ఎన్ డి ఏ – ఇండియా కూటమి లలో గెలుపు ఎవరిదో ఈనాడే తెలిపోతుంది
పోటీ చేయకున్న విజయం తథ్యమా?
ఎన్నికల ముందస్తు ఫలితలన్నీ నిజమేనా ?
మీడియా కథనాలన్నీ ముందస్తు ప్రణాళికలో భాగమేనా?
ఎన్ డి ఏ – ఇండియా కూటమి లలో గెలుపు ఎవరిదో ఈనాడే తెలిపోతుంది
హైదరాబాద్ జూన్ 03 :
దాదాపు పది వారాల పాటు దేశంలో, రాజకీయ పార్టీలలో నెలకొన్న ఉత్సుకతకు మంగళవారం తెరపడనుంది. దేశ భవిష్యత్ ను తేల్చే సాదారణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కానీ ఈ ఎన్నికల ఫలితాలను ముందస్తుగా సర్వేల ద్వారా అంచనా వేసిన అన్నీ మీడియా, సర్వే సంస్థలు ప్రధాని మోడి మళ్ళీ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి రానున్నారని తేల్చి చెప్పాయి. మొదటి నుండి జాతీయ మీడియా సస్థలు, సర్వేలు ఎన్ డి ఏ కూటమి భారీ మెజారిటీతో విజయం సాదిస్తుందని చెపుతున్నాయి. చివరికి పోటీ చేయక పోయిన, సీట్లు గెలుస్తుందని చెప్పే దశకు ఈ సర్వేలు వెళ్ళాయి.
దేశ ప్రధాని నరేంద్ర మోడి మూడవ సారి ప్రధాని కావడం ఖాయమని, బిజేపి పార్టీ పూర్తిగా నమ్ముతుంది. అలాగే ప్రధాని మోడి స్వయంగా 400 లకు పైగా సీట్లు గెలుస్తామని, అందులో బిజేపి స్వయంగా 370 సీట్లు గెలుస్తామని ప్రకటించారు. అదే అంశాన్ని ఎన్నికలకు ముందునుండి బిజేపి అధినాయకులు అమిత షా, జే పి నడ్డా లాంటి వారు కూడా తమ ప్రచారంలో వాడుకోవన్నారు.
ఏడు దశలలో జరిగిన ఎన్నికల్లో ప్రతి దశలో బిజేపి పార్టీకి ఎదురుదెబ్బ తగులుతుందని, అనుకొన్నాన్ని సీట్లు రావడం కష్టమనే అన్నీ వార్తా సంస్థలు, సామాజిక మాధ్యమాలు అంచనా వేశాయి. కానీ ప్రతి దశలోనూ ప్రధాని ఎన్నికలను హిందుత్వ ఏజండా తో ముందుకు తీసుక వెళ్లి, ముస్లింలకె ఇండియా కూటమి మద్దతు ఇస్తూ, హిందువులకు అన్యాయం చేస్తుందని ప్రచారరం చేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో నాయకుల భాష పూర్తిగా దిగజారిపోయిందని, గతంలో ఎన్నడూ లేనంత దూషణాలతో ఎన్నికలు ముగిశాయి.
తమిళనాడులో కాంగ్రెస్ కు 13-15 సీట్లు
తమిళనాడు రాష్ట్రంలో మొత్తం 39 సీట్లు ఉండగా, కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలకు పోటీ చెటున్ది. కానీ ఇండియా ఆక్సిస్ సర్వేలో 13-15 సీట్లు గెలుస్తుందని చెప్పింది. తమిళనాడులో బిజేపి ఈసారి తప్పకుండా 2-5 సీట్లు గెలుస్తుందని కూడా చెపుతున్నాయి. తమిళనాడు, కేరళలో బిజేపి తన వోట్ల శాతం పెరుగుతుందని ముందునుండి అందరూ అనుకొంటున్నారు. కానీ సీట్లు మాత్రం ఈ రెండు రాష్ట్రాలలో రావని అనుకొనుతున్నారు. కానీ సర్వే సంస్థలు మాత్రం బిజేపికి 5 నుండి 7 సీట్లు రావచ్చని చెప్పడాన్ని అందరూ ప్రశ్నిస్తున్నారు.
