సంప్రదాయ రీతిలో ధర్మపురిలో హనుమజ్జయంతి వేడుకలు

On
సంప్రదాయ రీతిలో ధర్మపురిలో హనుమజ్జయంతి వేడుకలు

సంప్రదాయ రీతిలో ధర్మపురిలో హనుమజ్జయంతి వేడుకలు


ధర్మపురి జూన్ 01 (ప్రజా మంటలు -
రామ కిష్టయ్య సంగన భట్ల) :                  
తెలంగాణ లోని ప్రాచీన పుణ్య క్షేత్రాలలో నొకటియై, పవిత్ర గోదావరీ నదీ తీరాన వెలసి, పలు దేవాలయాల సముదాయంతో అలరారుతున్న పుణ్య తీర్ధమైన ధర్మపురి క్షేత్రంలో శని వారం పెద్ద హనుమజ్జయంతి వేడుకలు సంప్రదాయ రీతిలో జరిగాయి. అంజనీ పుత్రుడైన మారుతి శరణు ఘోషలు, జయజయ ధ్వనాలు, భగవ న్నామ స్మరణలు, భక్తి సంగీతాలు, వేద మంత్రాలతో సనాతన క్షేత్రంలో భక్తి పారవశ్యం పొంగి పొర్లింది. ఉదయాత్పూర్వం ప్రత్యే కించి హన్మాన్ దీక్షాపరులు పవిత్ర గోదావరిలో మంగళ స్నానా లను ఆచరించి, దైవ దర్శనాలు చేసుకున్నారు.


శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాంతర్గత ఆంజనేయస్వామి ఆలయంలో దేవస్థాన అర్చకులు వొద్దిపర్తి నరసింహ మూర్తి, కళ్యాణ్, వామాన్, కార్తీక్, వేద పండితులు బొజ్జ సంపత్ కుమార్ 
 శర్మ, ముత్యాల శర్మ ఆధ్వర్యంలో, ఈఓ శ్రీనివాస్, ఐ. రామయ్య నేతృత్వంలో, పర్యవేక్షణలో, శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని  ఆంజనేయస్వామి వారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం , సుందరాకాండ పారాయణం లతో ప్రత్యేక పూజలు, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు. 
 దేవస్థానం కార్యనిర్వహణా ధికారి సంకటాల శ్రీనివాస్, వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ ముత్యాల శర్మ, ప్రవీణ్ కుమార్, ఉపప్రదాన అర్చకులు నేరెళ్ళ శ్రీనివాసాచార్య, స్థానిక వేదపండితులు, అర్చకులు వొద్దిపర్తి నరసింహ మూర్తి , కళ్యాణ్ కుమార్ , నంబి అరుణ్ కుమార్, బొజ్జ రమేశ్ శర్మ, రాజగోపాల్ , అర్చకులు, సిబ్బంది భక్తులు పాల్గొన్నారు. 


ఉపవాస దీక్షాదక్షులైన హన్మాన్ భక్తులు దేవస్థానంలో దర్శనాలు చేసుకుని, ప్రసాదాలనుకొని, పరమాన్నాలుగా గ్రహించారు. 

నదీతీరాన గోదా వరీ భద్రానదీ సంగమ స్థానాన వెలసిన దక్షిణాభిముఖుడైన భక్తాంజనేయ స్వామిని దర్శించు కున్నారు.
 చారిత్రిక, పౌరా ణిక నేపథ్యాన్ని కలిగిన ఈ ఆలయంలో హనుమజ్జయంతి సందర్భంగా ఉదయం ఆరు గంటలనుండి మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, మన్యుసూక్త సంపుటి, సుందరాకాండ పారాయణాది ప్రత్యేక పూజలను అనువంశిక అర్చకులు మధ్వాచారి రాంకిషన్ శర్మ, పవన్ కుమార్ ఆద్వర్యంలో సాంప్రదాయ వేదోక్త రీతిలో నిర్వహించారు. 
 రామమందిరంలో తాడూరి రఘునాథ్ శర్మ  సాంప్రదాయ పూజనొనరించారు.

Tags
Join WhatsApp

More News...

