జాతీయ జనగణనలో బీసీలను పక్కన పెట్టే కుట్ర – రౌండ్ టేబుల్ సమావేశంలో తీవ్ర విమర్శలు
కులగణనలో బీసీలను పక్కన పెట్టే కుట్ర – రౌండ్ టేబుల్ సమావేశంలో తీవ్ర విమర్శలు
కేంద్ర ప్రభుత్వ డాక్యుమెంట్ ప్రమాదకరం : కల్వకుంట్ల కవిత
ఖాజా మాన్షన్, బంజారాహిల్స్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సమగ్ర చర్చ
హైదరాబాద్, జనవరి 29 – ప్రజా మంటలు.
జాతీయ జనగణనలో కులగణన పేరిట బీసీలను “అదర్స్” పేరుతో పక్కన పెట్టే కుట్ర జరుగుతోందని వివిధ కుల, సామాజిక సంఘాల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఖాజా మాన్షన్, బంజారాహిల్స్లో నిర్వహించిన కులగణనపై సమగ్ర చర్చ రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా విమర్శించారు.
ముఖ్య వక్తల వ్యాఖ్యలు:
అశోక్ మాట్లాడుతూ,
దేశ జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు సరైన లెక్కలే లేవని, ఎస్సీ–ఎస్టీలకు ఉన్నంత రిజర్వేషన్ బీసీలకు కూడా రావాల్సిన అవసరం ఉందన్నారు. కులగణనలో బీసీ కాలమ్ లేకపోవడం ప్రమాదకరమని హెచ్చరించారు.
పోలాడి రామారావు (ఓసీ జాతీయ అధ్యక్షులు)
బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వారిని వాడుకుంటున్నారని విమర్శించారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలని అన్నారు.
గుజ్జ సత్యం (జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు)
75 ఏళ్లుగా బీసీల కులగణన లేకపోవడం దురదృష్టకరమని, 33 అంశాల్లో ప్రత్యేకంగా “బీసీ కాలమ్” ఉండాలని డిమాండ్ చేశారు.
సంధ్య (పీఓడబ్ల్యూ నాయకురాలు)
కులగణన లేకుండా మహిళా రిజర్వేషన్ కూడా అసంపూర్తేనని, జనగణన అద్దమైతే కులగణన అసమానతలకు ప్రతిబింబమన్నారు.
రాఘవచారి (తెలంగాణ స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు)
బీసీలకు న్యాయం జరుగుతుందన్న ఆశతో కవిత గారు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
మహ్మద్ మునవార్ అలీ (మైనార్టీ నేత)
కులగణన పేరుతో మైనార్టీలను వేధించే పరిస్థితి రాకూడదని, అందరికీ మేలు జరిగే విధంగా గణన జరగాలని కోరారు.
రామకృష్ణ (బీసీబీడబ్ల్యూఎఫ్ నేత)
బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుండానే ఎన్నికలు నిర్వహించడం మోసమన్నారు.
అనురాధ గౌడ్ (మహిళ నాయకురాలు)
బీసీ మహిళల సమస్యలను రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
గోవర్ధన్ (న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు)
“అదర్స్” కాలమ్ ద్వారా బీసీలను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.
మేకల రాములు యాదవ్ (జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి నేత)
బీసీల సంఖ్య తెలియకపోతే న్యాయం జరగదని స్పష్టం చేశారు.
డా. కుమారస్వామి (తెలంగాణ స్టూడెంట్ జేఏసీ నేత)
బీసీ నినాదం రాజకీయంగా బలమైన ఉద్యమంగా మారాలని అన్నారు.
సోమ శైలజా గౌడ్, పొద్దుటూరి ఎల్లయ్య, రాజలింగం (బుడగ జంగాల రాష్ట్ర అధ్యక్షులు), కంచి మధుసూదన్ (పూసల సంఘం రాష్ట్ర అధ్యక్షులు), చేగూరి కుమార్ (కురుమ సంఘం నేత), శివ ముదిరాజ్ (ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్), సావిత్రి (అఖిల భారత విశ్వకర్మ మహాసభ), మణికొండ వెంకటేశ్వర్ రావు (మున్నూరు కాపు మహాసభ), డా. జహంగీర్, శేఖర్ రెడ్డి (తెలంగాణ ఈబీసీ అధ్యక్షులు), జక్కని సంజయ్ కుమార్ (బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపకులు), ప్రశాంత్ (అరె కటిక కన్వీనర్), మన్నారం నాగరాజు (లోక్ సత్తా పార్టీ), మేకపోతుల నరేందర్ గౌడ్ (బీసీ సంక్షేమ సంఘం)
అందరూ ఒకే స్వరంతో బీసీ కాలమ్ తప్పనిసరిగా చేర్చాలని, జనాభా ప్రకారం హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో కులగణన అంశాన్ని దేశవ్యాప్తంగా ఉద్యమంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఫోన్ ట్యాపింగ్ కేసు: మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు
హైదరాబాద్, జనవరి 29 – ప్రజా మంటలు.
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు సిట్ అధికారులు నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు.