బీహార్ లో 5 పోటీ చేస్తే 6 సీట్లు గెలుస్తారా?
బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి లోని భాగస్వామి అయిన చిరాగ్ పాశ్వాన్ పార్టీ లోక్ జనశక్తి(ఎల్ జే పి) పార్టీ 2019 లో 6 సీట్లకు పోటీ చేసింది. కానీ ఈసారి మారిన రాజకీయ సమీకరణాలలో భాగంగా, 5 సీట్లకు మాత్రమే పోటీ చేస్తుంది. కానీ సర్వేలో ఎల్ జే పి 6 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉందని ప్రకటించడం సర్వేలలోని డొల్లతనాన్ని తెలియజేస్తుంది.
ఇలా పోటీ చేయకున్నా సీట్లు గెలుస్తుందని చెప్పడం వల్ల సర్వే సంస్థల అంచనాల విషయంలో సందేహాలు నెలకొంటున్నాయి. అలాగే దాదాపు అన్నీ సర్వే సంస్థలు 350 నుండి 416 సీట్ల వరకు ఎన్డీఏ గెలుస్తుందని ప్రకటించడం అనుమానాలకు తావిస్తుంది. బిజేపి కి వచ్చే వోట్ల శాతానికి, సీట్ల శాతానికి పొంతన లేని విధమైన అంచనాలు ఇవ్వడం అనేది ముందస్తుగా బిజేపిటో కుమ్ముకకై, ఈ అంచనాలను విడుదల చేయడం, ప్రతిపక్షాలను మానసికంగా దెబ్బతీయడానికే ననే ప్రచారం ఉండి. ఏమైనా ఈ ప్రజాస్వామ్య పండగ కూడా వంచన క్రీడా గా మారిపోతుందా అనే సందేహం కలుగుతుంది. దేశ భవిష్యత్ ను తీర్చిదిద్ది, ప్రజాస్వామ్య పరిరక్షణకు అనుకూలమైన ఫలితాలు రావాలని అందరూ ఆశిస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
విద్యా–సామాజిక రంగానికి తీరని లోటు: కాసుగంటి సుధాకర్ రావు మృతిపై పలువురి సంతాపం
జగిత్యాల డిసెంబర్ 26 (ప్రజా మంటలు):
విద్యా, పారిశ్రామిక, సామాజిక రంగాలకు విశేష సేవలందించిన ప్రముఖ విద్యావేత్త కాసుగంటి సుధాకర్ రావు మృతి జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన అకాల మరణం పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
విద్యావేత్తగా, సామాజిక సేవకుడిగా, పారిశ్రామికవేత్తగా విశేష... ఈరోజు ఉదయం గుజరాత్లో భూకంపం
అహ్మదాబాద్ డిసెంబర్ 26:
గుజరాత్ రాష్ట్రంలో శుక్రవారం ఉదయం సుమారు 6:10 గంటల సమయంలో భూకంపం సంభవించింది. కచ్ జిల్లాకు సమీప ప్రాంతమే భూకంప కేంద్రంగా గుర్తించారు. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత సుమారు 3.8 నుంచి 4.2గా నమోదైంది.
కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ భూకంపం... విద్యా–పారిశ్రామిక రంగాలకు వెలుగు నింపిన మహనీయుడు కాసుగంటి సుధాకర్రావు అస్తమయం
జగిత్యాల, డిసెంబర్ 26 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లాకు గర్వకారణంగా నిలిచిన ప్రముఖ విద్యావేత్త, పారిశ్రామిక వేత్త, సామాజిక సేవా ధురీణుడు కాసుగంటి సుధాకర్రావు(80) అకాల మరణం జిల్లావ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. తన జీవితమంతా సమాజ హితానికే అంకితం చేసిన ఈ మహనీయుడు గురువారం (డిసెంబర్ 25) రాత్రి హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన
మాజీ... నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
నంద్యాల డిసెంబర్ 26:
ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల–బత్తలూరు మధ్య శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి... ధర్మపురి అక్కపెల్లి రాజారాజేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ..
.