సీఎం రేవంత్ నిజాయితీపరుడైతే బీఆర్ఎస్ నేతలు జైలుకెళ్తారు : బిఆర్ఎస్ కుమున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులే లేరు : ఎంపీ అరవింద్

సీఎం రేవంత్ నిజాయితీపరుడైతే బీఆర్ఎస్ నేతలు జైలుకెళ్తారు : బిఆర్ఎస్ కుమున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులే లేరు : ఎంపీ అరవింద్    జగిత్యాల, జనవరి 23 (ప్రజా మంటలు):ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా నిజాయితీపరుడైతే గత పాలనలో అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ నేతలు తప్పకుండా జైలుకు వెళ్లాలని బీజేపీ ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. లేదంటే రేవంత్ ప్యాకేజీలకు లొంగుతాడా? లేక చట్టపరంగా చర్యలు తీసుకుంటాడా? అన్నది ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పీఎంఆర్...
Read More...

పద్మశాలి సేవా సంఘం అభివృద్ధి  కొరకు నిధులు కోరుతూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసిన కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య

పద్మశాలి సేవా సంఘం అభివృద్ధి  కొరకు నిధులు కోరుతూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసిన కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య జగిత్యాల జనవరి 23 ( ప్రజా మంటలు)జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని,జిల్లా అధ్యక్షులు గాజంగి నందయ్య  ని కలిసిన జగిత్యాల పద్మశాలి సేవా సంఘం సభ్యులు.  జగిత్యాల పట్టణంలో పద్మశాలి సేవా సంఘం అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయాలని మరియు పద్మశాలి విద్యార్థుల సంక్షేమం కోసం హాస్టల్,సంఘానికి కళ్యాణ
Read More...
Local News  State News 

సీఎం రేవంత్ నిజాయితీపరుడైతే బీఆర్ఎస్ నేతలు జైలుకెళ్తారు : ఎంపీ అరవింద్

సీఎం రేవంత్ నిజాయితీపరుడైతే బీఆర్ఎస్ నేతలు జైలుకెళ్తారు : ఎంపీ అరవింద్ బిఆర్ఎస్ కు మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులే లేరు? జగిత్యాల, జనవరి 23 (ప్రజా మంటలు): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా నిజాయితీపరుడైతే గత పాలనలో అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ నేతలు తప్పకుండా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బీజేపీ ఎంపీ అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లేదంటే ప్యాకేజీలకు లొంగుతాడా? లేక ధైర్యంగా చర్యలు తీసుకుంటాడా? అనే...
Read More...
Crime  State News 

భద్రాచలం సబ్‌ రిజిస్ట్రార్ ఖాదీర్ను అరెస్ట్ చేసిన ఏసీబీ

 భద్రాచలం సబ్‌ రిజిస్ట్రార్ ఖాదీర్ను అరెస్ట్ చేసిన ఏసీబీ భద్రాచలం, జనవరి 23 (ప్రజా మంటలు): భద్రాచలం సబ్‌ రిజిస్ట్రార్ షేక్ ఖాదీర్‌ను అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. బూర్గంపాడు సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేసిన సమయంలో భూ రిజిస్ట్రేషన్లలో భారీ అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై గత ఏడాది కాలంగా విచారణ కొనసాగుతోంది. ఏసీబీ ఖమ్మం రేంజ్ డీఎస్పీ వై. రమేష్...
Read More...
Crime  State News 

మేడారంలో విద్యుత్ హోర్డింగ్ కూలి ముగ్గురికి గాయాలు

మేడారంలో విద్యుత్ హోర్డింగ్ కూలి ముగ్గురికి గాయాలు మేడారం, జనవరి 23 (ప్రజా మంటలు): మేడారంలొ, శుక్రవారం విద్యుత్ హోర్డింగ్ కూలి ముగ్గురు గాయపడిన ఘటన చోటుచేసుకుంది. ఇందులో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. జంపన్నవాగు–గడ్డెల రోడ్డులోని హరిత ‘వై’ జంక్షన్ వద్ద విద్యుత్ నేమ్ హోర్డింగ్ ఏర్పాటు చేస్తున్న...
Read More...
Spiritual   State News 

బాసరలో వైభవంగా వసంత పంచమి ఉత్సవాలు

బాసరలో వైభవంగా వసంత పంచమి ఉత్సవాలు నిర్మల్, జనవరి 23 (ప్రజా మంటలు): తెలంగాణలోని ప్రసిద్ధ విద్యాపీఠమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో వసంత పంచమి ఉత్సవాలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. విద్యాదేవత సరస్వతి అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ వేడుకలకు సుమారు మూడు లక్షల మంది భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక హోమాలు,...
Read More...
Local News  Spiritual   State News 

