సంప్రదాయ రీతిలో ధర్మపురిలో హనుమజ్జయంతి వేడుకలు
సంప్రదాయ రీతిలో ధర్మపురిలో హనుమజ్జయంతి వేడుకలు
ధర్మపురి జూన్ 01 (ప్రజా మంటలు -
రామ కిష్టయ్య సంగన భట్ల) :
తెలంగాణ లోని ప్రాచీన పుణ్య క్షేత్రాలలో నొకటియై, పవిత్ర గోదావరీ నదీ తీరాన వెలసి, పలు దేవాలయాల సముదాయంతో అలరారుతున్న పుణ్య తీర్ధమైన ధర్మపురి క్షేత్రంలో శని వారం పెద్ద హనుమజ్జయంతి వేడుకలు సంప్రదాయ రీతిలో జరిగాయి. అంజనీ పుత్రుడైన మారుతి శరణు ఘోషలు, జయజయ ధ్వనాలు, భగవ న్నామ స్మరణలు, భక్తి సంగీతాలు, వేద మంత్రాలతో సనాతన క్షేత్రంలో భక్తి పారవశ్యం పొంగి పొర్లింది. ఉదయాత్పూర్వం ప్రత్యే కించి హన్మాన్ దీక్షాపరులు పవిత్ర గోదావరిలో మంగళ స్నానా లను ఆచరించి, దైవ దర్శనాలు చేసుకున్నారు.
శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాంతర్గత ఆంజనేయస్వామి ఆలయంలో దేవస్థాన అర్చకులు వొద్దిపర్తి నరసింహ మూర్తి, కళ్యాణ్, వామాన్, కార్తీక్, వేద పండితులు బొజ్జ సంపత్ కుమార్
శర్మ, ముత్యాల శర్మ ఆధ్వర్యంలో, ఈఓ శ్రీనివాస్, ఐ. రామయ్య నేతృత్వంలో, పర్యవేక్షణలో, శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆంజనేయస్వామి వారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం , సుందరాకాండ పారాయణం లతో ప్రత్యేక పూజలు, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు.
దేవస్థానం కార్యనిర్వహణా ధికారి సంకటాల శ్రీనివాస్, వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ ముత్యాల శర్మ, ప్రవీణ్ కుమార్, ఉపప్రదాన అర్చకులు నేరెళ్ళ శ్రీనివాసాచార్య, స్థానిక వేదపండితులు, అర్చకులు వొద్దిపర్తి నరసింహ మూర్తి , కళ్యాణ్ కుమార్ , నంబి అరుణ్ కుమార్, బొజ్జ రమేశ్ శర్మ, రాజగోపాల్ , అర్చకులు, సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.
ఉపవాస దీక్షాదక్షులైన హన్మాన్ భక్తులు దేవస్థానంలో దర్శనాలు చేసుకుని, ప్రసాదాలనుకొని, పరమాన్నాలుగా గ్రహించారు.
నదీతీరాన గోదా వరీ భద్రానదీ సంగమ స్థానాన వెలసిన దక్షిణాభిముఖుడైన భక్తాంజనేయ స్వామిని దర్శించు కున్నారు.
చారిత్రిక, పౌరా ణిక నేపథ్యాన్ని కలిగిన ఈ ఆలయంలో హనుమజ్జయంతి సందర్భంగా ఉదయం ఆరు గంటలనుండి మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, మన్యుసూక్త సంపుటి, సుందరాకాండ పారాయణాది ప్రత్యేక పూజలను అనువంశిక అర్చకులు మధ్వాచారి రాంకిషన్ శర్మ, పవన్ కుమార్ ఆద్వర్యంలో సాంప్రదాయ వేదోక్త రీతిలో నిర్వహించారు.