ధర్మపురి డిసెంబర్ 25(ప్రజా మంటలు)
శివారులోని కమలాపూర్ రోడ్డుకు గల అక్కపెల్లి రాజారాజేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం అర్థరాత్రి సమయంలో దొంగతనం జరిగింది.
దేవస్థానంలో స్వామివారికి అలంకరించిన 2 కిలోల వెండి పాన పట్ట (లింగం చుట్టూ బిగించబడినది) మరియు అమ్మవారికి అలంకరించిన 8 గ్రాముల వెండి ముఖ కవచము కలిపి మొత్తం 2... దేశ సేవకు జీవితాన్ని అంకితం చేసిన జాతీయవాది వాజపేయి -బిజెపి పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్
జగిత్యాల డిసెంబర్ 25 (ప్రజా మంటలు) భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి శతజయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేసిన బిజెపి పట్టణ శాఖ నాయకులు
ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ సుపరిపాలనకు స్ఫూర్తి అటల్ బిహారీ వాజపేయి..భారత దేశంలో నీతికి నిజాయితీకి నైతిక... ఘోర రోడ్డు ప్రమాదం : కొప్పూర్ యువకుడు మృతి
భీమదేవరపల్లి, డిసెంబర్ 25 (ప్రజామంటలు) :
మండలం కొప్పూరు గ్రామానికి చెందిన కొమ్ముల అంజి (20) శుక్రవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం, ఇందిరానగర్ దాటాక మోడల్ స్కూల్ ఎదుట బైక్పై వెళ్తున్న అంజిని ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. అంజి సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. ప్రమాదం జరిగిన... జీహెచ్ఎంసీ డీలిమిటేషన్కు బ్రేక్ : చెదిరిన రేవంత్ కల
హైదరాబాద్, డిసెంబర్ 25 (ప్రజా మంటలు):
వచ్చే ఏడాది జరగనున్న ఎస్ఐఆర్, జనగణనలను దృష్టిలో ఉంచుకొని వేగంగా పూర్తి చేయాలని భావించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) డీలిమిటేషన్ ప్రక్రియకు ప్రభుత్వమే బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. డివిజన్ల పునర్విభజనపై ప్రజల నుంచి వెల్లువెత్తిన అభ్యంతరాలు, రాజకీయ వర్గాల నుంచి వచ్చిన నిరసనల నేపథ్యంలో తుది... స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
సికింద్రాబాద్, డిసెంబర్ 25 (ప్రజా మంటలు):
నగర పరిధిలో రోడ్ల పక్కన జీవనం సాగిస్తున్న సంచార జాతులు, నిరాశ్రయ కుటుంబాల చిన్నారులతో స్కై ఫౌండేషన్ గురువారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా చిన్నారులకు బహుమతులు, ఆటవస్తువులు, వివిధ రకాల తినుబండారాలు అందజేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆటవస్తువులు, బహుమతులు అందుకోవడంతో చిన్నారులు అపారమైన... కర్ణాటక బస్సు ప్రమాదంలో 17 మంది సజీవదహనం
బెంగళూరు డిసెంబర్ 25:
కర్ణాటకలో ప్రమాదవశాత్తు ప్రైవేట్ బస్సు అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి 1:30–2:00 గంటల మధ్య చామరాజనగర్ జిల్లా హనూర్ తాలూకాలో ప్రయాణికులతో ఉన్న బస్సు మంటల్లో చిక్కడంతో 17 మంది సజీవదహనం అయ్యారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. అధికారులు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. భర్త అడ్డుగా ఉన్నాడని హత్య..అక్రమ సంబంధంతో భార్య దారుణం
అచ్చంపేట డిసెంబర్ 25 (ప్రజా మంటలు):
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో కలకలం రేపింది. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మహిళే ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా తేలడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.
అచ్చంపేట పట్టణంలోని మారుతి నగర్ కాలనీలో నివాసం... క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న దావ వసంత్ సురేష్ –
క్రైస్తవులకు శుభాకాంక్షలు
జగిత్యాల డిసెంబర్ 25 (ప్రజా మంటలు):
క్రిస్మస్ పండుగ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంప్ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత్ సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చిలో కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.... 