సంప్రదాయ రీతిలో ధర్మపురిలో హనుమజ్జయంతి వేడుకలు

On
సంప్రదాయ రీతిలో ధర్మపురిలో హనుమజ్జయంతి వేడుకలు

సంప్రదాయ రీతిలో ధర్మపురిలో హనుమజ్జయంతి వేడుకలు


ధర్మపురి జూన్ 01 (ప్రజా మంటలు -
రామ కిష్టయ్య సంగన భట్ల) :                  
తెలంగాణ లోని ప్రాచీన పుణ్య క్షేత్రాలలో నొకటియై, పవిత్ర గోదావరీ నదీ తీరాన వెలసి, పలు దేవాలయాల సముదాయంతో అలరారుతున్న పుణ్య తీర్ధమైన ధర్మపురి క్షేత్రంలో శని వారం పెద్ద హనుమజ్జయంతి వేడుకలు సంప్రదాయ రీతిలో జరిగాయి. అంజనీ పుత్రుడైన మారుతి శరణు ఘోషలు, జయజయ ధ్వనాలు, భగవ న్నామ స్మరణలు, భక్తి సంగీతాలు, వేద మంత్రాలతో సనాతన క్షేత్రంలో భక్తి పారవశ్యం పొంగి పొర్లింది. ఉదయాత్పూర్వం ప్రత్యే కించి హన్మాన్ దీక్షాపరులు పవిత్ర గోదావరిలో మంగళ స్నానా లను ఆచరించి, దైవ దర్శనాలు చేసుకున్నారు.


శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాంతర్గత ఆంజనేయస్వామి ఆలయంలో దేవస్థాన అర్చకులు వొద్దిపర్తి నరసింహ మూర్తి, కళ్యాణ్, వామాన్, కార్తీక్, వేద పండితులు బొజ్జ సంపత్ కుమార్ 
 శర్మ, ముత్యాల శర్మ ఆధ్వర్యంలో, ఈఓ శ్రీనివాస్, ఐ. రామయ్య నేతృత్వంలో, పర్యవేక్షణలో, శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని  ఆంజనేయస్వామి వారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం , సుందరాకాండ పారాయణం లతో ప్రత్యేక పూజలు, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు. 
 దేవస్థానం కార్యనిర్వహణా ధికారి సంకటాల శ్రీనివాస్, వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ ముత్యాల శర్మ, ప్రవీణ్ కుమార్, ఉపప్రదాన అర్చకులు నేరెళ్ళ శ్రీనివాసాచార్య, స్థానిక వేదపండితులు, అర్చకులు వొద్దిపర్తి నరసింహ మూర్తి , కళ్యాణ్ కుమార్ , నంబి అరుణ్ కుమార్, బొజ్జ రమేశ్ శర్మ, రాజగోపాల్ , అర్చకులు, సిబ్బంది భక్తులు పాల్గొన్నారు. 


ఉపవాస దీక్షాదక్షులైన హన్మాన్ భక్తులు దేవస్థానంలో దర్శనాలు చేసుకుని, ప్రసాదాలనుకొని, పరమాన్నాలుగా గ్రహించారు. 

నదీతీరాన గోదా వరీ భద్రానదీ సంగమ స్థానాన వెలసిన దక్షిణాభిముఖుడైన భక్తాంజనేయ స్వామిని దర్శించు కున్నారు.
 చారిత్రిక, పౌరా ణిక నేపథ్యాన్ని కలిగిన ఈ ఆలయంలో హనుమజ్జయంతి సందర్భంగా ఉదయం ఆరు గంటలనుండి మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, మన్యుసూక్త సంపుటి, సుందరాకాండ పారాయణాది ప్రత్యేక పూజలను అనువంశిక అర్చకులు మధ్వాచారి రాంకిషన్ శర్మ, పవన్ కుమార్ ఆద్వర్యంలో సాంప్రదాయ వేదోక్త రీతిలో నిర్వహించారు. 
 రామమందిరంలో తాడూరి రఘునాథ్ శర్మ  సాంప్రదాయ పూజనొనరించారు.

Tags
Join WhatsApp

More News...