రామమందిరంలో తాడూరి రఘునాథ్ శర్మ సాంప్రదాయ పూజనొనరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తపస్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 28 (ప్రజా మంటలు)తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా బోయినపల్లి ప్రసాద్ రావు ప్రధాన కార్యదర్శిగా కొక్కుల రాజేష్ ఎన్నికగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవగా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్... లక్ష్మీపూర్ హత్య కేసు చేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన డీఎస్పీ రఘు చందర్
జగిత్యాల డిసెంబర్ 28 (ప్రజా మంటలు)
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్ గ్రామంలో హత్యకు గురైన బుర్ర మహేందర్ అనే వ్యక్తి హత్య కేసును ఛేదించారు పోలీసులు... ప్రేమ పేరుతో మోసం చేయడంతో పాటు వీడియోలు బయట పెడతానని మహేందర్ వేధింపులకు గురి చేయడంతోనే అక్క చెల్లెలుతో పాటు కుటుంబ సభ్యులు కలిసి హత్యకు పాల్పడినట్లు... కాసుగంటి సుధాకర్ రావు పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
హైదరాబాద్ డిసెంబర్ 28 (ప్రజా మంటలు)
ప్రముఖ విద్యావేత్త , శ్రీ సరస్వతిశిశు మందిర్ ,శ్రీవాణి సహకార జూనియర్ కళాశాల,గోదావరి వ్యాలీ వ్యవస్థాపకులు కాసుగంటి సుధాకర్ రావు అనారోగ్యం తో హైదరాబాదులో మరణించగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ సుధాకర్ రావు పార్థివ దేహానికి నివాళులు అర్పించి,వారి కుమారుడు కాసుగంటి జగదీష్ చందర్ రావును,... సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి – మార్త సత్యనారాయణ
కాగజ్ నగర్, డిసెంబర్ 28 (ప్రజా మంటలు):
రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ సిటిజన్లపై జరుగుతున్న వేధింపులు, నిర్లక్ష్య ఘటనలు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో, వారి రక్షణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కార్యదర్శి మార్త సత్యనారాయణ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వృద్ధుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో... ఎస్సి రెసిడెన్షియల్ హాస్టల్ నిర్వహణపై హెచ్ఆర్సీ ఆగ్రహం
సికింద్రాబాద్, డిసెంబర్ 28 ( ప్రజామంటలు) :
రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్–నాదర్గుల్–కందుకూర్ ఎస్సి రెసిడెన్షియల్ హాస్టల్లో నెలకొన్న దారుణ పరిస్థితులపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని ఫిర్యాదుతో హెచ్ఆర్సీ కేసు నం. 8122/2025 నమోదు చేసి విచారణ చేపట్టింది.హాస్టల్లో మురుగు పొంగిపొర్లడం, తలుపులు–కిటికీలు లేని... అలరించిన ఫెమి–9 ఉమెన్స్ క్లబ్ ఫ్యాషన్ షో
సికింద్రాబాద్, డిసెంబర్ 28 (ప్రజామంటలు):
ర్యాంప్ వాక్ కేవలం ఫ్యాషన్ కోసమే కాకుండా మహిళల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆలోచనల్లో మార్పుకు నాంది పలుకుతుందని చీఫ్ గెస్ట్ మిసెస్ తెలంగాణ క్రౌన్ సుధా నాయుడు అన్నారు. బేగంపేట ఫ్యామిలీ వరల్డ్లో ఫెమి–9 ఉమెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యూటీ ఫ్యాషన్ మీట్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా... జగిత్యాల ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా రాజేందర్ రెడ్డి ఘన విజయం.
జగిత్యాల డిసెంబర్ 28 (ప్రజా మంటలు)టీయూడబ్ల్యూజే (ఐజేయు) అనుబంధ జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎల్లాల రాజేందర్ రెడ్డి ఘన విజయం సాధించినట్లు ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎన్నికల అధికారి బెజ్జంకి సంపూర్ణ చారి తెలిపారు.
ఆదివారం స్థానిక దేవిశ్రీ గార్డెన్లో నిర్వహించిన ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో రాజేందర్రెడ్డి తన సమీప ప్రత్యర్థి... ఇబ్రహీంపట్నంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 28 (ప్రజా మంటలు):
ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు గూడ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య పోరాటం నుంచి ప్రజాస్వామ్య... గొల్లపల్లి లో రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి
గొల్లపల్లి, డిసెంబర్ 28 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం పాలయ్యారు. అబ్బాపూర్ గ్రామానికి చెందిన రెడపాక లింగయ్య – లచ్చవ్వ దంపతులు ద్విచక్ర వాహనంపై ఆదివారం తెల్లవారుజామున జగిత్యాల వైపు వెళ్తుండగా, ఎదురుగా జగిత్యాల నుంచి గొల్లపల్లి వైపు వస్తున్న తవేరా వాహనం ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో... ఎల్కతుర్తిలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం
ఎల్కతుర్తి, డిసెంబర్ 28 (ప్రజా మంటలు):
భారత జాతీయ కాంగ్రెస్ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కూడలిలో జరిగిన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇంద్రసేన రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్య పోరాటం... ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానల్ ఆధిపత్యం
హైదరాబాద్ డిసెంబర్ 28 (ప్రజా మంటలు):తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానల్ ఘన విజయం సాధించింది. మొత్తం 44 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానల్ 28 స్థానాలు కైవసం చేసుకోగా, మన ప్యానల్ 15 స్థానాల్లో విజయం సాధించింది.
ఛాంబర్ ఎన్నికల్లో రెండు ప్యానెల్స్ పోటీపడ్డాయి. నిర్మాతలు అల్లు... ట్రిపుల్ ఆర్ బాధిత రైతులకు అండగా నిలుస్తా – కవిత
కల్వకుర్తి డిసెంబర్ 28 (ప్రజా మంటలు):
జంగారెడ్డి గూడెం పరిధిలో ట్రిపుల్ ఆర్ (రీజినల్ రింగ్ రోడ్) కారణంగా భూములు కోల్పోతున్న రైతులకు అండగా నిలుస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. జంగారెడ్డి గూడెం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో నిర్వాసిత రైతులతో మాట్లాడిన ఆమె, భూసేకరణలో జరిగిన అన్యాయాలను తీవ్రంగా ఖండించారు.
ట్రిపుల్ ఆర్... 