నోటీసుల్లో భాగంగా,... జాతీయ జనగణనలో బీసీలను పక్కన పెట్టే కుట్ర – రౌండ్ టేబుల్ సమావేశంలో తీవ్ర విమర్శలు
కేంద్ర ప్రభుత్వ డాక్యుమెంట్ ప్రమాదకరం : కల్వకుంట్ల కవిత కులగణనలో బీసీలకు కేంద్రం ద్రోహం : కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జనవరి 29 (ప్రజా మంటలు):
దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణన–కులగణన ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జాతీయ జనగణనలో కులగణనపై సమగ్ర చర్చ కోసం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ప్రసంగించారు.
బిసి కాలం తొలగించడం అన్యాయం
పదేళ్లకు ఒకసారి జరగాల్సిన... ఎమ్మెల్యే సంజయ్ అవినీతితో జగిత్యాల మున్సిపాలిటీ బ్రష్టు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల, జనవరి 28 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్సిపాలిటీని ఎమ్మెల్యే సంజయ్ అవినీతి, అక్రమాలతో బ్రష్టు పట్టించారని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. ఇందిరా భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్లలో 16 మంది కమిషనర్లు మారటం, 8 మంది ఉద్యోగులు జైలు పాలవడం, ఏసీబీ–విజిలెన్స్ దాడులే ఎమ్మెల్యే... మున్సిపల్ ఎన్నికల్లో సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి అభ్యర్థుల పోటీ
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయం
హైదరాబాద్, జనవరి 28 (ప్రజా మంటలు):
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ‘సింహం’ గుర్తుపై తెలంగాణ జాగృతి ఔత్సాహిక అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో ఆల్ ఇండియా... ఎన్నికల నియమవళి పక్కాగా అమలు చేయాలి నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
మెట్పల్లి/కోరుట్ల జనవరి 28 (ప్రజా మంటలు)మెట్ పెల్లి మరియు కోరుట్ల మున్సిపాలిటీల్లో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరుగుతోందా లేదా అనే విషయాన్ని స్వయంగా పరిశీలించారు.నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా... గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి దేవదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్
జగిత్యాల జనవరి 28 ( ప్రజా మంటలు)2027 లో గోదావరి పుష్కరాలు జరుగనున్న నేపథ్యంలో పుష్కరాలను పకడ్బందీగా నిర్వహించే క్రమంలో బుధవారం జిల్లా కలెక్టర్ లు మరియు సంబందిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జగిత్యాల జిల్లా నుండి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా దేవదాయ శాఖ ప్రధాన కార్యదర్శి... శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ధర్మపురి సిఐ కి అందజేత
వెల్గటూరు జనవరి 28 (ప్రజా మంటలు)
జక్కాపురం నారాయణస్వామి వెలగటూరుధర్మపురి సిఐ ఏ. నరసింహ రెడ్డి నీ మర్యాద పూర్వకం గా కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకీ ఆహ్వానం అందించిన ఆలయ చైర్మన్ చింతల రాజయ్య,సర్పంచ్ భూపల్లి రాజయ్య,ఉపసర్పంచ్ యాగండ్ల గంగయ్య, ప్రధాన అర్చకులు పవన్ కుమార్ ,హరి ప్రశాంత్, ఈ కార్యక్రమం... ఈనెల 30న వెలగటూర్ మండల స్థాయి ( సీఎం కప్) సెకండ్ ఎడిషన్ సెలక్షన్స్
వెల్గటూర్ జనవరి 28 ( ప్రజా మంటలు)
జక్కాపురం నారాయణస్వామి వెల్గటూర్మండల స్థాయి సీఎం కప్ (సెకండ్ ఎడిషన్) సెలక్షన్స్ తేదీ 30 జనవరి 2026 శుక్రవారం రోజున జడ్.పి.హెచ్.ఎస్ వెల్గటూర్ లో నిర్వహించబడతాయని ఎంఈఓ బోనగిరి ప్రభాకర్ తెలిపారు.
మండలంలోని అన్ని గ్రామాల క్రీడాకారిని మరియు క్రీడాకారులు తమ వెంట రిజిస్ట్రేషన్ చేసుకున్న... రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్పై మహిళ ఆరోపణలు
అమరావతి / రైల్వే కోడూరు, జనవరి 28 (ప్రజా మంటలు):
రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్పై ఓ మహిళ చేసిన తీవ్రమైన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. తనతో 2024 నుంచి 2026 జనవరి 7 వరకు సన్నిహిత సంబంధాలు కొనసాగించిన ఎమ్మెల్యే, పెళ్లి చేస్తానని నమ్మించి మోసం చేశారని,... ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరు సహకరించాలి మున్సిపల్ ఎన్నికల కోడ్ నియమావళిని పాటించాలి_ జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
జగిత్యాల జనవరి 28 ( ప్రజా మంటలు)
ఎన్నికల కోడ్ నియమావళిని అందరు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు.
బుధవారం జిల్లా కలెక్టరేట్లో మిని సమావేశ హాల్ లో ఏర్పాటు చేసిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా అడిషనల్... 