State News 

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ — డిసెంబర్ 8 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ — డిసెంబర్ 8 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో హైదరాబాద్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు): డిసెంబర్ 8 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పూర్తిగా ఆర్థిక సదస్సు అని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి దిశను తెలిపే ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్ ఈ సదస్సులో ఆవిష్కరించడం ప్రధాన లక్ష్యమని...
Read More...
Local News 

రాష్ర్టంలో పెరిగిన వీధి కుక్కల బెడద  : జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

రాష్ర్టంలో పెరిగిన వీధి కుక్కల బెడద  : జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు సికింద్రాబాద్, డిసెంబర్ 05 (ప్రజామంటలు) : తెలంగాణలో వీధికుక్కల బెడద మితిమీరిందని, రాష్ట్రవ్యాప్తంగా కుక్కలు మనుషులపై దాడులు, కరవడం, ప్రాణాలు తీసే ఘటనలు పెరుగుతున్నా, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కొనసాగుతుంద‌ని ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామా రావు ఇమ్మానేని ఆరోపించారు. సుప్రీం కోర్టు ఈ విషయమై ఎన్ని సార్లు మొట్టికాయలు వేసిన అధికారులు తమ...
Read More...

గాంధీలో చికిత్స పొందుతూ సాయి ఈశ్వర్ చారి మృతి

గాంధీలో చికిత్స పొందుతూ సాయి ఈశ్వర్ చారి మృతి బీసీ సంఘాల ఆందోళనతో గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత *ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు – పలు పోలీస్ స్టేషన్లకు తరలించిన నిరసనకారులు
Read More...

పిఎంఓ లో రాజకీయ అలజడి సృష్టించిన హిరెన్ జోషి

పిఎంఓ లో రాజకీయ అలజడి సృష్టించిన హిరెన్ జోషి హిరేన్ జోషి, ప్రో హిమానీ దూద్, నవనీత్ సెహగల్ లు ఎందుకు ఈరోజు ఢిల్లీ వర్గాల్లో చర్చనీయంగా మారారు? హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పదకోశం జరుగుతున్న పోటీయే దీనికి ప్రధాన కారణమా? బెట్టింగ్ అప్ కంపెనీని నిర్వహిస్తున్న సెహగల్ కొడుకు వల్లన పీఎంఓ కు వీటి సంబంధాలు బయటకు రావడం కారణమా? పూర్తిగా చదవండి.
Read More...
State News 

జోగులాంబ అమ్మవారి ఆలయ అభివృద్ధికి ₹347 కోట్ల ప్రణాళిక - చిన్నారెడ్డి

జోగులాంబ అమ్మవారి ఆలయ అభివృద్ధికి ₹347 కోట్ల ప్రణాళిక - చిన్నారెడ్డి హైదరాబాద్ డిసెంబర్ 05 (ప్రజా మంటలు): తుంగభద్ర నది ఒడ్డున ఆలంపూర్‌లో కొలువైన పవిత్ర శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి ఆలయం అభివృద్ధికి ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. మొత్తం ₹347 కోట్లతో ఆలయాన్ని ఆధునికంగా, భక్తులకు అనుకూలంగా తీర్చిదిద్దే కార్యక్రమం రూపొందించారు. తక్షణ పనులకు ₹35 కోట్లు అవసరం బాలాలయం నిర్మాణం, వజ్రలేపనం, కుంభాభిషేకం...
Read More...
National  Comment 

ఇండిగో విమాన రద్దుల వెనుక అసలు కథ ఏమిటి?

ఇండిగో విమాన రద్దుల వెనుక అసలు కథ ఏమిటి? గత నాలుగు రోజులుుగా జరుగుతున్న ఇండిగో విమాన రద్దులపై, ప్రచారంలో ఉన్న సమాచారాన్ని ఆధారంగా తీసుకుని, కార్పొరేట్ పోరాటం కోణంలో ఒక సమగ్ర విశ్లేషణాత్మక కథనం. దేశవ్యాప్తంగా నాలుగు రోజులుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండిగో సంస్థకు చెందిన అనేక విమానాలు అకస్మాత్తుగా రద్దు కావడం, కొన్ని గంటల తరబడి ఆలస్యంగా నడవడం, ప్రయాణికులు...
Read More...
National  International   State News 

అమెరికా బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్నిప్రమాదం – ఇద్దరు తెలుగు విద్యార్థుల విషాద మరణం

