సంప్రదాయ రీతిలో ధర్మపురిలో హనుమజ్జయంతి వేడుకలు
సంప్రదాయ రీతిలో ధర్మపురిలో హనుమజ్జయంతి వేడుకలు
ధర్మపురి జూన్ 01 (ప్రజా మంటలు -
రామ కిష్టయ్య సంగన భట్ల) :
తెలంగాణ లోని ప్రాచీన పుణ్య క్షేత్రాలలో నొకటియై, పవిత్ర గోదావరీ నదీ తీరాన వెలసి, పలు దేవాలయాల సముదాయంతో అలరారుతున్న పుణ్య తీర్ధమైన ధర్మపురి క్షేత్రంలో శని వారం పెద్ద హనుమజ్జయంతి వేడుకలు సంప్రదాయ రీతిలో జరిగాయి. అంజనీ పుత్రుడైన మారుతి శరణు ఘోషలు, జయజయ ధ్వనాలు, భగవ న్నామ స్మరణలు, భక్తి సంగీతాలు, వేద మంత్రాలతో సనాతన క్షేత్రంలో భక్తి పారవశ్యం పొంగి పొర్లింది. ఉదయాత్పూర్వం ప్రత్యే కించి హన్మాన్ దీక్షాపరులు పవిత్ర గోదావరిలో మంగళ స్నానా లను ఆచరించి, దైవ దర్శనాలు చేసుకున్నారు.
శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాంతర్గత ఆంజనేయస్వామి ఆలయంలో దేవస్థాన అర్చకులు వొద్దిపర్తి నరసింహ మూర్తి, కళ్యాణ్, వామాన్, కార్తీక్, వేద పండితులు బొజ్జ సంపత్ కుమార్
శర్మ, ముత్యాల శర్మ ఆధ్వర్యంలో, ఈఓ శ్రీనివాస్, ఐ. రామయ్య నేతృత్వంలో, పర్యవేక్షణలో, శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆంజనేయస్వామి వారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం , సుందరాకాండ పారాయణం లతో ప్రత్యేక పూజలు, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు.
దేవస్థానం కార్యనిర్వహణా ధికారి సంకటాల శ్రీనివాస్, వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ ముత్యాల శర్మ, ప్రవీణ్ కుమార్, ఉపప్రదాన అర్చకులు నేరెళ్ళ శ్రీనివాసాచార్య, స్థానిక వేదపండితులు, అర్చకులు వొద్దిపర్తి నరసింహ మూర్తి , కళ్యాణ్ కుమార్ , నంబి అరుణ్ కుమార్, బొజ్జ రమేశ్ శర్మ, రాజగోపాల్ , అర్చకులు, సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.
ఉపవాస దీక్షాదక్షులైన హన్మాన్ భక్తులు దేవస్థానంలో దర్శనాలు చేసుకుని, ప్రసాదాలనుకొని, పరమాన్నాలుగా గ్రహించారు.
నదీతీరాన గోదా వరీ భద్రానదీ సంగమ స్థానాన వెలసిన దక్షిణాభిముఖుడైన భక్తాంజనేయ స్వామిని దర్శించు కున్నారు.
చారిత్రిక, పౌరా ణిక నేపథ్యాన్ని కలిగిన ఈ ఆలయంలో హనుమజ్జయంతి సందర్భంగా ఉదయం ఆరు గంటలనుండి మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, మన్యుసూక్త సంపుటి, సుందరాకాండ పారాయణాది ప్రత్యేక పూజలను అనువంశిక అర్చకులు మధ్వాచారి రాంకిషన్ శర్మ, పవన్ కుమార్ ఆద్వర్యంలో సాంప్రదాయ వేదోక్త రీతిలో నిర్వహించారు.
రామమందిరంలో తాడూరి రఘునాథ్ శర్మ సాంప్రదాయ పూజనొనరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గౌహతి టెస్ట్: దక్షిణాఫ్రికా తొలి రోజు 247 పరుగులు
గౌహతి నవంబర్ 22:
భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది.
ఓపెనర్లు ఐడెన్ మార్క్రామ్ మరియు రియాన్ రికల్డన్ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు.
మార్క్రామ్ 38 పరుగులకు, రికల్డన్ 35 పరుగులకు... అమీర్పేట్లో రూ.25 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ హర్షం..
సికింద్రాబాద్, నవంబర్ 22 (ప్రజామంటలు):
అమీర్పేట్ డివిజన్లో రూ.25 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు రక్షించారని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ తెలిపారు. పార్కు కోసం దశాబ్దాల క్రితం కేటాయించిన 1500 గజాల స్థలాన్ని... కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో వెజిటేబుల్ డే సెలబ్రేషన్స్
సికింద్రాబాద్, నవంబర్ 22 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ భోలక్ పూర్ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో శనివారం వెజిటేబుల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. నర్సరీ,ఎల్ కేజీ, యూకేజీ చిన్నారి విద్యార్థులకు ఈ సందర్బంగా వెజిటేబుల్స్ ప్రాముఖ్యత గురించి వివరించారు.