కొండగట్టులో రాజకీయ ఉద్రిక్తత.. అర్చకుల ధర్నాతో స్థంభించిన దర్శనాలు

కొండగట్టులో రాజకీయ ఉద్రిక్తత.. అర్చకుల ధర్నాతో స్థంభించిన దర్శనాలు కొండగట్టు, జనవరి 23 (ప్రజా మంటలు): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆలయ అర్చకులు విధులు బహిష్కరించి ధర్నాకు దిగడంతో భక్తుల దర్శన వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. క్యూ లైన్లలో వేలాదిమంది భక్తులు నిలిచిపోగా, కొందరు భక్తులు అర్చకులు లేకుండానే స్వామి దర్శనం చేసుకుని వెనుదిరిగారు....
Read More...
State News 

ఫోన్ ట్యాపింగ్ కేసు దృష్టి మళ్లింపు కుట్రే : కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసు దృష్టి మళ్లింపు కుట్రే : కేటీఆర్ హైదరాబాద్, జనవరి 23 (ప్రజా మంటలు): ఫోన్ ట్యాపింగ్ కేసును రాజకీయ దురుద్దేశంతో రూపొందించిన దృష్టి మళ్లింపు కుట్రగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.టి. రామారావు (కేటీఆర్) తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీల అమలు వైఫల్యం, అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ కేసును ముందుకు...
Read More...
National  Crime 

జైలులో ప్రేమ.. పెళ్లికి పరోల్ : రాజస్థాన్‌లో అరుదైన పరిణామం

జైలులో ప్రేమ.. పెళ్లికి పరోల్ : రాజస్థాన్‌లో అరుదైన పరిణామం జైపూర్, జనవరి 23: రాజస్థాన్‌లో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. వేర్వేరు హత్య కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు జైలులో ప్రేమలో పడి, పెళ్లి చేసుకునేందుకు కోర్టు పరోల్ మంజూరు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హైప్రొఫైల్ దుష్యంత్ శర్మ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ప్రియ సెత్ (నేహా సెత్) కు...
Read More...

యుద్ధానికి ముగింపు కోసం పుతిన్‌తో భేటీ: ట్రంప్ ప్రకటన

యుద్ధానికి ముగింపు కోసం పుతిన్‌తో భేటీ: ట్రంప్ ప్రకటన డావోస్ | జనవరి 22 : ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు తీసుకురావడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను త్వరలోనే కలవనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. స్విట్జర్లాండ్‌లోని డావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో పాల్గొన్న ట్రంప్, మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ట్రంప్...
Read More...
National  State News 

బీఎంసీ మేయర్ ఎంపికపై బీజేపీలో అసంతృప్తి తేజస్వి గోసాల్కర్‌కు పదవి… మూల సిద్ధాంతాలకు వ్యతిరేకమా?

బీఎంసీ మేయర్ ఎంపికపై బీజేపీలో అసంతృప్తి తేజస్వి గోసాల్కర్‌కు పదవి… మూల సిద్ధాంతాలకు వ్యతిరేకమా? ముంబై జనవరి 22: బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కొత్త మేయర్‌గా బీజేపీ నేత తేజస్వి గోసాల్కర్ ఎన్నిక కావడంతో ముంబై రాజకీయాల్లోనే కాదు, బీజేపీ అంతర్గత వర్గాల్లోనూ చర్చలు, అసంతృప్తి మొదలైంది. ఈ ఎన్నిక బీజేపీ మూల సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉందన్న విమర్శలు పార్టీ లోపల నుంచే వినిపిస్తున్నాయి. తేజస్వి గోసాల్కర్ ఇటీవల జరిగిన...
Read More...
National  State News 

మీర-భాయందర్‌కు తొలి బెంగాలీ మేయర్? జయ దత్త పేరుతో బీజేపీ ఆలోచన… ఎంఎన్‌ఎస్ తీవ్ర వ్యతిరేకత

మీర-భాయందర్‌కు తొలి బెంగాలీ మేయర్? జయ దత్త పేరుతో బీజేపీ ఆలోచన… ఎంఎన్‌ఎస్ తీవ్ర వ్యతిరేకత ముంబై జనవరి 22:ముంబైతో పాటు పరిసర ప్రాంతాల్లో మరోసారి ‘మరాఠీ వర్సెస్ బయటి వారు’ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈసారి ఈ వివాదానికి కేంద్రంగా మారింది ముంబై సమీపంలోని మీరా-భాయందర్. మేయర్ పదవికి సంబంధించి బీజేపీ తీసుకునే అవకాశమున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. మీరా-భాయందర్ మున్సిపల్ కార్పొరేషన్ (MBMC) తాజా ఎన్నికల్లో...
Read More...