అమెరికా బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్నిప్రమాదం – ఇద్దరు తెలుగు విద్యార్థుల విషాద మరణం బర్మింగ్‌హామ్ (అలబామా) డిసెంబర్ 05 (ప్రజా మంటలు): అమెరికా అలబామా రాష్ట్రంలోని బర్మింగ్‌హామ్ నగరంలో గురువారం ఉదయం జరిగిన భారీ అగ్నిప్రమాదం ఇద్దరు తెలుగు విద్యార్థుల ప్రాణాలు తీసింది. స్థానిక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు కాసేపటికే భవనం మొత్తం వ్యాపించడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అక్కడ నివాసముంటున్న మొత్తం 13 మంది...
Read More...

సోమాజిగూడలో అగ్నిప్రమాదం – శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్‌లో మంటలు

సోమాజిగూడలో అగ్నిప్రమాదం – శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్‌లో మంటలు హైదరాబాద్‌, డిసెంబర్ 05 (ప్రజా మంటలు): నగరంలోని సోమాజిగూడలో మంగళవారం సాయంత్రం పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది. భవనం ఐదో అంతస్తులో ఉన్న శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కిచెన్‌ ప్రాంతం నుంచి భారీగా పొగలు ఎగసిపడటంతో అక్కడి సిబ్బంది, భవనం నివాసితులు ఆందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న వెంటనే ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌కు...
Read More...
State News 

హన్మకొండ అడిషనల్ కలెక్టర్ ఏసీబీ వలలో

హన్మకొండ అడిషనల్ కలెక్టర్ ఏసీబీ వలలో హనుమకొండ, డిసెంబర్ 05 (ప్రజా మంటలు): హనుమకొండ అడిషనల్ కలెక్టర్‌గా, అలాగే ఇన్‌చార్జ్ డీఈవోగా పనిచేస్తున్న వెంకట్ రెడ్డి ఎసీబీ వలలో చిక్కారు. పుత్తూరు హైస్కూల్ అనుమతి పునరుద్ధరణ కోసం రూ.60,000 లంచం స్వీకరిస్తుండగా అతడిని అవినీతి నిరోధక శాఖ అధికారులు ట్రాప్ చేసినట్లు సమాచారం. వెంకట్ రెడ్డితో పాటు జూనియర్ అసిస్టెంట్ మనోజ్‌ను కూడా...
Read More...

జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబరచి జిల్లా పేరును నిలబెట్టాలి-జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్  బి.ఎస్. లత

జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబరచి జిల్లా పేరును నిలబెట్టాలి-జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్  బి.ఎస్. లత    జగిత్యాల డిసెంబర్  5 (ప్రజా మంటలు) పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియం లో జిల్లా స్థాయి పీఎం శ్రీ స్కూల్స్ ఆటల పోటీలను జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్  బి. ఎస్ లత ప్రారంభించారు. జగిత్యాల జిల్లా లోని 16 పీఎం శ్రీ స్కూల్స్ నుండి సుమారు 900 మంది విద్యార్థులు కబడ్డీ, కోకో, వాలి...
Read More...

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి : జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ 

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి : జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్      మెట్పల్లి  / ఇబ్రహీంపట్నం/ మేడిపల్లి డిసెంబర్ 5 (ప్రజా మంటలు)  శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా అన్ని వర్గాల ప్రజలు సహకరించాలి  ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరిచే ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో సాగేందుకు పోలీస్ శాఖ పరంగా కావలసిన భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పి...
Read More...
Local News 

బలిదానాలు వద్దు  బరి గీసి పోరాడుదాం–బీసీఐఎఫ్ చైర్మన్, మాజీ ఐఏఎస్ చిరంజీవిలు 

బలిదానాలు వద్దు  బరి గీసి పోరాడుదాం–బీసీఐఎఫ్ చైర్మన్, మాజీ ఐఏఎస్ చిరంజీవిలు  సికింద్రాబాద్, డిసెంబర్ 05 (విప్రజామంటలు): బీసీలకు 42శాతం  రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుని ఆత్మహుతికి ప్రయత్నించి, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందిన సాయి ఈశ్వర్ చారి మృతదేహాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులను మాజీ ఐఏఎస్ చిరంజీవులు పరామర్శించారు. అనంతరం ఆయన...
Read More...