దైనిందిన ఆహారంలో కూరగాయలను ఖచ్చితంగా తినాలని, వాటి వలన ఆరోగ్యం బాగుంటుందని, వెజిటేబుల్స్ లోని... కోరుట్ల తాళ్ళచెరువు ఫిల్టర్ బెడ్ పరిశీలించిన అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ )బి రాజా గౌడ్
కోరుట్ల నవంబర్ 22(ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కోరుట్ల మండల కేంద్రంలోని తాళ్లచెరువు ఫిల్టర్ బెడ్ ను శనివారం పరిశీలించిన అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) బి.రాజ గౌడ్
పట్టణం లోని పట్టణ ప్రజలకు సకాలంలో నీరు అందించాలి. ఫిల్టర్ బెడ్ ను మరియు నీరు యొక్క స్వచ్ఛతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు.... కోటీ రూపాయల భూమిని ₹16 లక్షలకు ఇచ్చేది లేదంటూ ఆగ్రహించిన రైతులు
సంగారెడ్డి నవంబర్ 22,(ప్రజా మంటలు):సంగారెడ్డి జిల్లాలోని చౌటకూర్ మండలం శివ్వంపేట గ్రామంలో మంగళవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్రిపుల్ ఆర్ రోడ్ ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ నోటీసులు అందజేయడానికి వచ్చిన అధికారులను రైతులు పంచాయతీ కార్యాలయంలో బంధించారు.
భూసేకరణ నోటీసులు అందించడానికి వచ్చిన అధికారులు
ట్రిపుల్ ఆర్ రోడ్ నిర్మాణం కోసం ఎకరాకు... 3లక్షల రూపాయల LOC అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
హైద్రాబాద్ నవంబర్ 22(ప్రజా మంటలు)బీర్ పూర్ మండల తుంగురూ గ్రామానికి చెందిన ఉయ్యాల సుజాత అనారోగ్యం తో బాధపడుతూ నరాల సంబంధిత వైద్య చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉండగా విషయాన్ని రంగంపేట నాయకులు డ్రైవర్ శేఖర్ ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ దృష్టికి తీసుకురాగా ముఖ్యమంత్రి సహాయ నిది ద్వారా నిమ్స్ లో... రిపోర్టర్ షఫీ ఆరోగ్య పరిస్థితి ఆసుపత్రిని సందర్శించి వైద్యులను అడిగి తెలుసుకొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
హైదరాబాద్ నవంబర్ 22(ప్రజా మంటలు)
జగిత్యాల ఐ న్యూస్ రిపోర్టర్ షఫీ అనారోగ్యంతో హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రెనోవ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా షఫీ ని ఆస్పత్రి లో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో అడిగి తెలుసుకున్నారు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ తెలంగాణలో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై కొత్త జీవో విడుదల
హైదరాబాద్ నవంబర్ 23, ప్రజా మంటలు:
తెలంగాణ ప్రభుత్వం ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై కీలక ఆదేశాలు జారీ చేసింది. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, మండల–జిల్లా పరిషత్ స్థానాల రిజర్వేషన్ కేటాయింపుకు సంబంధించిన మార్గదర్శకాలతో ప్రభుత్వం తాజా జీవో విడుదల చేసింది.
ఈ జీవో ప్రకారం—మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదు... తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ముగింపు – బేగంపేట ఎయిర్పోర్ట్లో ఘన వీడుకోలు
హైదరాబాద్ నవంబర్ 22, ప్రజా మంటలు:
తెలంగాణలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి రెండు రోజుల పర్యటన విజయవంతంగా పూర్తయ్యింది. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్రపతికి శుక్రవారం బేగంపేట ఎయిర్పోర్ట్లో ఘనంగా వీడుకోలు పలికారు.
ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ,ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రవాణా–బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం... కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
జగిత్యాల (రూరల్ ) నవంబర్ 22 ప్రజా మంటలు:
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు శుక్రవారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొని, పరిణతి యజ్ఞోపవిత ధారణ చేసి భక్తి శ్రద్ధలతో ఆరాధన నిర్వహించారు.
ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ,“మన కోరుట్ల నియోజకవర్గ... సుప్రీం కోర్టు తీర్పు: గవర్నర్–ముఖ్యమంత్రి అధికారాలపై దేశవ్యాప్త చర్చ
చెరువుల మరమ్మత్తులకు నిధులు ఇవ్వండి : MLA సంజయ్
హైదరాబాద్ నవంబర్ 21 (ప్రజా మంటలు):జగిత్యాల అభివృద్ధి పనులపై కీలక నిర్ణయాలు త్వరలో వెల్లువడనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని ఆయన కార్యాలయంలో కలిసి, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ వినతిపత్రం సమర్పించారు.
చెరువుల మరమ్మత్తులకు నిధుల అభ్యర్థన
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపిన వివరాల... 