్య కన్నా హీనమైన చర్య
ఎమ్మెల్యే సంజయ్ పార్టీ విడడం ఆత్మహత్య కన్నా హీనమైన చర్య
జగిత్యాల జూన్ 24 (ప్రజా మంటలు)
జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక తహసిల్ చౌరస్తా వద్ద ధర్నా చేపట్టి దిష్టి బొమ్మను తగలబెట్టిన అనంతరం వారి ఇంటిని ముట్టడించిన కార్యక్రమంలో జగిత్యాల బిఆర్ఎస్ జిల్లా అద్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ,మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ,జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్,మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ,సీనియర్ నాయకులు ఓరుగంటి రమణారావు గారు రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ చైర్మెన్ లోక బాపు రెడ్డి పాల్గోన్నారు.
బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, ఉద్యమంలో పాల్గొనకున్న కెసిఆర్ పిలిచి మూడు సార్లు టికెట్ ఇచ్చారు.తల్లి పాలు తాగి రొమ్ము మీద గుద్ధినటువంటి సంజయ్ వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అని అన్నారు.
కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, కష్ట కాలంలో పార్టీని మోసం చేసి స్వార్థంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే డా.సంజయ్ ని జగిత్యాలలో తిరుగనివ్వమని.అలాంటి వారు బ్రతికున్న చచ్చిన శవంతో సమానమేనని అన్నారు.
జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ మాట్లాడుతూ, ల్వకుంట్ల కవితక్క చంటి పిల్లాడిలా పట్టుకుని కాలికి బట్ట కట్టకుండా తనే ఎమ్మెల్యే గా తిరిగి మూడు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి రెండు సార్లు ఎమ్మెల్యే గెలిపిస్తే నమ్మక ద్రోహానికి ఒక ప్రతిరూపం ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అని అన్నారు.
బిఆర్ఎస్ పార్టీ కుటుంబసభ్యులు కార్యకర్తలు సామాన్య ప్రజలు కూడా తమ ఓటు వృథా అయిందని స్వచ్ఛందంగా వచ్చి తీవ్రంగా ఖండించారు..
మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పై గెలిచిన నువ్వు రాజీనామా చేసి మళ్ళీ పోటీకి రావాలని అని అన్నారు..
ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ హరిచారణ్ రావు,జెడ్పీటీసీ నాగం భూమన్న,కెడిసీసీ జిల్లా మెంబర్ రాంచందర్ రావు,ఎంపీపీ సంధ్యారాణి,రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు,వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి,రాయికల్ మండల అధ్యక్షుడు కొల శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు శీలం ప్రియాంక,ఉదయ శ్రీ, నాగేశ్వర్ రావు,పట్టణ ఉపాధ్యక్షుడు వొల్లెం మల్లేశం, ఎంపీటీసీలు,సర్పంచ్లు, బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,పట్టణ మరియు మండల విభాగం నాయకులు, మహిళలు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...
More News...
<%- node_title %>
<%- node_title %>
సుప్రీం కోర్టు తీర్పు: గవర్నర్–ముఖ్యమంత్రి అధికారాలపై దేశవ్యాప్త చర్చ
చెరువుల మరమ్మత్తులకు నిధులు ఇవ్వండి : MLA సంజయ్
హైదరాబాద్ నవంబర్ 21 (ప్రజా మంటలు):జగిత్యాల అభివృద్ధి పనులపై కీలక నిర్ణయాలు త్వరలో వెల్లువడనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని ఆయన కార్యాలయంలో కలిసి, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ వినతిపత్రం సమర్పించారు.
చెరువుల మరమ్మత్తులకు నిధుల అభ్యర్థన
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపిన వివరాల... చిరు ఉద్యోగుల పెద్ద మనసు....ప్రతి నెల వేతనం నుంచి కొంత భాగం సేవ పనులకు..
సికింద్రాబాద్, నవంబర్ 21 (ప్రజామంటలు) :
ఆర్ఎన్ఆర్ ఇన్ఫ్రా సంస్థ ఉద్యోగులు కృష్ణజ్యోతి, కీర్తిల ఆధ్వర్యంలో గాంధీ ఆస్పత్రి ఎంసీహెచ్ విభాగంలో చికిత్స పొందుతున్న బాలింతలు, గర్భిణీలకు శుక్రవారం పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ వాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామాజిక సేవలో భాగంగా ఉద్యోగులు తమ వేతనంలో కొంతభాగాన్ని ప్రతి... శిశు సంరక్షణపై మరింత అవగాహన పెంచుకోవాలి.. గాంధీలో న్యూ బోర్న్ బేబీ వారోత్సవాలు..
సికింద్రాబాద్, నవంబర్ 21 (ప్రజామంటలు) :
నవ జాత శిశు సంరక్షణపై తల్లులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వైద్యనిపుణులు అభిప్రాయపడ్డారు. గాంధీ మదర్ అండ్ చైల్డ్ కేర్ ఆస్పత్రి (ఎంసీహెచ్) లో గైనకాలజీ, పిడియాట్రిక్ విభాగాల సంయుక్త నేతృత్వంలో న్యూబోర్న్ బేబీ వారోత్సవాలను పురష్కరించుకుని శుక్రవారం పలు అవేర్నెస్ కార్యక్రమాలు... దేవాలయానికి ఎలక్ట్రానిక్ గుడి గంట బహుకరణ
ఇబ్రహీంపట్నం నవంబర్ 21 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వర్ష కొండ గ్రామంలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి శ్రీ పిస్క శ్రీనివాస్-లత దంపతులు ఎలక్ట్రానిక్ గుడి గంటను బహుకరించారు.
ఈ గంట ప్రతి గంట, ప్రతి గంటకు టైం చెప్పడంతో పాటు, ఒక భగవద్గీత శ్లోకం మరియు భక్తి గీతం... ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్ లత
ధర్మపురి నవంబర్ 21(ప్రజా మంటలు)
కొనుగోలు కేంద్రాలకి వచ్చిన ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్. లత అన్నారు.
శుక్రవారం ధర్మపురి మండలం రాజారాం , దమ్మన్నపేట్ మరియు దుబ్బల గూడెం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) మాట్లాడుతూ... రాష్ట్రపతికి రేవంత్ రెడ్డి స్వాగతం
హైదరాబాద్, నవంబర్ 21 (ప్రజా మంటలు):
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తో కలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్రపతి ని ఆహ్వానించారు.
రాష్ట్రపతి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న భారతీయ కళా మహోత్సవం – రెండవ... క్రీడల వల్ల నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
మెట్టుపల్లి నవంబర్ 21(ప్రజా మంటలు దగ్గుల అశోక్):
మెట్టుపల్లి పట్టణ పరిధిలోని వెల్లుల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి ఖోఖో పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జిల్లా విద్యాధికారి రాము గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... కౌన్సిలింగ్ తో వృద్ధుల కేసులు పరిష్కారం..
జగిత్యాల నవంబర్ 21 (ప్రజా మంటలు):
తల్లిదండ్రులను నిరాదరిస్తున్న కొడుకులు, కోడళ్ళకు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ కౌన్సిలింగ్ నిర్వహించారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని సీనియర్ సిటిజెన్స్ కార్యాలయం కౌన్సిలింగ్ కేంద్రానికి జిల్లా లోని జగిత్యాల పట్టణం, బీర్పూర్, మల్యాల, పెగడపల్లి, గొల్ల పల్లి... దుబాయ్ ఎయిర్ షో లో కూలిన తేజస్ ఫైటర్
దుబాయ్, నవంబర్ 21 (ప్రజా మంటలు):
దుబాయ్ ఎయిర్ షోలో భారత్కు చెందిన తేజస్ యుద్ధ విమానం కూలిపోయిన ఘటన కలకలం రేపింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, బెంగళూరు హెచ్.ఏ.ఎల్ (HAL) సంస్థలో తయారైన ఈ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో ఆకస్మికంగా కుప్పకూలింది.
విమానం కూలిన వెంటనే అక్కడ భారీగా ... కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కట్టిన ముడుపు విడిపించిన ఎంపీ వంశీ
గొల్లపల్లి, నవంబర్ 21 (ప్రజా మంటలు):
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ రాఘవపట్నంలోని హనుమాన్ దేవాలయాన్ని దర్శించి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని గతంలో కట్టుకున్న ముడుపును ఈరోజు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి పురోహితుల ఆశీర్వాదం తీసుకున్నారు.
గ్రామ ప్రజలతో మాట్లాడిన ఆయన దేవాలయ అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి సహాయం... ఈనెల 25 న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్?
హైదరాబాద్, నవంబర్ 21 (ప్రజా మంటలు):
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. బీసీ డెడికేటెడ్ కమిషన్ సమర్పించనున్న నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీరాజ్ చట్టం–2018 సవరణల ప్రకారం, గత ఎన్నికలలో... 